/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నిర్మల్‌ హృదయ్‌ భవన్‌కు సీఎం జగన్ దంపతులు Yadagiri Goud
నిర్మల్‌ హృదయ్‌ భవన్‌కు సీఎం జగన్ దంపతులు

గుంటూరు:

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం విజయవాడలో పర్యటించారు. నగరంలోని రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు సందర్శించారు.

వారికి ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీరావు తదితరులు స్వాగతం పలికారు. 

నిర్మల్‌ హృదయ్‌ భవన్‌లో ఆశ్రయం పొందుతున్న అనాథ పిల్లలతో సీఎం దంపతులు ముచ్చటించారు. మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి నివాళులర్పించారు.

అక్కడ నూతనంగా నిర్మించిన భవనాన్ని పిల్లలతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి పయనమయ్యారు.

మరోవైపు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకోవడంతో.. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున్న రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే సేవా కార్యక్రమాలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కేక్‌ కట్‌ చేసి ప్రారంభించారు....

ఖిల్లా మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా:

మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కే పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ అమ్మవారిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి దర్శించుకున్నారు.

దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం

ఆలయ అభివృద్ధి కొరకై కోటి రూపాయలు మంజూరు చేసిన సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.అభివృద్ధి అనేది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉండాలని మంత్రి అన్నారు.

మన తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఏ రంగాన్ని ఎంచుకున్న రంగంలో అన్ని విధాల అభివృద్ధి చెందేటట్లు 50 సంవత్సరాలు చరిత్రలో నిలిచే విధంగా గుర్తు పెట్టుకునే విధంగా అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని పేర్కొన్నారు.

నా నియోజకవర్గంలో గల అతి పురాతనమైన దేవాలయాల మరమ్మత్తులకై ముఖ్యమంత్రి ని అడగగా తక్షణమే 8 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్,రామనర్సింహ గౌడ్,ఎండోమెంట్ ఇంజనీరింగ్ అధికారులు మరియు ఆలయ కమిటీ ధర్మకర్తలు, అరవింద్ శర్మ, బేర బాలకిషన్,లోకసాని కొండల్ రెడ్డి, అంకిరెడ్డి ఆర్కే పురం డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్, సాజిద్, ధర్పల్లి అశోక్,సునీత రెడ్డి, స్వప్న మరియు ఇతర నాయకులు,మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు...

చెన్నై ఫైవ్‌ స్టార్‌... ఐదోసారి చాంపియన్‌

ఐదోసారి ఐపీఎల్‌ టైటిల్‌ సాధించిన సూపర్‌కింగ్స్‌

ఫైనల్లో 5 వికెట్లతో గుజరాత్‌పై ఘన విజయం

వర్షంతో మారిన లెక్కల్లో ధోని సేనదే పైచేయి

ఆఖరి బంతికి గెలిపించిన జడేజా

అహ్మదాబాద్‌:

ఐపీఎల్‌–2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చాంపియన్‌గా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో చెన్నై 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.

సాయి సుదర్శన్‌ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ కోల్పోగా... వృద్ధిమాన్‌ సాహా (39 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్‌) శుబ్‌మన్‌ గిల్‌ (20 బంతుల్లో 39; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసి గెలిచింది. కాన్వే (25 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్‌ దూబే (21 బంతుల్లో 32 నాటౌట్‌; 2 సిక్స్‌లు) రాణించారు.

సమష్టి బ్యాటింగ్‌ ప్రదర్శన...

42 బంతుల్లో 67, 42 బంతుల్లో 64, 33 బంతుల్లో 81... తొలి మూడు వికెట్లకు వరుసగా గుజరాత్‌ భాగస్వామ్యాలివి. జట్టులోని టాప్‌–4 తమ వంతుగా కీలకపాత్ర పోషించడంతో భారీ స్కోరు సాధ్యమైంది. సాహా, గిల్‌ ఇద్దరూ దూకుడుగా ఆడుతూ ఈ సీజన్‌లో మరోసారి జట్టుకు శుభారంభం అందించారు. తుషార్‌ వేసిన రెండో ఓవర్లోనే 3 పరుగుల వద్ద గిల్‌ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను దీపక్‌ చహర్‌ వదిలేసి గుజరాత్‌కు మేలు చేశాడు. చహర్‌ ఓవర్లో సాహా సిక్స్, 2 ఫోర్లు కొట్టగా... తుషార్, తీక్షణ ఓవర్లలో గిల్‌ వరుసగా మూడేసి ఫోర్లు బాది జోరు ప్రదర్శించాడు.

