మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజుచే కాంటెస్టెడ్ ఎమ్మెల్యే లోకనబోయిన రమణ ముదిరాజ్ కు సన్మానం
మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజుచే కాంటెస్టెడ్ ఎమ్మెల్యే లోకనబోయిన రమణ ముదిరాజ్ కు సన్మానం
ఈరోజు హైదరాబాదులోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ లో జరిగిన మేదో మదన సదస్సులో నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా బీఎస్పీ బహుజస మాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన లోకనబోయిన రమణ ముదిరాజ్ ను ముదిరాజ్ సామాజిక వర్గం నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆకిటి శ్రీహరి ముదిరాజ్ ఘనంగా సన్మానించినారు,
*ఈ సందర్భంగా లోకనబోయిన రమణ ముదిరాజ్ మాట్లాడుతూ వాకిటి శ్రీహరి ముదిరాజ్ కు ధన్యవాదాలు తెలుపుతూ ముదిరాజ్ ల చిరకాల కోరిక బీసీ ఏ విషయమై ముదిరాజ్ ముఖ్య నాయకులతో కూడిన కమిటీని సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావడానికి అనుమతి తీసుకోవాలని కోరుతూ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఓటు బ్యాంకు కలిగిన ముదిరాజ్ కులం రాజకీయంగా ఇంకా ఎంతో వెనుకబడి ఉందని ముదిరాజ్ జాతి యువత చైతన్యవంతమై ముదిరాజ్ లు ఎక్కడ పోటీ చేసిన పార్టీలకతీతంగా గెలిపించుకోవాలన్నారు త్వరలో జరిగే ఎంపీ ఎలక్షన్స్ లో ముదిరాజులకు అన్ని పార్టీల నుండి టికెట్ల విషయంలో ఒత్తిడి పెంచి ఎంపీ టికెట్లు ఇప్పించుకొని పట్టున్న నియోజకవర్గాల్లో మూకుమ్మడిగా ఓట్లు వేసి గెలిపించాలనీ రెండు మూడు నెలల్లో జరిగే సర్పంచ్ ఎలక్షన్స్ లో ఎంపిటిసి ఎంపీపీ జడ్పిటిసిలను అత్యధిక స్థానాల్లో రాష్ట్రా వ్యాప్తంగా కైవసం చేసుకొని సంస్థగతంగా ముదిరాజ్ జాతిని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మేదో మదన సదస్సును ఏర్పాటు చేసిన గుండ్లపల్లి శ్రీనివాస్, అల్లుడు జగన్, ఉప్పరబోని రంజిత్, ఆకుల రాజేష్ ముదిరాజులను అభినందించారు, ఈ కార్యక్రమనికి విచ్చేసినటువంటి నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.



రన్నింగ్లో ఊడిపోయిన పల్లెవెలుగు బస్సు టైర్లు
తిరుమల: సర్వదర్శనం భక్తులకు తిరుపతిలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ.. ప్రస్తుతం 30వ తేదీకి సంబంధించిన టోకెన్లు జారీ చేస్తున్న అధికారులు.. జనవరి 1వ తేదీ వరకు సంబంధించిన టోకెన్లు జారీచేయనున్న టీటీడీ.
హైదరాబాద్: నేడు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్గా తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ సాగించిన ప్రగతి ప్రస్థానం వివరిస్తూ ‘స్వేద పత్రం’ విడుదల చేయనున్న కేటీఆర్
ఆంధ్రా రాజకీయాలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఇది. టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. నారా లోకేష్, కిలారి రాజేష్లో కలిసి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చారు పీకే. అనంతరం.. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు సమావేశంలో గత కొంతకాలంగా టీడీపీ వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మ కూడా పాల్గొన్నారు. రాబిన్ శర్మ టీం సర్వేలపై సమావేశంలో చర్చించనున్నారు. కాగా గత ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున పనిచేశారు ప్రశాంత్ కిషోర్.
హైదరాబాద్: నేడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్న సీఎం రేవంత్రెడ్డి.. ఉదయం 10 గంటలకు భేటీ.. ఆరు గ్యారెంటీలు, జిల్లా, మండల, గ్రామస్థాయిలో ప్రజాపాలన కార్యక్రమంపై చర్చించనున్న సీఎం.. పలు కీలక విషయాలపై కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్గా దీపాదాస్ మున్షీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకురాలిగా పనిచేసిన దీపాదాస్ మున్షీ.. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా మాణిక్కం ఠాగూర్.. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్ఛార్జ్గా పనిచేసిన థాక్రేను గోవా కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా నియమించిన ఏఐసీసీ.
రైతు హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో నేడు రైతు దినోత్సవం పురస్కరించుకొని నలగొండ క్లాక్ టవర్ సెంటర్లో కేక్ కట్ చేసి రైతులకు శుభాకాంక్షలు తెలియజేసిన నలగొండ రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షుడు నిమ్మల కృష్ణమూర్తి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత పదవ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతిని జాతీయ రైతు దినోత్సవం గా మన భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగినది, రైతులకు పంట గిట్టుబాటు ధర, పంటను ఎలా అమ్ముకోవాలి మరియు రైతుల భూ సమస్యల గురించి తెలంగాణ రైతు హక్కు సాధన సమితి ముందుండి నడిపిస్తుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు హక్కుల సాధన సమితి జిల్లా రైతు సంఘం నాయకులు మహమ్మద్ సాదిక్ పాషా, మిరియాల కిరణ్ కుమార్, జాల యాదగిరి, సురకారం యాదగిరి, కంచర్ల రఘురామిరెడ్డి, జనార్ధన్ రెడ్డి, భీమినపల్లి నగేష్ తదితరులు పాల్గొన్నారు.
Dec 24 2023, 21:03
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.5k