బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ కు అధిక సంఖ్యలో తరలిరండి: బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ రేపటి నామినేషన్ కార్యక్రమానికి బిజెపి, బీజేవైఎం కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. భువనగిరి కోట మీద ఎగిరేది బిజెపి జెండానే అని అన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్. జయశంకర్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, డాక్టర్ కె. లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు,ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పాల్గొననున్నారని తెలిపారు. జిల్లా నుండి బిజెపి, బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున నామినేషన్ ర్యాలీలో పాల్గొనాలని కోరారు.
SB NEWS NLG
Apr 23 2024, 13:32