NLG: సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాస్ శ్రీనివాస్
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం:
యరగండ్లపల్లి గ్రామంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైనటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, బుధవారం మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాస్ శ్రీనివాస్ పంపిణీ చేశారు. ముదం పద్మమ్మ భర్త వెంకటయ్య కు 54,000 రూపాయల చెక్కును, వల్లముల నర్సమ్మ కు 20,000 రూపాయల చెక్కు ను పంపిణి చేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రామదాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేదలకు వరం లాంటిదని, కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి నిరుపేద వినియోగించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాకులవరం అశోక్ రెడ్డి, పులిమామిడి నరసింహారెడ్డి, ఏడుదోడ్ల కృష్ణ రెడ్డి, జమ్ముల వెంకటేష్ గౌడ్, ఎం.డీ.ఇబ్రయీమ్, వనపర్తి యాదయ్య, మామిడి అంజయ్య, సీత వెంకటయ్య, ఆకారపు శీను, కుక్కడపు ముత్యాలు, కాకులవరం పృద్విశ్ రెడ్డి, బొమ్మిడి సుదర్శన్,నక్కరగోని కొండల్,కుక్కడుపు అంజయ్య, ముద్దం వెంకటయ్య, గోడ్డేటి వెంకటయ్య, మైలారం అంజయ్య, గజ్జి యాదయ్య, సిలివేరి యాదయ్య, పొలగోని అబ్బయ్య, పోలగొని యాదయ్య, ఏర్కలి రాములు, నక్కరగోని స్వామి, తోడేటి నాగరాజు, రాముని సంతోష్, పొలాగోని శేఖర్, సురగొని శ్రీను, వల్లాముల శ్రీశైలం, బచ్చనగోని లింగం, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం:
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రామదాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేదలకు వరం లాంటిదని, కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి నిరుపేద వినియోగించుకోవాలని అన్నారు.

నల్లగొండ జిల్లా:
ఈ మేరకు వారు మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న రైతులు తాము పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రాల ద్వారా విక్రయించి మద్దతు ధరను పొందాలని, దళారులకు తక్కువ ధరకు పత్తిని అమ్ముకొని మోసపోవద్దని సూచించారు.
నల్లగొండ జిల్లా:
ఈ మేరకు వారు మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న రైతులు తాము పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రాల ద్వారా విక్రయించి మద్దతు ధరను పొందాలని, దళారులకు తక్కువ ధరకు పత్తిని అమ్ముకొని మోసపోవద్దని సూచించారు.
నల్లగొండ జిల్లా, గట్టుప్పల్: డిసెంబర్ 2, 3, 4, తేదీలో మిర్యాలగూడలో జరగబోవు సిపిఐ(ఎం ) బహిరంగ సభను జయప్రదం చేయాలని, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో బహిరంగ సభ కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు.
నల్లగొండ: అవినీతి నిరోధక వారోత్సవాల్లో భాగంగా, న్యూ ఇండియా అస్యూరెన్స్ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో, సోమవారం బొట్టుగూడ హైస్కూల్ విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, డ్రాయింగ్ పై పోటీలు నిర్వహించారు.
నల్లగొండ జిల్లా:
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు కేంద్రాలలో దళారుల బెడద లేకుండా చూసి మద్దతు ధర ఇవ్వాలని, వరి తేమ శాతం ను పరిగణలోకి తీసుకోకుండా కొనుగోలు చేయాలని అన్ని వొడ్లను కొనుగోలు చేయాలని అన్నారు.
నల్గొండ: జిల్లా కలెక్టర్ గా, ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠి ని, సోమవారం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు కెలవత్ నాగేష్ నాయక్, ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి గిరిజన సాంప్రదాయ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
తిరుమలగిరి సాగర్ మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా పనులు నడుస్తున్న నెల్లికల్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని, త్వర్వతగతిన పనులు పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని, తండాలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని నగేష్ నాయక్ కలెక్టర్ ను కోరారు.
సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తండాలను సందర్శిస్తామని అన్నారు.
నల్లగొండ: మండలంలోని బుద్ధారం గ్రామానికి చెందిన కాసర్ల లింగస్వామి ని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ సోమవారం నియామక పత్రం అందజేశారు.
నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న రూ.7500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేసి, బహుజన విద్యార్థుల అభివృద్ధికై తోడ్పడాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కి వినతి పత్రం అందజేశారు.
Nov 06 2024, 11:39
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.7k