VijayaKumar

Aug 04 2024, 19:07

వలిగొండ మూసి వంతెన పై కొత్త రోడ్డుకు నిధులు మంజూరు ,ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మండల ప్రజలు

భువనగిరి నుండి  చిట్యాల రోడ్డు మార్గంలో వలిగొండ మూసి వంతెన పైన ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు గుంతల మయం కావటంతో.గత కొన్ని రోజుల నుండి ప్రయాణికులు విద్యార్థులు ఈ రోడ్డు గుండా ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే ప్రమాదాలు జరుగుతున్నవి ఇట్టి విషయాన్ని తెలుసుకొని మూసి వంతెన ను పరిశీలించిన మన ప్రియతమా నేత భువనగిరి శాసన సభ్యులు  కుంభం అనిల్ కుమార్ రెడ్డి  మరమత్తుల గురించి R&B అధికారతో మాట్లాడి వలిగొండ మూసి వంతెనపైన కొత్త రోడ్ కోసం 30,04,948 లక్షల రూ" మంజూరు చేయించడం జరిగింది. వారికి వలిగొండ పట్టణ మరియు మండల ప్రజలు ప్రత్యేక ధన్యవాలు తెలియజేయడం జరిగింది.

VijayaKumar

Aug 04 2024, 17:52

మేరు సంఘం వలిగొండ మండల నూతన అధ్యక్షులుగా ఆదిమూలం సోమేష్ మేరు ఏకగ్రీవ ఎన్నిక

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఆదివారం మేరు సంఘం నూతన మండల కమిటీ మేరు సంఘం నాయకులు ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా ఆదిమూలం సోమేశ్ మేరు,ప్రధాన కార్యదర్శిగా వెంపటి నరేష్ కోశాధికారిగా వెంపటి మత్స్యగిరి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ మేరు సంఘం అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తానని అంతేకాకుండా ప్రభుత్వం తరఫున వచ్చే నిధుల కోసం పోరాడుతానని తెలిపారు నన్ను నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్న మేరు సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు ఆదిమూలం గోపి, గౌరవ అధ్యక్షుడు కీర్తి రమేష్, దోమకొండ సత్యనారాయణ, వెంపటి రాజు, కీర్తి శ్రీనివాస్, రెగ్యులర్ టైలర్ కీర్తి రమేష్, వెంపటి లక్ష్మీనారాయణ, రామగిరి వెంకటేష్, కీర్తి సత్యనారాయణ, ఆదిమూలం రమేష్, వెంపటి అశోక్,కీర్తి వెంకటేశం, ఆదిమూలం శ్రీనివాస్, కీర్తి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 04 2024, 17:03

ఈనెల 13న భువనగిరిలో మాదిగల విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయండి : ఎమ్మార్పీఎస్

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రహదారి బంగ్లాలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి మాదిగ ఆత్మీయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ. ఎస్సీ వర్గీకరణ కు సుప్రీంకోర్టు అనుకూల తీర్పు ఇచ్చిన శుభ సందర్భంగా ఆగస్టు 13న భువనగిరిలో మాదిగల విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి , కోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేస్తామని ఇచ్చిన హామీకి ధన్యవాదాలు తెలిపారు. ఏబిసిడి వర్గీకరణ పై ఎనలేని పోరాటం చేసి జాతి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి హక్కులు సాధించుకున్న ఘనత మందకృష్ణ మాదిగకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగారం అంజయ్య ,బట్టు రామచంద్రయ్య, ఇటికల దేవేందర్, కోళ్ల జహంగీర్, సందెల శ్రీనివాస్, శివ, హరిప్రసాద్ ,కృష్ణయ్య, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 04 2024, 16:39

ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అన్నింటిని వెంటనే అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం రోజున భువనగిరిలో జరిగిన ఏఐటీయూసీ జిల్లా ఆఫీస్ బెరర్స్ సమావేశానికి గోద శ్రీరాములు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఆటో కార్మికులకు ఇస్తామన్న 12000 వెంటనే ఇవ్వాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, మధ్యాహ్న భోజన వంట కార్మికులకు నెలకు 10వేలు ఇవ్వాలని, కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేసి శ్రమదోపీడి అరికట్టాలని కోరారు. అంగన్వాడీలకు నెలకు 18000 వేతనం వెంటనే అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని , కనీస వేతన చట్టాలను సవరించి పెరుగుతున్న థరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని కోరారు. కనీస వేతనాలు బోర్డు ఏర్పాటు చేసి కార్మిక సంఘాలకు ప్రాతినిథ్యం కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. ఉద్యోగ కార్మిక సంఘాలు ఈ ప్రభుత్వము మీద ఎన్నో ఆశలు పెట్టుకొని గత ఎన్నికల్లో బలపరచి గెలిపించారని ఆ నమ్మకం నిలబెట్టుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి వెంటనే చేపట్టాలని కోరారు. గ్రామపంచాయతీ కార్మికుల, 2వ ఏఎన్ఎం ల వేతనాలు తక్షణమే పెంచాలని కోరారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ను ప్రక్షాలన చేసి నిజమైన లబ్ధిదారులకు కార్డులు అందేలా చర్యలు చేపట్టాలని, సాఫ్ట్వేర్ విధానంలో ఆన్లైన్ విధానంలో మార్పులు తీసుకొని రావాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ అండగా ఉంటుందని అన్నారు. ఈ సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు అధ్యక్షత వహించగా కార్యక్రమంలో ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, ఉపాధ్యక్షులు పిల్లి శంకర్, సహాయ కార్యదర్శులు గానబోయిన వెంకటేష్, సోమన సబిత తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 04 2024, 14:38

కేరళ బాధితులకు సహాయాన్ని అందించి అండగా నిలవండి : సిర్పంగి స్వామి సిపిఎం మండల కార్యదర్శి

ప్రకృతి వైపరీత్యంతో కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి మరణించిన 300 పైగా కుటుంబాలకు మరియు గాయాలపాలై వైద్యాన్ని అందుకుంటున్న క్షతగాత్రులకు,నిరాశ్రయులకు అండగా నిలిచి ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి కోరారు సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదివారం రోజున పులిగిల్ల గ్రామంలో కేరళ వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిర్పంగి స్వామి మాట్లాడుతూ దేశంలో పర్యాటక ప్రాంతంగా ఉన్నటువంటి కేరళను ప్రకృతి వైపరీత్యాలతో కురుస్తున్న అకాల వర్షం కారణంగా వయనాడ్ ప్రాంతంలోని ప్రజల జీవితాలను చిన్నభిన్నం చేసిందన్నారు సుమారు 300 పైగా ప్రజలు ఇప్పటికే మరణించారని అనేకమంది గాయాలతో ప్రాణాలను కాపాడుకున్నారని అనేకమంది తమ ఇండ్లను కుటుంబాలను కోల్పోయి నిరాశ్రయులై ఉన్నారని వారందరికీ అండగా నిలవాల్సిన అవసరం ప్రస్తుత సమయంలో ఉందని వారిని ఆదుకునేందుకు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ దేశవ్యాప్తంగా ఈనెల 4,5 తేదీల్లో విరాళాల సేకరణ నిర్వహించాలని పిలుపునిచ్చిందన్నారు ప్రజలను ఆదుకునేందుకు కేరళ రాష్ట్ర వామపక్ష ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తుందన్నారు, కష్ట కాలంలో ఉన్న కేరళ రాష్ట్రాన్ని బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని ఆయన అన్నారు ఇప్పటికే అనేకమంది సినీ నటులతో పాటు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చి విరాళాన్ని ప్రకటించిందని ప్రజలందరూ మానవతా దృక్పథంతో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని తమకు వీలైన మేరకు ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరారు సిపిఎం పార్టీ సేకరించిన విరాళాలను జిల్లా రాష్ట్ర కమిటీల ద్వారా కేరళ బాధితులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి బుగ్గ చంద్రమౌళి,సిపిఎం నాయకులు దొడ్డి బిక్షపతి, వడ్డమాని వెంకటయ్య, కొమ్మిడి సత్తిరెడ్డి,ఈర్ల రమేష్,మారబోయిన ముత్యాలు,వడ్లకొండ శంకరయ్య,బొడ్డు రాములు,వడ్డేమాన్ మధు,వేముల నాగరాజు, వరికుప్పల శంకరయ్య, వేముల అనిల్, వేముల నర్సింహ,వరికుప్పల బాబు,వేముల టెండూల్కర్,వేముల జ్యోతి బాబు,దయ్యాల నరసింహ,వనం యాదయ్య,దశరథ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 03 2024, 20:58

ఈనెల 10, 11న భువనగిరిలో జరిగే ఆవాజ్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని కరపత్రాల ఆవిష్కరణ

ఈనెల 10, 11న భువనగిరి పట్టణంలో జరిగే ఆవాజ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆత్మకూరు మండల కేంద్రంలో కరపత్రాల విడుదల. శనివారం రోజున ఆత్మకూరు మండలంలో ఆవాజ్ రాష్ట్రస్థాయి శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని అవాజ్ నాయకులు కరపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఇక్బాల్ S.K లతీఫ్ మాట్లాడుతూ శ్రీ శ్రీనివాస ఫంక్షన్ హాల్ (దివ్య) లో రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు శిక్షణ తరగతులు లౌకిక వాద ప్రజాతంత్ర శక్తులు ఈ శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని సమాజం ఐక్యంగా నిలపడం కొరకు దేశ ఐక్యతను చాటే విధంగా ఉంటాయని శిక్షణ తరగతుల మొదటి రోజున ముస్లిం స్వాతంత్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ ను భువనగిరి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రారంభిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో యువతి యువకులు ప్రజాతంత్ర వాదులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో MD అజీమోద్దీన్ MD మోలిసాహబ్ MD జమాల్ MD రంdజాన్ MD హారున్ వృత్తి సంఘం మండలం కన్వర్ వేముల బిక్షం తదితరులు పాల్గొన్నారు,

VijayaKumar

Aug 03 2024, 20:54

యాదగిరిగుట్టలో లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో శనివారం సీఎం సహాయనిధి చెక్కులను ప్రభుత్వ ఆలేరు  ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లబ్ధిదారులకు  పంపిణీ చేశారు. బొమ్మలమ్మ రామారావు మండలంలో 79 మందికి ,తుర్కపల్లి మండలంలో 63 మందికి, రాజపేట మండలంలో 76 మందికి, యాదగిరిగుట్ట పట్టణం మండలంలో 114 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య ఖర్చుల నిమిత్తం లబ్ధిదారులకు అందజేశామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కట్టుబడి ఉందని తెలిపారు .ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 03 2024, 16:47

అమరుల స్ఫూర్తితో గీతా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తాం; బోలగాని జయరాములు KGKS రాష్ట్ర ఉపాధ్యక్షులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కల్లుగీత కార్మిక ఉద్యమాలలో పనిచేస్తూ అమరులైన అమరులు బొమ్మగాని ధర్మ బిక్షం బైరు మల్లయ్య తొట్ల మల్సూర్ సూదగాని ఎట్టయ్య లాంటి ఎందరో అమరవీరులు కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారిని స్మరిస్తూ వారు చూపిన మార్గంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్లుగీత కార్మిక సంఘం కార్మికుల సమస్యలపై సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయరాములు అన్నారు. తేదీ 03-08-2024 శనివారం రోజున వలిగొండ పట్టణంలోని శివశక్తి ఫంక్షన్ హాల్ కేజీ కేఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన అమరుల యాది సభ పలుసం స్వామి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన జయరాములు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి ఉన్నాయని కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఏ ప్రభుత్వాలు కూడా సంపూర్ణ ప్రయత్నాలు చేస్తలేవు అని వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని వారికి హామీల వరకే పరిమితం అవుతున్నారని అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించకపోవడం వృత్తి రక్షణకు ఆధునీకరణ చేయకపోవడంతో కల్లుగీత వృత్తిలో గీతా కార్మికులు క్రమంగా తగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కళ్ళు గీత కార్మికుల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు చేసి కళ్ళు గీత కార్మిక సంఘం నాయకులు కొన్ని హక్కులను సాధించారని వాటిని కాపాడుకుంటూ కల్లుగీత వృత్తి రక్షణ కోసం కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అధిక నిధులు విడుదల చేయడం కోసం ఆధునికరించడం కోసం భవిష్యత్తులో గీతా కార్మికులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలిపారు అందుకు వృత్తి రక్షణ కోసం పనిచేసే అమరులైన అమరుల స్ఫూర్తితో సంఘం ముందుకు వెళుతుందని తెలిపారు కేజీ కేస్ జిల్లా అధ్యక్షులు రాగిరి కృష్ణయ్య మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా నందనం వద్ద ఉన్న నీర కేంద్రానికి నిధులు కేటాయించి వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా కల్లుగీత కార్మికుల ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేస్తున్న కేజీ కేఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య మండల అధ్యక్షులు పబ్బతి మల్లేశం మండల నాయకులు కొండూరు సత్తయ్య కొండూరు అంజయ్య పలుసం లింగం బంధారపు ధనంజయ గాజుల వెంకటేశం గంధ మల్ల గోపాల్ పలుసం చంద్రమౌళి శంకరయ్య లోడే మల్లేశం మద్దెల మారయ్య మండలంలోని వివిధ గ్రామాల అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు

VijayaKumar

Aug 03 2024, 16:44

ఎస్సీ వర్గీకరణ అమలుపై హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ యువజన నాయకులు డాక్టర్ ముప్పిడి రవి

ఎస్సీ వర్గీకరణపై తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీ ప్రస్తావన* *- అమలుపై హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి* *- ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ యువజన నాయకుడు డాక్టర్ ముప్పిడి రవి* ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. తీర్పు వచ్చిన వెంటనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి కోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేస్తానని ఇచ్చిన హామీకి కోమటిరెడ్డి బ్రదర్స్,నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరుడు కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు డాక్టర్ ముప్పిడి రవి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణపై పోరాటం చేస్తే నేటికీ తుది ఫలితం రావడం హర్షణీయం అని, వచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం అమలు విషయం కూడా పారదర్శకంగా జరిగే విధంగా చేయాలని ఒక ప్రకటనలో కోరారు.

VijayaKumar

Aug 03 2024, 09:08

వలిగొండ: నర్సయ్య గూడెం వద్ద కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా : కారు ఢీ కొట్టడంతో తో వ్యక్తి మృతి చెందిన ఘటన వలిగొండ మండల పరిధిలోని నరసయ్య గూడెం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది .పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వల్లపు నరసయ్య తన వ్యక్తిగత పనుల నిమిత్తం వలిగొండ కు వచ్చి తన టీవీఎస్ ఎక్సెల్ బండిపై తిరిగి వెళుతుండగా నరసయ్య గూడెం సమీపంలో రోడ్డు కల్వర్టు వద్ద కారు ఢీకొట్టడంతో తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వలిగొండ ఎస్సై మహేందర్ తెలిపారు.