ఆదర్శ పాఠశాల పదవ వార్షికోత్సవంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోనీ లోతుకుంట గ్రామం లో ఆదర్శ పాఠశాలలో శనివారం రోజున పదవ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ....ఆయన మాట్లాడుతూ ,విద్యాసంస్థల కార్యక్రమాలకు మొదటిసారిగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నదని ,కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో ఆదర్శ పాఠశాలన్ని ప్రారంభించారు. ఈ పది సంవత్సరాల కాలంలో ఆదర్శ పాఠశాలలు చదివిన విద్యార్థిని విద్యార్థులు ఇంజనీర్లు డాక్టర్లు ఉన్నత స్థాయిలో ఉండడం చాలా ఆనందకరమైన ...విషయమని ఆయన అన్నారు. పాఠశాలకి 500 మీటర్ల సిసి రోడ్డు అయిందని ఇంకా 300 మీటర్ల సిసి రోడ్ గురించి మన ఏ ఈ తో మాట్లాడుతున్నానని ,చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యమని ఆటల వలన మానసిక ఉల్లాసం కలుగుతుందని ఆయన అన్నారు. వలిగొండ లో మినీ స్టేడియం ఏర్పాటు చేయిస్తా నని ఆయన అన్నారు. పాఠశాలకు కావలసిన అన్ని వసతులు కల్పిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ రాము, ఎంపీపీ నూతి రమేష్ రాజు, జెడ్పిటిసి వాకిటి పద్మానంతరెడ్డి, ఎంపీటీసీ పల్లెర్ల భాగ్యమ్మ రాజు, శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాజాల ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్, లోతుకుంట మాజీ సర్పంచ్ రాచకొండ బచ్చయ్య, ఆధ్యాపక బృందం ,విద్యార్థిని విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు
![]()
![]()






జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవీర్భావ దినోత్సవ వేడుకలను ఆత్మకూరు మండల కేంద్రం కట్ట మైసమ్మ దేవాలయం వద్ద ఉపాధిహామీ కూలీలు, ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గారు కేక్ కట్ చేసి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బడుగు బలహీన వర్గాలను ఆదుకొనే లక్ష్యంతో.. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేడు ...గ్రామాభివృద్ధి మరియు సంక్షేమంలో భాగస్వామ్యం కావడం నేడు ఉపాధి హామీ పథకం 19 వ వసంతంలో అడుగుపెట్టడం హర్షణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ నిరంజన్ వలీ, ఏపిఓ రమేష్, పంచాయతీ కార్యదర్శి ఆనంద్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి,మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం, నాయకులు కట్టేకోల హన్మంతు గౌడ్, ఎద్దు వెంకటేశ్వర్లు , పైళ్ళ దామోదర్ రెడ్డి,రంగ స్వామి,కోరే కనకయ్య, ఎలగందుల సైదులు, కొండపల్లి ముత్యాలు, ఉపాధి హామీ సిబ్బంది యాది రెడ్డి, శ్రీశైలం,సత్యనారాయణ మరియు కూలీలు పాల్గొన్నారు.



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోకారం, జాలు కాలువ గ్రామాలలో శుక్రవారం వలిగొండ ఎస్సై డి మహేందర్ సైబర్ నేరాలు, సీసీటీవీ ఉపయోగాలు, నేర నివారణ చర్యలు పై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలను పంచుకుంటే తర్వాత వాళ్లు బ్యాంక్ అధికారుల వలె నమ్మించి ఓటిపి తెలుసుకొని బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తారని తెలిపారు. గ్రామాలలో సిసిటీవీలను ఉపయోగించాలని సిసిటీవీ వలన నేరాలను అరికట్టవచ్చని అన్నారు. దొంగలను, నేరస్తులను గుర్తించడంలో సీసీటీవీలు సహాయపడతాయని... సమాజంలో నేరం చేసే అవకాశాలను తగ్గిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాల యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






Feb 03 2024, 20:18
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.3k