సర్పంచుల సేవలు గుర్తిండిపోతాయి: ఎంపిటిసి సామ రామ్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం: ఐదేళ్ల పదవీ కాలంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చేసిన కృషి మరువ లేనిదని ఎంపిటిసి సామ రాంరెడ్డి అన్నారు. వారి పనితీరు చాలా బేషుగ్గా ఉందని కొనియాడారు. ఎంపిటిసి పరిధిలోని వేములకొండ, ముద్దాపురం,వెంకటాపురం, గుర్నాథ్ పల్లి,నాలుగు గ్రామ పంచాయతీల సర్పంచులను, వార్డు మెంబర్లను, ఈరోజుతో .. సర్పంచుల ముగిస్తున్నందున, మంగళవారం వేములకొండ గ్రామపంచాయతీ ఆవరణలో పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా... రాంరెడ్డి మాట్లాడుతూ సర్పంచులు గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేశారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు బోడ లక్ష్మమ్మ బాలయ్య,ఉప్పల్ రెడ్డి, కొత్త నరసింహ, జువ్వ మంజుల సత్తయ్య, ఆయా గ్రామపంచాయతీ ల వార్డ్ మెంబర్లు ,గ్రామ నాయకులు పులిపలుపుల రాములు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.




యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదాన్ పల్లి గ్రామంలో 15.00 లక్షల వ్యయంతో ,నిర్మించనున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులకు, 10.00 లక్షల వ్యయంతో ,నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ..అదనపు గదులను సోమవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు . అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గం ని సన్మానించినారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని గొల్నేపల్లి గ్రామంలో ఆదివారం రోజు రాత్రి మిర్యాల గూడెం రోడ్డు ప్రమాదంలో, గొల్నేపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబం లో, ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన పార్థివ దేహాలకు, పూల మాలలు వేసి నివాళులు అర్పించిన స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఒకే కుటుంబంలో మృతి చెందిన వారికి తక్షణమే 50వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. మృతి చెందిన వారు బొమ్మ మచ్చేందర్, అతని కుమారుడు నియాన్ష్ ప్రమాదం జరిగిన సమయంలో చనిపోయారు. అతని భార్య మాధవి చికిత్స పొందుతూ.. మరణించారు. కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. అదేవిధంగా గొల్నేపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే వెంట సీనియర్ నాయకులు బెలిదె నాగేశ్వర్ గంగాపురం దైవాధీనం గౌడ్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామంలో, నూతన గ్రామపంచాయతీ భవనాన్ని రోడ్లు ,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ... కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడని, నీచంగా కేటీఆర్ మాట్లాడడం తగదని అన్నారు. కష్టపడి జడ్పిటిసి, ఎమ్మెల్సీ, ఎంపీ, సీఎంగా ఎదిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి కూడా తండ్రి మాధవరెడ్డి ద్వారానే జడ్పీ చైర్మన్ పదవి పొందాడని... అనడంతో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు .దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని, మర్లపహాడ్ గ్రామానికి చెందిన, 100 మంది మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా.. చిన్ననాటి మధుర స్మృతులు , ఆట పట్టించిన సంగతులు, చిలిపి చేస్టల తో , గడిపిన కాలాన్ని నెమరు వేసుకున్నారు. పాఠశాల విద్య ,అనంతరం ఏం చదివారు ,ఎక్కడ సిరపడ్డారు, ఏం చేస్తున్నారు? కుటుంబ సభ్యుల వివరాలను ,ఒకరికొకరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ,ఆటపాటలతో సరదాగా గడిపారు. ప్రతి ఏటా కుటుంబ సభ్యులతో కలిసి సమావేశం అవ్వాలని, దీనితోపాటు సామాజిక సేవ కార్యక్రమాలు కూడా చేయాలని, నిర్ణయించుకున్నారు. ఆ మధురమైన క్షణాలు... మళ్లీ అవన్నీ గుర్తు చేసుకుంటూ 20 ఏళ్ల తర్వాత కలుసుకొని, ఆనందంగా గడిపారు .ఈ కార్యక్రమంలో కంది ,కొమురెల్లి, కొలను, సప్పిడి ,వారల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
జనతా టీవీ - 2024 క్యాలెండర్ ని , టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి లోని వివేరా హోటల్లో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు.. మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ,ప్రజా సమస్యల పరిష్కార ధ్యేయంగా పనిచేస్తున్న ఛానల్ , జనత టీవీ అని అన్నారు. అనంతరం జనత టీవీ యాజమాన్యానికి మరియు రిపోర్టర్లకు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాఘవపురం ఎంపిటిసి ఆరే ప్రశాంత్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ గౌడ్ ,మురళి, సాయిబాబా, జనతా టీవీ స్టాప్ రిపోర్టర్ మహమ్మద్ షానూర్, రిపోర్టర్లు గోపరాజు వెంకన్న, పాషా ,రషీద్ ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం క్రీడా యోజన మరియు యువజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన డిస్ట్రిక్ట్ అడ్వైజరి కమిటీ యూత్ ప్రోగ్రాం కు ఉమ్మడి నల్గొండ జిల్లా అడ్వైజర్ గా వలిగొండ మండలం గొల్నే పల్లి గ్రామానికి చెందిన బీజేవైఎం జిల్లా సెక్రెటరీ గండికోట హరికృష్ణ నియమితులయ్యారు. సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, కేంద్ర యువజన శాఖ మంత్రి నితిన్ కుమార్ మిశ్రాకు మరియు కేంద్ర ప్రభుత్వ పెద్దలకి సహకరించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు . ఇచ్చిన బాధ్యతని కర్తవ్యం తో నిర్వహిస్తామని ,యువత క్రీడల పట్ల పెంపొందించే విధంగా కృషి చేస్తామని అన్నారు. 
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారిని సూర్యాపేట శాసనసభ్యులు ,మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఆదివారం సన్మానించారు .ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్ , రవీందర్ కుమార్ ,భువనగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యాల మహిపాల్ రెడ్డి , జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు , తదితరులు పాల్గొన్నారు.
Jan 30 2024, 15:52
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.8k