"నాగం భేరి" మాస పత్రికను విడుదల చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్
నల్లగొండ: బిజెపి నాయకులు డా. నాగం వర్షిత్ రెడ్డి.. భారతీయ జనతా పార్టీని ప్రజల వద్దకు చేరే విధంగా, నాగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత వైద్య శిబిరాలు, వివిధ సేవా కార్యక్రమాలు, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, పల్లెల్లో చేసిన విస్తృత పర్యటన వివరాలను పొందుపరిచి ప్రచురించిన "నాగం బేరి" మాసపత్రికను జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ చేతుల మీదుగా గురువారం, బిజెపి జిల్లా కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, జిల్లా ఇంఛార్జి ప్రదీప్ , జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, ముత్యాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.






ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చలో సూర్యాపేట పిలుపు మేరకు, నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని మరియు నకిరేకల్ నియోజకవర్గ నాయకులు సూర్యాపేట కు తరలి వెళ్లగా మార్గ మధ్యలో పోలీస్ లు అరెస్టు చేసి అర్వపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
అనంతరం నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. బీసీ బిడ్డ అయిన వట్టే జానయ్య యాదవ్ పై అక్రమ కేసులు బనాయిస్తూ వేధించడం చాలా సిగ్గుచేటని, బీసీలతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా వారిని అణచివేయడంలో భాగంగానే ఈ అరెస్టులకు తెర లేపినారని ఆమె భావిస్తున్నట్లు తెలిపారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం వట్టే జానయ్య యాదవ్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, లేనిపక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజనులు అంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. అక్రమ అరెస్టులతో బహుజన రాజ్యాన్ని ఆపలేరని అన్నారు.
నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గం ఉపాధ్యక్షులు పావిరాల నర్సింహా యాదవ్, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్, రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, రామన్నపేట మండల ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, చిట్యాల మండల కోశాధికారి మునుగోటి సత్తయ్య, చిట్యాల అడ్వైజర్ జిట్ట నర్సింహా రాజ్, అన్నమళ్ళ సైదులు తదితరులు ఉన్నారు.
తిరుమలగిరి సాగర్: బహుజన బిడ్డ ఒట్టే జానయ్య యాదవ్ పై ఒక్క రాత్రిలోనే అక్రమంగా 71 కేసులను నమోదు చేయించారని ఆరోపిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. బహుజన బిడ్డ ఒట్టే జానయ్య యాదవ్ కు మద్దతుగా చలో సూర్యాపేట పిలుపునిచ్చిన నేపథ్యంలో తిరుమలగిరి మండల పోలీస్ అధికారులు బీఎస్పీ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా నియోజవర్గ బీఎస్పీ ఉపాధ్యక్షులు బత్తుల ప్రసాద్ మాట్లడుతూ.. తక్షణమే ఒట్టే జానయ్య యాదవ్ పై అక్రమంగా నమోదు చేసిన 71 కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. బీఎస్పీ తిరుమలగిరి మండల అధ్యక్షుడు అంగోత్ శివ నాయక్, బోడ రవి, తదితరులు ఉన్నారు.
దేవరకొండ డివిజన్, పీఏ పల్లి మండలం మల్లాపురం గ్రామంలో గతంలో రేషన్ డీలర్ భర్త వెంక రెడ్డి పై, రేషన్ బియ్యం బైక్ పై అక్రమంగా తరలిస్తున్న ఫోటోలు తీసి కంప్లీట్ చేయగా దాని విచారణలో కంప్లైంట్ దారునికి తెలియకుండా అధికారులు వచ్చి విచారణ చేశారని ఆరోపిస్తూ.. అదే గ్రామానికి చెందిన జిల్లా రాములు బుదవారం దేవరకొండ ఆర్డీవో కార్యాలయం లో మళ్లీ అట్టి రేషన్ డీలర్ పై రీ- ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పేరికే విజయ్ కుమార్, ధర్మపురం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ: గత 15 రోజులుగా 2వ ఏఎన్ఎం లు చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరి రావు కోరారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో రెండవ ఏఎన్ఎంల నిరవధిక సమ్మె కలక్టర్ కార్యాలయం ముందు జరుగుతున్న సందర్భంగా బుధవారం ఉజ్జీని యాదగిరి రావు దీక్ష శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. తెలంగాణా వస్తె కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని చెప్పిన ప్రభుత్వం 16 సంవత్సరాలుగా పని చేస్తున్న వారినీ పర్మినెంట్ చేయకపోవడం అన్యాయమని అన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఏఎన్ఎం లను అందరిని బేషరతుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
ఏఎన్ఎం లు ముందుగా జిల్లా కలెక్టర్ కర్ణన్ కు రాఖీ కట్టి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని వినతి పత్రం అందజేశారు.
కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, డివిజన్ కార్యదర్శి వి.లెనిన్, 2వ ఏ ఎన్ ఎం ల యూనియన్ జిల్లా అద్యక్షులు పోలే రత్నకుమారి, జిల్లా కార్యదర్శి నర్సమ్మ, పద్మ, హారతి, గీత, సరిత, అన్నపూర్ణ, శోభ, అండాలు, సౌజన్య, పద్మ, సలోని, సుచిత్ర , మాధురి, భవానీ, విద్య, నాగశ్రీ, సంతోష, భాగ్య, శైలజ, కవిత, అండాలు, సరళ, సువర్ణ, సత్యమ్మ, పార్వతి, సుమతి, పద్మావతి, శోభ, రుక్సానా, సుప్రియ సాలమ్మ, నీలవేణి, శారద, విజయలక్ష్మి, జ్యోతి, లలిత, శ్రీలత, నూర్జహాన్, ధనలక్ష్మి, అరుణ, ప్రేమలత, సుమలత, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Sep 01 2023, 20:46
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.4k