నిజంనిప్పులాంటిది

Jun 26 2024, 16:37

అయోధ్య గర్భగుడిలో నీటి లీకేజి !

- స్పష్టత ఇచ్చిన ఆలయ కమిటీ 

అయోధ్య రామమందిరం (Ayodhya Ram Temple) గర్భగుడి నుంచి వర్షపు నీరు లీకవుతోందన్న (roof leak) వార్తలపై రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా (Nripendra Mishra) స్పందించారు. ఈ మేరకు ఆలయ ప్రధాన పూజారి ఆరోపణలను తోసిపుచ్చారు.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించిన రామమందిరం (Ayodhya Ram Temple) ప్రారంభోత్సవం జరుపుకొని సరిగ్గా అర్ధ సంవత్సరం కూడా పూర్తి కాకముందే.. ప్రధాన గర్భాలయంలో నీరు లీకవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. చిన్నపాటి వర్షానికే ఆలయం పైకప్పు నుంచి నీరు కారుతోందని ఆలయ ప్రధాన ఆర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్‌ పేర్కొన్నారు. అయితే గర్భగుడి నుంచి వర్షపు నీరు లీకవుతోందన్న (roof leak) వార్తలపై రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా (Nripendra Mishra) స్పందించారు. ఈ మేరకు ఆలయ ప్రధాన పూజారి ఆరోపణలను తోసిపుచ్చారు. పైకప్పు లీక్‌ కాలేదని స్పష్టం చేశారు.

విద్యుత్‌ తీగల కోసం అమర్చిన పైపుల ద్వారా నీరు కిందకు వచ్చిందని వివరించారు. ‘ఆలయంలో నీటి లీకేజీ లేదు. అయితే, విద్యుత్‌ తీగల కోసం అమర్చిన పైపుల నుంచి వర్షం నీరు ఆలయంలోపలికి వచ్చింది. ఆలయ భవనాన్ని నేనే స్వయంగా పరిశీలించాను. రెండో అంతస్తు నిర్మాణంలో ఉంది. రెండో అంతస్తు పైకప్పు పూర్తైతే వర్షం నీరు ఆలయంలోకి రావడం ఆగిపోతుంది’ అని నృపేంద్ర మిశ్రా విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.

కాగా, సోమవారం అర్ధరాత్రి జల్లులు పడిన తర్వాత పైకప్పు ద్వారా ఆలయ గర్భగుడిలోకి వర్షపు నీరు వచ్చిందని ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. రామ్‌లల్లా విగ్రహం ముందు పూజారి కూర్చునే స్థలం, వీఐపీ దర్శనం కోసం భక్తులు వచ్చే ప్రదేశం వరకూ పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్‌ అవుతోందన్నారు. ‘దేశం నలుమూలల నుంచి వచ్చిన ఇంజినీర్లు రామమందిరాన్ని నిర్మిస్తుండటం చాలా ఆశ్చర్యంగా ఉంది. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించారు. కానీ వర్షం పడితే పైకప్పు లీక్‌ అవుతుందని ఎవరకీ తెలియదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవాలయం పైకప్పు లీక్ అవడం ఆశ్చర్యంగా ఉంది. ఇలా ఎందుకు జరిగింది..? ఇంత పెద్ద ఇంజనీర్ల సమక్షంలోనే ఇలాంటి ఘటన జరగడం చాలా పొరపాటు’ అని అన్నారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు స్పందించి లీకేజీని అరికట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆలయం నుంచి నీరు బయటకు వెళ్లేలా చూడాలని కోరారు.

1800 కోట్లతో ఆలయ నిర్మాణం !

ఆయోధ్య ఆలయ ప్రారంభోత్సవాన్ని ఈ ఏడాది జనవరి 22న ఎంతో అర్భాటంగా నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దీన్ని బీజేపీ తన సొంత కార్యక్రమంలా నిర్వహించిందనే విమర్శలు ఉన్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. రాజకీయ, సినిమా, పరిశ్రమ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు చూసేందుకు లైవ్‌ ఏర్పాట్లు కూడా చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నేతృత్వంలో చేపట్టిన ఈ రామ మందిర నిర్మాణ అంచనా వ్యయం రూ.1,800 కోట్లుగా ఉన్నది. ఆలయ నిర్మాణం, అనంతర నిర్వహణ కోసం ట్రస్టుకు దాతల నుంచి దాదాపు రూ.3,500 కోట్ల మేర వచ్చాయి.

నిజంనిప్పులాంటిది

Jun 26 2024, 15:35

2 రాష్ట్రాలు... 2 నాలుకలు...

హర్యానాలో తమ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి బీజేపీలోకి మారడంతో ఆమెను ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌ కు లేఖ రాసింది... 

కానీ తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుంది..

హర్యానా లో పార్టీ మారితే వేటు వేయాలని కోరుతున్న కాంగ్రెస్ తెలంగాణలో ఎందుకు మౌనంగా ఉంది

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Jun 26 2024, 11:41

లోక్ సభ స్పీకర్ గా రెండోసారి ఓం బిర్లా ఎన్నిక..

18వ లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. స్పీకర్ కుర్చీలో ఓం బిర్లాను ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూర్చొబెట్టారు..

ఎన్డీయే తరఫున లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాణి ఓటుతో లోక్ సభ స్పీకర్ ఎంపిక చేశారు..

Streetbuzz News

Real Time News Platform

నిజంనిప్పులాంటిది

Jun 26 2024, 10:56

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గుమ్మళ్ళ సృజన

ప్రతిష్టాత్మక జిల్లాలో పనిచేయటం ఆనందంగా ఉంది..

గతంలో కూడా జిల్లాలో పని చేసిన అనుభవం ఉంది

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటాం

అధికారులు తో సమీక్ష నిర్వహిస్తాం

గతం లొ ఎన్టీఆర్ జిల్లాలో పని చేసిన అనుభవం వుంది 

రాష్ట్రం లోనే అత్యంత ప్రతిష్టత్మకమైన జిల్లాలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను 

ఎన్టీఆర్ జిల్లా కు దేశ వ్యాప్తంగా మంచిపేరు వచ్చే విదంగా సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తాను అని తెలిపారు

నిజంనిప్పులాంటిది

Jun 25 2024, 21:42

షర్మిలని తప్పించండి... కాంగ్రెస్ లో విలీనం చేస్తా

డీకే ముందు ఆఫర్ పెట్టిన జగన్..? 

11 సీట్లకే పరిమితమై ఘోర పరాజయం అయిన జగన్ రెడ్డి, ఇక తన మనుగడ కష్టమని భావిస్తున్నారు. చంద్రబాబు పక్కన మోడీ ఉండటం, తనపైన సిబిఐ, ఈడీ కేసులతో పాటు, బాబాయ్ మర్డర్ కేసు కూడా వేలాడుతూ ఉండటంతో, జాతీయ పార్టీ సాయం లేనిదే బ్రతికి బట్టకట్టటం ఇక సాధ్యం కాదని భావించిన జగన్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటానికి సిద్ధం అయ్యారు.

ఇందుకు బెంగుళూరు వేదికగా జగన్ చర్చలు జరుపుతున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, డీకే శివకుమార్ తో నిన్న రాత్రి భేటీ అయిన జగన్,

కాంగ్రెస్ నుంచి షర్మిలని తరిమేస్తే, తాను కాంగ్రెస్ లో విలీనం చేసేస్తా అని ఆఫర్ ఇచ్చారు. దీని పై హైకామాండ్ తో చర్చించి నిర్ణయం చెప్తామని డీకే చెప్పినట్టు తెలుస్తుంది.

ఇటు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే చంద్రబాబు నుంచి, అక్కడ హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉంటే రేవంత్ నుంచి ఇబ్బందులు ఉంటాయని, ఇంటలిజెన్స్ ద్వారా మొత్తం లాగేస్తారని భావిస్తున్న జగన్, ఇక నుంచి బెంగుళూరు యలహంకా ప్యాలెస్ లోనే ఉండనున్నారు. అందుకే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. చూడాలి పరిణామాలు ఎలా మారతాయో.

నిజంనిప్పులాంటిది

Jun 25 2024, 20:04

అనుమతుల్లేని ఎస్పిఆర్ పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలి

•బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు : అయితగోని జనార్దన్ గౌడ్

 బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఎలాంటి అనుమతులు లేకుండా నల్గొండ జిల్లా కేంద్రంలో దేవరకొండ రోడ్ లో ఎస్. పి .ఆర్ హైస్కూల్ పేరుమీద పాఠశాలను చలాయిస్తున్నారు.

దీనికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తున్న పాఠశాల యజమానియం పైన చట్టపరమైన చర్యలు తీసుకొని విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని విద్యాశాఖ అధికారి గారిని కోరుతున్నాము.

తన ఇష్టానుసారంగా ప్రవేట్ పాఠశాలలను నెలకొల్పి పేద విద్యార్థుల నుండి లక్షల రూపాయలను దండుకుంటున్న ప్రైవేట్ పాఠశాలల యజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాము జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్ పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చాలాఇస్తున్నారు.

తక్షణమే జిల్లా కలెక్టర్ గారు చరువచూపి ఇలాంటివి ఎక్కడున్నా తక్షణమే సీజ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం.

ఈ కార్యక్రమంలో బిసి రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి ,విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు కొంపల్లి రామన్న గౌడ్ ,సహదేవ్, ప్రమోద్, మహేష్ ,పృద్వి, సాయి ,రామ్ చరణ్ ,మల్లికార్జున్ ,హరికృష్ణ ,తరుణ్, రవి ,రాజు తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 25 2024, 11:30

వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్న పవన్ కల్యాణ్

అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఈరోజు నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు.

11 రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో భాగంగా పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు..

గత ఏడాది జూన్‌లో పవన్‌ వారాహి విజయ యాత్ర చేపట్టారు.

ఆ యాత్ర సందర్భంలోనూ అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు..

నిజంనిప్పులాంటిది

Jun 25 2024, 11:08

నేటి నుంచి చంద్రబాబు కుప్పం టూర్

నేటి నుంచి రెండు రోజుల పాటు సిఎం చంద్రబాబు కుప్పం టూర్ ఉండనుంది. ఇవాళ మ.12.30 గం. లకు పి ఈ ఎస్ మెడికల్ కాలేజీ హెలిప్యాడ్, కుప్పంకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు..

మ.12.55 గం. శాంతిపురం జల్లిగానిపల్లి గ్రామం నందు లకు హెచ్ ఎన్ ఎస్ ఎస్ కాలువ పరిశీలన చేస్తారు.

మ.1.35 గం. లకు శాంతిపురం మండలం చిన్నారి దొడ్డి గ్రామంలో హెచ్ ఎన్ ఎస్ ఎస్ కాలువ పరిశీలన…. మ.02.10 గం. లకు కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహంలో విరామం తీసుకుంటారు. ఇక మ.3.00 గం. లకు ఎన్ టి ఆర్ విగ్రహం కూడలి, కుప్పం-బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. సా.4.35 గం. లకు కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహం పార్టీ నేతలతో సమావేశంలో పాల్గొంటారు.

26న (బుధవారం) కార్యక్రమాలు . .

బుధవారం రోజు ఉ.10.30 గం. లకు - ఆర్ అండ్ బి అతిథి గృహం, కుప్పం – ప్రజా ఫిర్యాధుల స్వీకరణలో పాల్గొంటారు చంద్రబాబు. మ.12 గం. లకు - గవర్నమెంట్ డిగ్రీ కళాశాల (పి ఈ ఎస్ కళాశాల సమీపం లో), కుప్పం- నియోజకవర్గ పరిధి అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. మ.02.35 గం. లకు - పి ఈ ఎస్ మెడికల్ కాలేజీ - పార్టీ శ్రేణులతో మీటింగ్ ఉంటుంది. సా.4.10 – పి ఈ ఎస్ మెడికల్ కాలేజీ హెలిప్యాడ్, కుప్పం నుండి ముఖ్యమంత్రి తిరోగమనం చేస్తారు.

నిజంనిప్పులాంటిది

Jun 24 2024, 11:54

సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ!

విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల అభినందనలు

మెగా డిఎస్సీ విధివిధానాల ఫైలుపై లోకేష్ తొలి సంతకం

అమరావతి: రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్.. 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ - 208 చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు.

మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ తొలిసంతకం చేసి, కేబినెట్ కు పంపారు. పలువురు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘ నాయకులు లోకేష్ ను కలిసి అభినందనలతో ముంచెత్తారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా

మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, ఎస్.సవిత, టీజీ భరత్, మాజీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావు, భాష్యం ప్రవీణ్, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ వేమూరి రవికుమార్,

తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, ప్రధాన కార్యదర్శి రవినాయుడు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం, మాజీ ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, ఏఎస్ రామకృష్ణ, బుద్ధా నాగ జగదీష్, అంగర రామ్మోహన్ రావు, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ నాగుల్ మీరా తదితరులు లోకేష్ ను కలిసి అభినందనలు తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Jun 24 2024, 10:55

ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభం. సూపర్‌-6 పథకాల అమలుపై చర్చించనున్న కేబినెట్‌.

పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై చర్చించనున్న మంత్రివర్గం. 

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం. 

బడ్జెట్‌ తయారీలో ప్రాధాన్య అంశాలపై దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు.

Streetbuzz News