మార్నింగ్ ముఖ్యంశాలు....
మార్నింగ్ ముఖ్యంశాలు....
ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్, అంగన్వాడీల సమ్మె
![]()
తెలంగాణలో చలితీవ్రత, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
భారత్లో 197కు చేరిన JN-1 కొత్త వేరియంట్ కేసులు
ఇకపై బ్యాంకు ఖాతాల్లోనే ఉపాధి హామీ కూలీల వేతనం జమ
ఎలక్టోరల్ బాండ్ల విక్రయానికి ఈనెల 11 వరకు గడువు
కర్నాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్కు CBI నోటీసులు
జపాన్కు సునామీ ముప్పు..అప్రమత్తమైన రష్యా,ఉ.కొరియా
గాజా ఉత్తర ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి
యూకే స్టూడెంట్ వీసా కొత్త నిబంధనలు అమలు




ఛత్తీస్గఢ్: బీజాపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు..
ప్రమాదవశాత్తు మాట్వాండికి చెందిన 6 నెలల పసికందు మృతి, తల్లికి గాయాలు..
మహిళను హుటాహుటిన బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. బాధిత కుటుంబానికి పోలీసుల సాయం.. ఎదురుకాల్పుల్లో పలువురు నక్సలైట్లకు గాయాలు.
ఏపీలో నేటి నుంచి గ్రామాల్లో వైద్య శిబిరాలు.. 

నల్గొండ ఎంపీ బరిలో నాగం వర్షిత్ రెడ్డి..
. నల్లగొండ ఎంపీ స్థానం నుండి సంకినేని వెంకటేశ్వరరావు, నాగం వర్షిత్ రెడ్డి, బండారు ప్రసాద్, నూకల నర్సింహ రెడ్డి, మన్నె రంజిత్ యాదవ్ పోటీ పడుతున్నారు. కాగా నాగం వర్షిత్ రెడ్డి జిల్లాలో ఇప్పటికే పేదలకు ఉచిత వైద్యం అందిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
: హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్ ప్రారంభం.. నుమాయిష్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు..
ఫిబ్రవరి 15 వరకు కొనసాగనున్న ఎగ్జిబిషన్.
దేశాన్నే ఆకర్షించే నుమాయిష్ హైదరాబాద్లో ఉండడం మనకు గర్వకారణం.. దేశంలో హైదరాబాద్ను గుర్తు తెచ్చుకుంటే నుమాయిష్ గుర్తు వస్తుంది.. గత పదేళ్ల నుంచి పేరుకుపోయిన సమస్యలు పరిష్కరిస్తాం. -సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణలో న్యూ ఇయర్ సందర్భంగా లిక్కర్ సేల్స్ జోరుగా సాగాయి. మూడు రోజుల్లో రూ.625 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.
న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు లిక్కర్ షాపులు, వైన్స్కి అనుమతి ఇవ్వడం, బార్లకు ఒంటి గంట వరకు ఓపెన్ ఉండడంతో మందుబాబులు పండగ చేసుకున్నారు.
డిసెంబర్ 28న రూ.133 కోట్లు, 29న రూ.179 కోట్లు, 31న అత్యధికంగా రూ.313 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.
సినీ నటి జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

ప్రత్యేక పూజలు నిర్వహించిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్
ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్: మెట్రో కానీ , ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదు.. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం.. ఎయిర్పోర్ట్కు దూరాన్ని తగ్గిస్తాం..
ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు.. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఒవైసీ ఆస్పత్రి, చాంద్రాయణగుట్ట దగ్గర ఎయిర్పోర్ట్కు వెళ్లే మెట్రోలైన్కు లింక్ చేస్తాం.
. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రాపురం వరకు మెట్రో.. అవసరమైతే హైటెక్ సిటీ వరకున్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వరకు పొడిగిస్తాం.. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం దానికంటే మా ప్రతిపాదనకే తక్కువ ఖర్చు అవుతుంది. -సీఎం రేవంత్ రెడ్డి.
Jan 02 2024, 10:05
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.9k