21 పరుగుల వద్ద సాహా ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను కూడా చహర్‌ వదిలేయడం టైటాన్స్‌కు మరింత కలిసొచ్చింది. ఎట్టకేలకు ధోని మెరుపు స్టంపింగ్‌తో గిల్‌ వెనుదిరగ్గా, 36 బంతుల్లో సాహా అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ వెంటనే సాహా అవుట్‌ కాగా, సుదర్శన్‌ దూకుడు కొనసాగింది. తీక్షణ ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన అతను పతిరణ ఓవర్లో వరుసగా 2 ఫోర్లు కొట్టి 33 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీకి చేరుకున్నాడు. తుషార్‌ వేసిన తర్వాతి ఓవర్లో అతను మరింత చెలరేగిపోయాడు.

తొలి నాలుగు బంతుల్లో అతను 6, 4, 4, 4 కొట్టడం విశేషం. తుషార్‌ తర్వాతి ఓవర్లోనూ టైటాన్స్‌ 18 పరుగులు రాబట్టింది. పతిరణ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 6, 6 కొట్టి 96కు చేరిన సుదర్శన్‌ తర్వాతి బంతికి దురదృష్టవశాత్తూ ఎల్బీగా దొరికిపోయి సెంచరీ చేజార్చుకున్నాడు. చివర్లో హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 21 నాటౌట్‌; 2 సిక్స్‌లు) ధాటి గుజరాత్‌ను మరింత పటిష్ట స్థితికి చేర్చింది.

వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం చెన్నై విజయలక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్ణయించారు. ఛేదనను చెన్నై ఘనంగా ప్రారంభించింది. దూకుడుగా ఆడిన ఓపెనర్లు రుతురాజ్, కాన్వే 4 ఓవర్ల పవర్‌ప్లే ముగిసేసరికి 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో స్కోరును 52 పరుగులకు చేర్చారు.

అయితే పవర్‌ప్లే తర్వాత చెన్నైని నియంత్రించడంలో బౌలర్లు సఫలమయ్యారు. నాలుగు పరుగుల తేడాతో వీరిద్దరు వెనుదిరిగారు. అయితే రుతురాజ్‌ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్‌), రహానే (13 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అంబటి రాయుడు (8 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా ఓ చేయి వేసి జట్టును గెలుపు దిశగా నడిపించారు.

15 ఓవర్లకు కుదింపు...

రిజర్వ్‌ డే అయిన సోమవారం కూడా వాన మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. సరైన సమయానికే ఆరంభమై గుజరాత్‌ పూర్తి 20 ఓవర్లు ఆడింది. అయితే చెన్నై ఇన్నింగ్స్‌లో 3 బంతులకు 4 పరుగులు చేసిన తర్వాత మొదలైన వర్షం సుదీర్ఘ సమయం పాటు తెరిపినివ్వలేదు.

వర్షం తగ్గినా, ప్రధాన పిచ్‌ పక్కన ఉన్న మరో పిచ్‌ ఆరకపోవడంతో సమస్యగా మారింది. దానిని ఆరబెట్టేందుకు గ్రౌండ్స్‌మన్‌ అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు అర్ధరాత్రి 12.05 గంటలకు మ్యాచ్‌ మళ్లీ మొదలైంది. చెన్నై ఇన్నింగ్స్‌ను 15 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 171 పరుగులుగా నిర్దేశించారు. పవర్‌ప్లేను 4 ఓవర్లకు పరిమితం చేయగా, ఒక్కో బౌలర్‌ గరిష్టంగా 3 ఓవర్లు మాత్రం వేసేందుకు అనుమతించారు.

స్కోరు వివరాలు

గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) ధోని (బి) చహర్‌ 54; గిల్‌ (స్టంప్డ్‌) ధోని (బి) జడేజా 39; సుదర్శన్‌ (ఎల్బీ) (బి) పతిరణ 96; పాండ్యా (నాటౌట్‌) 21; రషీద్‌ (సి) రుతురాజ్‌ (బి) పతిరణ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–67, 2–131, 3–212, 4–214, బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–38–1, తుషార్‌ 4–0–56–0, తీక్షణ 4–0–36–0, జడేజా 4–0–38–1, పతిరణ 4–0–44–2.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) రషీద్‌ (బి) నూర్‌ 26; కాన్వే (సి) మోహిత్‌ (బి) కాన్వే 47; దూబే (నాటౌట్‌) 32; రహానే (సి) విజయ్‌శంకర్‌ (బి) మోహిత్‌ 27; రాయుడు (సి) అండ్‌ (బి) మోహిత్‌ 19; ధోని (సి) మిల్లర్‌ (బి) మోహిత్‌ 0; జడేజా (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15 ఓవర్లలో 5 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–74, 2–78, 3–117, 4–149, 5–149. బౌలింగ్‌: షమీ 3–0–29–0, పాండ్యా 1–0–14–0, రషీద్‌ 3–0–44–0, నూర్‌ 3–0–17–2, లిటిల్‌ 2–0–30–0, మోహిత్‌ శర్మ 3–0–36–3.

