/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz పెద్దకాపర్తి లో ఆయుస్మాన్ భారత్ ఈ కేవైసి. Yadagiri Goud
పెద్దకాపర్తి లో ఆయుస్మాన్ భారత్ ఈ కేవైసి.

 చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో 77 వ బూత్ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఆయుస్మాన్ భారత్ ఈ కేవైసి కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు శేపురి రవీందర్ గారి సహకారంతో 77వ బూత్ అధ్యక్షులు తెలుసూరి నర్సింహ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వ మరియు ప్రవేట్ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందించాలనే ఉద్దేశ్యంతో ఆయుష్మాన్ భారత్ కార్డులను లబ్దిదారులకు అందించనున్నారని వారు తెలిపారు.

ఈనెల 31 వరకు గ్రామంలో బీజేపీ ఆద్వర్యంలో ఉచితంగా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు మోర దనుంజయ్య ,సీనియర్ నాయకులు పోట్లపల్లి సుభాష్ గౌడ్ ,  మైల సత్తయ్య , గుండెబోయిన నర్సింహ , మోర నరేష్ , కాటం సందీప్, హరీష్ , మహేష్ , లింగస్వామి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

స్వప్నలోక్‌ అగ్ని ప్రమాద మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంతో పాటు పలువురు గాయపడటం విచారకరమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం తెలిపారు.

మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలించాలని.. అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రులు మహమూద్‌ అలీ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు సూచించారు.

మరణించినవారికి ₹5 లక్షల ఎక్స్ గ్రేషియాను సీఎం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.

ఏం జరిగిందంటే..

సికింద్రాబాద్‌లోని రద్దీ ప్రాంతంలో ఉన్న స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి వేళ 7, 8 అంతస్థుల్లో తొలుత మంటలు చెలరేగాయి.

విద్యార్థి మృతికి కారణమైన ప్రిన్సిపాల్ పై హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి.

సూర్యాపేట జిల్లా చివ్వేంల బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతికి కారణమైన పాఠశాల ప్రిన్సిపాల్ ని తక్షణమే విధుల నుంచి తొలగించి చట్టపరంగా హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ విద్యార్థి మృతికి ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే కారణమన్నారు. విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రిన్సిపల్ అలసత్వం వహించడం వల్లనే ఈ ఘటన జరిగిందన్నారు. ప్రమాదం జరిగినప్పుడే అధికారులు, ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు చేపట్టడం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.

గాయపడిన విద్యార్థులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని, మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, సూర్యాపేట జిల్లా కేంద్రంలో 500 గజాల ఇంటిస్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, మారోజు రాజ్ కుమార్, సాయి, శ్రీకాంత్, సంపత్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఐ.ఎఫ్.టి.యు నల్లగొండ జిల్లా 5వ మహాసభను జయప్రదం చేయాలని కరపత్రం ఆవిష్కరణ...IFTU

భారత కార్మిక సంఘాల సమాఖ్య( ఐ ఎఫ్ టి యు) నల్లగొండ జిల్లా 5వ మహాసభను ఈనెల 21న నల్లగొండ జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ లో నిర్వహిస్తున్నట్లు దీనికి పెద్ద ఎత్తున కార్మికులు హాజరుకావాలని ఐఎఫ్ టీయు నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్ కోరారు.

జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ లో ఐ ఎఫ్ టి యు నల్లగొండ జిల్లా 5వ మహాసభను జయప్రదం చేయాలంటూ కరపత్రాలను ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా IFTU జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్,జిల్లా నాయకులు బొంగరాల నర్సింహాలు పాల్గొని మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులను నిరాకరిస్తూ, కార్పోరేట్ కంపెనీల యాజమాన్యాలకు కార్మిక చట్టాలను తాకట్టుపెట్టి పాద సేవ చేస్తున్నారని ఆయన అన్నారు. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని విమర్శించారు.

ఏకకాలంలో ఆదాని ఆస్తులు ఎలా పెరిగినాయని దీనికి మోడీ ప్రభుత్వమే కారణమని ఆయన అన్నారు. సామాన్యులను పట్టించుకోని ప్రభుత్వం కార్పొరేట్లకు 12:30 లక్షల కోట్లకు పైగా రుణాలు మాఫీ చేశారని అన్నారు. పెట్రోల్, డీజిల్ ,గ్యాస్, నిత్యవసర సరుకుల ధరలను పెంచుతూ పేద ప్రజలపై భారలు మోపుతున్నారని దుయ్యబట్టారు. కార్మికుల కనీస వేతనాలు దిగజారిపోతున్నాయని, కొనుగోలు శక్తి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని దీనికి మోడీ ప్రభుత్వమే కారణమని తెలియజేశారు.

IFTU నల్లగొండ జిల్లాలో వివిధ రంగాల కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని, ఆ పోరాట వెలుగులో అనేక విజయాలు కూడా సాధించిందని, గత ఉద్యమాలను సమీక్షించుకొని, భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవడానికి IFTU నల్లగొండ జిల్లా 5వ మహాసభను నల్లగొండ జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ లో ఈ నెల 21న నిర్వహించనున్నట్లు దీనికి పెద్ద ఎత్తున కార్మికుల హాజరు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో IFTU నాయకులు కత్తుల చంద్రశేఖర్, దాసరి నర్సింహా,జానపాటి శంకర్,మామిడాల ప్రవీణ్,తాలూక వెంకన్న,సింగం మహేష్,బొమ్మపాల అశోక్,తీగల నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.

Atchannaidu: 'సీఎంకు కర్రకాల్చి వాతపెట్టేలా పట్టభద్రుల తీర్పు'

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jaganmoha Reddy) కి కర్రకాల్చి వాతపెట్టేలా పట్టభద్రుల తీర్పు ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) అన్నారు..

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజల తిరగబడితే ఫలితం ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి (AP CM) కి ప్రత్యక్షంగా కనిపిస్తోందన్నారు. ప్రజాస్వామ్యo సిగ్గుపడేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగినా ప్రజలు తమ పక్షానే నిలిచారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులని భావించి మూడు రాజధానులంటూ మోసాగించే యత్నం చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓడిపోతే మూడు రాజధానులకు ప్రజలు వ్యతిరేకంగా అనే భావన వ్యక్తమవుతుందని వైసీపీ నేతలే ప్రచారం చేశారన్నారు..

అభివృద్దే తమ నినాదం అని ఉత్తరాంధ్ర ప్రజలు చాటి చెప్పారని అన్నారు. విశాఖలో రూ.40 వేల కోట్ల భూములను వైసీపీ కొల్లగొట్టిందని తాము చూపిన ఆధారాలు ప్రజలు నమ్మి ఓటు వేశారని తెలిపారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అసంతృప్తి లో ఉన్న చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేల (YCP MLAs) కు తాజా పట్టభద్రుల ఫలితాలు చూసి అంతరాత్మప్రభోదానుసారం ఓటేయబోతున్నారని చెప్పారు. రేపు జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ పట్టభద్రుల ఎన్నికలు సెమీఫైనల్‌గా భావిస్తున్నామన్నారు. రేపు పులివెందుల కూడా గెలవబోతున్నామని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు..

అరెస్ట్ చేయవద్దని చెప్పలేం: వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు..

హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనపై సీబీఐ తవ్ర చర్యలు తీసుకోవద్దని హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ వివేకానందరెడ్డి..

ఈ పిటిషన్ ను హైకోర్టు శుక్రవారంనాడు తోసిపుచ్చింది. వైఎస్ అవినాష్ రెడ్డి మధ్యంతర పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది.

అవినాష్ రెడ్డిని విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. అవినాష్ రెడ్డిని విచారించే ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

అవినాష్ రెడ్డి తదుపరి విచారణపై స్టే కూడా ఇవ్వలేమనిహైకోర్టు తేల్చి చెప్పింది..

Heavy Rains: ఐఎండీ తాజా వార్నింగ్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వాతావరణం పూర్తిగా మారిపోయింది.. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు..

రాబోవు మూడు రోజుల రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉండబోతోందనే వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది..

ఇక, శనివారం రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని..

ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, ఆదివారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ ఓ ప్రటనలో పేర్కొన్నారు..

టి.ఎస్.పి.ఎస్.సి పేపర్ లీకేజీ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి.

- బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్.

తెలంగాణ రాష్ట్రంలో టీ.ఎస్.పి.ఎస్.సి. నిర్వహిస్తున్న వివిధ పోటీ పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే సమగ్ర విచారణ జరిపి, కారకులను కఠినంగా శిక్షించాలని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టీ.ఎస్.పి.ఎస్.సి ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ పోటీపరీక్షల పేపర్ లీకేజీ ఘటనలను నిరసిస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన వ్యక్తం చేసిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థి, నిరుద్యోగులు టీ.ఎస్.పి.ఎస్.సి విడుదల చేసే పలు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి గత కొన్ని

సంవత్సరాలుగా అహర్నిశలు కష్టపడి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంటే పేపర్ లీకేజీ ఘటనలు చోటు చేసుకోవడం చాలా విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలోని వివిధ జిల్లా కేంద్రాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ వర్గాల విద్యార్థులు రేయింబవళ్లు ఒక్క పూట భోజనం చేస్తూ, అనేక ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొని కష్టపడి ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు అన్యాయం చేయాలని చూసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీ.ఎస్.పి.ఎస్.సి పేపర్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సిట్టింగ్ జడ్జి చే సమగ్ర విచారణ జరిపించి ఘటనకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహించి టి ఎస్ పి ఎస్ సి చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థి, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న టీ.ఎస్.పి.ఎస్.సి. బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలని అన్నారు. పేపర్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, విద్యార్థి నిరుద్యోగుల జీవితాలకు భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో టీ.ఎస్.పి.ఎస్.సి. కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, మారోజు రాజ్ కుమార్, యలిజాల రమేష్, సాయి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

టి.ఎస్.పి.ఎసి నిర్వహించిన అన్ని పరీక్షలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి..

•తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అన్ని పరీక్షలకు సంబంధించి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్ చేస్తుంది.

తెలంగాణ వస్తే అవినీతికి,అక్రమాలకు, లంచగొండితనానికి తావు ఉండదని అంతా పారదర్శకంగా జరుగుతుందని తెలంగాణ సమాజం భావించింది.

కానీ అన్ని డిపార్ట్మెంట్లో అవినీతి పేర్కొనపోయిందని లంచగొండితనం విలాయ తాండవం చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు.

పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం యొక్క నియంత్రణ కొరవడినట్లు స్పష్టంగా కనబడుతుందన్నారు అందుకు నేడు బయటపడిన భాగోతమే నిదర్శనం అన్నారు.ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన రంగం లోకి దిగి విచారణ ను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.

H3N2 Virus: డేంజర్ బెల్స్.. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపిస్తున్న వైరస్

దేశంలో వైరస్ హెచ్3ఎన్2 వేగంగా వ్యాపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా హెచ్3ఎన్2 తెలుగు రాష్ట్రాలకు పాకింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఐసీఎమ్ఆర్ అప్రమత్తం చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు జరుగుతుండడం, వైద్యం కోసం తెలుగు రాష్ట్రాలకు క్యూకడుతున్న విదేశీయులు ఊపందుకున్న పర్యాటకం వైరసి.హెచ్3ఎన్2 వైరస్ వేగంగా వ్యాపించేందుకుకారణమవుతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ప్రజలు మాస్కులు వాడటం లేదని కూడా వెల్లడించాయి.

కరోనా కేసులు తగ్గిన తర్వాత ఇప్పుడు భారత్ లో హెచ్3ఎన్2 రకం వైరస్ బారిన పడేవారి సంఖ్య ఎక్కువైంది.

సాధారణ జలుబు, ఫ్లూ జ్వరంలాగే దీన్ని కూడా లైట్ తీసుకున్నారు.

అయితే, ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరస్ విజృంభిస్తోంది.

మరణాల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది.