/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz సిద్ధిపేటలో రైల్వేట్రాక్ పనులను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు Yadagiri Goud
సిద్ధిపేటలో రైల్వేట్రాక్ పనులను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేటజిల్లా :

సిద్ధిపేట శివారు మందపల్లి నుంచి రైల్వే ట్రాక్ లైను పనులు రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య మంత్రి హరీష్‌రావు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సంతోష్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమరాజు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జనార్ధన్ బాబు, సిద్ధిపేట ఆర్డీఓ రమేశ్ బాబు, ఇతర అధికార యంత్రాంగంతో కలిసి క్షేత్రస్థాయి రైల్వే ట్రాక్ పనులను మంత్రి పరిశీలించారు.

సిద్ధిపేటకు తొందరలోనే రైలు కూత వచ్చేలా యుద్ధప్రాతిపదికన రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. సిద్ధిపేట రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో జాప్యం జరగొద్దని, పనుల వేగం పెంచాలని రైల్వే శాఖ అధికార యంత్రాంగం, కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

దుద్దెడ - సిద్ధిపేట వరకూ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులలో భాగంగా చేపట్టిన ట్రాక్ నిర్మాణ పనుల గురించి మంత్రికి రైల్వే శాఖ అధికారులు వివరించారు. దుద్దెడ - సిద్ధిపేట రైల్వే ట్రాక్ పనులలో భాగంగా మందపల్లి వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ జాప్యంపై ఆరా తీసి, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.......

అనుపమ పరమేశ్వరన్‌కు ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందా?

నటి అనుపమ పరమేశ్వరన్‌కు ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందా? ఆమె అభిమానులను ఇప్పుడు పట్టి పీడిస్తున్న అనుమానం ఇదే. అందుకు కారణం లేకపోలేదు. 2015లో ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఆ చిత్ర విజయం ఈమె దశను మార్చేసింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు అనుపమ పరమేశ్వరన్‌ బాగా ఓన్‌ చేసుకున్నారని చెప్పక తప్పదు. అక్కడ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు భాషను కూడా నేర్చుకుంది. అదే విధంగా తమిళంలోనూ ధనుష్‌ జంటగా కోడి, అధర్వ సరసన తల్లి పోగాదే వంటి చిత్రాల్లో నటించింది.

ఇక మాతృభాషలో నటిస్తున్న ఈమె బహుభాషా నటిగా రాణిస్తున్నారు. ఇటీవల నటుడు నిఖిల్‌ సిద్ధార్థ్‌తో జత కట్టిన కార్తికేయ–2 తెలుగుతో పాటు హిందీలోనూ సంచలన విజయం సాధించింది. అలా బాలీవుడ్‌ ప్రేక్షకులను పరిచయం అయిన అనుపమ ప్రేమ వ్యవహారంపై కూడా 10 రకాల వార్తలు ఉన్నాయి. ముఖ్యంగా స్టార్‌ క్రికెటర్‌ బుమ్రాతో ప్రేమాయణం అంటూ వార్తలు హల్‌చల్‌ చేశాయి. అయితే ఇటీవల ఆయన తన ప్రేయసిని పెళ్లి చేసుకోవడంతో ఆ ప్రచారానికి పుల్‌స్టాప్‌ పడింది.

తాజాగా నటి అనుమప పరమేశ్వరన్‌ ఒక ప్లాస్టిక్‌ పేపర్‌ను ఉంగరంగా తయారు చేసి తన వేలికి తొడుక్కుని తన ఎంగేజ్‌మెంట్‌ ఉంగరం అంటూ ఇన్‌స్ర్ట్రాగామ్‌లో పేర్కొంది. దీంతో తమ అభిమాన నటి పెళ్లికి సిద్ధమైందా అంటూ అభిమానులు తెగ కలవరపడిపోతున్నారు.

