నూతన సంవత్సర వేడుకలను ఉద్దేశించి నలగొండ పోలీస్ శాఖ తరపున ప్రజలకు విజ్ఞప్తి..
![]()
నల్గొండ పోలీసు శాఖ తరపున ప్రజలందరికీ 2024 నూతన సంవత్సర హార్దిక శుభాకాంక్షలు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని, ప్రజల రక్షణ కొరకు, నల్గొండ పోలీసుల ఆధ్వర్యంలో అదనపు సిబ్బందితో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది.
నూతన సంవత్సర వేడుకల గురించి ఎవరికి ప్రత్యేకమైన కార్యక్రమాలకు లేదా ఈవెంట్లకు పోలీస్ శాఖ ఎటువంటి అనుమతులు జారీ చేయలేదు. ఎవరైనా చట్ట నిబంధనలు ఉల్లంఘించి నూతన సంవత్సర వేడుకల పేరుతో ఏదైనా మ్యూజికల్ లేదా ఎంటర్టైన్మెంట్ లేదా ఈవెంట్ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. అంతే కాకుండా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాల పేరుతో, టికెట్లు/ ఎంట్రీ ఫీజుల రూపంలో ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
![]()
నూతన సంవత్సర వేడుకల గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ ప్రజలందరికీ ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నది. నూతన సంవత్సరం మొదటి రోజు ఏ కుటుంబం విషాదకర ఘటనతో ఆరంభం కాకుండా అన్ని జాగ్రతలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.
ముఖ్యంగా తల్లిదండ్రులు తమ యుక్త వయసు పిల్లలకు, మరీ ముఖ్యంగా మైనర్ పిల్లలకు, బైక్స్/ కార్లను ఇచ్చినచో, వారు అట్టి వాహనాలను నిర్లక్ష్యంగా లేక మద్యం, మత్తు పదార్థాలు సేవించి నడపడం వలన ప్రమాదాలు జరిగి, దాని వలన వారికి గానీ లేక వారివల్ల ఇతరులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కావున ఈ విషయంలో తల్లితండ్రులు అప్రమత్తతో ఉండాలని విజ్ఞప్తి. ఈ సందర్బంగా "డ్రంకెన్ డ్రైవింగ్ " కేసులు నమోదు చేసేందుకు, అతివేగం/ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారు మరియు త్రిబుల్ రైడింగ్ నడిపే వారి కొరకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది.
కావున 31వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట తరువాత ఎవరైనా రోడ్లపై అనవసరంగా సంచరిస్తూ ఉండే వారిపై న్యూసెన్స్ కేసు బుక్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయి. దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి తమ తమ వేడుకలను అర్ధరాత్రి ఒంటిగంటలోపు పూర్తిచేసుకుని తమతమ ఇళ్లకు వెళ్లాలని విజ్ఞప్తి.
అంతేకాకుండా నూతన సంవత్సర వేడుకల పేరుతో ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్లపై న్యూసెన్స్ చేసినా, లేక ఈవ్ టీజింగ్ లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరుగుతుంది
పై విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ పోలీసు వారితో సహకరించి పూర్తి శాంతియుత మరియు ఆహ్లాదకరమైన వాతావరణం లో నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని విజ్ఞప్తి.
ఈ నూతన సంవత్సర వేడుకలు ఎవరింట్లో కూడా విషాదాన్ని నింపకూడదని కోరుకుంటూ, అందుకొరకు ప్రజలందరూ మా సూచనలు పాటించి అన్ని చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను: డి ఎస్ పి నల్లగొండ.




హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ విచారణ

హైదరాబాద్: నేడు టీఎస్ఆర్టీసీకి చెందిన 80 కొత్త బస్సులను ప్రారంభించనున్న రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆర్టీసీ ప్రయాణికులకు నేటి నుంచి అందుబాటులోకి రానున్న 80 కొత్త బస్సులు
తిరుమల: 8వ రోజుకు చేరుకున్న వైకుంఠ ద్వార దర్శనం.. ఎల్లుండి అర్దరాత్రితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం.. ఎల్లుండి వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.
ఏపీకి సంబంధించిన పొలిటికల్ బ్రేకింగ్ న్యూస్ ఇది. పొత్తులపై క్లారిటీ వచ్చేసింది. 2024 ఎన్నికల్లో 2014 సీనే రిపీట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏపీలో పొత్తులపై సంక్రాంతికల్లా బీజేపీ నిర్ణయం తీసుకోనుంది. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ బాధ్యతలను ముగ్గురు బీజేపీ జాతీయ నేతలకు అప్పగించింది హైకమాండ్. టీడీపీతో పొత్తుపై BJPలో అభిప్రాయ సేకరణ పూర్తైనట్లు తెలిసింది. టీడీపీ-
జనసేనతో కలిసి వెళ్లాలని ఏపీ బీజేపీ మెజార్టీ నేతల సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పొత్తు వల్ల 3 పార్టీలకు జరిగే లాభనష్టాలపై ఇప్పటికే నివేదిక కూడా రెడీ అయిందట. ఈ రిపోర్ట్ను మోదీ ఆఫీసుకు కూడా అందజేశారట. పార్లమెంటరీ బోర్డులో చర్చించాక పొత్తులపై తుది నిర్ణయం వెల్లడి కానుంది.
హైదరాబాద్: ఫిలింనగర్ లో మరోసారి డ్రగ్స్ పట్టివేత.. పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తి అరెస్టు.. 20 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ .. పబ్ కు వచ్చే కొంత మందికి డ్రగ్స్ అమ్మినట్లుగా గుర్తింపు.. డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని పట్టుకునేందుకు రంగంలో దిగిన నాలుగు బృందాలు.
హైదరాబాద్: హ్యాండ్లూమ్, మార్కెటింగ్, సహకార శాఖలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష.. టెక్స్ టైల్స్ కోసం ఉన్న కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..
ఆదాయం పెంచుకునేలా కార్పొరేషన్లను బలోపేతం చేయాలి.. కోహెడ మార్కెట్ ను అత్యాధునిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయాలి. దేశంలోనే బెస్ట్ మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దాలి.. మార్కెట్లలో సోలార్ ఎనర్జి ప్యానల్స్ ఏర్పాటు చేయాలి-మంత్రి తుమ్మల
Dec 31 2023, 07:49
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
34.1k