వలిగొండ : SFI పోరాట ఫలితంగా పర్మిషన్ లేకుండా ప్రారంభించిన శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేసిన మండల విద్యాధికారి
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్ చేస్తు పాఠశాల ప్రారంభించిన శ్రీ చైతన్య విద్యాసంస్థలను మూసివేయలని ధర్నా చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు లు మాట్లాడుతూ శ్రీ చైతన్య పేరు చెప్పి అమాయక తల్లిదండ్రులను మోసం చేసి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ అడ్మిషన్లు ప్రారంభిస్తున్నారని,అడ్మిషన్ల కోసం బస్సులను అదేవిధంగా వాల్ రైటింగ్స్ రాస్తున్నారన్నారు, శ్రీ చైతన్య విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని గత 20 రోజుల క్రితమే జిల్లా విద్యాశాఖ అధికారీ* *(DEO)గారికి , ,అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి( MEO)గారి దృష్టికి తీసుకువెళ్లి, వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు,విద్య అనేది అంగట్లో సరుకుగా మార్చి విద్యాశాఖ అధికారుల నుండి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇష్టానుసారంగా విద్యాసంస్థలను ప్రారంభించి విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద లక్షల ఫీజులు తీసుకోవాలని చూస్తున్నారన్నారు,దీనిపై వెంటనే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా చేయగా మండల విద్యాధికారి ఎంఈఓ గారు స్పందించి శ్రీచైతన్య స్కూలుకు వచ్చి పాఠశాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు ఇది ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితమని పర్మిషన్ లేని పాఠశాలలు నడిపితే ఎస్ఎఫ్ఐ చూస్తూ ఊరుకునేది లేదన్నారు ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి గుర్తింపు లేని పాఠశాలలను మూసివేయాలని, అదేవిధంగా పర్మిషన్ లేని పాఠశాలలకు అడ్మిషన్లు తీసుకోకుండా తల్లిదండ్రులు పిల్లలు ముందుగా జాగ్రత్తలు తీసుకొని, ఇలాంటి విద్యాసంస్థలను పర్మిషన్ ఇవ్వకుండా చూడాల్సిందిగా, అదేవిధంగా ఇలాంటి విద్యాసంస్థలకు పర్మిషన్ ఇస్తే సామాన్య ప్రజల నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారన్నారు,విద్యను వ్యాపారంగా చేసుకోవాలని చూస్తున్న ఈ శ్రీ చైతన్య విద్యాసంస్థలకు పర్మిషన్ ఇవ్వద్దని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మండల అధ్యక్షులు ఎండి,ఫర్దిన్ పట్టణ అధ్యక్షులు మైసొల్ల,నరేందర్ దుబ్బ,శివ,సాయి,యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.
![]()

విద్య అనేది అంగట్లో సరుకుగా మార్చి విద్యాశాఖ అధికారుల నుండి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇష్టానుసారంగా విద్యాసంస్థలను ప్రారంభించి విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద లక్షల ఫీజులు తీసుకోవాలని చూస్తున్నారన్నారు,దీనిపై వెంటనే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా చేయగా మండల విద్యాధికారి ఎంఈఓ గారు స్పందించి శ్రీచైతన్య స్కూలుకు వచ్చి పాఠశాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు ఇది ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితమని పర్మిషన్ లేని పాఠశాలలు నడిపితే ఎస్ఎఫ్ఐ చూస్తూ ఊరుకునేది లేదన్నారు ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి గుర్తింపు లేని పాఠశాలలను మూసివేయాలని, అదేవిధంగా పర్మిషన్ లేని పాఠశాలలకు అడ్మిషన్లు తీసుకోకుండా తల్లిదండ్రులు పిల్లలు ముందుగా జాగ్రత్తలు తీసుకొని, ఇలాంటి విద్యాసంస్థలను పర్మిషన్ ఇవ్వకుండా చూడాల్సిందిగా, అదేవిధంగా ఇలాంటి విద్యాసంస్థలకు పర్మిషన్ ఇస్తే సామాన్య ప్రజల నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారన్నారు,విద్యను వ్యాపారంగా చేసుకోవాలని చూస్తున్న ఈ శ్రీ చైతన్య విద్యాసంస్థలకు పర్మిషన్ ఇవ్వద్దని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మండల అధ్యక్షులు ఎండి,ఫర్దిన్ పట్టణ అధ్యక్షులు మైసొల్ల,నరేందర్ దుబ్బ,శివ,సాయి,యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.

గత రెండు సంవత్సరాలుగా తాటి చెట్ల పైనుండి పడి మరణించిన, శాశ్వత వికలాంగులైన, గీత కార్మికులకు. రావలసిన ఎక్స్ గ్రేషియా , మరియు గీతా కార్పొరేషన్ ద్వారా అందించాల్సిన తాత్కాలిక పరిహారము ,వెంటనే అందించాలని భువనగిరి మండలంలో మంది చనిపోయిన. 12మంది మరియు ఎనిమిది మంది శాశ్వత వికలాంగులైన వారు ,తాత్కాలిక పరిహారము అందించకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నారని, తక్షణమే ఎక్స్ గ్రేషియా అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 50 సంవత్సరాలు పైబడిన గీత కార్మికులకు ,ప్రభుత్వము వృత్తి పింఛన్లను ఇవ్వడంలో గత రెండు సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తుందని. 50 సంవత్సరాలు నిండిన వృత్తి పింఛన్లకు అర్హులైన గీతా కార్మికులు రెండు సంవత్సరాలు పైబడి ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకొని కనులు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారని వెంటనే గీతా కార్మికులకు పెన్షన్లను ప్రభుత్వం ప్రకటించిన విధంగా ,పెంచి తక్షణమే రెగ్యులర్ గా పెన్షన్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నూతనంగా గ్రామాలలో గీత వృత్తిలో పనిచేస్తున్న వారికి ,కొత్త సభ్యత్వము గుర్తింపు కార్డులు, ఇవ్వాలని ఎన్నికల కోడ్ పేరుతో ఆపివేసిన ,గీతా కార్మికులకు నూతన సభ్యత్వాలనే తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు . గత ప్రభుత్వము గీతా కార్మికులకు ఇస్తానన్న ఉచిత బైక్ లను ప్రతి గీత కార్మిక కుటుంబానికి అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు జూలై,ఆగస్టు . మాసాలలో అమరుల యాది లో కల్లుగీత కార్మిక ఉద్యమంలో, వృత్తి రక్షణ సంక్షేమం కొరకు హక్కుల కొరకు పోరాడిన, మహనీయులు.. బొమ్మగానిధర్మభిక్షం, తొట్లమల్సూరు,, బైరుమల్లయ్య, సూదగాని యెట్టయ్య, లాంటి అనేకమంది అమరవీరులని ,సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో గీతా కార్మికుల హక్కుల కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుంటూ గ్రామ గ్రామాన కల్లుగీత కార్మిక ఉద్యమంలో అమరులైన మహనీయులని, జ్ఞాపకం చేసుకుంటూ సభలు నిర్వహించనున్నామని వీటిని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు పాండాల మైసయ్య, మట్ట బాలరాజు, రంగా కొండల్, గడ్డమీది సోములు, కొండ అశోక్, మచ్చ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

.
ఈ సందర్భంగా NSUI జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లలో అక్రమంగా పుస్తకాలను విక్రయిస్తున్నారు. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అలాంటి స్కూళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎన్ ఎస్ యు ఐ అండగా ఉంటుందని ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించే దిశగా వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకునూరి మహేందర్, NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి సురుపంగ చందు, జిల్లా కార్యదర్శి పాండాల శరత్, పట్టణ ఉపాధ్యక్షులు కార్తీక్, ఎండి. అసద్, అబ్దుల్, కౌశిక్, సద్దామ్, జలీల్,ఫిరోజ్, ప్రసాద్, తేజ తదితరులు పాల్గొన్నారు.
జులై 7 నాటికి ఎమ్మార్పీ శ్రేణులు గ్రామ మండల పూర్తిస్థాయి కమిటీలను పూర్తిచేసుకుని నల్ల షర్టు బ్లాక్ పాయింట్తో డ్రెస్ కోడ్ తో జూలై 7న వరంగల్లో జరిగే మాదిగల ఆత్మగౌరవ కవాతుకు లక్షలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లావ్యాప్తంగా మాదిగ పల్లెలు రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామం నుండి ప్రతి మాదిగ బిడ్డ వరంగల్ కేంద్రానికి తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు సందెలు శ్రీనివాస్ మాదిగ యాకర్ నరసింహారావు మాదిగ ఇటుకల దేవేందర్ మాదిగ బాల నరసింహ మాదిగ జాంగిర్ మాదిగ పాముకుంట్ల బసవయ్య మాదిగ మాజీ సర్పంచ్ బిక్షపతి మాదిగ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య (క్యాట్కొ) దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు కొడారి వెంకటేష్ కోరారు. తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య సమావేశం ఆదివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హిల్ కాలనీ యూత్ హాస్టల్లో జరిగింది. ఈ సమావేశంలో క్యాట్కో రాష్ట్ర కమిటీ నాయకులు వేముల గౌరీ శంకర్ రావు, శంకర్ లాల్ చౌరాసియా, ఏలే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతనంగా రాష్ట్రంలో రైతు వినియోగదారుల సంఘాలు, మహిళా వినియోగదారుల సంఘాలు, పిల్లల, వృద్ధుల, మరియు వికలాంగుల వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేసి వాళ్లలో చైతన్యం తీసుకువచ్చి గ్రామస్థాయిలో వినియోగదారుల సంఘాల బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సంస్థ ఏర్పడి పదేళ్లు అయిన సందర్భంగా ఆగష్టు 10,11-2024 రెండు రోజుల పాటు నిర్వహించే రాష్ట్రస్థాయి దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు కొడారి వెంకటేష్ కోరారు. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుటకు "ఆహ్వాన కమిటీ సభ్యులను" ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
దశాబ్ది ఉత్సవాల ముఖ్య భాద్యతలు రాష్ట్ర ఉపాధ్యక్షులకు, కార్యదర్శులకు అప్పగించారు. ప్రతి ఒక్క వినియోగదారుల సంఘం బాధ్యులు నూతన వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేయడానికి కృషిచేయాలని సూచించారు. ఆగస్టు 10,11 న నిర్వహించే దశాబ్ది ఉత్సవాలను విజయవంతం కావడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు . ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సంపత్ కుమార్(రంగారెడ్డి ), ఎస్ రమేష్ బాబు(మేడ్చల్), సిహెచ్ గురవయ్య (నల్లగొండ), పి సోమయ్య(యాదాద్రి భువనగిరి), షేక్ సైదా, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు( సూర్యాపేట), ఏ మట్టయ్య ,ఎండి ముస్తాఫా, ఎండి నజీర్ పాష, కట్ట మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Jun 19 2024, 19:24
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.5k