ఈనెల 12, 13న యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్ఎఫ్ఐ నాల్గవ మహాసభ జయప్రదం చేయండి: ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు
![]()
భువనగిరిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో SFI భువనగిరి మండల మహాసభ కుక్కుట్ల శివాని అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది, ఈ మహాసభకు ముఖ్య అతిథిగా SFI జిల్లా కార్యదర్శి వనం రాజు హాజరై మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరి పోసిన ఆంధ్ర మహాసభకు కేంద్రమైన భువనగిరి పట్టణంలో ఈనెల 12 13 తేదీల్లో SFI యాదాద్రి భువనగిరి జిల్లా నాలుగో మహాసభలు నిర్వహించుకుంటున్నాం,* కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్లను, ఫెలోషిప్ వెంటనే విడుదల చేయాలి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అవకాశవాద రాజకీయాలను ఓడించాలి,
![]()
అదేవిధంగా మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బిజెపిని ఓడగొట్టే విధంగా విద్యార్థులందరూ ఏకం కావలసిన పరిస్థితి ఉందని , బిజెపి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత విద్యను పూర్తిగా కాషాయకరణ, విద్యను ధ్వంసం చేయడం జరిగింది. విద్య అనేది అంగట్లో సరుకుగా మారింది అదేవిధంగా గత టిఆర్ఎస్ పూర్తిగా విద్యారంగాన్ని విస్మరించింది,అదేవిధంగా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది విద్యారంగం అభివృద్ధి చెందే వారి పాలన విధానం కనబడుటలేదు, పెండింగ్లో ఉన్న 7200 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి, పెంచిన మెస్ కాస్మోటీ ఛార్జ్ లను వెంటనే అమలు చేయాలని, అద్దె భవనంలో ఉన్న హాస్టల్ లను సొంత బిల్డింగ్ను ఏర్పాటు చేసి నూతన గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని , విద్యారంగ సమస్యలను పరిష్కరించేలా విద్యార్థులకు సన్నగా చేయడం కోసం ఈ మహాసభలు ఎంతో తోడ్పడతాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో GMPS జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ SFI జిల్లా ఉపాధ్యక్షులు లావుడియా రాజు SFI మండల నాయకులు అన్నంపట్ల రమణ, కుకుట్ల శివాని, మోటే శంకర్, సల్మాన్ ముద్దంనాగరాజు,ముద్ధంమహేష్, జన నితిన్, హరిగే మని,వంశీ, తదితరులు పాల్గొన్నారు.


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద MRPS ఆధ్వర్యంలో ధర్నా రాస్తరోకో నిర్వహించడం జరిగింది


ఒక ముస్లిం అమ్మాయి తనని ఇష్టపడుతుందని తెలుసుకొని,ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని మతసామరస్యానికి ప్రతీకైనాడని, ఆమె సోదరుని సాయంతో భువనగిరి కోటను స్వాధీనం చేసుకుని ప్రజారంజకంగా పరిపాలించి చరిత్ర సృష్టించిచాడని, ఆతర్వాత గోల్కొండ కోట పై దండయాత్ర చేసి విజయం సాధించిన పాపన్న గౌడ్ బహుజన రాజ్యం జెండాను గోల్కొండ కోట పై ఎగురవేసాడని వారు తెలిపారు. గత పాలకులు సర్థార్ సర్వాయి పాపన్న చరిత్రను కనుమరుగు చేసారని,ఆ చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించటానికి నేటి యువత కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ వర్థంతి కార్యక్రమంలో భువనగిరి మాజీ కౌన్సిలర్ దేవరకొండ సత్యనారాయణ, సామాజిక ఉద్యమ నాయకులు కొడారి వెంకటేష్, పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బత్తుల గణేష్ గౌడ్, ప్రజా సంఘాల నాయకులు ఎర్ర శివరాజ్, గోపరాజు వెంకటేష్, మధు తదితరులు పాల్గొన్నారు


అనంతరం ఇంతియాజ్ మాట్లాడుతూ నిరుపేద ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏటా మేరాజ్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్ చైర్మన్ నదీమ్ ఖాన్ సహకారంతో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరుగు తుందన్నారు. ప్రతి ఏటాలాగే ఈసారి కూడ మేరాజ్ గ్రూప్ వారి సౌజన్యంతో ఇప్పటికే ఆదివారం రెండు లక్షల రూపాయల విలువగల నిత్యవసర సరు కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా సోమవారం రెండవ విడతలో భాగంగా పట్టణంలోని పేద ముస్లిం కుటుంబాల కు ఒక్కొక్కరికి 3000.రూపాయల రంజాన్ తోఫా కిట్టును మరో రెండు లక్షల రూపాయల తో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు . తమపై ఎంతో నమ్మకంతో ప్రతి ఏటా భువనగిరి పట్టణంలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు తమ వంతు సహాయంగా నిత్యవసర సరుకులు అందజేస్తున్న మేరాజ్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్ చైర్మన్ నదీమ్ ఖాన్ కు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. పవిత్రమైన రంజాన్ మాసంలో పేదలను గుర్తించి వారికీ తమకు తోచిన సహాయం అందించాలన్నదే తమ లక్ష్య మన్నారు.ఈ కార్య క్రమంలో టీజేయు జిల్లా అధ్యక్షుడు ఎండి శానూర్ బాబా,మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీఇస్తియాక్ అహ్మద్,సయ్యద్ రఫీఖ్ అహ్మద్,ఎండీ కామ్రాన్ హుస్సేన్,ఎండీ సలీం ఎండీ గయాజ్ అహ్మద్ ఎండీ సిరాజ్, ఎండీ మొఖ్తార్,అహ్మద్,ఆదిల్ రాషేద్,షకీల్,రెయ్యాన్ తదితరులు పాల్గొన్నారు.
Apr 03 2024, 17:16
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.3k