పవర్లూమ్ కార్మికులకు ఇంటి స్థలం ఇచ్చి ,ఇండ్లు నిర్మించి ఇవ్వాలి,వర్కర్ టు ఓనర్ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి..
పవర్లూమ్ కార్మికులకు ఇంటి స్థలం ఇచ్చి ,ఇండ్లు నిర్మించి ఇవ్వాలి
వర్కర్ టు ఓనర్ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి
రాష్ట్రంలో పవర్లూమ్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రత్యేక కోటా ద్వారా 120 గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపెల్లి సత్తయ్య లు తెలిపారు
శనివారం తెలంగాణ పవర్ లుం వర్కర్స్ యూనియన్ (సిఐటియు ) పద్మనగర్ ఏరియా కమిటీ సమావేశం పద్మనగర్ మార్కండేయ గుడి దగ్గర జరిగింది.ఈ సందర్భంగా సత్తయ్య రాష్ట్రవ్యాప్తంగా పవర్లూమ్ కార్మికులు లక్ష మంది పైగా ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది సొంత ఇల్లు లేక అద్దె ఇండ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది యజమానులు వేసిన షెడ్లలో నివాసం ఉంటూ రోజుకు 14 గంటలు పని చేస్తున్నారు. చేసిన కష్టానికి తగిన ఫలితం రాక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారింది. అప్పుల బాధలతో అనేక ఇబ్బందులు పడుతున్న పవర్లూమ్ కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని కోరారు. గత ప్రభుత్వం కార్మికుడిని యజమాని చేయాలని వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రకటించి సిరిసిల్లకే పరిమితం చేసిందని, ఆ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ శాఖలకు ఉపయోగపడే వస్త్రాలన్నింటిని రాష్ట్రంలో కార్మికుల చేత చేయించి ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రయత్నం చేయాలని కోరారు. టెక్స్టైల్ అఫరల్ పార్క్ నిర్మాణం వెంటనే పూర్తిచేసి ఉపాధి కల్పించాలని, పవర్లూమ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇచ్చి ఈ ఎస్ ఐ పి ఎఫ్ ప్రమాద బీమా సౌకర్యం పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. త్రిఫ్ట్ పథకాన్ని చేనేత కార్మికుల తరహాలో పవర్లూమ్ కార్మికులకు కూడా డబుల్ డబ్బులు ఇవ్వాలని కోరారు.
పద్మనగర్ ఏరియా అధ్యక్షుడు గంజి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి పసునూరి యోగానందం పద్మనగర్ ఏరియా కార్యదర్శి సూరపల్లి భద్రయ్య కోశాధికారి వై ఆంజనేయులు, షేక్ జానీ సురేష్ ,గంజి చంద్రయ్య, వెంకన్న, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు




హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ విచారణ

హైదరాబాద్: నేడు టీఎస్ఆర్టీసీకి చెందిన 80 కొత్త బస్సులను ప్రారంభించనున్న రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆర్టీసీ ప్రయాణికులకు నేటి నుంచి అందుబాటులోకి రానున్న 80 కొత్త బస్సులు
తిరుమల: 8వ రోజుకు చేరుకున్న వైకుంఠ ద్వార దర్శనం.. ఎల్లుండి అర్దరాత్రితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం.. ఎల్లుండి వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.
ఏపీకి సంబంధించిన పొలిటికల్ బ్రేకింగ్ న్యూస్ ఇది. పొత్తులపై క్లారిటీ వచ్చేసింది. 2024 ఎన్నికల్లో 2014 సీనే రిపీట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏపీలో పొత్తులపై సంక్రాంతికల్లా బీజేపీ నిర్ణయం తీసుకోనుంది. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ బాధ్యతలను ముగ్గురు బీజేపీ జాతీయ నేతలకు అప్పగించింది హైకమాండ్. టీడీపీతో పొత్తుపై BJPలో అభిప్రాయ సేకరణ పూర్తైనట్లు తెలిసింది. టీడీపీ-
జనసేనతో కలిసి వెళ్లాలని ఏపీ బీజేపీ మెజార్టీ నేతల సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పొత్తు వల్ల 3 పార్టీలకు జరిగే లాభనష్టాలపై ఇప్పటికే నివేదిక కూడా రెడీ అయిందట. ఈ రిపోర్ట్ను మోదీ ఆఫీసుకు కూడా అందజేశారట. పార్లమెంటరీ బోర్డులో చర్చించాక పొత్తులపై తుది నిర్ణయం వెల్లడి కానుంది.
హైదరాబాద్: ఫిలింనగర్ లో మరోసారి డ్రగ్స్ పట్టివేత.. పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తి అరెస్టు.. 20 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ .. పబ్ కు వచ్చే కొంత మందికి డ్రగ్స్ అమ్మినట్లుగా గుర్తింపు.. డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని పట్టుకునేందుకు రంగంలో దిగిన నాలుగు బృందాలు.
హైదరాబాద్: హ్యాండ్లూమ్, మార్కెటింగ్, సహకార శాఖలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష.. టెక్స్ టైల్స్ కోసం ఉన్న కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..
ఆదాయం పెంచుకునేలా కార్పొరేషన్లను బలోపేతం చేయాలి.. కోహెడ మార్కెట్ ను అత్యాధునిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయాలి. దేశంలోనే బెస్ట్ మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దాలి.. మార్కెట్లలో సోలార్ ఎనర్జి ప్యానల్స్ ఏర్పాటు చేయాలి-మంత్రి తుమ్మల
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన 22 ల్యాండ్ క్రూజర్ల వ్యవహారంలో కీలక మలుపు
Dec 30 2023, 22:06
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
30.6k