పోలీసులకు పుష్ప సినిమా చూపించిన గంజాయి స్మగ్లర్లు

భద్రాచలం :మన్యంలో పుష్ప చిత్రం సీన్లు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. అడవిమాటున అక్రమం రాజ్యమేలుతోంది. గంజాయి స్మగ్లింగ్ జోరు అందుకుంది. గంజాయి స్మగ్లర్లు గంజాయి తరలింపునకు రకరకాల మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు.

భద్రాచలం మీదుగా కోట్లాది రూపాయలు విలువ చేసే నిషేధిత గంజాయి సరిహద్దులు దాటుతోంది. సోమవారం అర టన్ను విలువ చేసే గంజాయి పోలీసులకు చిక్కటం గమనార్హం. ట్రాక్టర్ ట్రాలీకి ప్రత్యేక ఛాంబర్ కట్టి అందులో గంజాయి ప్యాకెట్లు తరలిస్తుండగా పట్టుబడిన సంఘటన ‘పుష్ప’ చిత్ర సన్నివేశం గుర్తుకు తెచ్చింది.

మన్నెంలో స్మగ్లింగ్ స్మెల్…

భద్రాచలం మన్యంలో నిషేధిత గంజాయి స్మగ్లింగ్ గుట్టుగా సాగుతోంది. ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అడవుల్లో గంజాయి సాగు జరుగుతుండగా, ఈ నిషేధిత గంజాయిని అక్కడినుంచి సమీప భద్రాచలం అటవీ ప్రాంతం గుండా అక్రమార్కులు సరిహద్దును దాటిస్తున్నారు.

ఒడిశాలోని చిత్రకొండ, కల్లూరు, బలిమెల, పెళ్లి బాయ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుత్తేడు, డొంకరాయి, సీలేరు, కొండరాజుపేట, ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాల్లో గంజాయి పెద్ద ఎత్తులో సాగుతోంది. దొరికితే దొంగ లేదంటే దొర అన్న చందంగా స్మగ్లర్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. ఛత్తీస్ గఢ్, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో చెక్ పోస్ట్ లు ఉన్నా అవి ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యాయి.

అక్కడి అధికారుల కనుసనల్లోనే ఈ గంజాయి రవాణా సాగుతోందన్న ఆరోపణలు లేకపోలేదు. ఇదిలా ఉండగా తెలంగాణ భద్రాచలం వద్ద కూడా చెక్ పోస్ట్ లు ఉన్నాయి. అడపాదడపా ఇక్కడ కూడా గంజాయి పట్టుబడుతున్నప్పటికీ పెద్ద ఎత్తున భద్రాచలం కూడా గంజాయి దాటి పట్టణాలకు తరలిపోతోందని తెలుస్తోంది. గతంలో పెద్ద ఎత్తున గంజాయి పట్టు పడగా, ఇటీవల కాలంలో స్మగ్లర్లు రకరకాల మార్గాల ద్వారా గంజాయిని సరిహద్దు దాటిస్తున్నట్లు సమాచారం...

వరంగల్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఎస్సై ల బదిలీలు

వరంగల్ జిల్లా:

కమిషనరేట్ పరిధిలో 12 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ ఏవీ రంగనాథ్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన ఎస్సైలు వీరే..

