/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz మోసం చేసిన ప్రియుడు.. సలసల కాగే నూనెతో ప్రియురాలు దాడి Yadagiri Goud
మోసం చేసిన ప్రియుడు.. సలసల కాగే నూనెతో ప్రియురాలు దాడి

ఇప్పటివరకూ తమ ప్రేమని అంగీకరించలేదనో, లేక మోసం చేశారనో అమ్మాయిలపై అబ్బాయిలు యాసిడ్ దాడి చేయడమో, ఇతర అఘాయిత్యాలకు పాల్పడటమో చూశాం. కానీ.. తాజాగా అందుకు భిన్నంగా ఓ అబ్బాయిపై ఒక అమ్మాయి ఎటాక్ చేసిన ఘటన వెలుగు చూసింది. తనని మోసం చేశాడన్న కోపంతో.. తన ప్రియుడిపై ఓ యువతి సలసల కాగే నూనె పోసింది. దీంతో.. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చెన్నైలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

చెన్నై ఈరోడ్‌కి చెందిన మీనాదేవి, కార్తి రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అయితే.. కొంతకాలం నుంచి కార్తిలో మార్పు రావడాన్ని మీనా గమనించింది. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా.. అతడు మాట దాటవేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే వేరే అమ్మాయితో తిరుగుతున్నాడనే విషయం మీనాదేవికి తెలిసింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి.

చివరికి తాను మోసపోయానని తెలుసుకున్న మీనాదేవి.. ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఓ పథకం రచించింది. ప్లాన్ ప్రకారం.. శనివారం మాట్లాడాలని ఉందని కార్తిని తన రూమ్‌కి పిలిచింది. ప్రియురాలి పిలుపు మేరకు కార్తి ఆమె రూమ్‌కి వెళ్లాడు. అప్పటికే అతనిపై దాడి చేసేందుకు ఆమె నూనెని వేడి చేసి పెట్టింది. ప్రియుడు రూమ్‌కి రాగానే.. అదును చూసి, అతనిపై సలసల కాగే ఆ నూనెని పోసేసింది. అనంతరం ‘‘ఇప్పుడు నిన్ను ఎవరు ప్రేమిస్తారో నేను చూస్తా’’ అంటూ గట్టిగా అరిచింది.

ఈ ఘటనలో కార్తికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖం, చేతులు కాలిపోయాయి. సహాయం కోసం అతడు కేకలు వేయగా.. ఇరుగుపొరుగు వారు మీనా రూమ్ వద్దకు వచ్చారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న కార్తిని చూసి.. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కార్తి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో.. మీనా దేవిని పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు. బాధితుడు కార్తి.. పెరుందురైలోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. కార్తి, మీనాదేవి దగ్గరి బంధువులే అవుతారు. ఆ బంధుత్వంతోనే ఇద్దరికి పరిచయం ఏర్పడటం, అది ప్రేమగా మారడం జరిగింది. అయితే.. సుఖాంతంగా ముగుస్తుందని అనుకున్న ఈ ప్రేమకథ, కార్తి మోసం చేయడంతో విషాదాంతంగా మారింది.

గుంటూరు..పేద కాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

రెయిన్ ట్రీ పార్క్ వద్ద ఉన్న ఓ అపార్ట్మెంట్ లో గుట్టు చప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నడుస్తున్న వైనం

బెట్టింగ్ కి పాల్పడుతున్న ఆరుగురు అరెస్ట్ , వారి వద్ద నుంచి 4.30లక్షలు 4ల్యాప్ టాప్స్,బెట్టింగ్ కి వాడే పరికరాలు స్వాధీనం

బెట్టింగ్ కి వాడే "కి ప్యాడ్"సెల్ ఫోన్లు 29 స్వాధీనం

బెట్టింగ్ పై విచారణ చేస్తున్న పోలీసులు

సల్కునూరు గ్రామ లక్ష్మీ నరసింహస్వామి వారి విశిష్టత
సల్కునూరు గ్రామ లక్ష్మీ నరసింహస్వామి వారి విశిష్టత *సల్కునూరు గ్రామంలో ఘనంగా హోలీ సంబరాలు* రాష్ట్రమంతా ఒకరోజు సల్కునూరు గ్రామంలో ఒక రోజు లక్ష్మీ నరసింహ స్వామి వసంతోత్సవ సందర్భంగా
సల్కునూరు గ్రామంలో ఘనంగా హోలీ సంబరాలు
రాష్ట్రమంతా ఒకరోజు సల్కునూరు గ్రామంలో ఒక రోజు లక్ష్మీ నరసింహ స్వామి వసంతోత్సవ సందర్భంగా
Amit Shah: CISF సాధించిన విజయాలకు భారత గర్విస్తోంది

హైదరాబాద్- దేశాన్ని రక్షించడంలో CISF సిబ్బంది సాధించిన విజయాలకు భారతదేశం గర్విస్తోందని కేంద్ర హోమంత్రి అమిత్ షా అన్నారు.

54వ సీఐఎస్‌ఎఫ్‌ రైజింగ్‌ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా అమిత్ షా పాల్గొన్నారు..

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళి సై, ఎంపీ లక్ష్మణ్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమరులకు నివాళులర్పించిన అమిత్ షా..CISF పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు..

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్‎మెంట్లలో వేచివున్నారు..

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టనుంది..

శనివారం శ్రీవారిని 79,561 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు..

36,784 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు..

శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు..

Delhi Liquor Scam Case : ముగిసిన కవిత ఈడీ విచారణ.. ఎనిమిది గంటలుగా ఏమేం ప్రశ్నించారు..!?

ఏమేం ప్రశ్నించారు..!?

1. ఢిల్లీ మద్యం పాలసీలో మార్పులు చేసింది మీరేనా..?

