NLG: పర్యావరణ క్యాలెండర్ ఆవిష్కరించిన పర్యావరణ ఇంజనీర్ పి.సురేష్ బాబు
నల్లగొండ: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ.. ఇండియన్ ఎన్విరాన్మెంట్ సోషల్ ఫోరం (ఐఈఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ను, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం పర్యావరణ ఇంజనీర్ పి.సురేష్ బాబు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక, పర్యావరణ అంశాలతో కూడిన ప్రకృతి దినాలను పొందుపరిచి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థకు అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో సహాయ పర్యావరణ ఇంజనీర్ ఎండి సజీనా బేగం, సహాయ పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.పురుషోత్తం రెడ్డి, డాక్టర్ యం.రామకృష్ణ, కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది రహిమ, కె.నాగరాజు, విజిత, తదితరులు పాల్గొన్నారు.


















Mar 19 2024, 21:38
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.9k