1.ఎం.సురేష్ వీఆర్ నుంచి హసన్ పర్తి

2.భూక్యా చందర్ వీఆర్ నుంచి కేయూసీ

3.ఏ.ప్రవీణ్ కుమార్ వీఆర్ నుంచి వర్ధన్నపేట

4.బి.రామారావు వర్ధన్నపేట నుంచి హన్మకొండ

5.డి.వి ఫణి వీఆర్ నుంచి సుబేదారి

6.డి.రాజు హన్మకొండ నుంచి టాస్క్ ఫోర్స్

7.జి.అరుణ్ రిపోర్ట్ ఫ్రమ్ భద్రాది కొత్తగూడెం నుంచి జనగామ

8.బి.మాధవ్ వీఆర్ నుంచి మట్టెవాడ

9.ఎండీ.గాలిబ్ వీఆర్ నుంచి సుబేదారి

10.గాలిబ్ షరీఫ్ వీఆర్ నుంచి ఇంతేజార్ గంజ్

11.ఎండీ వలీ వీఆర్ నుంచి హసన్ పర్తి కె.లక్ష్మి భరోసా సెంటర్

12.ఎస్. డేవిడ్ వీఆర్ నుంచి కొడకండ్లకు. బదిలీ చేసినట్లు తెలిసింది..

ఇట్లా కాలిస్తే ఎట్లా ❓️

వరి కొయ్యలను తగులబెడుతున్న రైతులు

సారం దెబ్బతింటున్నదంటున్న శాస్త్రవేత్తలు

మేలు చేసే సూక్ష్మ జీవులు చనిపోయి పంట దిగుబడి తగ్గే ప్రమాదం

పెద్దపెల్లి జిల్లా : గతంలో కొడవళ్లతో వరిని మొదళ్ల వరకు కోసేవారు. ప్రస్తుతం యంత్రాలు అందుబాటులోకి రావడంతో మొదళ్ల వరకు కాకుండా 25 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తులో కోస్తున్నాయి. దీంతో గడ్డి కొయ్య కాళ్ల రూపంలో పంట అవశేషంగా మిగులుతున్నది. వీటిని రైతులు మడిలోనే తగులబెడుతున్నారు.

ఇది పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నది. కాల్చడం వల్ల అపార నష్టాలున్నాయంటూ శాస్త్రవేత్తలు పదేపదే చెబుతున్నా మెజార్టీ రైతులు వినకుండా వరి కొయ్యలను కాల్చుతూనే ఉన్నారు. తద్వారా తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్లు అవుతున్నది. ఈ విధానం వల్ల ప్రకృతి దెబ్బతినడమేకాదు, అన్నదాత అన్ని రకాలుగా నష్టపోతున్నాడు. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోవడమే కాకుండా సారవంతమైన భూమి దెబ్బతినడంతో దిగుబడిపై కూడా ప్రభావం చూపుతున్నది. వాతావరణం కలుషితమవుతున్నది.

అప్పట్లో దొడ్డినిండా పశువులు ఉండడం వల్ల వాటి మేత కోసం గడ్డిపోచను కూడా విడిచిపెట్టకుండా.. కొడవళ్లతో వరిని మొదళ్ల వరకు కోసేవారు. ఎండబెట్టి కుప్పవేసి ఏడాదంతా పశువులకు మేతగా ఉపయోగించే వారు. ఇప్పుడు పశువులు లేకుండా పోయాయి. రైతుకు గడ్డి అవసరం లేకుండాపోయింది. వరికోత యంత్రాలు వచ్చిన తదుపరి గడ్డిని కుప్పవేసే రైతులను వేళ్లపై లెక్కపెట్టే పరిస్థితులు వచ్చాయి. మారిన ప్రపంచీకరణ నేపథ్యంలో.. ప్రస్తుతం రైతులు వరిపంట కోతకు యంత్రాలను వినియోగిస్తున్నారు. పంటకు, పంటకు మధ్య సమయం తక్కువ ఉండడంతో వరికోసిన తర్వాత మిగిలిన కొయ్యకాళ్లు, వరిగడ్డిని కంపోస్టుగా మార్చుకోవడంపై రైతులకు అవగాహన లేకపోవడంతో పొలంలో ఉన్న కీటకాలను, వ్యాధికారక జీవులు నశింపచేయవచ్చన్న అపోహతో చాలా మంది రైతులు వరి కొయ్య కాళ్లను, గడ్డిని తగులబెడుతున్నారు.

తగులబెట్టడం వలన అనేక నష్టాలు

వరి కొయ్యలను తగులపెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతున్నది. ఉత్తర భారతదేశంలో ఈ కారణంగా శీతాకాలంలో తీవ్రస్థాయిలో కాలుష్య సమస్యలు ఎదురవుతున్నాయని ఇప్పటికే అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా సూక్ష్మజీవులు పంటకు వేసే ఎరువులను మొక్కలకు అందిస్తాయి. కానీ కొయ్యలను తగులపెట్టడంతో అవి చనిపోవడంతో రైతులు వేసే ఎరువులు మొక్కకు అందే అవకాశం లేకుండాపోతున్నది. కొయ్యకాళ్లను కాల్చడం వల్ల నేలలోని సేంద్రీయ కర్బనం, కార్బన్‌డైఆక్సైడ్‌గా మారి వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతున్నది. పొగ, ధూళికణాలు గాలిలో కలవడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. అలాగే పొలాల్లో తిరిగే ముంగిసలు, ఉడుములు, నెమళ్లు, తొండలు ఇలా అనేక జీవరాసులు చనిపోతున్నాయి. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. ఇది సాగుకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.

కలియ దున్నినా..కుప్ప పెట్టినా.. బంగారమే

వరిపంట కోసిన వెంటనే కొయ్యకాళ్లను తగులబెట్టకుండా పొలంలో మిగిలిన తేమను ఉపయోగించుకుని దున్నాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దున్నడం వల్ల కొయ్యకాళ్లు మట్టితో కప్పబడి కుళ్లే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తద్వారా సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఇలా చేయడం వల్ల వేసవిలో నేలలో పగుళ్లు రాకపోవడం, తేమ ఆవిరి కావడం తగ్గి తొలకరిలో పడిన వర్షపునీరు నేలలోకి ఇంకిపోవడం ద్వారా నేలకోతకు గురికాకుండా ఉంటుంది. ఒక టన్ను వరి గడ్డి కావాలంటే.. ఆ వరి పెరుగుదలకు 18.9 కిలోల పోటాషియం, 6.2 కిలోల నత్రజని, 1.1 కిలోల భాస్వరంతోపాటు కొంత మోతాదులో సూక్ష్మపోషకాలు అవసరం అవుతాయి. కొయ్యకాళ్లను భూమిలో కలియ దున్నితే, గడ్డి ద్వారా పోషకాలన్ని తిరిగి నేలకు చేరతాయి. లేదా ఈ పంట అవశేషాల వ్యర్థాలను కంపోస్టు చేయడం ద్వారా సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవచ్చు. వానాకాలంలో దమ్ము చేసేటప్పుడు ఎకరానికి 50 కిలోల సూపర్‌ ఫాస్ఫేట్‌ వేస్తే నేలలో మిగిలిపోయిన వరికొయ్యలు తొందరగా కుళ్లిపోతాయి. తర్వాత నాటే వరి పంటకు నేల ద్వారా పోషకాలు అందుబాటులోకి వస్తాయి. ఈవిధానంపై ఆయా మండలాల్లో వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నా, క్షేత్ర స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తు న్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది......

పార్లమెంట్‌ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు❓️

న్యూ ఢిల్లీ :

భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేశ పార్లమెంట్‌ నూతన భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్‌ ఓంబిర్లా తాజాగా ప్రారంభించారు. రూ.20,000 కోట్ల సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా కొత్త పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌ను నిర్మించారు.

65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాత భవనం కంటే మూడు రెట్లు అధిక పరిమాణంలో ఆకట్టుకునే హంగులతో కొత్త పార్లమెంట్ భవనం రూపొందింది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పార్లమెంట్‌ భవనాన్ని ఏ నిర్మాణ సంస్థ కట్టింది. భవన నిర్మాణానికి ఎంత ఖర్చయింది.. వంటి ఆసక్తికరమైన విషయాలు మీ కోసం...

నిర్మాణ సంస్థ ఇదే..

భారత పార్లమెంట్‌ నూతన భవనాన్ని టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ నిర్మించింది. 2020లో లార్సెన్ అండ్‌ టూబ్రో (L&T)పై రూ. 3.1 కోట్ల స్వల్ప మార్జిన్‌తో రూ. 861.9 కోట్లకు ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. మొదట్లో షాపూర్జీ పల్లోంజీ సంస్థ పోటీలో నిలిచినా తరువాత బిడ్డింగ్ ప్రక్రియ నుంచి వైదొలింది.

రూ.940 కోట్లు.. 21 నెలల్లోనే పూర్తి

సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.940 కోట్లు. కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని కేవలం 21 నెలల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించింది టాటా కంపెనీ......

SB NEWS

హైదరాబాద్ పబ్ లో పాములు..!!

పబ్బులో మాత్రం వన్య ప్రాణులతో ఎంటర్టైన్ అయ్యారు..!!

విషపూరితమైనవి కాదని తెలుసుకుని వాటిని పట్టుకుని ఫోటోలు దిగారు..!!

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు పోలీసు అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు..!!

పబ్ లు అంటే ఫుల్ మ్యూజిక్, మద్యం.. ఇలాంటివి చాలా వరకూ వింటూ ఉంటాం. కానీ హైదరాబాద్ లోని ఓ పబ్బులో మాత్రం వన్య ప్రాణులతో ఎంటర్టైన్ అయ్యారు. అరుదైన తొండలు, పాములు చూసి పబ్ కు వెళ్లిన కొందరు షాక్ అయ్యారు.

అయితే అవేవీ విషపూరితమైనవి కాదని తెలుసుకుని వాటిని పట్టుకుని ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు పోలీసు అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు. వన్య ప్రాణులను పబ్బుల్లోకి తీసుకుని వచ్చింది ఎవరు అనే కోణంలో ఆరాతీయడం మొదలుపెట్టారు.

జూబ్లీ హిల్స్‌లో..!!

జూబ్లీ హిల్స్‌లో ఉన్న Xora నైట్ క్లబ్ లోనివి ఈ విజువల్స్. ఇటీవల 'వైల్డ్ జంగిల్ పార్టీ' థీమ్‌లో భాగంగా ఈ ప్రాణాలను తీసుకుని వచ్చారు. నిజమైన వన్యప్రాణులను తీసుకుని వచ్చి.. వచ్చిన వాళ్లను థ్రిల్ చేయాలని పబ్ యాజమాన్యం భావించింది. ఈవెంట్ కి సంబంధించిన వీడియో ఫుటేజ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయిన తర్వాత ఈ క్లబ్ అందరి దృష్టిని ఆకర్షించింది. వన్యప్రాణి సంరక్షకులు పబ్ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పబ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో వైరల్ అయింది. ఫుల్

సౌండ్ తో సాంగ్స్ పెట్టుకుని ఉండగా.. మనుషుల మీద వన్య ప్రాణులు తిరగడం చూడవచ్చు. దీనిపై ఇక ట్విట్టర్ లో కూడా చర్చ జరిగింది. అటువంటి వాతావరణంలో వన్య ప్రాణులను తీసుకుని రావచ్చా అంటూ పలువురు ప్రశ్నల వర్షం కురిపించారు.

మన చట్టాలు అందుకు ఒప్పుకుంటాయా అని కూడా ప్రశ్నించారు. క్లబ్ ప్రాంగణంలో వివిధ జాతుల వన్యప్రాణులు ఉన్నాయి. స్పష్టంగా అవి వాటి సహజ ఆవాసాలకు దూరంగా ఉన్నాయి. ట్విట్టర్ వినియోగదారుల ఫిర్యాదు మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ నుండి తక్షణ ప్రతిస్పందన వచ్చింది. వెంటనే చర్యలు తీసుకోవాలని అరవింద్ కుమార్ పోలీసులను సంప్రదించారు. ఈ ఘటన దిగ్బ్రాంతికరమైనదని తెలిపారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో కిటకిట

తిరుమలలో భక్తుల రద్దీ నేడు (మంగళవారం) పెద్ద ఎత్తున పెరిగింది. టోకెన్ రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. నేడు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

ఇక సోమవారం స్వామివారిని 78126 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.74 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 37,597 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.....

SB NEWS

SB NEWS

SB NEWS

Eatela rajender: పొంగులేటి.. జూపల్లి నాకే రివర్స్‌ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు: ఈటల

హైదరాబాద్‌: భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు భాజపాలో చేరికపై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వారిద్దరూ భాజపాలో చేరడం కష్టమే అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఈటల మీడియాతో మాట్లాడారు..

''ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ బలంగా ఉంది. భాజపా బలంగా లేదు. పొంగులేటి, జూపల్లితో నేను రోజూ మాట్లాడుతున్నాను. వారే నాకు రివర్స్‌ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

ఇప్పటివరకు వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరకుండా మాత్రమే నేను ఆపగలిగాను. భాజపాలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులున్నాయి.

ఇప్పటికీ కమ్యూనిస్ట్‌ ఐడియాలజీ ఉన్న జిల్లా ఖమ్మం. దేశానికి కమ్యూనిస్టు సిద్ధాంతం నేర్పిన గడ్డ తెలంగాణ. ఖమ్మంలో వామపక్షాలు, తెదేపా సహా అన్ని పార్టీలుంటాయి. ప్రియాంక గాంధీని అప్పట్లో పొంగులేటి కలిశారని తెలిసింది. అంతకంటే ముందే ఖమ్మం వెళ్లి పొంగులేటితో చర్చించాను'' అని ఈటల వ్యాఖ్యానించారు..