నిజంనిప్పులాంటిది

May 26 2024, 07:43

పట్టభద్రుల ఓటు ఎవరికో ?

మూడు ఉమ్మడి జిల్లాలు.. ఐదు లోక్‌సభ నియోజకవర్గాలు.. 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న శాసనమండలి స్థానం. 4,63,839 మంది పట్టభద్రులైన ఓటర్లకు 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నియోజకవర్గం.

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారిన ఉప ఎన్నిక. 

దీంతో సోమవారం పోలింగ్‌ జరగనున్న వరంగల్‌-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కుమార్‌, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ తరఫున ఏనుగుల రాకే్‌షరెడ్డి బరిలోకి దిగారు. 

2007 నుంచి నాలుగు పర్యాయాలు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఏకపక్షంగా గెలవగా, ఐదోసారి కూడా మళ్లీ పాగా వేయాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే గులాబీ కోటకు ఎలాగైనా చెక్‌ పెట్టి తమ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్‌, బీజేపీ వ్యూహ, ప్రతివ్యూహాలతో హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. పట్టభద్రులను ఆకట్టుకునేందుకు అత్మీయ సమ్మేళనాలు, ఫోన్‌కాల్‌ పలకరింపులు, వాకర్స్‌తో మాటామంతీ లాంటి కార్యక్రమాలతో ప్రచారాన్ని హోరెత్తించారు.

నిజంనిప్పులాంటిది

May 26 2024, 07:39

Breaking : కరీంనగర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత !

- స్పందించిన ఎంపీ బండి సంజయ్ కుమార్

- పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్

కరీంనగర్‌లో పరిస్థితి అదుపుతప్పింది. నిన్న (26-5-2024) హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. శనివారం రాత్రి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సివిల్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న హనుమాన్ ఆలయం నుంచి, గాంధీ రోడ్డు లోని హనుమాన్ ఆలయం వరకు.. ఈ శోభయాత్ర జరపాలని ప్రారంభించారు.

హనుమాన్ మాల వేసిన వారు ర్యాలీ చేస్తుండగా.. కొందరు వ్యక్తులు వచ్చి ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో హనుమాన్ భక్తులు ఆందోళన చేశారు. జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు కరీంనగర్ వైపు చూసే పరిస్థితి. అక్కడ జరిగిన పరిణామాలు ఉద్రిక్తతకు దారితీశాయి. హనుమాన్ శోభాయాత్రలో తోపులాటతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు లాఠీఛార్జ్ చెయ్యడంతో కొంతమందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై బండి సంజయ్ స్పందించారు.

నిజంనిప్పులాంటిది

May 25 2024, 12:00

Blast in Factory:ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం గన్‌పౌడర్‌ ఫ్యాక్టరీలో పేలుడు 17మంది దుర్మరణం..

Blast in Factory : ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం ఘోరం జరిగింది. బెమెతారా జిల్లా బెర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలో గన్‌పౌడర్‌ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది..

ఈ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బిల్డింగ్‌ మొత్తం కుప్పకూలింది. దాంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా భవన శిథిలాల కింద చిక్కుకున్నారు..

ఫ్యాక్టరీలో పేలుడు శబ్ధం వినిపించగానే స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. 17 మృతదేహాలను శిథిలాల నుంచి బయటికి తీసి పోస్టుమార్టానికి పంపించారు. పలువురు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..

నిజంనిప్పులాంటిది

May 25 2024, 11:27

MPని చంపి.. చర్మం ఒలిచి, ముక్కలుగా నరికి నగరమంతా పారేసిన వైనం

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్ ఇటీవల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.

 అయితే ఎంపీ అన్వరుల్ హత్యకు సంబంధించి సీఐడీ తాజాగా షాకింగ్ విషయాలను వెల్లడించింది

ఓ మహిళను ఎరవేసి హనీ ట్రాప్‌ ద్వారా ఎంపీని కోల్‌కతాకు రప్పించి.. 

ఓ అపార్ట్‌మెంట్‌లో హత్య చేశారు. 

అనంతరం చర్మం వలిచి, ముక్కలుగా నరికారు. 

వాటిని ప్లాస్టిక్‌ బ్యాగ్‌ల్లో నగరమంతా పారేశారని సీఐడీ అధికారులు తెలిపారు. 

ఈ కేసుకు సంబంధించి జిహాద్‌ హవల్దార్‌ను సీఐడీ అరెస్ట్‌ చేసినట్లు తెలిపింది.

నిజంనిప్పులాంటిది

May 25 2024, 11:25

విశాఖలో అయ్యనార్‌ ఆపరేషన్ సక్సెస్‌.. 48 గంటల్లోనే ఇంటికి చేరారు బాధితులు

విశాఖపట్నంలో అయ్యనార్‌ ఆపరేషన్ సక్సెస్‌.. 48 గంటల్లోనే ఇంటికి చేరారు బాధితులు. 

కాంబోడియాలో చిక్కుకున్న విశాఖ బాధితులకు సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌ బాసటగా నిలిచారు.

 సైబర్‌ క్రైమ్‌ గ్యాంగ్‌ చేతిలో చిత్రహింసలకు గురైన వారిని విశాఖకు రప్పించి శభాష్‌ అనిపించుకున్నారు.

 ఇంతకీ.. కంబోడియాలో విశాఖ వాసులు ఎందుకు చిక్కుకున్నారు?.. 

వారిని రప్పించేందుకు అయ్యనార్‌ చేసిన ఆపరేషన్ ఏంటి?…

సైబర్‌ క్రైమ్‌ కేటుగాళ్లు రోజుకో రూటులో నేరాలు చేస్తూ రెచ్చిపోతూనే ఉన్నారు. రూట్‌ చేంజ్‌ అంటూ.. ఇప్పుడు కొత్త పంథా ఎంచుకున్నారు. ఉద్యోగాల పేరుతో భారతీయులను వాళ్ల దేశాలకు తీసుకెళ్లి.. మన కంటిని మన వేళ్లతోనే పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. అవును.. సరిగ్గా ఇలాంటి కేసే విశాఖలో వెలుగులోకి వచ్చింది. కాంబోడియాలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు విశాఖ పోలీసులు. ఒక వ్యక్తి ఫిర్యాదుతో కంబోడియా గ్యాంగ్‌ డొంకనే పెకిలించారు విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌. ఈ కేసులో దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ బాగోతాన్ని గుర్తించడమే కాదు.. మానవ అక్రమ రవాణా కోణాన్ని వెలికి తీశారు.

ఇక.. ఈ కేసులో ఇప్పటికే విశాఖకు చెందిన ముగ్గురు ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా వివరాలు, వారి మోసాలపై CP రవిశంకర్‌ అయ్యానార్‌ దృష్టి సారించారు. కొందరు విశాఖ ఏజెంట్లు.. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో 150 మంది నిరుద్యోగులను పంపడంతో కాంబోడియా గ్యాంగ్‌ నిర్బంధించినట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిన తర్వాత భారతీయుల వీసాలు చించివేయడంతో ఆ కేటుగాళ్ల ఉచ్చులో పడుతున్నారని.. ఇలా.. దేశవ్యాప్తంగా కంబోడియా గ్యాంగ్‌ చేతిలో సుమారు 5వేల మంది చిక్కుకున్నట్లు దర్యాప్తులో తేలడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

వివిధ రాష్ట్రాల వారిని తీసుకెళ్లి నిర్బంధించినట్లు వెల్లడైంది. అంతేకాదు.. మనవాళ్లకు పలు రకాల స్కామ్‌ల్లో ట్రైనింగ్‌ ఇచ్చి.. మనదేశంపైనే సైబర్‌ ఎటాక్‌ చేయిస్తుండడం సంచలనంగా మారింది.

ఇక.. కంబోడియా గ్యాంగ్‌ మన వాళ్లను అక్కడికి ఎలా తీసుకెళ్తున్నారు?.. మనవాళ్లతో సైబర్‌ నేరాలు ఎలా చేయిస్తున్నారు? ఆ గ్యాంగ్‌ గుట్టు ఎలా రట్టు చేశారు?.. అనే కీలక విషయాలను వెల్లడించారు విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో విశాఖ ఏజెంట్లు నిరుద్యోగులను కంబోడియా ఏజెంట్లకు అమ్మేస్తున్నారన్నారు. ఇలా చేయడం ద్వారా విశాఖ ఏజెంట్లకు కంబోడియా గ్యాంగ్‌ ఒక్కొక్కరికి 50వేలు చొప్పున ఇస్తున్నారని తెలిపారు.

మొత్తంగా.. కంబోడియా కేటుగాళ్ల కేసులో విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌ ఆపరేషన్ సూపర్‌ సక్సెస్‌ అయింది. కంబోడియాలోని ఇండియన్‌ ఎంబసీ సహకారంతోనే 48 గంటల్లో బాధితులను తీసుకొచ్చి శభాష్‌ అనిపించుకున్నారు. ఇక.. దేశ వ్యాప్తంగా జరిగిన సైబర్‌ స్కామ్‌కు సంబంధించి డొంక కదిలించేందుకు సిద్ధమవుతున్నారు విశాఖ పోలీసులు.

నిజంనిప్పులాంటిది

May 25 2024, 11:21

గుడివాడలో మాయా లేడి

•మాయ మాటలు చెప్పి కోటిన్నర కాజేసిన మాయలేడి లీలావతి

•నమ్మించి మోసం చేసింది ఓ మాయలేడి. 

