సుంకిశాల గ్రామం నుండి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో బీఆరెస్ పార్టీని వీడి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన వలిగొండ మండలం సుంకిశాల గ్రామ నాయకులు.
వలిగొండ మండలం సుంకిశాల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్ ఆధ్వర్యంలో బీఆరెస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్ మొగిలిపాక నరసింహ,ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి,మాజీ సర్పంచ్ పోలెపల్లి స్వామి,ఎండోమెంట్ డైరెక్టర్ బాల కృష్ణ,మాజీ పాల సంఘం చైర్మెన్ రాచమల్ల శంకరయ్య,పాల సంఘం చైర్మెన్ పరమేష్,ఈతాప రాములు,పోలేపల్లి వీరాస్వామి,బొక్క బుచ్చిరెడ్డి మరియు 200మంది బీఆరెస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో బీఆరెస్ పార్టీని వీడి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన వలిగొండ మండలం సుంకిశాల గ్రామ నాయకులు.


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం అభివృద్ధి ప్రదాత, ప్రజాసేవ చేయాలని లక్ష్యంతో ముందడుగు వేసి ఇంద్రపాల నగరం గ్రామ సర్పంచిగా గత ఐదు సంవత్సరాలుగా పలు అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి, గ్రామాన్ని ప్రగతి పథంలో లో నడిపించి, రామన్నపేట ఎంపీపీ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రజా నాయకులు పూస బాల నరసింహ కి ఇంద్ర పాలనగరం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బందెల క్రిస్టఫర్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఇంద్రపాల నగరం గ్రామానికి వీరి చేసిన సేవలు సేవలు మరువలేమని అన్నారు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని టేకుల సోమవారం గ్రామంలో సెక్యూరిటీ టీం మెంబెర్స్ తో కలిసి వలిగొండ ఎస్సై డి మహేందర్ మంగళవారం రాత్రి ఫూట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు జరుగుతున్న దొంగతనాలు , చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలపట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. అన్ని గ్రామాల్లో టీం సభ్యులు తమ తమ గ్రామాలలో గస్తీ నిర్వహించి ,దొంగతనాలు జరగకుండా చూడాలని అన్నారు .అనుమానం ఉన్న వ్యక్తులు తారాసపడితే వెంటనే సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు చేగూరి మోహన్, చేగూరి బాలకృష్ణ, టి గణేష్ రెడ్డి, చేగూరి మల్లేష్ ఆధ్వర్యంలో యువకులు,తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ప్రజలకు వెలువర్తి గ్రామంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో పూజారి ఆదిత్య శర్మ ఉగాది పర్వదిన ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు పంచాంగాన్ని వినిపించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ నానమాల ఉప్పలయ్య, దేవాలయ కమిటీ సభ్యులు ,భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం రైలు నుండి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. 108 సిబ్బంది తెలిపిన వివరాల , ప్రకారం వలిగొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గుంటూరుకు చెందిన పాటిబండ్ల నాగార్జున వయస్సు 23 ,ఇతను సికింద్రాబాద్ నుండి గుంటూరుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైలు నుండి పడి, తీవ్ర గాయాలు అయ్యాయి .అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది గమనించి 108 వారికి సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని, చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు 108 సిబ్బంది తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బంది తమ సెల్ ఫోన్ లను నిషేధిస్తూ సోమవారం ఏప్రిల్ 8న ఉత్తర్వులు జారీ చేసింది. విలేఖరుల తో పాటుగా ప్రధాన ఆలయంలో విధులు నిర్వహించే మినిస్ట్రీస్ సిబ్బంది, మతపర సిబ్బంది ,నాలుగో తరగతి సిబ్బంది ,ఎస్పీఎఫ్, హోం గార్డ్స్ ,ఔట్సోర్సింగ్ సిబ్బంది వారి సెల్ ఫోన్లు ఆలయంలోకి తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ కార్యనిర్వణాధికారి కార్యాలయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నిర్ణయం తీసుకుంది.
Apr 10 2024, 21:21
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.9k