/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు Yadagiri Goud
ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు

ఆర్టీసీ ఉద్యోగుల‌కు డీఏ ఇస్తున్న‌ట్లు ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్, చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ గురువారం ప్ర‌క‌టించారు. జులై 2022 లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు సంస్థ చెల్లిస్తుందని ప్రకటించారు.

తెలంగాణ ఉద్యమంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారు. 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్ లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసింది.

మిగిలిన ఒక్క డీఏను త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తుంది అని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.

రోడ్డుపై వెళ్తుండగా.. స్కూటీలో చెలరేగిన మంటలు

మహబూబాబాద్ జిల్లాలోని బొల్లెపెల్లి గ్రామంలో గురువారం నడిరోడ్డుపై స్కూటీ తగలబడింది. స్కూటీపై వెళ్తుండగా అకస్మాత్తుగా ముందుబాగంలో మంటలు చెలరేగాయి.

దీంతో వెంటనే అప్రమత్తమైన వాహనదారుడు స్కూటీని ఆపి దిగిపోయాడు. ఈ ఘటనలో స్కూటీ ముందుభాగంగా పూర్తిగా కాలిపోయింది.

గూడూరు మండలం బోల్లేపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు స్కూటీలో మంటలు చెలరేగాయి. గుండెంగాకు చెందిన బోడ రవీందర్ స్కూటీపై వెళ్తుండగా...

ముందు భాగంలో మంటలను స్థానికులు గుర్తించి రవీందర్కు చెప్పారు. దీంతో రవీందర్ బండిని ఆపి దిగిపోయాడు. ఆ తర్వాత స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేశారు..........

Hyderabad: '25న నా పెళ్లి జైలుకెళ్లను'.. కోర్టులో రిమాండ్‌ ఖైదీ వీరంగం..

హైదరాబాద్‌: కోర్టులో ఓ నిందితుడు హల్‌చల్‌ సృష్టించాడు. ఈనెల 25న తన పెళ్లి ఉందని.. జైలుకు వెళ్లనంటూ హంగామా చేశాడు. కోర్టు లోపల డోర్‌కు ఉన్న అద్దాలు పగులకొట్టడంతో నిందితుడి చేతికి గాయాలయ్యాయి..

ఈ ఘటన గురువారం నాంపల్లి కోర్టులో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. నిందితుడు ఆనంద్ అగర్వాల్‌ రౌడీ షీటర్. ఇప్పటికే అతనిపై 18 కేసులు నమోదయ్యాయి. ఇటీవల గంజాయి కేసులో శాలిబండ పోలీసులు అగర్వాల్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఈ కేసు విచారణ సందర్భంగా అతనికి న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. ఈ సందర్భంగా తనకు పెళ్లి కుదిరిందని.. జైలుకు వెళ్లనని మొండికేశాడు. అంతటితో ఊరుకోకుండా కోర్టు లోపల డోర్‌ అద్దాలు ధ్వంసం చేశాడు. నిందితుడు అగర్వాల్‌పై గతంలోనూ పలు గంజాయి కేసులు నమోదయ్యాయి. ఓ మర్డర్ కేసు, దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నాడు. నెల రోజుల క్రితమే ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి విడుదల అయ్యాడు..

IAF: కుప్పకూలిన వాయుసేన శిక్షణ విమానం..!

బెంగళూరు: భారత వాయుసేనకు (IAF) చెందిన ఓ శిక్షణ విమానం (Kiran Aircraft) ప్రమాదానికి గురైంది. కర్ణాటక (Karnataka)లోని చామరాజనగర్‌ (Chamrajnagar) సమీపంలో అది కుప్పకూలింది..

అయితే, ఈ ఘటనలో విమానంలోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అందులో ఒక మహిళా పైలట్‌ ఉన్నారు. వాయుసేన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

'రోజువారీ శిక్షణ కార్యకలాపాల్లో భాగంగా వాయుసేనకు చెందిన 'కిరణ్‌' శ్రేణి విమానం.. బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరింది.

ఈ క్రమంలోనే చామరాజనగర్‌ సమీపంలోని భోగాపుర గ్రామంలో బహిరంగ ప్రదేశంలో అది కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు.. భూమిక, తేజ్‌పాల్‌ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. ఈ క్రమంలోనే దీనిపై విచారణకు ఆదేశించిన'ట్లు వాయుసేన తెలిపింది..

ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన శరత్ చంద్రారెడ్డి

న్యూ ఢిల్లీ :

ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రా రెడ్డి ఆప్రూవర్‌గా మారారు. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ మేరకు ఆయన అభ్యర్ధన దాఖలు చేశారు. శరత్ చంద్రారెడ్డి అభ్యర్ధనకు కోర్టు సైతం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్‌గా మారారు. గత ఏడాది నవంబర్‌లో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. కాగా తాను అప్రూవర్‌గా మారేందుకు అనుమతించాలని సీబీఐ కోర్టును ఆయన నేడు కోరారు.

శరత్‌ చంద్రా రెడ్డి అప్రూవర్‌గా మారనున్నారంటూ వార్తలు ఇప్పటికే వచ్చాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించనుందని.. ఈ మేరకు హోం శాఖ ఆదేశాలు జారీ చేసిందని సైతం ప్రచారం జరిగింది. ఈ పరిణామంతో, సీఎం కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు ఢిల్లీ మద్యం స్కాంలో మరోసారి తెరపైకి రానుందా!? అనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఎం జగన్‌ ఆదివారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా వారి మధ్య ఢిల్లీ మద్యం స్కాం అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే, స్కాంలో నిందితుడైన శరత్‌ చంద్రా రెడ్డి అప్రూవర్‌గా మారనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయనకు వై కేటగిరీ భద్రతను కల్పించాలని హోం శాఖ ఆదేశించినట్లు వివరించాయి. ఆయన అప్రూవర్‌గా మారి కుంభకోణంలో కవిత పాత్రను వెల్లడించే అవకాశాలున్నాయని ఆ వర్గాలు చెప్పాయి. ఢిల్లీ మద్యం వ్యాపారంలో సౌత్‌ గ్రూప్‌ తరఫున పాల్గొన్న వారిలో కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి, వ్యాపారస్తుడు అరుణ్‌ రామచంద్ర పిళ్లై, కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబు గోరంట్ల, శరత్‌ చంద్రారెడ్డి ఉన్న విషయం తెలిసిందే.

కవిత ప్రేరణతోనే తాను మద్యం వ్యాపారంలో పాల్గొన్నానని శరత్‌ చంద్రా రెడ్డి చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు శరత్‌ చంద్రా రెడ్డి కూడా అప్రూవర్‌గా మారడంతో కవిత పేరు మరోసారి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. నిజానికి, స్కాంలో కవిత లావాదేవీల సమాచారం ఉన్నా కేంద్రం తగిన చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర బీజేపీ నేతలు పలువురు ఢిల్లీ పెద్దలకు అనేక సార్లు చెప్పారు. కేసీఆర్‌ కుటుంబాన్ని కేసుల వలయంలో ఇరికిస్తే తప్ప బీఆర్‌ఎస్‌ బలహీనం కాదని, బీజేపీకి అవకాశాలు దక్కవని చెబుతూ వచ్చారు. ఢిల్లీలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య ఏదో అవగాహన ఉందనే ప్రచారం జరుగుతోందని, కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మడం మొదలు పెట్టారని, కవిత అరెస్టు అయితేనే బీజేపీపై నమ్మకం పెరుగుతుందని ఇటీవల బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది...

Pakistan : పాకిస్థానీ చొరబాటుదారుడి కాల్చివేత

న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరులోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్థానీ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం (BSF) మట్టుబెట్టింది. భద్రతా సిబ్బంది హెచ్చరించినప్పటికీ, ఆ వ్యక్తి దూసుకొస్తుండటంతో కాల్పులు జరిపారు..

అంతర్జాతీయ సరిహద్దుల్లో సాంబ సెక్టర్లో ఈ సంఘటన గురువారం జరిగింది.

బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, అంతర్జాతీయ సరిహద్దుల్లోని బీఓపీ (బోర్డర్ ఔట్ పోస్ట్) మంగు చక్ వద్ద గురువారం తెల్లవారుజామున 2.50 గంటలకు పాకిస్థాన్ వైపు నుంచి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా దూసుకొస్తుండాన్ని బీఎస్ఎఫ్ సిబ్బంది గమనించారు.

ఆ వ్యక్తిని హెచ్చరించినప్పటికీ, ఆ వ్యక్తి సరిహద్దు కంచె వైపు దూసుకొచ్చాడు. దీంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సాంబ సెక్టర్‌లో బీఎస్ఎఫ్ సిబ్బంది సోదాలు నిర్వహించారు..

తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆ నేతకు పిలుపు..

విజయవాడ: తాడేపల్లి ప్యాలెస్ వేదికగా మరోసారి బుజ్జగుంపుల పర్వం మొదలైంది. ఇప్పటికే అధిష్టానంపై గుర్రుగా ఉండి.. నియోజకవర్గానికే పరిమితమైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సీఎంవో నుంచి సమాచారం అందింది..

గురువారం మధ్యాహ్నం రావాలని బాలినేనికి పిలుపు వచ్చింది. గత కొంతకాలంగా వైసీపీలో నేతల తిరుగుబాటు అధినేత జగన్‌కు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.

ముఖ్యంగా కీలకమైన ఒంగోలు జిల్లా రాజకీయాలు ముఖ్యమంత్రికి నిద్రపట్టనివ్వటంలేదు. ఓ వైపు మామ, మరోవైపు బాబాయిల రాజకీయ వ్యవహారం పార్టీకి తీరని నష్టం కలిగిస్తోందని జగన్ భావిస్తున్నారు. దీనికొక పరిష్కారం కావాలని ఆయన నిర్ణయించారు..

SB NEWS

రైతులు బాగుండాలనే పెట్టుబడి సాయం: పత్తికొండలో సీఎం జగన్‌

కర్నూలు: రైతన్నకు మంచి జరగాలనే తాపత్రయంతో ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుకుంటూ వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో రైతుల ఖాతాల్లోకి వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం నిధుల జమ కార్యక్రమ బహిరంగ సభలోపాల్గొని ప్రసంగించారు.

మీ ప్రేమానురాగాలకు రెండు చేతులూ జోడించి నమస్కరిస్తున్నా. ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ అభివాదం చేసి మరీ తన ప్రసంగం ప్రారంభించారాయన.

రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ఇవాళ ఆ రైతన్నల కోసం భరోసా ఇస్తూ.. బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాలోనే సాయం జమ చేస్తున్నాం. రైతులు ఇబ్బంది పడకూడదనే ఈ పెట్టుబడి సాయం అని అన్నారాయన..

ప్లాట్ ఫామ్ ట్రైన్ మధ్యలో ఇరుక్కుపోయిన మహిళ రెండు గంటలు నరకం

ఖమ్మంజిల్లా :

ఖమ్మం రైల్వే స్టేషన్‌లో గురువారం ఘోరప్రమాదం చోటుచేసుకుంది,రైలు ఎక్కుతుండగా ఓమహిళ జారిపడింది. ట్రైన్‌, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఇరుక్కుపోయింది.

మధిరకు చెందిన రైల్వే ఉద్యోగి నాగేశ్వరరావు అతని భార్య కల్యాణి ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం వచ్చారు. ఆసుపత్రిలో చూపించుకున్న అనంతరం తిరిగి మధిర వెళ్ళడానికి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.

ఇంటర్ సిటీ ట్రైన్ రావడముతో ముందు నాగేశ్వర రావు ఎక్కాడు. వెనుకనే భార్య కల్యాణి కూడా ట్రైన్ ఎక్కుతుండగా ఒక్కసారిగా రైలు కదిలింది.

దీంతో మహిళ కాలుజారి ట్రైన్‌కు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఇరుక్కపోయి రెండు గంటలు నరకం అనుభవించింది,ఏడమ కాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. దీనిని గమనించిన రైల్వే సిబ్బంది అతి కష్టం మీద మహిళను బయటకు తీసి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు...

ములుగు జిల్లా లో నలుగురు మావోయిస్టు కొరియర్ల అరెస్టు

ములుగు జిల్లా:

వాజేడు మండలంలో నలుగురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.. వెంకటాపురం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సిఐ కె శివప్రసాద్ ఈ వివ‌రాల‌ను వెల్లడించారు..

ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు అగ్ర నాయకులు దళ సభ్యులు ..మరికొంతమంది వాజేడు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన మిషన్లను తగలబెట్టి ..అటుగా వచ్చే పోలీసు పార్టీని ల్యాండ్ మెన్ ఏర్పాటు చేసి చంపాలని కుట్ర పన్నుతున్నారని సమాచారం రావడంతో పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాలతో వాజేడు నుండి గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్యలో ఉన్న దారిలో తనిఖీ నిర్వహించారు..

ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ పై ఒక బస్తా బ్యాగు పెట్రోల్ టీం తో గుమ్మడిదొడ్డి వైపు నుండి వాజేడు వైపు వస్తు పోలీస్ పార్టీని చూసి పారిపోవాలని ప్రయత్నించారు..

గమనించిన పోలీసులు వారిని అదుపులో తీసుకొని తనిఖీ చేయగా.. అందులో పేలుడు పదార్థాలు కనిపించడంతో ఇద్దరు పంచులను పిలిపించి వారి సమక్షంలో విచారణ నిర్వహించారు.. పుల్లూరి నాగరాజు వావిలాల నర్సింగరావు ఎం పెల్లి జాగావా కంబాలపల్లి గణపతి అనే నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకొని కోర్టులో హాజరు పరచనున్నట్లు సిఐ తెలిపారు...