2. ఈ మార్పులు చేర్పులు వెనుక ఎవరెవరి పాత్ర ఉంది.. మనీష్ సిసోడియాతో (Manish Sisodia) పరిచయం ఎలా ఏర్పడింది..!?

3. ఢిల్లీ గవర్నమెంట్‌కు (Delhi Govt)- సౌత్‌గ్రూప్‌నకు మధ్యవర్తి మీరేనా..?

4. ఢిల్లీ మద్యం వ్యాపారంతో మీకున్న సంబంధమేంటి..?

5. లిక్కర్ స్కామ్‌లో మీ పాత్ర ఉందా.. లేదా..?

6. అరుణ్ రామచంద్ర పిళ్లై మీకు బినామీనా కాదా..?

7. మీ ప్రతినిధని పిళ్లై చెప్పిన దాంట్లో నిజమెంత..?

8. పిళ్లైకు.. మీకు (కవితకు) మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా..?

9. రామచంద్రతో వ్యాపారం చేస్తే నాతో చేసినట్లే అని మీరు చెప్పలేదా..?

10. సౌత్‌గ్రూప్‌తో మీకున్న సంబంధాలేంటి..?

11. ఛార్టెడ్ ఫ్లైట్‌లో వెళ్లి రూ. 130 కోట్లు లంచం ఇచ్చారా..?

12. 130 కోట్లు డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది.. ఎవరిచ్చారు..?

13. ఛార్డెడ్ ఫ్లైట్ మీకు ఎవరు సమకూర్చారు..?

14. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎప్పుడైనా కలిశారా..?

15. ఫేస్‌టైమ్‌లో మీరు సమీర్ మహేంద్రుతో మాట్లాడారా.. లేదా..?

16. శరత్ చంద్రారెడ్డిని ఎన్నిసార్లు కలిశారు..?

17. శరత్ చంద్రాతో తరుచూ మాట్లాడాల్సిన అవసరం ఏంటి..?

18. ఆధారాలు మాయం చేసేందుకు సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారా..?

19. సెల్‌ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు..?

20. గోరంట్ల బుచ్చిబాబుకు మీకున్న సంబంధమేంటి..? అని కవితను ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం..

చిరునవ్వుతో బయటికొచ్చిన కవిత
తొమ్మిది గంటల సుదీర్ఘ ఈడీ విచారణ అనంతరం ఎమ్మెల్సీ కవిత బయటికి వచ్చారు. ఆమె కోసం ఈడీ కార్యాలయం బయట వేచి చూస్తున్న బీఆర్ఎస్ శ్రేణులకు నవ్వుతూ అభివాదం చేశారు. అయితే కవితను మాట్లాడాలంటూ మీడియా చుట్టుముట్టగా ఆమె ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు.
Delhi Liquor Scam Case : హై అలర్ట్..

•కవిత ఈడీ ఆఫీసు నుంచి బయటికొచ్చాక ఏం చేయబోతున్నారు..!?

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ (MLC Kavitha ED Enquiry) ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన క్వశ్చన్ అవర్ సాయంత్రం 6.30 గంటలు దాటినా ఇంకా పూర్తి కాలేదు. ఏడున్నర గంటలుగా కవితను ఈడీ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకే విచారణ ముగియాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆ సమయాన్ని పెంచారు అధికారులు.

అయితే.. ఈడీ ఆఫీసు దగ్గర పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మీడియాను, బీఆర్ఎస్ కేడర్‌ను ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో లేకుండా పోలీసులు దూరంగా పంపుతున్నారు. రూల్ ప్రకారం మహిళలను సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా, సమయం దాటినా కవితను ఈడీ బయటకు పంపలేదు. ఈడీ వైఖరితో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి. కవిత బయటికి రాగానే అరెస్ట్ చేస్తారని ఢిల్లీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

భారీ బందోబస్తు..

మరోవైపు.. ఈడీ కార్యాలయం నుంచి కవిత బయటికి రాగానే ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి వాహనాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. ముఖ్యంగా ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఇవాళ ఉదయం నుంచే బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీ భవన్ దగ్గర ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఏం జరగబోతోంది..?

అయితే.. విచారణ తర్వాత కవిత ఏం చేయబోతున్నారు..? మీడియాతో మాట్లాడుతారా..? ఢిల్లీలోని నివాసానికి వెళ్తారా లేకుంటే హైదరాబాద్‌కు పయనం అవుతారా..? అని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈడీ విచారణ ముగిస్తే.. ఇవాళే హైదరాబాద్‌కు కవిత బృందం బయల్దేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. విచారణకు రావాలని మరోసారి కవితకు నోటీసులు ఇవ్వాలనే యోచనలో ఈడీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే రేపు ఆదివారం కానుండటంతో సోమవారం విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఇవాళ రాత్రికి హైదరాబాద్‌కు వచ్చి.. సోమవారం మళ్లీ వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా.. శుక్రవారం రాత్రి నుంచే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి అక్కడే ఉన్నారు.

మందుబాబులకు బాధాకరమైన వార్త.

మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల‌ నేపథ్యంలో మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.

మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ క్రమంలో ఆ మూడు జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలను మార్చి 11 సాయంత్రం 4 గంటల నుంచి మార్చి 13 సాయంత్రం 4 గంటల వరకు మూసేయాలని ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

నిబంధనలు అతిక్రమించిన వైన్స్‌లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌ జరుగనుంది. మార్చి 16న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.

కాగా మహబూబ్‌నగర్‌ - రంగారెడ్డి - హైదరాబాద్‌ టీచర్‌ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీకాలం మార్చి 29తో, హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సయ్యద్‌ హసన్‌ జాఫ్రీ పదవీకాలం మే 1తో ముగియనున్నది. దీంతో ఈ రెండు స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది...