VijayaKumar

Aug 05 2024, 18:14

తెలంగాణ లెక్చరర్స్ ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా ఎండి యాకుబ్ బాబా నియామకం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని శ్రీ సాయి కృప డిగ్రీ మరియు పేజీ కళాశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు కత్తి వెంకటస్వామి హాజరై మాట్లాడుతూ ప్రైవేటు కళాశాలల సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ లెక్చరర్స్ ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా మహమ్మద్ యాకూబ్ బాబా కు రాష్ట్ర అధ్యక్షులు కత్తి వెంకటస్వామి నియామక పత్రాన్ని అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన యాకూబ్ బాబ మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ లెక్చరర్స్ పోరం బలోపేతం చేస్తానని, జిల్లా లొ లెక్చరర్స్ సమస్యలను రాష్ట్ర కమిటీ తెలిపి , పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నాపై నమ్మకంతో జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లాలోని లెక్చరర్స్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ లెక్చరర్ ఫోరం అసోసియేట్ ప్రెసిడెంట్ కొడిమాల కృష్ణ, తెలంగాణ లెక్చరర్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి కర్తాల శ్రీనివాస్, శ్రీ సాయి కృప డిగ్రీ మరియు పీజీ కళాశాల కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రైవేట్ కళాశాలల మేనేజ్మెంట్ జాయింట్ సెక్రెటరీ సింగబోయిన మల్లేశం వాగ్దేవి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె శ్రవణ్ రెడ్డి కృషి ఐటిఐ ప్రిన్సిపాల్ నామోజు రమేష్ అధ్యాపక బృందం పాల్గొన్నారు.

VijayaKumar

Aug 05 2024, 17:41

ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి, నాణ్యమైన భోజనం అందించాలని AISF వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన భోజనం అందించాలని పరిపాలన అధికారి జగన్ గారికి సోమవారం  ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది ఈరోజు ఉదయం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన కళాశాల వసతి గృహంలో పురుగులు ఉన్న అన్నం విద్యార్థులకు పెట్టారని తెలుసుకొని అక్కడికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడడం జరిగింది అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన వసతి మరియు భోజన సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు గతంలో అనేకసార్లు కలెక్టర్ గారికి బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేసిన పర్యవేక్షణ లోపంతో హాస్టల్ వార్డెన్లు అందుబాటులో లేకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య నాయకురాలు సబిత ఏఐఎస్ఎఫ్ నాయకులు చింతపల్లి అరుణ్, ప్రవీణ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 05 2024, 15:08

నెరవేరిన 30 ఏళ్ల కల, ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు హర్షనీయం: నారపాక నరేందర్ నిదానపల్లి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో న్యాయం, ధర్మం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసి విజయం సాధించడం హర్షించదగ్గ విషయమని నిదానపల్లి గ్రామ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు నారపాక నరేందర్ అన్నారు.ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ, ఏ బి సి డి వర్గీకరణపై ఎనలేని పోరాటం చేసి జాతి కొరకు తన జీవితాన్ని పణంగా,పెట్టి హక్కు సాధించుకున్న ఘన చరిత్ర మందకృష్ణ మాదిగదని ఆయన పోరాటం ఢిల్లీ వరకు వెళ్లి ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటానని ఎన్ని రోజులైనా నా పోరాటం విరమించేది లేదని పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాట పటిమను చూపించి సాధించుకున్న ఘనుడు మందకృష్ణ మాదిగని, ఈ యొక్క తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ అమలు చేస్తామని హామీ ఇవ్వడం ఎంతో గర్వించదగ్గ విషయమని,పారదర్శకంగా అమలు చేయాలని ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.

VijayaKumar

Aug 05 2024, 12:55

వక్ఫ్ బోర్డ్ పై కుట్ర పడుతున్న మోడీ ప్రభుత్వం: మహమ్మద్ అతహర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు

కేంద్రం లోని మోడీ ప్రభుత్వం ఒక వర్గం పై కక్ష పూరితంగా వ్యవహారిస్తూ వారికి చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తుల పై కన్నేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ అతహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు చట్టాలలో 40 సవరణలు చేయాలని కేంద్ర కాబినెట్ సమావేశం అయ్యి అంగీకరించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వారం వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టె అవకాశం ఉందని ఇండియా కూటమి తో పాటు ఎన్డిఏ కూటమి లో ఉన్న బీజేపేతర ప్రాంతీయ పార్టీ లు కూడా వ్యతిరేకించాలని కోరారు.ఇలా మోడీ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వారి మత స్వేచ్ఛ హక్కును ఉల్లంగిస్తున్నారని మండిపడ్డారు.

VijayaKumar

Aug 05 2024, 11:55

ZPHS టేకుల సోమవారం 1989-90 ,SSC బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం. పాఠశాలకు 60 వేలు ఆర్థిక సహాయం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని జడ్.పి.హెచ్.ఎస్ టేకుల సోమారం 1989-90 ఎస్ఎస్సి బ్యాచ్ వారు 34 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగింది .ఈ కార్యక్రమానికి అందరూ టీచర్లు మరియు విద్యార్థిని విద్యార్థులు హాజరు కావడం జరిగింది. పనుమటి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే స్కూల్ విద్యార్థుల కోసం డైనింగ్ హాల్ నిర్మాణం గురించి 60,000 రూపాయలను పూర్వ విద్యార్థులు డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు MMS ఫంక్షన్ హాల్ టేకుల సోమారంలో చాలా ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పనుమటి నరేందర్ రెడ్డి MD జహంగీర్ రాయగిరి రవీందర్ గజ్జి గంగారాo యాదవ్ సోలిపురం సురేఖ పద్మ లు పాల్గొని ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.

VijayaKumar

Aug 04 2024, 19:31

అరూరు: తుమ్మల నర్సయ్య సేవాసమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామానికి చెందిన బండారు భూపాల్ రెడ్డి ఆకస్మికంగా మరణించినందున వారి కుటుంబ సభ్యులకు కీర్తిశేషులు తుమ్మల నరసయ్య సేవాసమి తి ఆధ్వర్యంలో పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది .పిల్లల పైచదువులకు కూడా సహాయం అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవా సమితి గౌరవ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బండారు నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల శ్రీనివాస్ ,సంతోష్, అధ్యక్షులు కసర బోయిన లింగయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి పిట్టల సుధాకర్, ఓబీసీ మండల అధ్యక్షుడు కనకా చారి ,ఆరూరు మాజీ సర్పంచ్ లు జినుకల దానయ్య , పోలేపాక చెమ్మయ్య, ఆవుల స్వామి, బండారు చిన్న నరసింహారెడ్డి ,మహిపాల్ రెడ్డి, మత్స్య  సహకార సంఘం మండల అధ్యక్షుడు బండి  రవికుమార్, ఆవుల అంజయ్య, కసుర బోయిన నరసింహ ,ఎలిమినేటి సంతోష్ కుమార్, కోయిగూర మధు ,మీసాల మత్స్యగిరి ,గడ్డల నరసింహ ,ఆనందు ,ఎలిమినేటి వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 04 2024, 19:10

వలిగొండ: ఐదు ప్రభుత్వ ఉద్యోగాలతో సత్తా చాటిన వెలువర్తి యువకుడు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వెల్వర్తి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన బోదాసు శ్రీను-సునీత దంపతుల ప్రథమ పుత్రుడు హరి ప్రకాశ్ బీటెక్ పూర్తి చేశాడు. ఇటీవల వెలువడిన ఏఈఈ ఫలితాల్లో మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ లో గెజిటెడ్ ఉద్యోగం సాధించాడు. దీనితోపాటు ఇంకా నాలుగు ఉద్యోగాలు ఏఈ, కానిస్టేబుల్, టీపీబీఓ(టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్ సిర్), గ్రూప్-4 వంటి ఉద్యోగాల్లోనూ ఎంపికయ్యాడు. ప్రస్తుతం హరి ప్రకాష్ భువనగిరి ఫైర్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. హరి ప్రకాష్ పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందనలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు.

VijayaKumar

Aug 04 2024, 19:07

వలిగొండ మూసి వంతెన పై కొత్త రోడ్డుకు నిధులు మంజూరు ,ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మండల ప్రజలు

భువనగిరి నుండి  చిట్యాల రోడ్డు మార్గంలో వలిగొండ మూసి వంతెన పైన ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు గుంతల మయం కావటంతో.గత కొన్ని రోజుల నుండి ప్రయాణికులు విద్యార్థులు ఈ రోడ్డు గుండా ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే ప్రమాదాలు జరుగుతున్నవి ఇట్టి విషయాన్ని తెలుసుకొని మూసి వంతెన ను పరిశీలించిన మన ప్రియతమా నేత భువనగిరి శాసన సభ్యులు  కుంభం అనిల్ కుమార్ రెడ్డి  మరమత్తుల గురించి R&B అధికారతో మాట్లాడి వలిగొండ మూసి వంతెనపైన కొత్త రోడ్ కోసం 30,04,948 లక్షల రూ" మంజూరు చేయించడం జరిగింది. వారికి వలిగొండ పట్టణ మరియు మండల ప్రజలు ప్రత్యేక ధన్యవాలు తెలియజేయడం జరిగింది.

VijayaKumar

Aug 04 2024, 17:52

మేరు సంఘం వలిగొండ మండల నూతన అధ్యక్షులుగా ఆదిమూలం సోమేష్ మేరు ఏకగ్రీవ ఎన్నిక

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఆదివారం మేరు సంఘం నూతన మండల కమిటీ మేరు సంఘం నాయకులు ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా ఆదిమూలం సోమేశ్ మేరు,ప్రధాన కార్యదర్శిగా వెంపటి నరేష్ కోశాధికారిగా వెంపటి మత్స్యగిరి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ మేరు సంఘం అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తానని అంతేకాకుండా ప్రభుత్వం తరఫున వచ్చే నిధుల కోసం పోరాడుతానని తెలిపారు నన్ను నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్న మేరు సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు ఆదిమూలం గోపి, గౌరవ అధ్యక్షుడు కీర్తి రమేష్, దోమకొండ సత్యనారాయణ, వెంపటి రాజు, కీర్తి శ్రీనివాస్, రెగ్యులర్ టైలర్ కీర్తి రమేష్, వెంపటి లక్ష్మీనారాయణ, రామగిరి వెంకటేష్, కీర్తి సత్యనారాయణ, ఆదిమూలం రమేష్, వెంపటి అశోక్,కీర్తి వెంకటేశం, ఆదిమూలం శ్రీనివాస్, కీర్తి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 04 2024, 17:03

ఈనెల 13న భువనగిరిలో మాదిగల విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయండి : ఎమ్మార్పీఎస్

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రహదారి బంగ్లాలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి మాదిగ ఆత్మీయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ. ఎస్సీ వర్గీకరణ కు సుప్రీంకోర్టు అనుకూల తీర్పు ఇచ్చిన శుభ సందర్భంగా ఆగస్టు 13న భువనగిరిలో మాదిగల విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి , కోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేస్తామని ఇచ్చిన హామీకి ధన్యవాదాలు తెలిపారు. ఏబిసిడి వర్గీకరణ పై ఎనలేని పోరాటం చేసి జాతి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి హక్కులు సాధించుకున్న ఘనత మందకృష్ణ మాదిగకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగారం అంజయ్య ,బట్టు రామచంద్రయ్య, ఇటికల దేవేందర్, కోళ్ల జహంగీర్, సందెల శ్రీనివాస్, శివ, హరిప్రసాద్ ,కృష్ణయ్య, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.