ఘనంగా పి.ఆర్.టి.యు సీనియర్ కార్యకర్త, సర్వేల్ పాఠశాల ఉపాధ్యాయునీరాలు ఎస్. విజయలక్ష్మి కి సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా:
నారాయణపూర్: మండల వనరుల కేంద్రంలో ఈరోజు, పిఆర్టియు సీనియర్ కార్యకర్త, సర్వేల్ పాఠశాల టీచర్ ఎస్. విజయలక్ష్మిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పిఆర్టియు నాయకులు మాట్లాడుతూ.. పి ఆర్ టి యు కార్యకర్త విజయలక్ష్మి ఏప్రిల్ మాసంలో పదవీ విరమణ కాబోతున్న సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానించామని తెలిపారు. కార్యక్రమంలో మండల నోడల్ అధికారి జి.శ్రీనివాస్, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ రమ, మండల ప్రధాన కార్యదర్శి దోర్నాల రాము, రాష్ట్ర బాధ్యులు సురేందర్ రెడ్డి, హరి కిషన్ రెడ్డి, జిల్లా బాధ్యులు చొల్లేటి శ్రవణ్ కుమార్, యాదిరెడ్డి, మండల కార్యదర్శి పబ్బు దేవేందర్, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Feb 07 2024, 14:37
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.5k