నిజందాగదుక్షణంఆగదు

Jul 22 2024, 07:32

నిఫా వైరస్‌పై అప్రమత్తమైన కేంద్రం...

నిఫా వైరస్‌పై అప్రమత్తమైన కేంద్రం

కేరళ రాష్ట్రానికి ప్రత్యేక వైద్య బృందం

కేరళలో మల్లప్పురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు మృతి.

కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి అందరి శాంపిల్స్‌ సేకరణ

కొజికోడ్‌కు BSL-3 మొబైల్ ల్యాబ్ పంపిన కేంద్రం

నిఫా మరణాలతో క్వారంటైన్ చర్యలకు కేంద్రం ఆదేశం

నిజందాగదుక్షణంఆగదు

Jul 22 2024, 07:23

విద్యా, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి...

విద్యా, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి.

విద్యతోనే సమాజ మార్పు సాధ్యమని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి చెప్పారు . విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. మనదేశంలో ప్రైమరీ స్కూల్స్ పై ఇప్పటికీ ప్రభుత్వాలకు , ప్రజలకు ఒక స్పష్టత లేదన్నారు.

 జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఆంధ్ర మహిళా సభ డిగ్రీ ఉమెన్స్ కళాశాల ఆధ్వర్యంలో.... విద్యా, వైద్య రంగాలు - సవాళ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు ముఖ్యఅతిథిగా హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి మాట్లాడుతూ.... విద్యార్థుల్లో చిన్నప్పటినుంచి శాస్త్రీయ ఆలోచనను పెంపొందించేలా పాఠ్యాంశాలు ఉండాలని, ఇందుకు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. విద్యారంగానికి ప్రభుత్వాలు తమ బడ్జెట్లో కేటాయించాల్సిన స్థాయిలో నిధులను కేటాయించడం లేదని అన్నారు. విద్యకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. ప్రాథమిక విద్యనుంచే విద్యార్థుల్లో శాస్త్రీయ భావాలను పెంపొందించేలా పాఠ్యపుస్తకాలను రూపొందించాలని కోరారు. యూనివర్సిటీ స్థాయిలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు సైతం అశాస్త్రీయ పద్ధతులను పాటించడం ఏంటని ప్రశ్నించారు. యువత ఎక్కువగా సాంకేతిక విద్య పట్ల ఆసక్తి చూపుతోందని.. ఇది ఏ మాత్రం మంచిది కాదన్నారు. సామాజిక అంశాలను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఆర్ట్స్ ,సైన్స్ సమాజ అభివృద్ధికి దోహదం చేస్తాయని... కావున విద్యార్థులు సాంకేతిక విద్య కే ప్రాధాన్యత కాకుండా సామాజిక అంశాలకు కూడా ఎంచుకోవాలని కోరారు.

 జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.... సమాజంలో పేదలకు సరైన న్యాయం అందడం లేదన్నారు. చట్టం ఒకటే అయినా అది అందరికీ సమానంగా అందడం లేదన్నారు. పేదలకు ఒకలా, ధనవంతులకు మరోలా న్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రముఖ కార్డియాలజిస్ట్ విరించి విరివింటి మాట్లాడుతూ.... ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతని చెప్పారు. కానీ ప్రభుత్వాలు ఈ బాధ్యతనుండి క్రమంగా తప్పుకుంటున్నాయని చెప్పారు. చిన్న చిన్న రోగాలకు కూడా పేదలు కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని చెప్పారు. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం ఫలితంగా.... పేదలు చిన్న చిన్న వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సర్కార్ ఆస్పత్రులను బలోపేతం చేయాలని.. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కోయ వెంకటేశ్వర్ రావు, టి. శ్రీనాథ్, రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య, వెంకటరమణారెడ్డి, జితేందర్, చెలిమెల రాజేశ్వర్, ప్రొఫెసర్ బి.యన్.రెడ్డి, డాక్టర్ రమాదేవి, ఎస్పీ లింగస్వామి , రవీంద్రబాబు ,భీమేశ్వర్, ఆంధ్ర మహిళా సభ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ పి. రజిని ,ప్రిన్సిపల్ డాక్టర్ K. ఝాన్సీ రాణి, అధ్యాపకులు డాక్టర్ K. కరుణాదేవి డాక్టర్ వై. వసుంధర సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jul 20 2024, 20:26

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ..

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ..

రవాణ, హౌసింగ్‌, జీఏడీ స్పెషల్ సీఎస్‌గా వికాస్‌రాజ్

జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా మహేష్‌ దత్‌

గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌గా ఎ.శరత్‌

గిడ్డంగుల కార్పొరేషన్‌ ఎండీగా కొర్రా లక్ష్మి

రెవెన్యూశాఖ స్పెషల్‌ సెక్రటరీగా ఎస్‌.హరీష్‌

మేడ్చల్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌గా రాధిక గుప్తా

నిజందాగదుక్షణంఆగదు

Jul 20 2024, 20:16

నల్లగొండ: రేపు ఆదివారం చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగే ఆరోగ్య అవగాహన సదస్సును విజయవంతం చేయండి...

ఆరోగ్య అవగాహన సదస్సును విజయవంతం చేయండి..

మన ఆరోగ్యం మన చేతుల్లో వంటిల్లే వైద్యశాల,

.అన్ని వ్యాధులకు పరిష్కారం ప్రకృతితోనే సాధ్యం

ఏచూరి శైలజ, ఐ బీ సీ ఛానల్ యం డీ, 

లోకనబోయిన రమణ ముదిరాజ్, మత్స్య కారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు,

నల్లగొండ పట్టణంలోని చిన్న వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన మీడియా సమావేశంలో ఐ భి సి ఛానల్ అధినేత ఏచూరి శైలజ భాస్కర్, మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన రమణ ముదిరాజ్ , బొమ్మపాల గిరిబాబు,పాముల అశోక్ లు మాట్లాడుతూ ఈ నెల తేదీ 21 ఆదివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నల్లగొండ లోని చిన వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగే ఆరోగ్య అవగాహన సదస్సుకు అత్యధిక సంఖ్యలో విచ్చేసి నిత్యజీవితంలో మనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు ఎలా అధిగమించవచ్చో తెలుసుకోవచ్చని మన వంటింట్లోనే ఉన్న నిత్యం మనం వాడే దినుసులు కరివేపాకు మునగాకు తదితర చాలా రకాలతో ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి? పెస్టిసైడ్స్ వాడకుండా మన పెరట్లో కురాగాయల సాగుతో ఏ విధంగా ఆరోగ్యంగా జీవించొచ్చు, ఇలా ప్రస్తుత కాలంలో ప్రతి ఆహార పదార్ధము కల్తే జరుగుతుందని వీటన్నిటికీ పరిష్కారాలు మనకు ఆ రోజు ఆరోగ్య సదస్సులో దొరుకుతాయి కావునా ప్రతి ఒక్కరూ తప్పక రావాలని విజ్ఞప్తి చేశారు

ఇట్టి కార్యక్రమంలో కందిమల్ల నాగమణి,ముక్కామల నరసింహ,ఎం డీ అజీజ్ షరీఫ్, రవీందర్ రెడ్డి, రమేష్, మహేశ్ తదితరులు పాల్గోన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jul 20 2024, 20:03

నిజామాబాదు జిల్లా ఆస్పత్రిలో చిన్నారి కిడ్నాప్...

నిజామాబాదు జిల్లా ఆస్పత్రిలో చిన్నారి కిడ్నాప్...

నిజామాబాద్ జిల్లాఆస్పత్రిలో చిన్నారి కిడ్నాప్ కేసు

బాలుడి ఆచూకీ కోసం మూడు బృందాలు ఏర్పాటు

చిన్నారిని ఆర్మూర్ వైపు ఎత్తుకెళ్లినట్టు గుర్తింపు

కిడ్నాపర్ల కోసం గాలిస్తున్న పోలీసులు

నిజందాగదుక్షణంఆగదు

Jul 20 2024, 19:50

తెలంగాణలో మరో రెండు రోజులు విస్తారంగా వర్షాలు.. రెవెన్యూ అధికారులకు,సిబ్బందికి సెలవులు రద్దు..

తెలంగాణలో మరో రెండు రోజులు విస్తారంగా వర్షాలు

రెవెన్యూశాఖలో అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు

ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లతో మాట్లాడిన పొంగులేటి

కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి-పొంగులేటి

గోదావరి పరివాహక ప్రజలను అప్రమత్తం చేయాలి-పొంగులేటి

నిజందాగదుక్షణంఆగదు

Jul 20 2024, 18:48

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలలో ప్రాజెక్టులకు వరద పోటు...

తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు వరద పోటు.. భారీ వర్షాలతో ప్రాజెక్టులు, వాగులు, చెరువులకు పెరుగుతున్న వరద..

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు పెరిగిన వరద..

భద్రాచలం వద్ద 33 అడుగుల స్థాయికి చేరిన గోదావరి నీటిమట్టం..

రాత్రికి 41 అడుగుల స్థాయికి గోదావరి నీటిమట్టం.. ఆల్మట్టి, తుంగభద్ర, నారాయణపూర్‌ ప్రాజెక్టులకు భారీగా వరద.. తెరచుకున్న నారాయణపూర్‌ ప్రాజెక్టు గేట్లు.

నిజందాగదుక్షణంఆగదు

Jul 20 2024, 18:37

భద్రాచలం: చర్ల:లింగాపురం కొత్తపల్లి గోంపల్లి పంచాయతీల రహదారిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్...

లింగాపురం కొత్తపల్లి గోంపల్లి పంచాయతీల రహదారిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్..

చర్ల మండలం లింగాపురం కొత్తపల్లి గొంపల్లి ఈ మూడు గ్రామాలకు రహదారి లేకపోవడం చిన్నవర్షం పడ్డ ఈతవాగు రావడంతో, ప్రజలకు విద్యార్థులకు వృద్ధులకు రైతులకు రాకపోకలు బంద్ అయి తీవ్ర ఇబ్బందులకు ఎదురుకుంటున్నరని *సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు.

నేడు గ్రామలలోని ముఖ్యులతో పెద్ద మనుషులతో ఈత వాగును, ఆ మూడు గ్రామాల రహదారులను వారు సందర్శించి ప్రసంగించారు. సతీష్ మాట్లాడుతూ ఈ మూడు గ్రామపంచాయతీలు ఏజెన్సీలో వెనకబడ్డ ప్రాంతాలని ఇక్కడ ప్రజలకు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ఉందని అలాంటి ప్రజలు వర్షం రావడంతో కాలువలు పొంగి పొర్లడంతో ప్రజలు రాకపోకలు బంద్ అయి కనీస సౌకర్యాలు లేక సరుకులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. ఈ మూడు పంచాయతీల చుట్టూ గోదావరి ముంపు పొంచి ఉందని ప్రతి ఆట గోదావరి వచ్చి ఇల్లులు నీట మునుగుతున్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే వరద బాధితులకు ఎత్తైన ప్రదేశాలలో పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలని వారు అన్నారు భారత్ వెలుగుతోందని,అభివృద్ధి చెందుతుందని చెబుతూనే ఈ పాలకులు ఏజెన్సీ ప్రాంతాలని చిన్న చూపు చూస్తూ కనీసం చిన్న మోరీలు కూడా కట్టకపోవడంతో రహదారులు లేకపోవడంతో అనారోగ్యాల పాలైనటువంటి వారు గర్భవతులు మహిళలు అనేకమంది ఇబ్బందులకు గురవుతూ ఈ వర్షాకాలంలో వైద్యం అందక మరణిస్తున్నారని వారు అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు వేయాలని హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని వైద్య సౌకర్యాలు కల్పించాలని రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీగా తెలియజేస్తున్నాం ఈ మూడు పంచాయతీల కలిపి హై లెవెల్ బ్రిడ్జి నిర్మించకపోతే దశల వారి ఆందోళన చేస్తామని వారి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మహిళలు యువకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jul 20 2024, 16:55

గత కొద్ది సంవత్సరాలుగా ఉద్యోగ బదిలీ కాకుండా ఒకే చోట తిష్ట వేసి విధులు నిర్వహిస్తున్న హాస్టల్ వార్డన్ని వెంటనే బదిలీ చేయాలని కలెక్టర్కు వినతి..

గత కొద్ది సంవత్సరాలుగా ఉద్యోగ బదిలీ కాకుండా ఒకే చోట తిష్ట వేసి విధులు నిర్వహిస్తున్న హాస్టల్ వార్డన్ని వెంటనే బదిలీ చేయాలని కలెక్టర్కు వినతి..

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం

       

ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం బదిలీ చేయుట గురించి 

షెడ్యూల్ కులముల సంక్షేమ వసతి గృహము (ఏ) కాలేజ్ మహిళా హాస్టల్ నల్గొండ లోకల్ వార్డెన్ గా పనిచేస్తున్నటువంటి ఎస్ రమ్య సుధా విధులు నిర్వహిస్తుంది ప్రభుత్వ ఉత్తర్ల ప్రకారం బదిలీ కావాల్సి ఉన్నందున బదిలీ కాకుండా టీఎన్జీవోస్ నల్గొండ శాఖలో జిల్లాలో ఒక పదవిని అడ్డుపెట్టుకొని కదలకుండా నలగొండలో లోకల్ 12 సంవత్సరాలుగా ఒకే స్థానంలో పనిచేస్తూ జిల్లా శాఖ పదవిని అడ్డుపెట్టుకొని బదిలీ జరగకుండా నిలుపుదల చేసుకున్నది.

ఇది చట్ట విరుద్ధం కేవలం సంఘం జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కి ఇరువురికి మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుంది ఆరు సంవత్సరాలు దాటితే ఎవరైనా టీఎన్జీవోస్ నాయకులు అయిన సభ్యులైన తప్పక బదిలీ కావాల్సిందే వార్డెన్ ఎస్ రమ్య సుధ లిస్టులో స్పాస్ కూడా చూపించి సంఘ సభ్యత అడ్డుపెట్టుకొని నల్గొండలో ఉన్న చోటే ఉండడానికి ప్రయత్నిస్తుంది ఆమె స్పోజ్ కోట చూపించింది కావున ఆమె భర్త నల్గొండ జిల్లా పరిధిలో పనిచేస్తూ ఉంటే ఆ ప్రాంతానికి వెళ్లవలసి ఉంది అలా వెళ్లకుండా ప్రస్తుతం పని చేస్తున్న అదే స్థానంలో లోకల్ కాలేజ్ హాస్టల్ పనిచేయడం చట్ట విరుద్ధం ఈమధ్య రెండు సంవత్సరాల కాలంలోనే ఆమె భర్త పౌస్ కోట చూపించి కనగల్ మండలంలో స్కూల్ కి రావడం జరిగింది.

ఆమె భర్త పౌసే కోట ఉపయోగించుకున్నందున మరల 2 సారి స్పౌజ్ కోట ఉపయోగించుకోవడానికి అవకాశం లేనందున టిఎన్జి తరఫున తప్పుడు సర్టిఫికెట్ ఉపయోగించి గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న చోట మరలా ఉండేందుకు వార్డెన్ ఎస్ రమ్య సుధా గారు ప్రయత్నిస్తున్నారు ఒకే చోట ఎక్కువ రోజులు పనిచేయడం వలన అవినీతికి పాల్పడంతో పాటు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది గతంలోనే టీఎన్జీవో స్పౌజ్ కోట రెండుసార్లు వినియోగించుకుంది కావున వెంటనే బదిలీ చేయాలి ప్రభుత్వం ఈ రెండు రోజుల క్రితం హైదరాబాదులో షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయం ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్లో నల్గొండ జిల్లాలో 47 మంది వార్డెన్స్ ఉంటే 46 మందిని ట్రాన్స్ఫర్స్ బదిలీ కల్పించి నందున వారితో సమానంగా ఈమెని కూడా 12 సంవత్సరాల లాంగ్ స్టాండ్ అయినందున బదిలీ చేసి సమాన న్యాయం చేయాలని కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పి ప్రభుత్వ ఉత్తర్ల ప్రకారం వార్డెన్ ఎస్ రమ్య సుధా వార్డెన్ గారిని బదిలీ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా ధనావత్ అజయ్ మరియు కుమార్ జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Jul 18 2024, 17:59

బ్రేకింగ్: రైతులకు పంట రుణమాఫీ నిధులు విడుదల..

బ్రేకింగ్:

రైతులకు పంట రుణమాఫీ నిధులు విడుదల

నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

11.5 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నగదు జమ

రైతుల ఖాతాల్లోకి రూ.7 వేల కోట్లు

నేడు రైతులకు లక్ష వరకు రుణమాఫీ

ఈ నెలాఖరులోపే లక్షన్నర వరకు రుణమాఫీ