మత్స్యగిరి గుట్టకు బస్సు సౌకర్యం కల్పించాలని,యాదగిరిగుట్టడిపో మేనేజర్ కి వినతి పత్రం అందజేసిన అరూరు గ్రామస్తులు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మత్స్యగిరి గుట్టకు బస్సు సౌకర్యం కల్పించాలని..యాదగిరిగుట్ట డిపో మేనేజర్ కి, అరూరు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
మత్స్యగిరిగుట్ట దేవస్థానం దినదిన అభివృద్ధి చెందుతూ ,అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు కానీ ,ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక భక్తులు ముఖ్యంగా మహిళలు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది .దూర ప్రాంతాల నుంచి హైదరాబాదు ,నల్లగొండ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు బస్సులు లేక భువనగిరి వలిగొండలో నిలిచి పోతున్నారు.
యాదగిరిగుట్ట నుండి మచ్చ గిరి గుట్ట వరకు ఒక సెటిల్ బస్సు నడపాలని ,మేనేజర్ గారిని కోరడం జరిగింది .సానుకూలంగా స్పందించిన డిపో మేనేజర్ అతి త్వరలో బస్సు సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తామని అన్నారు.
వినతి పత్రం అందజేసిన వారిలో బండారు నరసింహారెడ్డి కిసాన్ సెల్ మండల అధ్యక్షులు, లింగయ్య యాదవ్ మాజీ మచ్చ గిరి గుట్ట ధర్మకర్త,
ఆవుల సత్యనారాయణ వార్డు మెంబర్, జనుగల మల్లేష్ హై స్కూల్ చైర్మన్, ఆవుల అంజయ్య ప్రైమరీ స్కూల్ చైర్మన్,
పిట్టల సుధాకర్, కీర్తిశేషులు తుమ్మల నరసయ్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు కసర బోయిన నరసింహ తదితరులు పాల్గొన్నార








యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణంలో గాయత్రి హైస్కూల్ నందు జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు . పవిత్రాత్మ, గాయత్రి పాఠశాలల విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ అధికారి జి రవీందర్ హాజరై ,మాట్లాడుతూ... మైనర్లు బైక్ నడపడం నేరం, ఒకవేళ ఆక్సిడెంట్ జరిగిన మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవలసి వస్తుందని అన్నారు .ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు కారులో గాని, బైకుల మీద గాని, బయలుదేరినప్పుడు హెల్మెట్ ,సీటు బెల్టు, పెట్టుకొమని కూతురు చెప్తే దాన్ని తప్పకుండా వింటారు, కావున ఈ విషయాన్ని తప్పకుండా.. గుర్తు చేయాలని అన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోఫోన్ వాడరాదు .ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలని విద్యార్థులతో అన్నారు .ఈ కార్యక్రమంలో యాజమాన్యం, ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదాన్ పల్లి గ్రామంలో 15.00 లక్షల వ్యయంతో ,నిర్మించనున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులకు, 10.00 లక్షల వ్యయంతో ,నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ..అదనపు గదులను సోమవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు . అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గం ని సన్మానించినారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని గొల్నేపల్లి గ్రామంలో ఆదివారం రోజు రాత్రి మిర్యాల గూడెం రోడ్డు ప్రమాదంలో, గొల్నేపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబం లో, ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన పార్థివ దేహాలకు, పూల మాలలు వేసి నివాళులు అర్పించిన స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఒకే కుటుంబంలో మృతి చెందిన వారికి తక్షణమే 50వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. మృతి చెందిన వారు బొమ్మ మచ్చేందర్, అతని కుమారుడు నియాన్ష్ ప్రమాదం జరిగిన సమయంలో చనిపోయారు. అతని భార్య మాధవి చికిత్స పొందుతూ.. మరణించారు. కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. అదేవిధంగా గొల్నేపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే వెంట సీనియర్ నాయకులు బెలిదె నాగేశ్వర్ గంగాపురం దైవాధీనం గౌడ్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామంలో, నూతన గ్రామపంచాయతీ భవనాన్ని రోడ్లు ,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ... కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడని, నీచంగా కేటీఆర్ మాట్లాడడం తగదని అన్నారు. కష్టపడి జడ్పిటిసి, ఎమ్మెల్సీ, ఎంపీ, సీఎంగా ఎదిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి కూడా తండ్రి మాధవరెడ్డి ద్వారానే జడ్పీ చైర్మన్ పదవి పొందాడని... అనడంతో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు .దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని, మర్లపహాడ్ గ్రామానికి చెందిన, 100 మంది మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా.. చిన్ననాటి మధుర స్మృతులు , ఆట పట్టించిన సంగతులు, చిలిపి చేస్టల తో , గడిపిన కాలాన్ని నెమరు వేసుకున్నారు. పాఠశాల విద్య ,అనంతరం ఏం చదివారు ,ఎక్కడ సిరపడ్డారు, ఏం చేస్తున్నారు? కుటుంబ సభ్యుల వివరాలను ,ఒకరికొకరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ,ఆటపాటలతో సరదాగా గడిపారు. ప్రతి ఏటా కుటుంబ సభ్యులతో కలిసి సమావేశం అవ్వాలని, దీనితోపాటు సామాజిక సేవ కార్యక్రమాలు కూడా చేయాలని, నిర్ణయించుకున్నారు. ఆ మధురమైన క్షణాలు... మళ్లీ అవన్నీ గుర్తు చేసుకుంటూ 20 ఏళ్ల తర్వాత కలుసుకొని, ఆనందంగా గడిపారు .ఈ కార్యక్రమంలో కంది ,కొమురెల్లి, కొలను, సప్పిడి ,వారల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Jan 30 2024, 22:52
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.5k