రేపు అన్ని జిల్లాల జడ్పీ చైర్మన్లు దివంగత జనగామ జడ్పీఛైర్మన్ పాగాల సంపత్రెడ్డి కి పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలి: కేటీఆర్
రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జెడ్పీఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు దివంగత జనగామ జడ్పీఛైర్మన్ పాగాల సంపత్రెడ్డి కి పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలి - పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు
జనగామ జడ్పీఛైర్మన్ పాగాల సంపత్రెడ్డి పార్ధివదేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పాగాల సంపత్రెడ్డి హఠాన్మరణం బాధాకరం అన్నారు. 14 ఏళ్లు కేసీఆర్ వెంట సైనికుడిలా ఉండి పని చేశారని, సంపత్రెడ్డి మరణం ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తను కలచి వేసిందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్రెడ్డి క్రియాశీలకంగా పని చేశారని, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నిబద్ధతతో పనిచేస్తూ విజయవంతం చేశారన్నారు. సంపత్రెడ్డి కుటుబానికి కేసీఆర్, పార్టీ శ్రేణుల తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంపత్రెడ్డి మరణం పార్టీకి తీరని లోటన్న కేటీఆర్, వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.
రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జెడ్పీఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు!!

రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జెడ్పీఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు దివంగత జనగామ జడ్పీఛైర్మన్ పాగాల సంపత్రెడ్డి కి పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలి - పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు

మిచౌంగ్ తుఫాన్ ఏపీవైపు దూసుకొస్తోంది..ఇప్పటికే రెండు రోజులుగా నెల్లూరు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలుపడుతున్నాయి..అనంతపురం, కడప ప్రకాశం, జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడింది..నిజాంపట్నం హార్బర్లో ఏడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు..తుఫాన్ దృష్ట్యా అధికారులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.! బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాస్తా సాయంత్రానికి తుఫానుగా బలపడి.. దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా పయనిస్తోంది.రేపు నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, పడే అవకాశం ఉంది. రానున్న రెండు, మూడు రోజులపాటు, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిచే అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అన్నదాతల్లో అలజడి కొనసాగుతోంది. మిచౌంగ్ తుఫాన్ ముప్పు భయం వెంటాడు తోంది.
గాంధీభవన్ టూ ఢిల్లీ వయా గచ్చిబౌలి... మీటింగ్ల మీద మీటింగ్లు.. మంతనాలే మంతనాలు సాగుతూనే వున్నాయి. సీఎల్పీపై సింగిల్ లైన్ స్టేట్మెంట్ వచ్చేసింది.. రేవంత్ రెడ్డికే సీఎం కుర్సీ అని హైకమాండ్ లైన్ క్లియర్ చేసిందనే టాక్ రానే వచ్చింది. ప్రమాణస్వీకారానికి రాజ్భవన్లో రంగం సిద్ధమైంది. ఇక రేవంత్ అనే నేను....అంటూ ఆవాజ్ రావడమే తరువాయి అనుకునేంతలోపు సీన్ ఛేంజ్.. సీఎం ఎవరినే మ్యాటర్ ఓవర్ టు ఢిల్లీ..
చెన్నైపై విరుచుకుపడ్డ మిచౌంగ్… బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా బలపడింది. నేడు నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫాన్ గానే మధ్యాహ్నం లోపు తీరం దాటనున్నది మిచౌంగ్. ఈ తుఫాన్ ప్రభావంతో రెండు రోజులపాటు కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణ శాఖ.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపధ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో ఎర్రవెల్లిలోని తన నివాసంలో సమావేశం అయిన మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు.. కేసీఆర్ని కలిసి ఆశీర్వాదం తీసుకున్న తాజాగా గెలిచిన అభ్యర్థులు.. శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్..
హైదరాబాద్: తెలంగాణ రెండో శాసనసభ రద్దు.. మంత్రి మండలి ప్రతిపాదనతో సభ రద్దు.. అధికారిక ప్రకటన విడుదల చేసిన రాజ్భవన్
తెలంగాణలో కొనసాగుతోన్న రాజీనామాల పర్వం.. ఇంటెలిజెన్స్ ఓఎస్డీ ప్రభాకర్రావు రాజీనామా.. సీఎస్కు రాజీనామా లేఖలు పంపిన తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు డా. దూది మెట్ల బాలరాజ్ యాదవ్, రవీందర్ సింగ్, డా. వాసుదేవ రెడ్డి, మన్నే క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లె రవికుమార్ గౌడ్, పాటి మీద జగన్ మోహన్ రావు, అనిల్ కూర్మాచలం, గజ్జెల నగేష్, మేడె రాజీవ్ సాగర్, డా. ఆంజనేయులు గౌడ్, సతీష్ రెడ్డి, రామచంద్ర నాయక్, గూడూరి ప్రవీణ్, వాల్యా నాయక్ తదితరులు.. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్రావు రాజీనామా
మెదక్: కూలిన దుండిగల్ ఎయిర్పోర్టు శిక్షణ విమానం.. విమాన ప్రమాదంలో ఇద్దరు మృతి.. పైలెట్, ట్రైనీ పైలెట్ సజీవదహనం.. తూప్రాన్ రావెల్లి శివారులో ఘటన.. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు.
Dec 05 2023, 17:04
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
32.2k