కృష్ణా జిల్లా గుడివాడలో అమాయకులకు మాయమాటలు చెప్పి కోటిన్నర కాజేసింది మాయలేడి. గుడివాడలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది.

మాయ లేడి లీలావతిపై చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలంటూ రూరల్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ప్రైవేటు బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో రుణాలు ఇప్పిస్తానంటూ లీలావతి మాయమాటలు చెప్పింది. లక్ష్మీ నగర్ కాలనీ, బాపూజీ నగర్, చౌదరి పేట, ఆర్టీసీ కాలనీ, టీడ్కో కాలనీ, జగనన్న కాలనీల్లోని మహిళలతో 60 గ్రూపులు ఏర్పాటు చేసింది.

గ్రూపుల్లోని సభ్యులకు మంజూరైన రుణాల్లో మాయ మాటలు చెప్పి కోటిన్నర తీసుకుంది. రుణాలు ఇప్పిస్తానంటూ పలువురి వద్ద బంగారు ఆభరణాలు తీసుకొని తాకట్టు పెట్టింది. రుణాలు చెల్లించకపోవడంతో, బ్యాంకుల ప్రతినిధులు బాధితుల ఇళ్లకు రావడంతో వారు లీలావతి కోసం వెతికారు.

ఆమె అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయింది. లీలావతి హైదరాబాదులోని మియాపూర్‌లో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లి ప్రశ్నించిన ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలోనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదగు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

నిజంనిప్పులాంటిది

May 25 2024, 08:59

జూన్‌ 27 నుంచి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ !

- 19 నుంచి రెండో దశ కౌన్సెలింగ్‌

- 3 దశల్లో కౌన్సెలింగ్‌.. షెడ్యూల్‌ విడుదల

- జూలై 12న మొదటి దశ సీట్ల కేటాయింపు

- జూలై 19 నుంచి రెండో దశ కౌన్సెలింగ్‌

- మూడు దశల్లో కౌన్సెలింగ్‌ నిర్వహణ

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వెల్లడైంది. ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి మొత్తం మూడు దశల్లో కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. ఈమేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన అడ్మిషన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. 

జూన్‌ 27వ తేదీ నుంచి ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. మొదటి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా జూన్‌ 27 నుంచి జూలై 5 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్‌ చేసుకుని కౌన్సెలింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

జూన్‌ 29 నుంచి జూలై 6 వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, జూన్‌ 30 నుంచి జూలై 8 వరకు సీట్లకు సంబంధించిన వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 12న మొదటి దశ సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 12 నుంచి 16 వరకు ఫీజు చెల్లించడంతోపాటు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. 

జూలై 19 నుంచి రెండో దశ కౌన్సెలింగ్‌ మొదలుకానుంది. ఈ దశలో జూలై 24న సీట్లను కేటాయించనున్నారు. జూలై 30 నుంచి తుది దశ కౌన్సెలింగ్‌ మొదలవుతుంది. ఈ దశలో ఆగస్టు 5న సీట్లను కేటాయిస్తారు. ఆ తర్వాత కూడా భర్తీ కాకుండా సీట్లు మిగిలితే వాటి భర్తీ కోసం ఆగస్టు 17న స్పాట్‌ అడ్మిషన్‌ ప్రక్రియను నిర్వహించనున్నారు.

నిజంనిప్పులాంటిది

May 25 2024, 08:56

తడిసిన ధాన్యం కొనేదెప్పుడు ?

సీఎం చెప్పినా ముందుకు సాగని కాంటా.. తడిసిన ధాన్యం కొనే దిక్కులేదు!

- అకాల వర్షాలకు తడుస్తున్న ధాన్యం 

- చాలా ప్రాంతాల్లో కొనుగోలు కానీ ధాన్యం

- కొనుగోలు చేసిన చోట మిల్లర్ల కొర్రీలు

- అకాల వర్షాలతో రైతులు ఆగమాగం

- తడిసిన ధాన్యంతో అన్నదాతల ఆందోళన

- మంత్రులు, అధికారులు పోలింగ్‌లో నిమగ్నం

- రైతులను పట్టించుకునే నాథుడే కరువు

 అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినా ఎక్కడా అమలు కావడం లేదు. తడిసిన ధాన్యాన్ని కొనేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. మళ్లీ ఆరబెట్టి తీసుకురావాలని చెప్తున్నారు. ఎక్కడో ఒక చోట రైతుల ఒత్తిడి తట్టుకోలేక కొనుగోలు చేస్తే.. ఆ ధాన్యాన్ని దించుకునేందుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారు. ఈ తడిసిన ధాన్యం తామేం చేసుకుంటామని, తిరిగి బియ్యం ఏ విధంగా ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి మాటకే దిక్కులేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అకాల వర్షాలు .. ప్రభుత్వ నిర్లక్ష్యం !

ఓవైపు అకాల వర్షాలు రైతులపై పగబడితే.. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వారికి మరింత నష్టం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు రైతులను నిండాముంచాయి. చేతికొచ్చిన మిగిలిన పంటతోనైనా పెట్టుబడి వస్తుందనుకున్న రైతులకు ప్రభుత్వం నుంచి నిరాశే ఎదురవుతున్నది. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల కష్టాలను, నష్టాలను మరింత పెంచుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రంలోకి ధాన్యం తీసుకొచ్చి వారం పది రోజులవుతున్నా.. కాంట పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఓసారి ధాన్యం తడిసిందని, మరోసారి ధాన్యం ఎండలేదని, ఇంకోసారి తాలు ఉందని ఇలా ఎప్పటికప్పుడు సాకులు చెబుతూ వాయిదాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికలు కూడా రైతుల నష్టాన్ని మరింత పెంచాయి. అధికారులంతా పోలింగ్‌లో నిమగ్నంకావడంతో కొనుగోళ్లు మరింత ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

2వేల కోట్ల బకాయిలు ఎప్పుడో ?

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం… రైతులకు డబ్బులు చెల్లింపుల్లోనూ ఇదే తరహా నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 26 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి రైతులకు సుమారు రూ. 5700 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా రూ. 3700 కోట్ల వరకు చెల్లించినట్టు తెలిసింది. అంటే ఇంకా రైతులకు రూ. 2వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ఆలస్యంగా ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ధాన్యం అమ్ముకున్న డబ్బులు కూడా ఆలస్యంగా ఇస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం విక్రయించిన వారం పది రోజులకు కూడా డబ్బులు పడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

May 24 2024, 17:52

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ !

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల(telangana formation day 2024) నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. జూన్ 2న జరిపే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు ఎన్నికల సంఘం(Election Commission) అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఈసీ అనుమతితో సీఎస్ శాంతకుమారి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్(secunderabad) పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు సీఎస్ తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్ రెండవ తేదీ కార్యక్రమానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. గన్ పార్క్ కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి పరేడ్ గ్రౌండ్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్నారు.

జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని(sonia gandhi) ఆహ్వానించాలని కాంగ్రెస్(congress) ప్రభుత్వం నిర్ణయించింది. యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన పదేళ్ల తర్వాత తొలిసారిగా సోనియా గాంధీ ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశం, పంట రుణాల మాఫీని తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు 2024 పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని ఇటివల ఎన్నికల సంఘం తెలిపింది.

దీంతోపాటు ఎన్నికల నిర్వహణలో ప్రమేయం ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారిని సమావేశానికి పిలవవద్దని ఈసీ(EC) ఆదేశించింది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అనేక ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ క్రమంలో ఏదైనా కొత్త ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటే ఎన్నికల సంఘం అనుమతి తప్పక తీసుకోవాల్సిందే.

నిజంనిప్పులాంటిది

May 24 2024, 12:04

రాజకీయ పార్టీ అభ్యర్థులనే కాకుండా స్వతంత్ర అభ్యర్థులవైపు కూడా చూడండి...

•పాలకూరి రవి గౌడ్, నల్గొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి

 ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో రాజకీయ పార్టీల అభ్యర్థులనే కాకుండా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారిని గెలిపించడానికి మేధావులైన పట్టభద్రులను కృషి చేయాలని, అదే విధంగా తమ అమూల్యమైన ఓటును స్వతంత్ర అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతగా వేసి గెలిపించుకోవాలని నల్లగొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి రవి గౌడ్ కోరారు..

నిరుద్యోగుల సమస్యల నుండి పుట్టుకొచ్చిన స్వతంత్ర అభ్యర్థులను గెలుపించుకుంటే పెద్దల సభలో తమ సమస్యల గురించి పొరడగలుగుతారు అని అన్నారు..

గతంలో ఆయా పార్టీల అభ్యర్థులను గేలిపించుకుంటే ఆ పార్టీకి ఒక సంఖ్య పరంగా బలం పెరిగింది తప్పా నిరుద్యోగ సమస్యలు పరిష్కారం కాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు..

కొన్ని రాజకీయ పార్టీల నుండి బరిలో వున్నా అభ్యర్థులు ఆ పార్టీ నుండి వచ్చే పార్టీ ఫండ్ నొక్కేయడానికే పోటీలో ఉన్నారు అని.. అలాంటి వ్యక్తులకు మీ అమూల్యమైన ఓటు వేసిన హృదయ అవుతుంది అని అన్నారు..

కాబట్టి మీరు చదువుకున్న ఓటర్లు కాబట్టి మీకున్న సమస్యలను పరిష్కారమ్ చేయగలుగుతాడు అనే నమ్మకం వున్న అభ్యర్థికి ఓటు వేసి గెలిపించుకోవాలని నల్గొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్ధి పాలకూరి రవి గౌడ్ కోరారు...