నిజంనిప్పులాంటిది

Jun 23 2024, 12:47

పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో మద్యం మత్తులో ప్రయాణికుని వీరంగం...

అన్నమయ్య జిల్లా : కడప నుంచి రాజంపేట కు వస్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో మద్యం మత్తులో ప్రయాణికుని వీరంగం...

కడపలో బస్సు ఎక్కి టిక్కెట్ తీసుకోకుండా కండెక్టర్, డ్రైవర్,తోటి ప్రయాణికులతో ఘర్షణ...

ప్రశ్నించిన మహిళా ప్రయాణికురాలి పై పాదరక్షతో దాడి...

బలవంతంగా నందలూరు పోలీస్ స్టేషన్ లో అప్పగింత...

పోలీస్ స్టేషన్ లో సైతం వీరంగం..

కంట్రోల్ చేయలేక సెల్ లో పెట్టి తాళం వేసిన పోలీసులు...

నిజంనిప్పులాంటిది

Jun 23 2024, 12:44

కోర్టు ఆదేశాలతోనే వైఎస్సార్​సీపీ ఆఫీస్ కూల్చివేత - సీఆర్డీఏ

గుంటూరు జిల్లాలోని వైఎస్సార్​సీపీ కార్యాలయం కూల్చివేత కోర్టు ఆదేశాల ప్రకారమే జరిగిందని అధికారులు ప్రకటించారు.

బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న ఈ స్థలాన్ని తక్కువ లీజుతో వైఎస్సార్​సీపీకార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కార్‌ కట్టబెట్టింది.

అనుమతులు లేకుండానే ఈ భవన నిర్మాణం చేపట్టడం జరిగిందని గుర్తించాక వైఎస్సార్​సీపీకి నోటీసులు జారీ చేసి కూల్చివేసినట్లు సీఆర్డీఏ అధికారులు వెల్లడించారు.

గుంటూరు జిల్లా సీతానగరంలో నీటిపారుదల శాఖ స్థలంలో అనుమతులు లేకుండా చేపట్టిన వైఎస్సార్​సీపీ కార్యాలయ భవనాన్ని సీఆర్డీఏ, ఎంటీఎంసీ, రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో ఇరిగేషన్ బోట్ యార్డు స్థలముంది. దీనిలో 2 ఎకరాల భూమిని వైఎస్సార్​సీపీ హయాంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింAది. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లే దారిలో బకింగ్ హామ్ మెయిన్ కెనాల్ పక్కనున్న స్థలాన్ని తక్కువ ధరకే వైఎస్సార్​సీపీ కొట్టేసింది.

ఈ ప్రాంతంలో ఎకరా మార్కెట్ ధర 5 కోట్ల నుంచి 8 కోట్ల రూపాయల వరకు పలుకుతోంది. కానీ ఏడాదికి ఎకరాకు కేవలం వెయ్యి చొప్పున 33 ఏళ్లకు లీజుకు ఇస్తూ గతేడాది ఫిబ్రవరి 16న వైఎస్సార్​సీపీ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఈ జీవో బయటకు రాకుండా అప్పటి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు జీవో బయటికి రావడంతో స్థానికులు అప్పటి ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

అక్రమ కట్టడాలపై అధికారులు దృష్టి: 

తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ కట్టిన అక్రమ కట్టడాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో బోట్‌ యార్డ్‌ సమీపంలో వైఎస్సార్​సీపీ అక్రమంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు సీఆర్డీఏ అధికారులు గుర్తించారు. అక్రమ నిర్మాణంపై అనుమతులు చూపించాలంటూ నోటీసులు జారీ చేశారు. వీటిపై వైఎస్సార్​సీపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా వారికి ఊరట లభించలేదు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల సాయంలో తెల్లవారుజాము నుంచే కూల్చివేత చేపట్టిన అధికారులు రెండున్నర గంటల్లోనే ప్రక్రియ పూర్తిచేశారు.

వైఎస్సార్​సీపీ కార్యాలయ అక్రమ నిర్మాణాన్ని న్యాయస్థానం ఆదేశాలమేరకే కూల్చివేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టకపోతే కోర్టు నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. జలవనరుల శాఖ భూమిని వైఎస్సార్​సీపీ కార్యాలయ నిర్మాణానికి ఇవ్వడం కుదరదంటూ ఈఎన్సీ నారాయణరెడ్డి ఇచ్చిన లేఖను ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి.

నిజంనిప్పులాంటిది

Jun 23 2024, 09:55

ఏపీలో పింఛన్ పంపిణీ.. కీలక అప్‌డేట్..

పింఛన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. 

పెంచిన పింఛన్ మొత్తం రూ.4 వేలతో పాటు ఏప్రిల్, మే, జూన్ బకాయిలు రూ.1000 చొప్పున మొత్తం జులై 1న రూ.7 వేలు అందించడాన్ని అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

నూతన పాసు పుస్తకాలను పింఛన్‌తో పాటు అందించాలన్నారు.

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Jun 22 2024, 12:07

గృహ సిబ్బందిని దోపిడీ చేసినందుకు నలుగురు హిందూజా కుటుంబ సభ్యులకు స్విస్ కోర్టు జైలు శిక్ష విధించింది

ఒక బిలియనీర్ భారతీయ వ్యాపార కుటుంబం వారి సేవకులను దోపిడీ చేసినందుకు 4.5 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. బ్రిటన్‌లో నివసిస్తున్న ఈ కుటుంబంలోని నలుగురు సభ్యులు జైలులో గడపాల్సి వస్తుంది. గృహ సిబ్బందిని దోపిడి చేసిన కేసులో హిందూజా కుటుంబానికి చెందిన నలుగురిపై స్విస్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. దోషులందరికీ నాలుగున్నర జైలు శిక్షలు విధించారు. అయితే, హిందుజా కుటుంబ సభ్యులు ప్రకాష్ మరియు కమల్ హిందుజా, వారి కుమారుడు అజయ్ మరియు కోడలు నమ్రత వంటి తీవ్రమైన కేసుల్లో ప్రతి ఒక్కరినీ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది, భారతదేశం నుండి కొంతమందిని వారి భవనంలో పని చేయడానికి పంపారు. జెనీవా కోసం తీసుకొచ్చారు. కానీ వారిని ఎక్కువ గంటలు పని చేసేలా చేసిన తర్వాత, వారు రోజుకు $8 మాత్రమే చెల్లించారు. హిందుజా కుటుంబం ఈ వ్యక్తుల పాస్‌పోర్ట్‌లను ఉంచిందని మరియు వారి కదలికలపై ఆంక్షలు విధించిందని కూడా పరిపాలన ఆరోపించింది.

జెనీవా కోర్టులో కేసు విచారణ సందర్భంగా, హిందుజా కుటుంబం గృహ సహాయకులను దోపిడీ చేయడం మరియు దుర్వినియోగం చేసినందుకు దోషిగా నిర్ధారించబడింది మరియు 4.5 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఈ కేసులో, హిందుజా కుటుంబం, 47 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తిని కలిగి ఉన్నారని ఆరోపించిన ముగ్గురు గృహ సహాయకులు మానవ అక్రమ రవాణా ఆరోపణల నుండి ఆమె విముక్తి పొందారు. అతనికి మరియు అతని కుటుంబానికి మధ్య కోర్టు వెలుపల సెటిల్మెంట్ జరగడం దాదాపు ఖాయం, అయినప్పటికీ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, కోర్టు విచారణను కొనసాగించింది.

ప్రకాష్ హిందుజా (78), కమల్ హిందుజా (75) కేసు మొత్తం విచారణ సమయంలో కోర్టుకు గైర్హాజరయ్యారు. అతనికి 4.5 సంవత్సరాల శిక్ష పడింది. కాగా అతని కొడుకు, కోడలుకు 4 ఏళ్ల శిక్ష పడింది. నలుగురు నిందితులు జెనీవా కోర్టుకు హాజరుకాలేదు. ఈ కేసులో మరో నిందితుడు కుటుంబ వ్యాపార నిర్వాహకుడు నజీబ్ జియాజీ కోర్టుకు హాజరయ్యారు. అతనికి 18 నెలల జైలు శిక్ష విధించబడింది, ఇది ప్రస్తుతం సస్పెండ్ చేయబడింది.

ఈ కేసు విచారణలో వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం.. హిందుజా కుటుంబానికి చెందిన మాన్షన్‌లో సేవకులుగా పనిచేస్తున్న సిబ్బందిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులే. వారు 18-18 గంటల పాటు పని చేసేలా చేశారు. జీతం పేరుతో నెలకు 250 నుంచి 450 డాలర్లు (నెలకు 20,000 నుంచి 35,000 రూపాయలు) వచ్చేది. స్విట్జర్లాండ్ ప్రకారం ఇది చాలా తక్కువ జీతం. ఇది మాత్రమే కాదు, వారికి స్విస్ ఫ్రాంక్ కరెన్సీకి బదులుగా భారతీయ రూపాయలలో చెల్లించబడింది. హిందూజా కుటుంబం తమ కుక్కల కోసం ప్రతి నెలా ఇంతకు మించి ఖర్చు పెట్టేది.

హిందూజా కుటుంబం భారతదేశంలో మూలాలను కలిగి ఉంది మరియు అదే పేరుతో వ్యాపార సంస్థను కూడా నడుపుతోంది, ఇది అనేక కంపెనీల సమ్మేళనం. ఇందులో నిర్మాణం, దుస్తులు, ఆటోమొబైల్, చమురు, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ వంటి రంగాలు కూడా ఉన్నాయి. హిందూజా గ్రూప్ వ్యవస్థాపకుడు పర్మానంద్ దీప్‌చంద్ హిందూజా అవిభక్త భారతదేశంలోని సింధ్‌లోని ప్రసిద్ధ నగరమైన షికార్‌పూర్‌లో జన్మించారు. 1914లో, అతను భారతదేశం యొక్క వాణిజ్య మరియు ఆర్థిక రాజధాని అయిన బొంబాయికి (ప్రస్తుతం ముంబై) వెళ్ళాడు. హిందూజా గ్రూప్ వెబ్‌సైట్ ప్రకారం, అతను అక్కడ వ్యాపారం యొక్క ఇన్‌లు మరియు అవుట్‌లను త్వరగా నేర్చుకున్నాడు. సింధ్‌లో ప్రారంభమైన వ్యాపార ప్రయాణం 1919లో ఇరాన్‌లో కార్యాలయంతో అంతర్జాతీయ రంగంలోకి ప్రవేశించింది. ఈ బృందం 1979 వరకు ఇరాన్‌లో ప్రధాన కార్యాలయంగా కొనసాగింది. ఆ తర్వాత యూరప్‌కు వెళ్లింది. ప్రారంభ సంవత్సరాల్లో, హిందూజా గ్రూప్ వ్యాపారానికి మర్చంట్ బ్యాంకింగ్ మరియు ట్రేడింగ్ రెండు స్తంభాలు. గ్రూప్ వ్యవస్థాపకుడు పర్మానంద్ దీప్‌చంద్ హిందుజా ముగ్గురు కుమారులు - శ్రీచంద్, గోపీచంద్ మరియు ప్రకాష్ - తర్వాత కార్యకలాపాలను చేపట్టి దేశ విదేశాల్లో కంపెనీని విస్తరించారు.

2023లో శ్రీచంద్ హిందూజా మరణించిన తర్వాత, అతని స్థానంలో అతని తమ్ముడు గోపీచంద్ గ్రూప్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. స్విట్జర్లాండ్‌లో మానవ అక్రమ రవాణా కేసును ఎదుర్కొంటున్న ప్రకాష్ మొనాకోలో వ్యాపారాన్ని స్థాపించాడు. హిందూజా కుటుంబం యునైటెడ్ కింగ్‌డమ్‌లో చాలా విలువైన ఆస్తులను కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 2023లో, హిందూజా గ్రూప్ లండన్‌లోని వైట్‌హాల్‌లో ఉన్న ఓల్డ్ వార్ ఆఫీస్‌లో రాఫెల్స్ పేరుతో ఒక హోటల్‌ను నిర్మించింది, ఇది అంతకుముందు బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖగా ఉంది. ఈ హోటల్ ప్రత్యేకత ఏమిటంటే ఇది బ్రిటిష్ ప్రధాని అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ నుండి కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఉంది. అదే సమూహం కార్ల్టన్ హౌస్ యొక్క పైకప్పులో కొంత భాగాన్ని కలిగి ఉంది, ఈ భవనం అనేక కార్యాలయాలు, నివాసాలు మరియు ఈవెంట్ గదులను కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు చాలా సమీపంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీల్లో 2 లక్షల మంది పనిచేస్తున్నారని హిందూజా గ్రూప్ పేర్కొంది.

నిజంనిప్పులాంటిది

Jun 22 2024, 08:53

నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు..

ఉదయం 10.30కి మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం.. 

11 గంటలకు స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు బాధ్యతల స్వీకరణ.. 

ఇప్పటికే స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్నపాత్రుడు.. 

స్పీకర్‌ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా వైసీపీ

నిజంనిప్పులాంటిది

Jun 21 2024, 21:48

అంగన్‌వాడీ టీచర్లను పట్టించుకోని ప్రభుత్వం !

కరీంనగర్ జిల్లా : గర్భిణులు, బాలింతలు, మూడు సంవత్సరాల నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు సేవలందిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు సమస్యలతో సతమతమవుతున్నారు. ఎన్నటికైనా వేతనాలు పెరుగుతాయనే గంపెడాశతో ప్రభుత్వం ఏది చెప్పినా వాటిని నూటికి నూరుపాళ్లు పూర్తి చేస్తున్నారు.

రోజురోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలతోపాటు అద్దె అలవెన్సులను పెంచి ఇవ్వాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్న భవనాలు సరిగా అద్దె చెల్లించడం లేదు. దీంతో టీచర్లే వారి వేతనాల నుంచిగానీ, అప్పొసప్పో చేసి అద్దెలు చెల్లిస్తూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

జిల్లాలో 777 అంగన్‌వాడీ కేంద్రాలు

జిల్లాలో అప్‌గ్రేడ్‌ చేసిన 25 మినీ అంగన్‌వాడీలతో కలిసి మొత్తం 777 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. మహిళా శిశు, వికలాంగులు, వయోవృద్దుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నాలుగు ప్రాజెక్టులను ఏర్పాటు చేసి ఈ అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. గంగాధర ప్రాజెక్టు పరిధిలో 155, హుజురాబాద్‌ పరిధిలో 226, కరీంనగర్‌ రూరల్‌ పరిధిలో 199, కరీంనగర్‌ అర్బన్‌ ప్రాజెక్టు పరిధిలో 172 కేంద్రాలు పని చేస్తున్నాయి.

వీటి ద్వారా 4,544 మంది గర్భిణులు, 14,689 మంది బాలింతలు, ఏడేళ్ళలోపు పిల్లలు 5,021, ఒకటి నుంచి మూడేళ్లలోపు బాలబాలికలు 19,449 మంది , మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 19,989 మంది, మొత్తం 63,692 మందికి అంగన్‌వాడీల ద్వారా ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. 777 మంది అంగన్‌వాడీ టీచర్లు, 777 మంది ఆయాలు పని చేస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అంగన్‌వాడీ టీచర్ల వేతనాలను 18 వేలకు పెంచుతామని ఎన్నికల మెనిఫెస్టోలో ప్రకటించడంతో అంగన్‌వాడీలు, అంగన్‌వాడీ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఆరునెలలు గడిచినా వేతనాల పెంపుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిరాశ చెందారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వం ఏమి చెప్పినా చేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు కోరుతున్నారు

నిజంనిప్పులాంటిది

Jun 21 2024, 19:20

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందించిన టిఎస్ జేఏ నాయకులు

బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ (ఓ ఎస్ డి) రెహమాన్ చేతుల మీదుగా అసోసియేషన్ కార్డులు ఆవిష్కరణ చేయించిన రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కొనసాగుతున్న 27 వేల మంది జర్నలిస్టుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ

తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు శుక్రవారం హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ తప్పనిసరి ప్రతి వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని గత ప్రభుత్వం చేసినట్లు అశ్రద్ధ చేయమని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులందరూ అసోసియేషన్లకు యూనియన్లకు అతీతంగా తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ఐకమత్యంగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమానంతరం బషీర్బాగులోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ (ఓ ఎస్ డి )రెహమాన్ చేతుల మీదుగా అసోసియేషన్ కార్డులను ఆవిష్కరింప చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగంపల్లి నాగబాబు,రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ దుర్గం బాలు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గట్టిగుండ్ల రాము,రాష్ట్ర న్యాయ సలహాదారులు కొలిశెట్టి రామకృష్ణ, రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్ రాఘవేంద్ర యాదవ్,రాష్ట్ర సహాయ కార్యదర్శులు నరసింహులు, చిలుకల చిరంజీవి,సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడి రవి, కోదాడ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కొండా ఉదయ్, సూర్యాపేట పట్టణ వైస్ ప్రెసిడెంట్ తాప్సి అనిల్,కార్యదర్శి దేశ గాని వెంకట్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 21 2024, 09:37

పల్లా శ్రీనివాసరావు భార్య ప్రొఫెసర్‌ లావణ్యాదేవిపై సస్పెన్షన్‌ ఎత్తివేత

విశాఖపట్నం (ఆంధ్రా యూనివర్సిటీ): తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భార్య ప్రొఫెసర్‌ లావణ్యాదేవిపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు..

ఆమె ఆంధ్రా విశ్వవిద్యాలయం కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో భర్త తరఫున ప్రచారంలో పాల్గొన్నారన్న ఆరోపణలతో ఉన్నతాధికారులు అప్పట్లో లావణ్యాదేవిని సస్పెండ్‌ చేశారు.

తాజాగా ఆమెపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ జేమ్స్‌ స్టీఫెన్‌ పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి..

నిజంనిప్పులాంటిది

Jun 21 2024, 09:33

Breaking: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య మృతి !

- కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య రూపాదేవి ఆత్మహత్య

- అల్వాల్‌లోని నివాసంలో ఉరి వేసుకున్నారు

- ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య కలకలంరేపింది. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌ అల్వాల్‌లోని పంచశీల కాలనీలోని నివాసంలో ఈ ఘటన జరిగింది.

ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. రూపాదేవి వికారాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రూపాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా.. ఆమె రెండు రోజుల నుంచి స్కూలుకు వెళ్లలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే సత్యం ఉదయమే నియోజకవర్గానికి వెళ్లగా.. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారని సమాచారం.

కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే సత్యం కుటుంబం బంధువులతో కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారని చెబుతున్నారు. ఇంతలోనే ఏం జరిగిందనే చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం అర్ధరాత్రి బయటకు వచ్చింది.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నిజంనిప్పులాంటిది

Jun 21 2024, 09:27

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

•తొలుత సీఎం చంద్రబాబు, తరువాత డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం

అమరావతి: శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం 9.46 గంటలకు ప్రారంభం కానున్నాయి..

తొలుత ప్రొటెం స్పీకర్‌ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేస్తారు. అనంతరం సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి రిజిస్టర్లలో సంతకాలు చేస్తారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. మాజీ సీఎం, వైకాపా అధ్యక్షుడు జగన్‌ సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేస్తారు. ఆంగ్ల అక్షరాల వరుసక్రమంలో సభ్యులను పిలుస్తారు. అనంతరం శాసనసభ సభాపతి ఎన్నికల ప్రక్రియను ప్రకటిస్తారు..

ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో సహా ఎవరికీ విజిటింగ్‌ పాస్‌లు జారీ చేయడం లేదని అసెంబ్లీ అధికారులు ప్రకటించారు. స్థలాభావం కారణంగా విజిటింగ్‌ పాస్‌ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు..