తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 01 2024, 13:22

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీం కీలక తీర్పు

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది..

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. 6:1 మెజారిటీతో సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. గురువారం నాడు వర్గీకరణపై సుదీర్ఘ విచారణ జరిపిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని స్పష్టం చేసింది. కాగా.. ఈ వర్గీకరణను మెజారిటీ సభ్యులు సమర్థించగా.. జస్టిస్‌ బేలా త్రివేది మాత్రం వ్యతిరేకించారు. ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నారని.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ అవసరం ఉందని.. వర్గీకరణచేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని సుప్రీం స్పష్టం చేసింది. ఈ మేరకు 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజా తీర్పు తర్వాత ధర్మాసనం పక్కనబెట్టింది. ఈ తీర్పును అనుసరించి తదుపరి మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వాలకు న్యాయస్థానం సూచించింది.

సామాజిక న్యాయం లక్ష్యంగా భారత రాజ్యాంగం దేశంలో విడిపోయి ఉన్న కులాలను చాలా శాస్త్రీయంగా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎఫ్.సి.లుగా వర్గీకరించింది. షెడ్యూల్ కులాలకు సంబంధించి అంటరానితనానికి గురవుతున్న కులాలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి వారికి రిజర్వేషన్ అవకాశాలు కల్పించింది. అయితే ఇలా కులపరంగా రిజర్వేషన్ పొందుతున్న తరగతుల్లో మాలలే అగ్ర భాగాన ఉన్నారని ఆరోపిస్తూ, ఈ తేడాను సవరించాలని ఎమ్మార్పీఎస్ ఉద్యమం చేస్తూ ఎ, బి, సి, డి కేటగిరీల వారీగా ఎస్సీలను వర్గీకరించాలని కొన్నేళ్లుగా ప్రభుత్వాలు, న్యాయస్థానాలను కోరుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. పంజాబ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ద పంజాబ్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ అండ్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ (రిజర్వేషన్‌ ఇన్‌ సర్వీసెస్‌) యాక్ట్‌-2006’ను సవాలు చేస్తూ పదుల సంఖ్యలో ధర్మాసనంకు పిటిషన్లు వచ్చాయి. ఇందులో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిటిషినర్‌గా ఉన్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎస్సీలకు 22.5% రిజర్వేషన్‌ కల్పిస్తుండగా.. పంజాబ్‌లో అది 25శాతంగా ఉంది. పంజాబ్‌ రిజర్వేషన్ల చట్టంలోని సెక్షన్‌ 4(5) ప్రకారం.. ఎస్సీ రిజర్వేషన్లలో వాల్మీకి, మజ్హబీ సిక్కులు పోటీలో ఉంటే.. వారికి ప్రాధాన్యతనిస్తూ 50% కోటాను కేటాయించాలి. ఈ చట్టం వల్ల ఎస్సీల్లోని ఇతర కులస్థులు ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ పంజాబ్‌-హరియాణా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 2010లో పంజాబ్‌ సర్కారుకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పునిచ్చింది. 2011లో పంజాబ్‌ సర్కారు దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లగా.. ఇతర పిటిషనర్లు సైతం వ్యాజ్యాలను దాఖలు చేశారు. 2020 ఆగస్టు 27న జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా(ప్రస్తుతం రిటైర్‌ అయ్యారు) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ విషయాన్ని పరిశీలించేందుకు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం అవసరమని స్పష్టం చేశారు. అసలు.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ చేయొచ్చా? అనే అంశంపై న్యాయపరమైన ప్రశ్నలను పరిశీలించేందుకు ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఇందులో చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌తోపాటు.. జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ బేలా.ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ సతీశ్‌చంద్ర మిశ్రాల ధర్మాసనం ఈ విచారణను ప్రారంభించింది.

ఈ కేసులో పిటిషనర్లు 2004 నాటి ‘ఈవీ చిన్నయ్య వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును ఉటంకించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీల్లో వర్గీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, అలాంటి నిర్ణయాలు భారత రాజ్యాంగంలోని 14వ అధికరణ(చట్టం ముందు అంతా సమానులే)ను ఉల్లంఘిస్తోందని 2004 నాటి తీర్పు స్పష్టం చేస్తోంది. దీనికి తోడు.. ఎస్సీ కులాల గుర్తింపు బాధ్యత పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుందని, ఆయా కులాలను రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 341 మేరకు రాష్ట్రపతి మాత్రమే నోటిఫై చేస్తారని పిటిషనర్లు తమ వ్యాజ్యాల్లో పేర్కొనడం జరిగింది. ఇదంతా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. ఈ క్రమంలోనే.. ఇవాళ 2004 నాటి ఈవీ చిన్నయ్య తీర్పును వ్యతిరేకిస్తూ.. రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నట్లు సీజేఐ ధర్మాసనం స్పష్టంచేసింది.

ఎస్సీ రిజర్వేషన్లలో క్యాటగిరి చేసుకునే అంశంపై పంజాబ్ ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్మార్పీఎస్ సుప్రీంకోర్టు ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజా తీర్పుతో ఆయా వర్గాలు, నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతిస్తున్నట్లు తెలిపారు. పేదలకు న్యాయం జరగాలన్నదే మోదీ సర్కార్ ఉద్దేశమని.. ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలని చెప్పుకొచ్చారు.

మరోవైపు.. సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మీడియా ఎదుటే ఆయన కంటనీరు పెట్టుకున్నారు. ‘మా 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించింది. ఈ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకున్నారు. అమిత్‌షా, వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డికి ధన్యవాదాలు. వర్గీకరణ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నాం. రిజర్వేషన్ల సిస్టమ్ ఇప్పుడు రెండో అడుగు వేయబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యం. వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఉద్యోగ నోటిఫికేషన్లు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. రీ-నోటిఫికేషన్లు ఇవ్వాలి’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మందకృష్ణ మాదిగ కోరారు. వర్గీకరణకు జనాభా లెక్కలతో పనిలేదని మరోసారి గుర్తు చేశారు. త్వరలో విజయోత్సవ సభ.. ఇందుకు సహకరించిన వారికి కృతజ్ఞత సభలు ఉంటాయని మందకృష్ణ వెల్లడించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 20:22

జనసేన పార్టీ ఎమ్మెల్యే కారుపై దాడి.. పవన్ కళ్యాణ్ సీరియస్..

ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు.

కారులో ఇంటికి వెళ్తుండగా జీలుగుమిల్లి మండలం బర్రిలంకలపాడు సమీపంలో దాడి జరిగింది.

ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండించారు.

ఘటనకు కారకులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు..

Sb news

Sb news

Sb news

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 15:16

ధరల పోటీ తట్టుకోలేక పోతున్నాం

ఇండియా సిమెంట్స్‌ (ఐసీఎల్‌) అమ్మకానికి దారితీసిన పరిస్థితులను ఆ సంస్థ అధినేత ఎన్‌ శ్రీనివాసన్‌ తనకు సన్నిహితులైన 300 మంది ఉద్యోగులతో పంచుకున్నారు. ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి ధరల విషయంలో పోటీ సంస్థలతో పోటీపడలేకే కంపెనీని అమ్మాల్సి వచ్చిందని వారితో భావోద్వేగంతో చెప్పారు.

కంపెనీ యాజమాన్యం చేతులు మారినా ఐసీఎల్‌ ఉద్యోగుల ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని హామీ ఇచ్చారు.

కంపెనీ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు, భూములు అమ్మేందుకు చేసిన ప్రయత్నాలూ ఫలించలేదన్నారు. కంపెనీ అమ్మకానికి ఇది కూడా ఒక కారణమన్నారు. ‘ధరలు తగ్గించి మన పోటీ సంస్థలు మనల్ని తొక్కేయగలవు. వారితో పోలిస్తే మన ఉత్పత్తి వ్యయం కొద్దిగా ఎక్కువ.

దాన్ని తగ్గించేందుకు చేసిన ప్రయాత్నాలు పెద్దగా ఫలించలేదు. అందుకే ఇండియా సిమెంట్స్‌ను అమ్మేయాల్సి వస్తోంది’ అని శ్రీనివాసన్‌ తనను కలిసిన ఉద్యోగులతో భావోద్వేగంతో చెప్పారు. దీంతో గత 55 సంవత్సరాలుగా సిమెంట్‌ పరిశ్రమతో ఆయనకు ఉన్న అనుబంధం ముగియబోతోంది.'

ఇండియా సిమెంట్స్‌ (ఐసీఎల్‌) షేర్లను డీలిస్ట్‌ చేసే ఆలోచన లేదని అలా్ట్రటెక్‌ సిమెంట్‌ ప్రకటించింది. కంపెనీ ఈక్విటీలో మెజారిటీ వాటా తమ హస్తగతమైనా.. ఐసీఎల్‌ ప్రత్యేక లిస్టెడ్‌ కంపెనీగానే కొనసాగుతుందని రెగ్యులేటరీ సంస్థలకు తెలిపింది.

ఐసీఎల్‌ ప్రధాన ప్రమోటర్‌ ఎన్‌ శ్రీనివాసన్‌, ఆయన కుటుంబసభ్యుల నిర్వహణలోని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) క్రికెట్‌ టీమ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎ్‌సకే) యాజమాన్యంలోనూ ఎలాంటి మార్పు ఉండదని ప్రకటించింది.

ఐసీఎల్‌ ఈక్విటీలో మరో 26 శాతం వాటా కోసం తాము చేసే ఓపెన్‌ ఆఫర్‌ను యాక్సిస్‌ క్యాపిటల్‌ నిర్వహిస్తుందని తెలిపింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 15:10

ఈమె అతి తెలివికి దండం పెట్టొచ్చు.. వాషింగ్ మెషిన్‌ను ఎలా వాడిందో చూస్తే..

ఇళ్లల్లో వస్తువులను చిత్రవిచిత్రంగా వాడే వారిని రోజూ చూస్తూనే ఉంటాం. కొందరు కూలర్‌ను ఫ్రిడ్జ్‌లా మార్చి పండ్లు, కూరగయలు పెడుతుంటారు. ఇంకొందరు ఫ్రిడ్జి నుంచి వచ్చే చల్లదనంతో ఇంటిని ఏసీలా మార్చుతుంటారు.

మరొక మహిళేమో.. ఇటుకలతో ఏకంగా వాషింగ్‌మెషిన్ తరహాలో నిర్మాణం చేపడుతుంది. ఇలాంటి వీడియోలు రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఓ మహిళ వాషింగ్ మెషిన్‌ను వాడిన విధానం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ వాషింగ్ మెషిన్‌ను (Washing machine) వాడే విధానం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.

సాధారణంగా ఎవరైనా వాషింగ్‌మెషిన్‌ను బట్టలు ఉతికేందుకు ఉపయోగిస్తారు. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది.

వాషిన్‌మెషిన్‌ను ఓపెన్ చేసిన ఆమె.. ముందుగా అందులో నీరు పోసి, తర్వాత అందులో లిక్విడ్ పోస్తుంది. ఆ తర్వాత ఏకంగా ఇంట్లోని (Woman putting dishes in washing machine) వంట పాత్రలన్నీ అందులో పడేస్తుంది. ఫైనల్‌గా మిషిన్ ఆన్ చేయగా.. గిరాగిరా వేగంగా తిరిగి పాత్రలు క్లీన్ అవుతాయి. ఇలా దుస్తులను వేయాల్సిన మిషిన్‌లో పాత్రలు వేసి శుభ్రం చేసింది. ఈమె అతి తెలివి చూసి అంతా అవాక్కవుతున్నారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. వాషింగ్‌మెషిన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది అంటూ కొందరు

ఈమె అతి తెలివికి హ్యాట్సాప్ అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 15:05

ఇద్దరు ఆర్డీవోలపై వేటు

వేత కేసులో ఇద్దరు ఆర్డీవోలను, ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేశారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సిసోడియా నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో మదనపల్లె ఆర్డీవోగా పనిచేసిన మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్‌తో పాటు సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్ట్టెంట్‌ గౌతంతేజ్‌లను సస్పెండు చేసింది. ఇదే కేసులో ఇటీవల మదనపల్లె వన్‌టౌన్‌ సీఐ వలీబషును వీఆర్‌కు పంపి, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండు చేశారు.

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాన్ని కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తమ అదుపులో అనుమానితులు ఎవరూ లేరన్నారు. ఎఫ్‌ఎ్‌సఎల్‌ (ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌) నివేదిక రాగానే 15 రోజుల్లో నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామన్నారు. మాధవరెడ్డి ఇంట్లో 500 వరకు ఇళ్ల స్థలాలు, భూముల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో శశికాంత్‌ ఇంట్లో మదనపల్లెకు చెందిన భూముల రికార్డులు దొరికాయన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పీఏ తుకారం ఇంట్లోనూ, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా ఇంట్లో కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నామని, ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఫైళ్ల కాల్చివేత కేసును అన్ని కోణాల్లో సాంకేతిక సహకారంతో పరిశోధిస్తున్నట్లు వివరించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినట్లు తెలిపారు. సెల్‌ టవర్‌ డంప్స్‌ తీశామని, 2000కు పైగా ఫోన్‌ కాల్‌డేటాను పరిశీలించినట్లు తెలిపారు. వాట్సా్‌పలకు సంబంధించి ఐపీడీఆర్‌ను కూడా పరిశీలించినట్లు చెప్పారు. ఇప్పటికే అనుమానితుల ఇళ్లను సోదా చేసి విలువైన ఆధారాలు సేకరించినట్లు ప్రకటించారు. పరిశోధనకు ఉపయోగపడే డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కొత్తగా 8 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో సీఐడీ అధికారుల సహకారంతో 15 బృందాలు విచారణ చేసినట్లు తెలిపారు.

సోమవారం మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ప్రజలు పోటెత్తారు. గత ఐదేళ్లలో వైసీపీ నాయకుల వేఽధింపులకు గురైన బాధితులు వెల్లువలా వచ్చారు. సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూ్‌పకు సుమారు 150 మంది బాధితులు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. వైసీపీ నాయకులు తమ భూములు ఆక్రమించారని, దౌర్జన్యంగా లాక్కున్నారని, విలువైన భూములను అతి తక్కువ ధరకే కాజేశారని.. చాలా వరకు ఇలాంటి ఫిర్యాదులే ఉన్నాయి.

మదనపల్లె సబ్‌ డివిజన్‌లోని భూబాధితులు ఆగస్టు 4వ తేదీ మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, తమ పార్టీ అండగా ఉంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఫైళ్లు దహనమైన గదిని, కాలిన కాగితాలను, పరిసరాలను ఆయన పరిశీలించారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోకి పోలీసులు అనుమతించకుండా ఆయనను అడ్డుకోవడంతో సీపీఐ నాయకులు పోలీసులను తోసుకుని వెళ్లి కార్యాలయంలో జరిగిన సంఘటనను పరిశీలించారు. అనంతరం ఆయన పోలీసుల తీరుపై మండిపడ్డారు. అంతజాగ్రత్తగా పోలీసులు ఉంటే ఇప్పటికే నిందితులను పట్టుకోవచ్చు కదా అని ప్రశ్నించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కొందరు ఉద్దేశపూర్వకంగానే స్వార్థ ప్రయోజనాల కోసం పైళ్లు కాల్చినట్లు సంఘటనను చూస్తే అర్థం అవుతుందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజలను అన్నివిధాలా దోచుకున్నారని ఆరోపించారు. నిరుపేదల భూములను ఆక్రమించి వారిపైనే దౌర్జన్యం చేసి కేసులు కట్టిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.

పట్టణంలోని కదిరి రోడ్డులో సర్వే నంబరు 145/6లో 22 సెంట్ల భూమిని నా భర్త మల్లికార్జున కొనుగోలు చేశారు. ఈ స్థలంపై కన్నేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత, పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథరెడ్డి మదనపల్లె తహసీల్దార్‌ కార్యాలయంలో మా స్థలం సబ్‌డివిజన్‌ ఫైలు మాయం చేశారు. ఈ స్థలంపై హక్కులేని వారి వద్ద కొనుగోలు చేసినట్లు రిజిస్ర్టేషన్‌ చేయించుకుని, మా స్థలాన్ని కబ్జా చేశారు.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలతకు అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం వీరబల్లి గ్రామంలో ఐదెకరాల విస్తీర్ణం ఉన్న చెరువును రెవెన్యూ అధికారులు కేటాయించారు. ఆపై ఆ చెరువును 2023లో ఫ్రీహోల్డ్‌గా చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అత్తగారి ఊరు వీరబల్లి. ఈ గ్రామ పరిధిలోని సుగాలితాండా సమీపంలో ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రదిబ్బ చెరువును పెద్దిరెడ్డి భార్య పేరుతో కేటాయించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 14:14

ఇంటి పత్రాలు రెడీగా ఉంచుకోండి...

పన్ను లెక్కను పక్కాగా కట్టేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) సిద్ధమైంది. ఇందులో భాగంగా భవన నిర్మాణ అనుమతుల వివరాలు, నివాసయోగ్య పత్రం(ఓసీ), తాజా ఆస్తి పన్ను చెల్లింపు రశీదు, నీటి, విద్యుత్‌ బిల్లులు, యజమాని గుర్తింపు కార్డు, వాణిజ్య భవనమైతే ట్రేడ్‌ లైసెన్స్‌ వివరాలు సేకరించనున్నారు.

పన్ను లెక్కను పక్కాగా కట్టేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) సిద్ధమైంది. ఇందులో భాగంగా భవన నిర్మాణ అనుమతుల వివరాలు, నివాసయోగ్య పత్రం(ఓసీ), తాజా ఆస్తి పన్ను చెల్లింపు రశీదు, నీటి, విద్యుత్‌ బిల్లులు, యజమాని గుర్తింపు కార్డు, వాణిజ్య భవనమైతే ట్రేడ్‌ లైసెన్స్‌ వివరాలు సేకరించనున్నారు. ఎంపికైన ఏజెన్సీ సిబ్బంది క్షేత్రస్థాయిలో సమాచారం తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు.

ప్రతీ భవనం నుంచి ఆస్తిపన్ను, వాణిజ్య సంస్థల నుంచి ట్రేడ్‌ లైసెన్స్‌ రుసుము వసూలు చేయాలని బల్దియా లక్ష్యంగా పెట్టుకుంది. ఉప్పల్‌, హయత్‌నగర్‌, హైదర్‌నగర్‌, కూకట్‌పల్లి(Uppal, Hayatnagar, Hydernagar, Kukatpally), కేపీహెచ్‌బీ కాలనీ, మియాపూర్‌, చందానగర్‌ ప్రాంతాల్లో సర్వే ప్రారంభించనున్నారు. దశల వారీగా ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాట తెలిపారు. సిబ్బందికి వివరాలు ఇచ్చి పౌరులు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లపై ఫిర్యాదుల నేపథ్యంలో ఆస్తిపన్ను మదింపునకు మాన్యువల్‌గా దరఖాస్తు విధానం నిలిపివేశారు. ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ అసెస్‏మెంట్‌ పద్ధతిని కొనసాగించారు. దీంతో గతంతో పోలిస్తే మదింపు జరుగుతున్న భవనాల సంఖ్య తగ్గిందని, ఈ ప్రభావం ఆదాయంపైనా పడుతోందని భావించిన జీహెచ్‌ఎంసీ మాన్యువల్‌(GHMC Manual)గా దరఖాస్తుల స్వీకరణను తిరిగి ప్రారంభించింది. సర్కిల్‌, జోనల్‌ కార్యాలయాల్లో పౌరుల నుంచి అసెస్‏మెంట్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు పన్ను చెల్లించని భవనాలను గుర్తించి దరఖాస్తు చేసుకోవాలని యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. డ్రోన్‌, క్షేత్రస్థాయి సర్వే నేపథ్యంలో యజమానుల నుంచి అసె్‌సమెంట్‌ దరఖాస్తులు తీసుకుంటున్నారు

డ్రోన్‌, క్షేత్రస్థాయి సర్వేతో భవనాల పక్కాగా లెక్క తేలడంతోపాటు.. ఎన్ని నిర్మాణాల నుంచి పన్ను వసూలవుతోంది..? ఇప్పటికీ మదింపు జరగని భవనాలెన్ని..? అన్న దానిపై స్పష్టత రానుంది. నివాస కేటగిరీలో పన్ను చెల్లిస్తు.. నివాసేతర అవసరాలకు వినియోగిస్తోన్న నిర్మాణాలనూ గుర్తిస్తారు.

శాటిలైట్‌ చిత్రాలతోపాటు, డ్రోన్‌ సర్వే ద్వారా ఏరియాల వారీగా భవనాలు, ఎన్ని అంతస్తులున్నాయన్నది తేలుతుంది. భవన నిర్మాణ విస్తీర్ణం ఎంత..? పన్ను ఎంత విస్తీర్ణానికి చెల్లిస్తున్నరనేది నిర్ధారించేందుకు కొలతలూ తీసుకుంటారని రెవెన్యూ విభాగం అధికారొకరు తెలిపారు. వీటి ఆధారంగా సవరణ మదింపు చేపడతారు. నిర్ణీత స్థాయి కంటే ఎవరైనా ఎక్కువ పన్ను చెల్లిస్తోన్నా.. దానినీ సవరిస్తారు. అనుమతి లేని నిర్మాణాలకు 100 శాతం పెనాల్టీ విధిస్తారు.

ఇప్పటి వరకు మదింపు జరగని భవనాలను పన్ను పరిధిలోకి తీసుకువచ్చి జీహెచ్‌ఎంసీ చట్టం 1955 ప్రకారం ఒకటిన్నర నుంచి రెండున్నర సంవత్సరాల పెనాల్టీతో పన్ను నిర్ణయిస్తారు. ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుండా వ్యాపారం చేస్తోన్న సంస్థల లెక్కలూ సర్వేతో తేలనున్నాయి.

ప్రస్తుతం 80 వేల ట్రేడ్‌ లైసెన్స్‌లు ఉండగా.. వీటి సంఖ్య రెండు లక్షలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కూలిన భవనాల పీటీఐఎన్‌లూ సర్వే అనంతరం తొలగించే అవకాశముంది. దీంతో ప్రస్తుతం గ్రేటర్‌లో ఎన్ని భవనాలున్నాయి..? మదింపు జరిగినవి..? ఎంత మంది పన్ను చెల్లిస్తున్నారు..? అన్న దానిపై స్పష్టత రానుంది

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 14:04

అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసా

కొండచరియలు విరిగిపడటంతో వయనాడులో పరిస్థితి భీతావాహంగా మారింది. మెప్పాడిలో గల పలు ప్రాంతాల్లో కొండచరియలు నేరుగా ఇళ్లపై పడ్డాయి. దీంతో 24 మంది వరకు చనిపోయారని అధికారులు ప్రకటించారు.

వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కేరళ ప్రభుత్వం ఆర్మీ సాయం కావాలని కోరింది.

కొండచరియలు విరిగిపడటంతో వయనాడులో (Wayanad) పరిస్థితి భీతావాహంగా మారింది. మెప్పాడిలో గల పలు ప్రాంతాల్లో కొండచరియలు నేరుగా ఇళ్లపై పడ్డాయి.

దీంతో 43 మంది వరకు చనిపోయారని అధికారులు ప్రకటించారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కేరళ ప్రభుత్వం ఆర్మీ సాయం కావాలని కోరింది. దాంతో భారత ఆర్మీ రంగంలోకి దిగింది. కొండచరియలు విరిగిపడటంతో మండక్కై, చూరల్‌మాల, అట్టమాల, నూల్పూజ గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా మారింది

వయనాడులో కొండచరియల బీభత్సం సృష్టించడంతో ఆర్మీ 225 మంది సిబ్బందిని పంపించింది. వీరిలో వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎంఐ-17, ఏఎల్‌హెచ్ హెలికాప్టర్ల సేవలను వినియోగిస్తున్నారు.

పరిస్థితి తీవ్రతత దృష్ట్యా భారత నౌకాదళం సేవలను వినియోగించుకుంటామని కేరళ మంత్రి వీణ జార్జ్ ప్రకటించారు. కొండచరియల విరిగిపడటంతో మలప్పురంలోని నీలంబర్ ప్రాంతానికి వెళ్లే వంతెన కొట్టుకొని పోయింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 13:59

కాంగ్రెస్‌కు షాక్.. BRS గూటికి గద్వాల ఎమ్మెల్యే

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ఇవాళ తిరిగి ఆయన సొంత గూటికి చేరుకున్నారు. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే ఆయన సొంతగూటికి చేరుకున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. పది మంది ఎమ్మెల్యేలు వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.

అయితే అనుహ్యంగా ఆయన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు రెండో విడత రుణమాఫీ కార్యక్రమం జరగుతున్న సమయంలోనే బండ్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు.

అసెంబ్లీలోని బీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్‌కు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో తాను ఇమడలేక పోతున్నట్లు ఆయన వెల్లడించనట్లు సమాచారం. కాగా, బండ్ల చేరికను కేటీఆర్ స్వాగతించారు. కేటీఆర్‌తో సమావేశం అనంతరం బండ్ల మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. తాను తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నట్లు వెల్లడించారు. త్వరలోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎంను కలవనున్నట్లు బండ్ల వెల్లడించారు. ఓ వైపు సీఎం రేవంత్ సహా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొనగా.. అనుహ్యంగా బండ్ల యూ టర్న్ తీసుకోవటం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది.

నెల తిరక్కుండానే యూటర్న్..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల శాసనసభ నియోజకవర్గం నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు.

అయితే ఇటీవల ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి అధికార పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యకర్తలు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు వెల్లడించారు.

అయితే ఆయన పార్టీ మారి నెల రోజులు కాకముందే యూటర్న్ తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని అధికార పార్టీ నేతలు చెబుతున్న తరుణంలో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే తిరిగి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం చర్చనీయాంశమైంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 13:28

గ్రేటర్ చుట్టుపక్కల HMDA పూలింగ్ ప్రాజెక్ట్స్ !

హైదరాబాద్ చుట్టుపక్కల హౌసింగ్ ప్రాజెక్టుల్ని పెంచేందుకు హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అధారిటీ.. కొత్త ప్రయత్నాలు చేస్తోంది. కొత్త లే-అవుట్లను డెవలప్‌ చేయాలని నిర్ణయించుకుంది. రైతుల నుంచి పూలింగ్ పద్దతిలో భూములను సేకరించి డెవలప్ చేసి.. తన వాటాగా వచ్చిన భూమిని విక్రయించి ఆదాయం పెంచుకోవాలనుకుంటోంది.

నిజానికి ఏపీ రాజధాని అమరవతికి పూలింగ్ పద్దతి సక్సెస్ అయిన తర్వాత హెచ్‌ఎండీఏ కూడా అదే చేయాలనుకుంది. కానీ ల్యాండ్ డెవలప్‌మెంట్‌లో తమ వాటా పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌కు గత సర్కార్‌ ఓకే చెప్పడంతో రైతుల వాటా 60శాతానికి పెరిగింది.

హెచ్‌ఎండీఏకు ఇవ్వడం వల్ల.. రైతులకు అనేక మేళ్లు జరుగుతాయి. భూములు ఇచ్చే వారికి ఆర్ధికపరమైన ఇబ్బందులు రాకుండా అన్ని రకాల అనుమతుల వ్యవహారాలను హెచ్‌ఎండీఏ పర్యవేక్షిస్తుంది. సాధారణంగా వ్యవసాయ భూములను లే-అవుట్లుగా మార్చాలంటే నాలా చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

కాని హెచ్‌ఎండీఏకు భూములు అప్పజెప్పితే వాటికి నాలా చార్జీలతో పాటు పాటు ల్యాండ్ యూజ్ కన్వర్షన్ చార్జీలను హెచ్‌ఎండీఏ భరిస్తుంది. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ ఖర్చులు సైతం హెచ్‌ఎండీఏ చెల్లించాలని నిర్ణయించడంతో రైతులపై భారం మరింత తగ్గనుంది.

ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ల వద్ద ఎక్కువ లే-అవుట్లు ఉండేలా హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రెడీ చేసుకుంది. హెచ్‌ఎండీఏ అమ్ముతుంది కాబట్టి లిటిగేషన్ లేని ల్యాండ్ లభిస్తుంది. అందుకే కార్పొరేట్ సంస్థలు అందులో కొనుగోలుకు ఆసక్తి చూపుతాయి. అలాగే మధ్యతరగతి ప్రజలకూ అందుబాటులో ఉంటే ఇళ్ల స్థలాలను కూడా హెచ్‌ఎండీఏ రెడీ చేయనుంది. ఇప్పటికే సిటీ చుట్టూ ఉండే ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా భూమిని డెవలప్‌మెంట్‌ కోసం అధికారులు గుర్తించారు.

మొత్తంగా హైదరాబాద్ చుట్టూ దాదాపు 11వేల ఎకరాల భూమిని హెచ్‌ఎండీఏ సేకరించి డెవలప్ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. హెచ్‌ఎండీఏ. ఇలా చేయడం ద్వారా ఇటు ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు…

ప్రజలకు క్లియర్ టైటిల్ ఉండే భూములు సరైన ధరల్లో దొరికేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టు ఎంత వేగంగా ముందుకు వెళ్తే అంతే వేగంగా హైదరాబాద్ నగరం ఔటర్ చుట్టూ విస్తరిస్తుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jul 30 2024, 13:23

పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కారుపై దాడి, ఖండించిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌

ఆకతాయిలు రాళ్లు రువ్వడంతో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కారు అద్దాలు పగిలిపోయాయి. సోమవారం సాయంత్రం బర్రింకల పాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వాహనం గ్రామంలో వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో కారు అద్దాలు పగిలిపోయాయి.

ఎమ్మెల్యే వాహనంపై దాడి చేశారని డ్రైవర్‌ ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ప్రతాప్ కిషోర్ స్పందించారు. పోలవరం డిఎస్పి సురేష్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో జీలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ విచారణ జరిపారు.

కారు అద్దాల పగిలిన ప్రదేశంలో అంతగా అనుమానించాల్సిన పరిస్థితులు లేవని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనలో పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు పోలీసు అధికారులు సన్నద్ధం అయ్యారు.

కారు పై రాయి పడడంతో వెనకగా ఉన్న అద్దాలు బ్రేక్ అయ్యాయి. సంఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో హాస్టల్ భవనాలు ఉన్నాయి

సోమవారం రాత్రి పోలవరం ఎమ్మెల్యే కారులో డ్రైవర్, వ్యక్తిగత సహాయకులు వెళుతుండగా బర్రింకలపాడు జంక్షన్ దగ్గర ఒక రాయి కార్ వెనుక మిర్రర్ కి తగిలి కార్ అద్దం పగిలింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కలుగలేదని పోలీసులు ప్రకటన విడుదల చేవారు.

ఘటన జరిగిన ప్రదేశంలో వసతిగృహం ఉందని తెలిపారు. ఆకతాయిలు విసిరిందా, ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా విసిరారా అన్నది పోలీస్ లు విచారిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని పోలవరం డిఎస్పీ తెలిపారు.

పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వాహనంపై చోటు చేసుకున్న రాళ్ళ దాడిని డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ ఖండించారు. బర్రింకలపాడు గ్రామంలో కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని దాడి సమయంలో ఎమ్మెల్యే బాలరాజు వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హాని జరగలేదని తెలిపారు. ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.