నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో బీసీ 42 శాతం రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా మహాత్మా జ్యోతి రావు బాపూలే విగ్రహానికి
నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో బీసీ 42 శాతం రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా మహాత్మా జ్యోతి రావు బాపూలే విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు నల్గొండ జిల్లా మంత్రివర్యులు బిసి మంత్రులు అందరికీ బీసీ రాజ్యాధికార సమితి కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఆమోదముద్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన విధంగా కేంద్రంలో కూడా మిత్రపక్షాల తోటి ప్రతిపక్షాలతోటి అందరిని ఏకతాటిపై తీసుకొచ్చి కేంద్రంలో కూడా బి సి రిజర్వేషన్ తీర్మానం చేయాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి గారు గౌరవ అధ్యక్షులు పున్న పవను గారు జిల్లా కార్యదర్శి మండల్ లింగయ్య యాదవ్ కార్యదర్శి దీకొండ నవీన్ జిల్లా ఉపాధ్యక్షులు గడగోజు విజయ చారి టౌన్ ప్రెసిడెంట్ చెన్నోజు రాజు బోగోజు వెంకటాచారి గడ్డం దశరథ జెల్లా దైవాదినం ఖమ్మం పాటి మురళి రావిరాల వెంకట్ పూల నాగేష్ పగిళ్ల ఆంజనేయులు జాల వెంకటయ్య అఖిలు నాగేంద్ర చారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
తగుళ్ల సర్వయ ఆధ్వర్యంలో నూతనఎమ్మెల్సీ నెల్లికల్లి సత్యానికి ఘన సన్మానం
గుర్రంపోడు మండల కేంద్రం లో గురువారం సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు, శంకరాచారి నివాసంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన సిపిఐ పార్టీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం నూతనంగా ఎన్నిక కావడంతో గుర్రంపూడు మండల కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ ఆహ్వానం మేరకు గుర్రంపొడు మండలానికి విచ్చేసిన సందర్భంగా , గుర్రంపొడు మండల సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ను శాలువాతో సత్కరించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. మునుగోడు నియోజకవర్గం మునుగోడు మండలం,చిన్న పల్లెటూరులో నిరుపేద కుటుంబంలో పుట్టి సిపిఐ పార్టీ కోసం తన వంతుకష్టపడి కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటూ, మునుగోడు నియోజకవర్గంలో అందరి మన్ననలు పొంది ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం పట్ల మునుగోడు నియోజకవర్గ సిపిఐ పార్టీ నాయకులకుకార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన సిపిఐ పార్టీకి ఎమ్మెల్సీ ఆకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నల్లగొండ జిల్లా మంత్రి కోమరెడ్డి వెంకట్ రెడ్డికి మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. మునుగోడు నియోజకవర్గ నికి చెందిన యాదవ సామాజిక వర్గం బీసీ బిడ్డ నెల్లికంటి సత్యం కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల గుర్రంపొడు మండల బీసీ నాయకులు సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసిహర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు తగుల్ల సర్వయ్య, సిపిఐ మండల కార్యదర్శి రేపాక లక్ష్మీపతి, ఎస్.కె మదర్, ఉజ్జుని రామచంద్రరావు, రామగిరి చంద్రశేఖర రావు, కాంగ్రెస్ నాయకులు జాల చిన్న సత్తయ్య యాదవ్, తగుల యాదయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మేడి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
గుర్రంపోడు గౌతమ్ స్కూల్లో దారుణం
ఫస్ట్ క్లాస్ చదువుతున్న విద్యార్థిని చేతికి వాతలు వచ్చేలా కొట్టిన ఉపాధ్యాయులు
నల్గొండ జిల్లా యాదవ మహాసభ జిల్లాలో తగుళ్ల యాదయ్యకు చోటు
నల్గొండ జిల్లా యాదవ మహాసభ జిల్లాలో తగుళ్ల యాదయ్యకు చోటు
అఖిలభారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా కమిటీ లో తగుల్ల యాదయ్య యాదవ్ కు చోటు వచ్చే
అఖిలభారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా కమిటీ లో తగుల్ల యాదయ్య యాదవ్ కు చోటు వచ్చే నెలలో ప్రకటించే అఖిల భారత యాదవ మహాసభ నల్లగొండ జిల్లా కమిటీలో గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన తగుల్ల యాదయ్యకు చోటు కల్పిస్తామని సోమవారం క్రాంతి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన అఖిలభారత యాదవ మహాసభలో జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు హామీ ఇచ్చారు, ఈ సందర్భంగా తగుల్ల యాదయ్య యాదవ్ మాట్లాడుతూ.తనపై నమ్మకం ఉంచి తనకు ఈ పదవిని కేటాయించిన జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ కు,జిల్లా కార్యవర్గానికి,మండల యాదవ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మండలంలోని యాదవ కులస్తుల సమస్యలను పరిష్కరించడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని తెలియజేశారు.
ఆరు గ్యారంటీల అమలుతో ప్రతిపక్షాల బేజారు* తట్టుకోలేక సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొత్త నాగరాజు


*గుర్రంపోడు*:ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు బేజారవుతున్నాయని, తట్టుకోలేక సీఎం రేవంత్ రెడ్డిపై బిఆరెస్ నాయకులు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని యువజన కాంగ్రెస్ గుర్రంపోడు మండల అధ్యక్షులు కొత్త నాగరాజు అన్నారు.ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే,ప్రతిపక్షంగా బిఆరెస్ పార్టీ నాయకులు సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి సీఎం రేవంత్ రెడ్డి పై వ్యక్తిగత దూషణలకు పాల్పడడం దురదృష్టకరమని అన్నారు.మాజీ మంత్రి జగదీష్ రెడ్డి  అహంకారంతో దళితుడైన స్పీకర్ ని అవమానిస్తూ మాట్లాడి, ఇప్పటివరకు క్షమాపణలు చెప్పకపోవడం దారుణమన్నారు. తప్పు చేసిన జగదీష్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాలకు సస్పెండ్ చేస్తే కార్యకర్తలతో ధర్నాలు చేయించడం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు.