VijayaKumar

Jun 16 2024, 20:55

ఎస్సీ , ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా దళితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి: దళిత హక్కుల పోరాట సమితి

దుప్పల్లి గ్రామంలో ఆదివారం అంబేద్కర్ చౌరస్తా వద్ద డిహెచ్పిఎస్ కరపత్రాలు ఆవిష్కరించారు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఈ నెల 18, 19 ,20 తేదీలలో లక్ష్మీ నరసింహ స్వామి ఫంక్షన్ హాల్ యాదగిరి గుట్ట మండలంలో నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా *వలిగొండ డిహెచ్పిఎస్ మండల కన్వీనర్ కట్ల యాదగిరి మాట్లాడుతూ* దళితులు తరతరాలుగా అంచివేతకు అంటరాని తనం వివక్షత దోపిడీ పీడనాల కింద నలిగిపోతున్న అట్టడుగు వర్గాలపై ఆశేష శ్రామిక కులాలు అభ్యున్నతి లక్ష్యంగా ఆవిర్భవించింది సమాజంలో తరతరాలుగా అంటరానితనం అనే అవమాన నియా దురాచారానికి అత్యంత దారుణంగా బలైపోతున్న దళితులను సామాజిక ఆర్థిక రాజకీయ ఆధిపత్యాన్ని ప్రశ్నించి అనిచివేతలను ఎదిరించి సమానత్వాన్ని సాధించేందుకు సంఘటితంగా చైతన్యవంతం చేయుటకు ప్రధాన లక్ష్యంగా దళిత సామాజిక దృక్పథంతో తెలంగాణ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించి దళితులలో చైతన్యం పరిచి మనిషిని మనిషిగా చూడ నిరాకరించి తోటి మనిషిని బానిసగా మార్చుకొని తరతరాలుగా అవమానాలకు అణిచివేతలకు దోపిడి పీడనాలకు కారణమైంది. ఈ దుర్మార్గమైన కుల వ్యవస్థ ఇలాంటి కుల వ్యవస్థకు పునాది అయిన మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టి కుల వ్యవస్థ పై యుద్ధం ప్రకటించాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. మోడీ ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ సేవలు ఉన్నత విద్యా ప్రవేటికరణ వేగవంతం కావడానికి తోడు ఈ ప్రైవేటు రంగాలలో రిజర్వేషన్లు లేకపోవడంతో పాటు రిజర్వేషన్లు విషయంలో రాజ్యాంగ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నాయని అన్నారు ఈ నైపెద్యంలో తెలంగాణ రాష్ట్రంలో దళితుల ఆర్థిక రాజకీయ సామాజిక హక్కుల పరిరక్షణకు సామాజిక న్యాయం కొరకు కుల వివక్షత నిర్మూలన కొరకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ని మరింత బలోపేతం చేయాలని దళితులకు కేటాయించిన నిధులను దారి మళ్లించకుండా స్వయం ఉపాధి పథకం అమలు చేయాలని కోరుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు నిర్వహించుటకు భవిష్యత్తు కార్యచరణను రూపుదించుకొని రాష్ట్రవ్యాప్తంగా దళితుల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయని వారన్నారు ఈ రాజకీయ శిక్షణ తరగతులకు ఎంపిక చేసిన దళితులు ఎక్కువ శాతం హాజరై ఈ రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలనిఅన్నారు ఈ కార్యక్రమంలో *ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, మాజీ సర్పంచ్ బందేల స్వామిదాస్, సిపిఐ గ్రామ శాఖ నాయకులు మెట్టు లక్ష్మీనారాయణ, ఎర్ర కిరణ్, మారోజు నరసింహ చారి,కట్ల సామేల్, మామిడికాయల నరేష్, అశోక్,రాజు తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Jun 16 2024, 17:09

ప్రజా సంపదను దోపిడి శక్తులకు కట్టబెడుతున్న బీజేపీ ప్రభుత్వం: పోతినేని సుదర్శన్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు

దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సహజ సంపాదనను ప్రజలకు సమపాలనలో పంచకుండా దోపిడీ శక్తులకు కట్టబెడుతున్నారని సిపిఎంnరాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు. ఈ రోజున యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 15,16 తేదీల్లో భువనగిరిలోని వైయస్సార్ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న రాజకీయ శిక్షణ తరగతులలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వెనుకబడిన తరగతుల జనగణనను చేపట్టడం ద్వారా జనగనన చేయడంలో బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నదని 10 సంవత్సరాల కాలం నుండి నిర్లక్ష్యం చేస్తున్నదని, ఈ కాలంలో జరిగిన దేశవ్యాప్త ఎన్నికల్లో దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ మాటలు ప్రజలు సంపూర్ణంగా నమ్మలేదని నమ్మక సంపూర్ణ మద్దతు సంపూర్ణమైన మద్దతు ఇవ్వలేదని బిజెపి దాని అనుబంధ సంఘాలు సంఘ పరివార్ లాంటి ఆలోచన మేరకే బిజెపి తన విధానాలు అవలంబిస్తున్నదని తన పరిపాలన కొనసాగిస్తుందని మతోన్మాద విధానాలను అవలంబిస్తూ దేశ ప్రజలను విచ్ఛిన్నం చేస్తూ దేశంలో అనేక అల్లర్లకు అనేక దాడులకు పూనుకున్నదని వెనుకబడిన కులానికి చెందిన వాడినని ప్రజలను మోసం చేయడం కోసం తాను వెనుకబడిన తరగతి వాడినని ప్రజలను మోసం చేశాడని మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట నీటి మూటలైనాయని రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను పూర్తిగా రద్దు చేయలేదని దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పుతున్నదని బ్రిటిష్ వారి కాలంలోనే అనేక పోరాటాలు చేసి ప్రజలు సాధించుకున్న హక్కులను మోడీ ప్రభుత్వం రద్దు చేయడానికి చూస్తున్నదని ఎప్పటికైనా ప్రజలు ఇచ్చిన ఫలితాన్ని బట్టి ప్రజా సమస్యల పరిష్కారం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని దేశంలో మోడీ అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటాల శరణ్యమని వారన్నారు. శిక్షణ తరగతులలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ బట్టుపల్లి అనురాధ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు ధోనూరి నర్సిరెడ్డి, కల్లూరి మల్లేశం, దాసరి పాండు జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ, సిరిపంగి సామి, సైదులు, బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా, రాజయ్య, పగిళ్ల లింగారెడ్డి, శ్రీనివాసచారి, దయ్యాల నరసింహ, గడ్డం వెంకటేశం, బొడ్డుపల్లి వెంకటేష్ , జెల్లల పెంటయ్య, బోలగాని జయరాములు, బోల్లు యాదగిరి, ఎంఎ ఇక్బాల్, నాయకులు ధూపాటి వెంకటేశం గాడి శ్రీనివాసు గురు అనీలు రేకల శ్రీశైలం బిక్షం గుండు వెంకట నరసింహ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి సంఘ నరేందర్ గద్ద నరసింహ బందెల ఎల్లయ్య దండగిరి గంధ మల్ల మాతయ్య అవ్వరు రామేశ్వరి రాములమ్మ ఆఫీస్ సెక్రటరీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 16 2024, 16:59

కామాంధుని కఠినంగా శిక్షించాలి , బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి : రామన్నపేట మండలం మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గాదే శోభారాణి


ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కూలీ దంపతులు చిన్నారితో పొట్ట కూటి కోసం పెద్దపల్లి జిల్లా లో సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి లోని ఒక రైస్ మిల్లులో పనిచేస్తున్నారు, ఆ మిల్లులో పనిచేసే బీహార్ కి చెందిన వినోద్ 28 సంవత్సరాలు అనే నిందితుడు తల్లి తండ్రి మధ్యలో పడుకున్న 6 సంవత్సరాల చిన్నారిని రాత్రి 11 గంటలకు ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపేసిన సంఘటన చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు గాదె శోభారాణి అన్నారు, తల్లిదండ్రులు పక్కనే ఉన్న ఆ బాలికను కాపాడుకోలేక పోవడం చాలా బాధాకరం అదేవిధంగా రాత్రిపూట నిరంతరం పోలీసుల పర్యవేక్షణ కూడా ఉండాలి, మద్యం,డ్రగ్స్ మత్తులో పడి ఇలాంటి అఘాయిత్యాలు చేస్తున్నారు,తొందరగా అతనికి శిక్ష పడాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కు పాదం మోపు తుందని మహిళా కాంగ్రెస్ తరపున వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాము, నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు,

VijayaKumar

Jun 16 2024, 13:54

హోటల్ ఎల్లప్ప లాడ్జ్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల పట్టణ కేంద్రంలోని లక్కారం 07,వార్డులో హోటల్ ఎల్లప్ప లాడ్జి నూతనంగా ఏర్పాటు చేయడం జరిగినది .ప్రారంభోత్సవానికి  ముఖ్యఅతిథిగా  మున్సిపల్ చైర్మన్ శ్రీ వెన్ రెడ్డి రాజు  హాజరై, వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొయ్యడ సైదులు, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, రామాలయ గుడి చైర్మన్ బొబ్బిళ్ళ మురళి, చెరుకు లింగస్వామి, కానుగు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


VijayaKumar

Jun 16 2024, 12:35

ఆత్మకూరు మండల కేంద్రంలో స్నేహితుల సహాయం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (యం) ఆదివారం  మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన వనం సుగుణ(38) భర్త మల్లేష్ 07-06-2024నాడు గుండెపోటు తో మరణించగా మృతురాలి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి చలించిన మృతురాలి కొడుకు వనం ప్రవీణ్ స్నేహితులు 2013-14 SSC బ్యాచ్ వారు బాధిత కుటుంబ సభ్యులకు 20,000 రూపాయల నగదు సాయం అందించి, పరామర్శించారు.

VijayaKumar

Jun 15 2024, 18:47

ఎస్సీ , ఎస్టీ ఉపాధ్యాయులకు పదోన్నతులలో న్యాయం చేయాలి: బోయ రాములు జిల్లా అధ్యక్షులు

నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పదోన్నతులు బదిలీలు చేపట్టడం పట్ల ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు బోయ రాములు హర్షం వ్యక్తం చేశారు . శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అత్యవసర సమావేశం లో మాట్లాడుతూ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల సీనియారిటీ లిస్ట్ లో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు మెరిట్ లో ఉన్నప్పటికీ అడక్వసి పేరుతో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించడం లేదు . అందువల్ల ప్రమోషన్లు లో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది.కావున ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల పదోన్నతికి అడ్డంకి గా మారిన జీవో నెంబర్ రెండు లో ఉన్నటువంటి అడక్కసి అనే పదాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తొలగించి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్లలో అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కట్ట మల్లయ్య మండల ప్రధాన కార్యదర్శి జానపాల కిషన్, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 15 2024, 15:52

ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని AISF ఆధ్వర్యంలో అడ్డగూడూర్ MRC లో వినతి పత్రం అందజేత

ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని వినతి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ రోజు అడ్డగూడూరు మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ప్రైవేటు విద్యాసంస్థల ఫీజు దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో లోయర్ డెవలప్మెంట్ అసిస్టెంట్ క్రాంతి కుమార్ కి వినతి పత్రంఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు అరికట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు తలాల సాయి, చిప్పలపళ్లి బన్నీ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 15 2024, 13:41

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య . హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ని  ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి వారి చిత్రపటం లడ్డు, ప్రసాదన్నీ అందజేశారు.వీరితోపాటు యాదాద్రి ఆలయ ఈవో భాస్కరరావు , తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jun 14 2024, 22:56

గంజాయి మత్తులో యువత... యువతలో మార్పును తీసుకొచ్చే దిశలో వలిగొండ పోలీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గంజాయి విక్రయించినట్లైనా సేవించినట్లైనా.., తెలిసిన సమాచారం ఇవ్వగలరని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని వలిగొండ ఎస్సై డి మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా వారు పలు చట్టాల గురించి వివరించారు. NDPS చట్టం అంటే NDPS చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఉత్పత్తి/తయారీ/సాగు, స్వాధీనం, అమ్మకం, కొనుగోలు, రవాణా, నిల్వ మరియు/లేదా ఏదైనా మాదక ఔషధం లేదా సైకోట్రోపిక్ పదార్ధాల వినియోగం నుండి నిషేధిస్తుంది. *మొదట 1985లో అమలులోకి వచ్చినది ఈ చట్టo* చట్టం ప్రకారం, నార్కోటిక్ డ్రగ్స్‌లో కోకా లీఫ్, గంజాయి (జనపనార), నల్లమందు మరియు గసగసాల గడ్డి ఉన్నాయి; మరియు సైకోట్రోపిక్ పదార్ధాలలో ఏదైనా సహజ లేదా సింథటిక్ పదార్థం లేదా సైకోట్రోపిక్ పదార్ధాల ద్వారా తీయబడిన ఏదైనా ఉప్పు (పౌడర్) లేదా తయారీ ఉంటుంది. సైకోట్రోపిక్ డ్రగ్‌ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు దాని అక్రమ రవాణా యొక్క పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ చట్టం కింద జరిమానాలు తీవ్రంగా ఉంటాయి. ఈ చట్టం కింద నేరాలకు ఒక సంవత్సరం నుండి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు నేరాన్ని బట్టి జరిమానా విధించబడుతుంది. చట్టం ప్రకారం, ప్రేరేపణ, నేరపూరిత కుట్ర మరియు నేరానికి పాల్పడే ప్రయత్నాలు కూడా నేరానికి సమానమైన శిక్షను పొందుతాయి. నేరం చేయడానికి సిద్ధపడటం కూడా సగం పెనాల్టీని ఆకర్షిస్తుంది. పునరావృత నేరాలకు ఒకటిన్నర రెట్లు జరిమానా మరియు కొన్ని సందర్భాల్లో మరణశిక్ష విధించబడుతుంది. NDPS చట్టంలోని నిబంధనల ప్రకారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 1986లో ఏర్పాటైంది . NCB అనేది మాదకద్రవ్యాల చట్ట అమలుకు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖలు, ఇతర కార్యాలయాలు & రాష్ట్ర/కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమన్వయం చేయడానికి మరియు మాదకద్రవ్యాల దుర్వినియోగానికి సంబంధించిన విషయాలకు సంబంధించి బాధ్యత వహించే నోడల్ ఏజెన్సీ . చట్టం ప్రకారం, చట్టం కింద దోషిగా నిర్ధారించబడిన డ్రగ్-సంబంధిత నేరాల నుండి వ్యక్తి సంపాదించిన ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు, స్తంభింపజేయవచ్చు మరియు జప్తు చేయవచ్చు. *NDPS చట్టం ప్రకారం శిక్షలు* అన్ని నేరాలు నాన్ బెయిలబుల్. 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష అలాగే, మాదకద్రవ్యాల దోషులు ఉత్తీర్ణత, ఉపశమనం మరియు ఉత్తీర్ణులైన శిక్షలను మార్చడం ద్వారా ఎటువంటి ఉపశమనం పొందలేరు. *నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ తగ్గింపు (NAPDDR) ఈ లక్ష్యాల దిశగా పనిచేస్తుంది.* *NDPS చట్టం గురించి తరచుగా అడిగే ప్రశ్నలు* *ప్రశ్న 1* NDPS చట్టం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి? నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాల చట్టం, 1985 కూడా NDPS చట్టంగా పిలువబడుతుంది, ఏదైనా మత్తుమందు లేదా సైకోట్రోపిక్ పదార్ధం యొక్క ఉత్పత్తి, సాగు, అమ్మకం, కొనుగోలు, రవాణా, నిల్వ మరియు/లేదా వినియోగంతో కూడిన ఏదైనా కార్యాచరణలో పాల్గొనకుండా ఏ వ్యక్తిని నిషేధిస్తుంది. *ప్రశ్న2* నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాల మధ్య తేడా ఏమిటి? వైద్య దృక్కోణం నుండి, సైకోట్రోపిక్స్ అనేది ఒక వ్యక్తి యొక్క స్పృహ లేదా అపస్మారక మానసిక జీవితంపై మనస్సుపై పనిచేసే రసాయన పదార్ధాలను నిర్దేశిస్తుంది. నార్కోటిక్స్‌లో మూర్ఖత్వం, కండరాల సడలింపు మరియు సున్నితత్వాన్ని తగ్గించడం లేదా తొలగించడం వంటి పదార్థాలు ఉంటాయని తెలిపారు.

VijayaKumar

Jun 14 2024, 19:53

వెలువర్తి లో మన గ్రోమోర్ సంస్థ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలో మన గ్రోమోర్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా
మార్కెటింగ్ మేనేజర్ రాజ్ కుమార్ సేంద్రీయ రసాయనిక ఎరువుల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సురేష్, మార్కెటింగ్ మేనేజర్ జానకయ్య ,మన గ్రోమోర్ వలిగొండ మేనేజర్ రమేష్ ,ఫీల్డ్ ఆఫీసర్ రాజు, అనిల్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ చంద్రయ్య, రైతులు అంజయ్య, సాలయ్య, పాపయ్య ,బాలకృష్ణ ,ఉపేందర్, సురేష్ ,రాములు ,కిరణ్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.