అయితే ఆమె సరదాగా అలా చేసినట్లు పేర్కొనడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం పెళ్లి తలపుల్లో అనుపమ. ఆ రహస్య ప్రేమికుడు ఎవరో? అంటూ వైరల్‌ చేస్తున్నారు. కాగా ఈ 27 ఏళ్ల పరువాల సుందరి ప్రస్తుతం తమిళంలో నటుడు జయం రవి, కీర్తిసురేష్‌లతో కలిసి సైరన్‌ చిత్రంలో నటిస్తోంది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల :

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు గురువారం శ్రీవారి సర్వదర్శనానికి 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం 80,284 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.71 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారిని 34,096 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు....

SB NEWS

SB NEWS

SB NEWS

బ్రేకింగ్ న్యూస్ : ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

ఖమ్మం జిల్లా :

జిల్లాలోని కొణిజర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కొణి జర్ల మండల కేంద్రం సమీపంలోని పెట్రోల్‌బంకు ఎదురుగా లారీ కారు పరస్పరం ఢీ కొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.

మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని తీవ్ర గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

మృతులు వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన పారుపల్లి రాజేష్, సుజాత దంపతులు, కుమారుడు అశ్విత్(13)గా గుర్తించారు.

హైదరాబాద్‌లో ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో రాజేష్ ఉద్యోగి. హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది....

SB NEWS

స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్:

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరోసారి విశాఖ శ్రీ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని ఆశీస్సులు తీసుకున్నారు.

నగరంలోని చందానగర్‌లో శ్రీ విశాఖ శారదాపీఠం పాలిత వెంకటేశ్వర స్వామి ఆలయంలో బస చేసిన స్వరూపానందేంద్రను కేసీఆర్ కలిశారు. బుధవారం ఆలయానికి వెళ్లి పీఠాధిపతులతో కొద్దిసేపు ముచ్చటించారు. కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్‌తోపాటు పలువురు ఉన్నారు.

కోకాపేటలో రాజశ్యామల అమ్మవారి ఆలయ నిర్మాణానికి సాయం..

హైదరాబాద్ కోకాపేటలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామల అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఈ నెల ఆరంభంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామి చేతులమీదుగా శంకుస్థాపన జరిగింది.

రూ.8 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆలయానికి కేసీఆర్ సర్కార్ రెండెకరాల స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. శంకుస్థాపన సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో రాజశ్యామల అమ్మవారు ఆవిర్భవించాలనే సదుద్దేశంతోనే కేసీఆర్ తమ పీఠానికి రెండెకరాల స్థలాన్ని కేటాయించారని అన్నారు.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే కేసీఆర్ ఆకాంక్షించారని తెలిపారు. రాజశ్యామల అమ్మవారి మహిమ గురించి సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబాలను అడిగితే చెబుతారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే...

సాక్షి హత్య కేసులో నిందితుడు సాక్షితో సహా ఐదుగురిని హత్య చేసేందుకు ప్లాన్

ఢిల్లీలోని ప్రముఖ సాక్షి హత్య కేసులో 11 గంటలకు మద్యం, గంజాయి తాగి కత్తితో తిరుగుతున్న నిందితుడు సాక్షితో సహా ఐదుగురిని హత్య చేసేందుకు ప్లాన్ వేసినట్లు వెల్లడైంది.

ఢిల్లీలోని ప్రముఖ సాక్షి హత్యకేసులో పెద్ద సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు సాహిల్ ఆదివారం ఉదయం నుంచి సాక్షి హత్యపై నిఘా పెట్టినట్లు తెలిసింది. సీసీటీవీ కెమెరా ఫుటేజీలో కూడా పోలీసులు ఇందుకు సంబంధించిన ఆధారాలను గుర్తించారు. మూడు, నాలుగు రోజులుగా హత్యకు ప్లాన్ చేస్తున్నట్టు నిందితుడు చెప్పాడు. అతని టార్గెట్ సాక్షి మాత్రమే కాదు, ప్రవీణ్ మరియు మరో ఇద్దరు ముగ్గురు యువకులు కూడా. చంపాల్సిన ఐదుగురి జాబితాను తయారు చేశాడు. ఆదివారం మార్గమధ్యంలో ఎవరు కలిసినా చంపేసేవాడు. ఈ మార్గాన్ని సాక్షులు మరియు ఇతరులు ఉపయోగిస్తున్నారని అతనికి తెలుసు. అందుకే ఉదయం నుంచి కత్తితో తిరుగుతున్నాడు. ఉదయం 11 గంటల సమయంలో మద్యం, గంజాయి సేవించినట్లు నిందితులు తెలిపారు. మధ్యమధ్యలో మత్తు మందు తాగుతూనే ఉన్నాడు. హత్య చేసినప్పుడు అతడు మద్యం మత్తులోనే ఉన్నాడు.

స్నేహం సాకుతో దాడి చేయొద్దని సాక్షి వేడుకున్నా.. దాడి మాత్రం కొనసాగించాడని నిందితుడు చెప్పాడు. హత్య చేసేందుకు హరిద్వార్ నుంచి కత్తిని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం కత్తిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరో సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సంఘటనా స్థలంలో సంఘటన జరగడానికి ముందు సాహిల్ ఓ యువకుడితో మాట్లాడుతున్నాడు. అయితే సాహిల్ ఇంతకు ముందు ఈ ప్రాంతంలో ఉండేవాడని పోలీసులు చెబుతున్నారు. అందుకే సంఘటన జరిగినప్పుడు తెలిసిన వారి పోవడం గురించి మాట్లాడుతున్నాడు. పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకుడు కూడా మరో యువకుడు ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతానికి ఈ యువకుడిని కూడా పోలీసులు విచారించనున్నారు.

అడవిలో ఫోన్, కత్తి విసిరాడు

హత్య అనంతరం తాను రిథాలా మెట్రో స్టేషన్‌ వైపు వెళ్లినట్లు నిందితుడు చెప్పాడు. ఇంతలో ఫోన్, కత్తిని గుప్తా కాలనీలోని అడవిలో విసిరేశారు. రాత్రిపూట రోడ్డుపై నిద్రించిన తర్వాత, అతను తెల్లవారుజామున బస్సులో తన అత్త గ్రామం అటెర్ని బులంద్‌షహర్‌కు చేరుకున్నాడు. అయితే హత్య విషయాన్ని అత్తకు చెప్పలేదు.

అన్ని శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించండి

ఈ హత్యపై పోలీసులు అన్ని సైంటిఫిక్ టెక్నిక్‌లను ఉపయోగిస్తారని ఔటర్ నార్త్ డీసీపీ రవికుమార్ సింగ్ తెలిపారు. అవసరమైతే, నిందితుడి మానసిక పరీక్ష కోసం సైకాలజిస్ట్ సహాయం కూడా తీసుకోబడుతుంది.

నిందితులను విచారించి ఆధారాలు సేకరిస్తామని మంగళవారం తెలిపారు. అలాగే హత్యకు గల కారణాలను కూడా కనుగొననున్నారు. హత్యకు ముందు మరియు తరువాత సాహిల్ ఢిల్లీ నుండి బులంద్‌షహర్‌కు వెళ్లడానికి మధ్య కూడా లింక్ ఉంది. నిందితులు, సాక్షులు, వారి స్నేహితుల ఫోన్‌లు, సోషల్‌ మీడియా ఖాతాలు, కాల్‌ డిటైల్స్‌ను స్కానింగ్‌ చేసి హత్యలో ఇంకా ఎవరైనా ప్రమేయం ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఘటనకు ఉపయోగించిన ఫోన్‌, కత్తి ఇంకా లభ్యం కాలేదు. ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

ప్రవీణ్‌ను విచారించనున్నారు

ప్రవీణ్‌ని కూడా పోలీసులు విచారించనున్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రవీణ్ జాన్‌పూర్‌లో ఉన్నాడు. అతను ఐదు-ఆరు సంవత్సరాలు సాహిల్‌తో కలిసి జీవించాడు, కాని వెంటనే అతను తన స్వంత పనిని ప్రారంభించాడు. ప్రవీణ్‌ని విచారించడంతో కొన్ని ముఖ్యమైన లింకులు కూడా చేరి హత్యకు గల కారణాలు కూడా తెలుస్తాయి.

ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు కుటుంబాన్ని కలిశారు

ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు చౌదరి అనిల్ కుమార్ మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఢిల్లీలో పెరుగుతున్న నేరాలు మరియు శాంతిభద్రతల పరిస్థితికి బిజెపి మరియు ఆమ్ ఆద్మీ పార్టీ రెండూ సమానంగా బాధ్యత వహించాలని ఆయన అన్నారు.

తెలంగాణపై అమిత్ షా కన్ను పడింది : కెసిఆర్ జాగ్రత్తగా ఉండాలి

ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పాగాకు బీజేపీ భారీ స్కెచ్‌ వేస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్‌ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలంగాణలో తన ప్రణాళిక అమలు చేసేందుకు అమిత్ షా నేరుగా హైదరాబాద్‌లోనే మకాం పెట్టబోతున్నారని చెప్పారు. ఇందుకోసం శంషాబాద్‌ వద్ద అమిత్ షా ఒక పెద్ద ఇంటిని నిర్మించుకున్నారని వివరించారు.

ఆ ఇంటిని ఒక పెద్ద వ్యాపారి నిర్మించి ఇచ్చారన్నారు. అమిత్ షా నెలలో రెండు రోజుల పాటు ఆ ఇంట్లో ఉంటూ తెలంగాణ రాజ‌కీయాల‌పై దృష్టి సారించబోతున్నారని ఒవైసీ వెల్లడించారు.

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోతారన్నారు. తెలంగాణ ప్రభుత్వ స్ట్రీరింగ్‌ ఎంఐఎం చేతుల్లో ఉందంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఒవైసీ కొట్టిపారేశారు.

స్ట్రీరింగ్ తమ చేతుల్లో ఉంటే పాతబస్తీలో అభివృద్ధి మరోలా ఉండేద‌న్నారు. హైదరాబాద్‌ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటున్న బండి సంజయ్‌ దమ్ముంటే చైనా మీద చేయాలని సవాల్ చేశారు....

జగిత్యాల జిల్లాలో చెట్టును ఢీకొన్న లారీ.. క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్

జగిత్యాలజిల్లా :

జిల్లాలో ధాన్యం లోడుతో వెళ్తున్న ఓ లారీ చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ నుజ్జు నుజ్జు అయ్యింది. డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు.

జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండల కేంద్రం మూలమలుపు వద్ద ఈ ప్రమాదం బుధవారం జరిగింది. ప్రమాదానికి లారీ అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

క్యాబిన్ లో డ్రైవర్ సందీప్ ఇరుక్కుని.. గంట పాటు నరకయాతన అనుభవించాడు. ప్రమాదం గురించి తెలియగానే స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు.

క్యాబిన్ నుంచి డ్రైవర్ ను అతి కష్టం మీద బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ కు డాక్టర్లు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. చెన్నూరు నుండి అదిలాబాద్ కు ధాన్యం లోడుతో లారీ వెళ్తుండగా ప్రమాదం జరిగింది..............

SB NEWS

హుజురాబాద్ బీఆర్ఎస్‌లో వర్గ పోరు❓️

కమలాపూర్: హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌లో వర్గపోరు నడుస్తోంది. అవినీతి ఆరోపణలపై ఈటలను మంత్రి పదవి నుంచి తొలగించడంతో ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడం అందరికీ తెలిసిందే. అయితే అనంతరం నిర్వహించిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఈటల గెలిచిన విషయం విధితమే. అయితే ప్రస్తుతం కమలాపూర్ మండలంలో పార్టీ కార్యకర్తల మధ్య సఖ్యత లేక విభేదాలు తలెత్తుతున్నాయి. పార్టీ నేతల మధ్య వర్గపోరు ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో గెలవడం సాధ్యమేనా? అంటూ సొంత పార్టీ నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సమక్షంలోనే కార్యకర్తలు ఒకరినొకరు దూషించుకున్నారు. ఆయన ఎంత చెప్పినా వినకుండా కుర్చీలు విసురుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం ఆశ్చర్యపరిచింది. అంతేకాక ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరిన నాయకులు పాతవారిపై అజమాయిషి చలాయిస్తున్నారనే పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమను గుర్తించడం లేదని ఎవరికీ చెప్పుకోవాలో తెలియక కిందిస్థాయి నాయకులు మదనపడుతున్నారు.

తారాస్థాయికి గొడవులు:

ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నికల ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌‌తో కలిసి పనిచేసిన పార్టీ నాయకులు ఒక వర్గంగా, ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి వర్గం నాయకుల మధ్య వర్గపోరు నడుస్తోంది. ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గ పూర్తి బాధ్యతలు కౌశిక్ రెడ్డికి అప్పగించగా నియోజకవర్గంలో పర్యటిస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటీవల పార్టీలో కొంతమంది నేతలు పార్టీ కోసం మనస్ఫూర్తిగా పనిచేయడం లేదంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈటల గెలిచినప్పుడు కూడా కొంతమంది ముఖ్యనాయకులు ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే కొందరు ఒక పార్టీ జెండా పట్టుకుని ఇంకో పార్టీ కోసం పనిచేస్తూ సొంత పనిచేస్తున్నామంటూ చెప్పుకుంటూ పార్టీలో కొనసాగుతున్నారని ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటుండడంతో గొడవలు తారాస్థాయికి చేరాయనే పలువురు చర్చించుకుంటున్నారు. పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు, వీడియోలు రావడంతో కౌశిక్ రెడ్డి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తాడనే అంశంపై మండలంలో అన్ని వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

ఈ వర్గ పోరు, వివాదాలు ఇలానే కొనసాగితే పార్టీలో ఉండి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రజల మధ్యకు రాలేమంటూ ఒక వర్గం నాయకులు అభిప్రాయపడినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైనా ముఖ్య నాయకులు మేల్కొని ఈటలపై గెలుస్తారో..? లేక వీరి విభేదాల వల్ల ఈటలకు లాభం చేకూర్చి మళ్లీ ఈటలకు పట్టం కడతారో వేచి చూడాల్సిందే..........

APPSC: త్వరలో గ్రూప్‌ -1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు: గౌతమ్‌ సవాంగ్

విజయవాడ: త్వరలోనే గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు..

గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించిన మెయిన్స్‌ పరీక్షలను జూన్‌ 3 నుంచి 10 వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు సవాంగ్‌ తెలిపారు.

ఈ ఏడాది జనవరి 8న ప్రిలిమ్స్‌ పరీక్షలు నిర్వహించామని సవాంగ్‌ చెప్పారు. పరీక్షలు జరిగిన 19 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించామని.. 6,455 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారన్నారు.

జూన్‌ 3 నుంచి మెయిన్స్‌ పరీక్షలను 10 జిల్లాల్లోని 11 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు.

కేవలం 15 నిమిషాలు మాత్రమే గ్రేస్‌ పిరియడ్‌ ఉంటుందని.. ఆ సమయం దాటితే లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. జులైలో మెయిన్స్‌ ఫలితాలు వెల్లడించి ఆగస్టు చివరి నాటికి గ్రూప్‌-1 ఇంటర్వ్యూలు పూర్తిచేస్తామని గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.