/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz వరంగల్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఎస్సై ల బదిలీలు Yadagiri Goud
వరంగల్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఎస్సై ల బదిలీలు

వరంగల్ జిల్లా:

కమిషనరేట్ పరిధిలో 12 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ ఏవీ రంగనాథ్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన ఎస్సైలు వీరే..

1.ఎం.సురేష్ వీఆర్ నుంచి హసన్ పర్తి

2.భూక్యా చందర్ వీఆర్ నుంచి కేయూసీ

3.ఏ.ప్రవీణ్ కుమార్ వీఆర్ నుంచి వర్ధన్నపేట

4.బి.రామారావు వర్ధన్నపేట నుంచి హన్మకొండ

5.డి.వి ఫణి వీఆర్ నుంచి సుబేదారి

6.డి.రాజు హన్మకొండ నుంచి టాస్క్ ఫోర్స్

7.జి.అరుణ్ రిపోర్ట్ ఫ్రమ్ భద్రాది కొత్తగూడెం నుంచి జనగామ

8.బి.మాధవ్ వీఆర్ నుంచి మట్టెవాడ

9.ఎండీ.గాలిబ్ వీఆర్ నుంచి సుబేదారి

10.గాలిబ్ షరీఫ్ వీఆర్ నుంచి ఇంతేజార్ గంజ్

11.ఎండీ వలీ వీఆర్ నుంచి హసన్ పర్తి కె.లక్ష్మి భరోసా సెంటర్

12.ఎస్. డేవిడ్ వీఆర్ నుంచి కొడకండ్లకు. బదిలీ చేసినట్లు తెలిసింది..

ఇట్లా కాలిస్తే ఎట్లా ❓️

వరి కొయ్యలను తగులబెడుతున్న రైతులు

సారం దెబ్బతింటున్నదంటున్న శాస్త్రవేత్తలు

మేలు చేసే సూక్ష్మ జీవులు చనిపోయి పంట దిగుబడి తగ్గే ప్రమాదం

పెద్దపెల్లి జిల్లా : గతంలో కొడవళ్లతో వరిని మొదళ్ల వరకు కోసేవారు. ప్రస్తుతం యంత్రాలు అందుబాటులోకి రావడంతో మొదళ్ల వరకు కాకుండా 25 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తులో కోస్తున్నాయి. దీంతో గడ్డి కొయ్య కాళ్ల రూపంలో పంట అవశేషంగా మిగులుతున్నది. వీటిని రైతులు మడిలోనే తగులబెడుతున్నారు.

ఇది పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నది. కాల్చడం వల్ల అపార నష్టాలున్నాయంటూ శాస్త్రవేత్తలు పదేపదే చెబుతున్నా మెజార్టీ రైతులు వినకుండా వరి కొయ్యలను కాల్చుతూనే ఉన్నారు. తద్వారా తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్లు అవుతున్నది. ఈ విధానం వల్ల ప్రకృతి దెబ్బతినడమేకాదు, అన్నదాత అన్ని రకాలుగా నష్టపోతున్నాడు. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోవడమే కాకుండా సారవంతమైన భూమి దెబ్బతినడంతో దిగుబడిపై కూడా ప్రభావం చూపుతున్నది. వాతావరణం కలుషితమవుతున్నది.

అప్పట్లో దొడ్డినిండా పశువులు ఉండడం వల్ల వాటి మేత కోసం గడ్డిపోచను కూడా విడిచిపెట్టకుండా.. కొడవళ్లతో వరిని మొదళ్ల వరకు కోసేవారు. ఎండబెట్టి కుప్పవేసి ఏడాదంతా పశువులకు మేతగా ఉపయోగించే వారు. ఇప్పుడు పశువులు లేకుండా పోయాయి. రైతుకు గడ్డి అవసరం లేకుండాపోయింది. వరికోత యంత్రాలు వచ్చిన తదుపరి గడ్డిని కుప్పవేసే రైతులను వేళ్లపై లెక్కపెట్టే పరిస్థితులు వచ్చాయి. మారిన ప్రపంచీకరణ నేపథ్యంలో.. ప్రస్తుతం రైతులు వరిపంట కోతకు యంత్రాలను వినియోగిస్తున్నారు. పంటకు, పంటకు మధ్య సమయం తక్కువ ఉండడంతో వరికోసిన తర్వాత మిగిలిన కొయ్యకాళ్లు, వరిగడ్డిని కంపోస్టుగా మార్చుకోవడంపై రైతులకు అవగాహన లేకపోవడంతో పొలంలో ఉన్న కీటకాలను, వ్యాధికారక జీవులు నశింపచేయవచ్చన్న అపోహతో చాలా మంది రైతులు వరి కొయ్య కాళ్లను, గడ్డిని తగులబెడుతున్నారు.

తగులబెట్టడం వలన అనేక నష్టాలు

వరి కొయ్యలను తగులపెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతున్నది. ఉత్తర భారతదేశంలో ఈ కారణంగా శీతాకాలంలో తీవ్రస్థాయిలో కాలుష్య సమస్యలు ఎదురవుతున్నాయని ఇప్పటికే అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా సూక్ష్మజీవులు పంటకు వేసే ఎరువులను మొక్కలకు అందిస్తాయి. కానీ కొయ్యలను తగులపెట్టడంతో అవి చనిపోవడంతో రైతులు వేసే ఎరువులు మొక్కకు అందే అవకాశం లేకుండాపోతున్నది. కొయ్యకాళ్లను కాల్చడం వల్ల నేలలోని సేంద్రీయ కర్బనం, కార్బన్‌డైఆక్సైడ్‌గా మారి వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతున్నది. పొగ, ధూళికణాలు గాలిలో కలవడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. అలాగే పొలాల్లో తిరిగే ముంగిసలు, ఉడుములు, నెమళ్లు, తొండలు ఇలా అనేక జీవరాసులు చనిపోతున్నాయి. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. ఇది సాగుకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.

కలియ దున్నినా..కుప్ప పెట్టినా.. బంగారమే

వరిపంట కోసిన వెంటనే కొయ్యకాళ్లను తగులబెట్టకుండా పొలంలో మిగిలిన తేమను ఉపయోగించుకుని దున్నాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దున్నడం వల్ల కొయ్యకాళ్లు మట్టితో కప్పబడి కుళ్లే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తద్వారా సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఇలా చేయడం వల్ల వేసవిలో నేలలో పగుళ్లు రాకపోవడం, తేమ ఆవిరి కావడం తగ్గి తొలకరిలో పడిన వర్షపునీరు నేలలోకి ఇంకిపోవడం ద్వారా నేలకోతకు గురికాకుండా ఉంటుంది. ఒక టన్ను వరి గడ్డి కావాలంటే.. ఆ వరి పెరుగుదలకు 18.9 కిలోల పోటాషియం, 6.2 కిలోల నత్రజని, 1.1 కిలోల భాస్వరంతోపాటు కొంత మోతాదులో సూక్ష్మపోషకాలు అవసరం అవుతాయి. కొయ్యకాళ్లను భూమిలో కలియ దున్నితే, గడ్డి ద్వారా పోషకాలన్ని తిరిగి నేలకు చేరతాయి. లేదా ఈ పంట అవశేషాల వ్యర్థాలను కంపోస్టు చేయడం ద్వారా సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవచ్చు. వానాకాలంలో దమ్ము చేసేటప్పుడు ఎకరానికి 50 కిలోల సూపర్‌ ఫాస్ఫేట్‌ వేస్తే నేలలో మిగిలిపోయిన వరికొయ్యలు తొందరగా కుళ్లిపోతాయి. తర్వాత నాటే వరి పంటకు నేల ద్వారా పోషకాలు అందుబాటులోకి వస్తాయి. ఈవిధానంపై ఆయా మండలాల్లో వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నా, క్షేత్ర స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తు న్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది......

పార్లమెంట్‌ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు❓️

న్యూ ఢిల్లీ :

భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేశ పార్లమెంట్‌ నూతన భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్‌ ఓంబిర్లా తాజాగా ప్రారంభించారు. రూ.20,000 కోట్ల సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా కొత్త పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌ను నిర్మించారు.

65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాత భవనం కంటే మూడు రెట్లు అధిక పరిమాణంలో ఆకట్టుకునే హంగులతో కొత్త పార్లమెంట్ భవనం రూపొందింది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పార్లమెంట్‌ భవనాన్ని ఏ నిర్మాణ సంస్థ కట్టింది. భవన నిర్మాణానికి ఎంత ఖర్చయింది.. వంటి ఆసక్తికరమైన విషయాలు మీ కోసం...

నిర్మాణ సంస్థ ఇదే..

భారత పార్లమెంట్‌ నూతన భవనాన్ని టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ నిర్మించింది. 2020లో లార్సెన్ అండ్‌ టూబ్రో (L&T)పై రూ. 3.1 కోట్ల స్వల్ప మార్జిన్‌తో రూ. 861.9 కోట్లకు ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. మొదట్లో షాపూర్జీ పల్లోంజీ సంస్థ పోటీలో నిలిచినా తరువాత బిడ్డింగ్ ప్రక్రియ నుంచి వైదొలింది.

రూ.940 కోట్లు.. 21 నెలల్లోనే పూర్తి

సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.940 కోట్లు. కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని కేవలం 21 నెలల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించింది టాటా కంపెనీ......

SB NEWS

హైదరాబాద్ పబ్ లో పాములు..!!

పబ్బులో మాత్రం వన్య ప్రాణులతో ఎంటర్టైన్ అయ్యారు..!!

విషపూరితమైనవి కాదని తెలుసుకుని వాటిని పట్టుకుని ఫోటోలు దిగారు..!!

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు పోలీసు అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు..!!

పబ్ లు అంటే ఫుల్ మ్యూజిక్, మద్యం.. ఇలాంటివి చాలా వరకూ వింటూ ఉంటాం. కానీ హైదరాబాద్ లోని ఓ పబ్బులో మాత్రం వన్య ప్రాణులతో ఎంటర్టైన్ అయ్యారు. అరుదైన తొండలు, పాములు చూసి పబ్ కు వెళ్లిన కొందరు షాక్ అయ్యారు.

అయితే అవేవీ విషపూరితమైనవి కాదని తెలుసుకుని వాటిని పట్టుకుని ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు పోలీసు అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు. వన్య ప్రాణులను పబ్బుల్లోకి తీసుకుని వచ్చింది ఎవరు అనే కోణంలో ఆరాతీయడం మొదలుపెట్టారు.

జూబ్లీ హిల్స్‌లో..!!

జూబ్లీ హిల్స్‌లో ఉన్న Xora నైట్ క్లబ్ లోనివి ఈ విజువల్స్. ఇటీవల 'వైల్డ్ జంగిల్ పార్టీ' థీమ్‌లో భాగంగా ఈ ప్రాణాలను తీసుకుని వచ్చారు. నిజమైన వన్యప్రాణులను తీసుకుని వచ్చి.. వచ్చిన వాళ్లను థ్రిల్ చేయాలని పబ్ యాజమాన్యం భావించింది. ఈవెంట్ కి సంబంధించిన వీడియో ఫుటేజ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయిన తర్వాత ఈ క్లబ్ అందరి దృష్టిని ఆకర్షించింది. వన్యప్రాణి సంరక్షకులు పబ్ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పబ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో వైరల్ అయింది. ఫుల్

సౌండ్ తో సాంగ్స్ పెట్టుకుని ఉండగా.. మనుషుల మీద వన్య ప్రాణులు తిరగడం చూడవచ్చు. దీనిపై ఇక ట్విట్టర్ లో కూడా చర్చ జరిగింది. అటువంటి వాతావరణంలో వన్య ప్రాణులను తీసుకుని రావచ్చా అంటూ పలువురు ప్రశ్నల వర్షం కురిపించారు.

మన చట్టాలు అందుకు ఒప్పుకుంటాయా అని కూడా ప్రశ్నించారు. క్లబ్ ప్రాంగణంలో వివిధ జాతుల వన్యప్రాణులు ఉన్నాయి. స్పష్టంగా అవి వాటి సహజ ఆవాసాలకు దూరంగా ఉన్నాయి. ట్విట్టర్ వినియోగదారుల ఫిర్యాదు మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ నుండి తక్షణ ప్రతిస్పందన వచ్చింది. వెంటనే చర్యలు తీసుకోవాలని అరవింద్ కుమార్ పోలీసులను సంప్రదించారు. ఈ ఘటన దిగ్బ్రాంతికరమైనదని తెలిపారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో కిటకిట

తిరుమలలో భక్తుల రద్దీ నేడు (మంగళవారం) పెద్ద ఎత్తున పెరిగింది. టోకెన్ రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. నేడు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

ఇక సోమవారం స్వామివారిని 78126 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.74 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 37,597 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.....

SB NEWS

SB NEWS

SB NEWS

Eatela rajender: పొంగులేటి.. జూపల్లి నాకే రివర్స్‌ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు: ఈటల

హైదరాబాద్‌: భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు భాజపాలో చేరికపై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వారిద్దరూ భాజపాలో చేరడం కష్టమే అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఈటల మీడియాతో మాట్లాడారు..

''ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ బలంగా ఉంది. భాజపా బలంగా లేదు. పొంగులేటి, జూపల్లితో నేను రోజూ మాట్లాడుతున్నాను. వారే నాకు రివర్స్‌ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

ఇప్పటివరకు వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరకుండా మాత్రమే నేను ఆపగలిగాను. భాజపాలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులున్నాయి.

ఇప్పటికీ కమ్యూనిస్ట్‌ ఐడియాలజీ ఉన్న జిల్లా ఖమ్మం. దేశానికి కమ్యూనిస్టు సిద్ధాంతం నేర్పిన గడ్డ తెలంగాణ. ఖమ్మంలో వామపక్షాలు, తెదేపా సహా అన్ని పార్టీలుంటాయి. ప్రియాంక గాంధీని అప్పట్లో పొంగులేటి కలిశారని తెలిసింది. అంతకంటే ముందే ఖమ్మం వెళ్లి పొంగులేటితో చర్చించాను'' అని ఈటల వ్యాఖ్యానించారు..

Teacher jobs: గుడ్‌న్యూస్‌.. ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచర్‌ పోస్టులు..

అమరావతి: ఏపీలో పెద్ద సంఖ్యలో టీచింగ్‌ పోస్టుల (Teaching Jobs)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖలోని సమగ్రశిక్షా సొసైటీ నిర్వహించే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు..

మొత్తం 1358 బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్) భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన మహిళా అభ్యర్థులు మే 30 నుంచి జూన్‌ 4 తేదీ రాత్రి 11.59గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు..

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

మొత్తం ఖాళీలివే.. ప్రిన్సిపాల్ 92 పోస్టులు ఉండగా.. పోస్టు గ్రాడ్యుయేషన్‌ టీచర్‌ 846; సీఆర్టీ 374, పీఈటీ 46 చొప్పున పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు.. ఆయా ఉద్యోగాలను బట్టి డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీలలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి: జనరల్‌ అభ్యర్థులకు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు అయిదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల చొప్పున వయో సడలింపు ఉంటుంది.

గౌరవ వేతనం: ప్రిన్సిపాళ్లకు రూ.34,139; సీఆర్టీలకు రూ.26,759; పీజీటీలకు రూ.26,759; పీఈటీలకు రూ.26,759 చొప్పున నెలకు గౌరవ వేతనం లభిస్తుంది.

దరఖాస్తు రుసుము: రూ.100. కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసే విధానం, జిల్లాలు, సబ్జెక్టులు, రోస్టర్‌ వారీగా ఉద్యోగ ఖాళీలు, విద్యార్హతలు, వేతనం..

నిన్న ఢిల్లీలో ఇవాళ అస్సాంలో వరస భూ ప్రకంపనలు

అస్సాం:

సోనిత్‌పూర్‌లో ఈరోజు సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. గౌహతిలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్టు వెల్లడించింది.

ఈ రోజు ఉదయం 8.03 గంటలకు 15 కిలోమీటర్ల లోతుతో భూకంపం సంభవించింది. ఇటీవలే బంగ్లాదేశ్, భూటాన్, చైనా, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో భూకంప ప్రకంపనలు సంభవించగా.. ఇప్పుడు అస్సాంలోనూ ఇలాంటి ఘటనలే పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది.

గౌహతిలో 24 గంటల్లోనే రెండోసారి భూకంప ప్రకంపనలు సంభవించాయి. మేఘాలయలోని పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లాలో మే 28న మధ్యాహ్నం 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.

మధ్యాహ్నం 2.58 గంటలకు 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం వచ్చింది. అంతకుముందు, సాయంత్రం 6:26 గంటలకు ఆఫ్ఘనిస్తాన్‌లో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది.

పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకన్ల పాటు కొనసాగిన ఈ ప్రకంపనలు ఉదయం 11:20 గంటలకు సంభవించాయని భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు.

కర్ణాటక డిప్యూటీ సీఎం శివ కుమార్ తో వైయస్ షర్మిల భేటీ

కర్ణాటక:

బెంగళూర్ లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు. సోమవారం ఉదయం బెంగళూరులోని డీకే నివాసంలో ఆయనతో భేటీ అయ్యి..శుభాకాంక్షలు తెలిపారు.

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి చాలా కష్టపడ్డారని.. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందంటూ డీకేకు కితాబునిచ్చారు. మహానేత YSR తో ఉన్న సాన్నిహిత్యాన్ని డీకే శివకుమార్.. వైఎస్ షర్మిల వద్ద గుర్తు చేశారు. మరోవైపు.. వైఎస్ షర్మిల మే 15 వ తేదీన డీకే శివకుమార్ బర్త్ డే రోజు కూడా భేటీ అయ్యి.. శుభాకాంక్షలు తెలిపారు.

ఈ భేటీ తెలంగాణలో రాజకీయ చర్చకు దారితీసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్ టీపీ మధ్య పొత్తు ఉండవచ్చని ప్రచారం జరుగుతున్న సమయంలో డీకే శివకుమార్ ను షర్మిల కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ క్రమంలో వారి మధ్య రాజకీయ పరమైన చర్చలు జరిగి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణలో కొంతకాలంగా వైఎస్ఆర్ టీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చని జరుగుతున్న ప్రచారానికి.. ఈ భేటీ మరింత ఊతం ఇస్తోంది. మరోవైపు... రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది...

అడవిలో కారు దగ్ధం

చౌదరిగూడ:

జిల్లేడు చౌదరిగూడ మండలంలోని పెద్ద ఎల్కిచేర్ల శివారులో గల అడవిలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున కారుకు నిప్పంటించి దగ్ధం చేశారు.

అడవిలో వాచెర్ గా పనిచేస్తున్న అజహార్ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా రాచకాల్వ దగ్గర కల్వర్టు పక్కన గుర్తు తెలియని కారు కాలిపోతుండడంతో పోలీసులకు సమాచారం చేరవేయడంతో వెంటనే చౌదరిగూడ మండల ఎస్సై సక్రం ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

అప్పటికే ఆ కారు గుర్తు పట్టకుండా పూర్తిగా తగలబడిపోయింది. కారు లోపల చుట్టుపక్కన ఎవరైనా వ్యక్తులు ఉన్నారేమోనని చూడగా ఎవరు కనిపించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఈ కారును దగ్ధం చేసి ఉంటారని ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.....

SB NEWS

SB NEWS