కోమటిరెడ్డి బ్రదర్స్ ను విమర్శించే స్థాయి జగదీశ్ రెడ్డి కి లేదు: కాంగ్రెస్ జిల్లా నాయకులు కూనూరు సాయికుమార్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర సాధనలో తన మంత్రి పదవిని సైతం వదులుకొని నిరాహార దీక్ష చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినీ విమర్శించే స్థాయి జగదీష్ రెడ్డికి లేవని కాంగ్రెస్ జిల్లా నాయకులు కునూరు సాయి కుమార్ గౌడ్ అన్నారు. పది సంవత్సరాలు మంత్రిగా ఉండి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలిపించుకోలేని అసమర్థ మంత్రి జగదీష్ రెడ్డి అని అన్నారు. కెసిఆర్ దగ్గర నీవు ఏమి చేసేవాడివో మీ సొంత పార్టీ వాళ్లే చెబుతున్నారు. 10, సంవత్సరాలు మంత్రిగా ఉండి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నీవల్ల ఒరిగిందేమీ లేదని నీవల్లనే చాలామంది ఓడిపోయామని మీ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే లంతా బాహాటంగానే విమర్శిస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అవినీతిపై అతి త్వరలో జైలుకు వెళ్ళబోవాల్సి వస్తుందని జగదీష్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ పై రాద్దాంతం చేస్తున్నారు. మానవత్వానికి మంచి పేరు అయినా మా కోమటిరెడ్డి బ్రదర్స్ పై మరోసారి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలమంతా నీకు సరైన బుద్ధి చెబుతామని ఇదే నీకు చివరి హెచ్చరిక అని అన్నారు.






ప్రశ్నించే వారు లేకుంటే సమాజం అధోగతి పాలవుతుంది తప్పుడు ఆలోచన లే రాజ్యమేలు తాయి సిపిఎం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నీకి సిపిఎం అభ్యర్థిగా ప్రజా ఉద్యమనాయకుడైన ఎండి జాంగిర్ గారు పోటీ చేస్తున్నారు గెలిపించాలని ప్రజలని కోరారు ఈరోజు శనివారం రోజున భువనగిరి మండలం చీమల కొండూరు లో సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నరసింహ పాల్గొని మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా కమ్యూనిస్టు రాజకీయాల్లో జీవితంలో అనేక సవాలను ఎదుర్కొని నిజాయితీగా ప్రజా సమస్యలపై పోరాటమే దినచర్య కొనసాగుతున్న ఎండి జాంగిర్ గాని వర్గాల ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్ట తో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ము కావున ప్రజలందరూ అన్ని రకాల వర్గాలు సిపిఎం పార్టీని ఆదరించి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకై మీ ఓటు వేసి గెలిపించాలని నరసింహ అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య సిపిఎం శాఖ కార్యదర్శి బోడ ఆంజనేయులు గ్రామ నాయకులు రావుల పోశయ్య జయమ్మ గ్రామ ప్రజలు జయమ్మ మల్లయ్య శ్రీశైలం బిక్షపతి పద్మ ఎల్లమ్మ కాశమ్మ లక్ష్మి రజిని మల్లమ్మ రేణుక లలిత తదితరులు పాల్గొన్నారు.

యోగ మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని వెంకిర్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్ లో ఉచిత యోగ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించడం జరిగినది . ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు యోగ మాస్టర్ సుధాకర్ మాట్లాడుతూ ఈ యోగా శిబిరం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందని, యోగా శిక్షణలో పాల్గొనడం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. తమ సంస్థ గత ఆరు సంవత్సరాలుగా గ్రామంలో నిస్వార్ధంగా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని అన్నారు . ఈ శిబిరం వేసవి సెలవులలో పూర్తిగా కొనసాగుతుందని ,విద్యార్థులు ఎవరైనా పాల్గొనవచ్చు అని తెలిపారు ,ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హెడ్మాస్టర్ చంద్ర రెడ్డి, మహర్షి మోడల్ హై స్కూల్ కరస్పాండెంట్ పి మల్లేష్ గౌడ్, వెంకిర్యాల వాస్తవ్యులు పోచారం మున్సిపల్ కార్పొరేటర్ చింతల రాజశేఖర్, సభ్యులు జిలుకపల్లి లక్ష్మీనారాయణ ,ముడుపు రాకేష్ ,కొండ శ్రీనాథ్ రెడ్డి, చిలుకూరు జంగయ్య మిత్రబృందం, విద్యార్థులు మరియు గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.



Apr 28 2024, 12:33
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.9k