NLG: రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయండి: మునాస ప్రసన్న
ఉమ్మడి నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ కు చెందిన గంగపుత్ర ముద్దుబిడ్డ దీటి మల్లయ్య, గంగపుత్ర సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తూ, జాతి మనగడే లక్ష్యంగా గత 40 సంవత్సరాలుగా నిస్వార్థ సేవ చేస్తున్న, కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహీత, తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర కార్యాచరణ సమితి చైర్మన్ ను, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా ప్రకటించారు.
ఈనెల 25న శుక్రవారం నాడు హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్, శాంతినగర్ వద్ద గల మత్స్యశాఖ భవన ప్రాంగణంలో దీటి మల్లయ్య తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర పశుసంవర్ధక మరియు మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సమాఖ్య చైర్మన్, ప్రత్యేక కార్యదర్శి, మత్స్యశాఖ కమిషనర్ ,మత్స్యశాఖ అధికారులు హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా నేడు తెలంగాణ గంగపుత్ర సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు మునాస ప్రసన్న ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న దీటి మల్లయ్య కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నల్గొండ పట్టణంలోని తెలంగాణ గంగపుత్ర సంఘ జిల్లా కార్యాలయంలో, ఈ నెల 25న హైదరాబాద్ లోని మత్స్య భవన్లో జరిగే ప్రమాణ స్వీకారానికి జిల్లా గంగపుత్ర సంఘ సభ్యులు , మత్స్య సంఘం సభ్యులు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరుచూ కరపత్రాన్ని ఆవిష్కరించి ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా గౌరవాధ్యక్షుడు పిల్లి సత్తయ్య, మాజీ జిల్లా అధ్యక్షుడు సింగం వెంకటయ్య, గౌరవ సలహాదారుడు ( Besta) మునసు వెంకన్న, ప్రధాన కార్యదర్శి మంగిలిపల్లి కిషన్, ఉపాధ్యక్షుడు వడ్డెబోయిన అంజయ్య,జిల్లా అధికార ప్రతినిధి వద్దబోయిన సైదులు, మీడియా కన్వీనర్ మరియు యువజన అధ్యక్షుడు అంబటి ప్రణీత్, ప్రచార కార్యదర్శి మనాస వెంకన్న, కోశాధికారి సింగం దుర్గయ్య, కార్యదర్శి మంగలిపల్లి శంకర్ , రాసమల్ల యాదగిరి, కందరబోయిన నాగయ్య, కోరేపల్లి కొండల్, కందరబోయిన శ్రీను, అంబటి రాజశేఖర్, అంబటి శివకుమార్, వడ్డెబోయిన పురుషోత్తం, మునాస నాగరాజు, మునాస వినయ్ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ కు చెందిన గంగపుత్ర ముద్దుబిడ్డ దీటి మల్లయ్య, గంగపుత్ర సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తూ, జాతి మనగడే లక్ష్యంగా గత 40 సంవత్సరాలుగా నిస్వార్థ సేవ చేస్తున్న, కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహీత, తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర కార్యాచరణ సమితి చైర్మన్ ను, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా ప్రకటించారు.
ఈనెల 25న శుక్రవారం నాడు హైదరాబాదులోని మాసబ్ ట్యాంక్, శాంతినగర్ వద్ద గల మత్స్యశాఖ భవన ప్రాంగణంలో దీటి మల్లయ్య తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర పశుసంవర్ధక మరియు మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సమాఖ్య చైర్మన్, ప్రత్యేక కార్యదర్శి, మత్స్యశాఖ కమిషనర్ ,మత్స్యశాఖ అధికారులు హాజరుకానున్నారు.

అదేవిధంగా దళితులకు మూడెకరాల భూమి అని చెప్పి, అందులో మాలలకు అన్యాయం జరిగిందని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని, సరైన నాయకున్ని ఎన్నుకోవాలని అన్నారు.
నల్లగొండ జిల్లా:
కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అయితగోని వెంకటయ్య, లెంకలపల్లి బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రేనుకుంట్ల నరేందర్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం: మండలానికి చెందిన బిఆర్ఎస్ నేతలు మంగళవారం మునుగోడు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. మరోసారి బిఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించినందుకు సీఎం కేసీఆర్ కు, మంత్రి జగదీష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మర్రిగూడెం మండలం బిఆర్ఎస్ నాయకులు.. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మర్రిగూడ సర్పంచ్ నల్ల యాదయ్య గౌడ్, బిఆర్ఎస్ యువనేత అభి సందేశ్, ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ: మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్ కార్మికుల నాలుగు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ AITUC రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
ఈరోజు AITUC ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కర్ణన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజిలో పనిచేసే కార్మికులకు నాలుగు నెలల దాటిపోయినా నేటికీ వేతనాలు రాకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ ను ఎన్నిసార్లు కలిసినా కూడా ప్రయోజనం లభించలేదని వాపోయారు.
అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న కార్మికులకు నెల నెల వేతనాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. జీతాలు రాక ఇంటి కిరాయి, ఆటో కిరాయిలు, పెరిగిన ధరలు భరించలేకపోతున్నారని అన్నారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని మరియు జీవో 60 ప్రకారం వేతనాలు పెంచాలని దేవేందర్ రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎండీ జకీర్, అండాలు, చంద్రమ్మ, స్వర్ణ, జానయ్య, విజయ, రేణుక, కవిత, చంద్రమ్మ, కోటేశ్వరి, సీత, లక్ష్మి, శిల్ప, జమీర్, శ్రీను, శిల్ప, కృష్ణవేణి, కరుణ, ఇద్దమ్మ, మంగమ్మ, అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్ష TSCPGET-2023 ఫలితాల్లో ఎన్జీ కళాశాల విద్యార్థులు, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన శ్యామ్ తెలిపారు.
కళాశాల విద్యార్థిని 'సుమ' రాష్ట్ర స్థాయిలో ఎంఎస్సీ జియాలజీలో మొదటి 1 St ర్యాంక్ సాధించారు. అదేవిధంగా భూపతి -జియాలజీ 10 వ ర్యాంకు, లక్ష్మణ్ ప్రభు ఆకాష్ - ఆర్కియాలజీ - 13 వ ర్యాంకు, శృతి -ఫిజిక్స్ 26 వ ర్యాంకు, శ్రావణి- గ్రంథాలయ సమాచార శాస్త్రం 27 వ ర్యాంకు, భావన జియాలజీ - 27వ ర్యాంకు, అమూల్య స్టాటిస్టిక్స్ - 29వ ర్యాంకు, భూపతి -జియో ఇన్ఫర్మేషన్ 52 వ ర్యాంకు, వెన్నెల -ఫిలాసఫీ 56 ర్యాంకు, సంజిత్ కుమార్- జాగ్రఫీ-73 వ ర్యాంకు, మనీషా- జువాలజీ-77 వ ర్యాంకు, అన్నమయ్య- రసాయన శాస్త్రం-78వ ర్యాంకు, గౌతమ్- కంప్యూటర్ సైన్స్- 84వ ర్యాంకు, కౌనిన్- బయోటెక్నాలజీ 85 వ ర్యాంకు, దుర్గ భవాని- చరిత్ర 100 వ ర్యాంకు, శృతి- వృక్షశాస్త్రం122వ ర్యాంకు, సిద్ధిక్- ఎకనామిక్స్ 130 వ ర్యాంకు, మల్లిక- మైక్రోబయాలజీ 157 వ ర్యాంకు, సిద్ధిక్ - గ్రంథాలయ సమాచార శాస్త్రం 169 వ ర్యాంకు, శిరీష- జువాలజీ 180 వ ర్యాంకు , ఇంకా చాలామంది విద్యార్థిని విద్యార్థులు పీజీ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల గ్రంథ పాలకులు డాక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు.
కళాశాల విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు రావడం పట్ల వైస్ ప్రిన్సిపల్ మునీర్ మరియు శ్రీనివాసులు, కళాశాల అధ్యాపకులు, కళాశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని.. సీఎం కేసీఆర్ రానున్న ఎన్నికల సందర్భంగా మరోసారి మునుగోడు నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మేల్యే అభ్యర్ధి గా ప్రకటించినందుకు, సీఎం కేసీఆర్ కు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా తనను అభ్యర్థిగా ప్రకటించడానికి సహకరించిన జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిని, మంగళవారం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మరియు వారి కుమారుడు కూసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదములు తెలిపారు.
అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి అగమ్య గోచారంగా మారిందని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోవడంలేదని, విద్యార్థుల సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని పిడిఎస్యూ జిల్లా ఇన్చార్జి ఇందూరు సాగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే పవన్ లు అన్నారు.
మంగళవారం నల్లగొండ పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద PDSU ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ.. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు 16 లక్షల మంది పైగా ప్రభుత్వం చెల్లించే ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ లపై ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు.
గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను అందించకపోవడంతో అనేకమంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అనేక కొత్త హామీలనిస్తూ ప్రజలను మభ్యపెడుతుందని, విద్యార్థులను పట్టించుకోవడంలేదని, విద్యార్థి సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని ఏద్దేవా చేశారు.
విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించకపోగా ప్రభుత్వమే వారిని సంక్షోభంలోకి నేడుతున్నదని తెలిపారు. జిల్లాలో 12 ప్రభుత్వ పాఠశాలకు పైగా విద్యార్థులు లేరన్న సాకుతో మూసివేతకు సిద్ధంగా ఉంచారని, విద్యాసంస్థలలో కనీస, మౌలిక వసతులు కల్పించకుండా ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు భర్తీ చేయకుండా విద్యాసంస్థలను మూసివేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
Aug 23 2023, 16:40
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
34.4k