నిజందాగదుక్షణంఆగదు

Feb 05 2024, 20:46

నల్లగొండ: బిఆర్ఎస్ నాయకులు పెండం ధనుంజయ కు మాతృవియోగం.. పరామర్శించిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే..

 నల్లగొండ పద్మా నగర్ నుండి...

 బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, పెండెం ధనుంజయ నేత... మాతృమూర్తి పెండెం నాగమణి గారు మృతి చెందటంతో.... నేడు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంట కండ్ల జగదీశ్ రెడ్డి గారు, వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు...ఈ సందర్బంగా వారు తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ... కుటుంబ సభ్యులకు ధైర్యవచనాలు పలికారు... ఇంకా వీరితోపాటు.. జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ గారు, నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్ గారు...

స్థానిక నాయకులు...రాపోలు దత్త గణేష్, పెండం సదానందం,పట్టణ పార్టీ కార్యదర్శి సంధినేని జనార్దన్ రావు మిర్యాల యాదగిరి..రావుల శ్రీనివాస రెడ్డి..చెరుపల్లి జయప్రకాశ్, వనం శేఖర్ తదితరులు వెంట ఉన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 05 2024, 16:18

ఢిల్లీ: ఎన్నికలు సమీస్తున్న వేళ ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం కొత్త రూల్స్‌...

ఢిల్లీ: ఎన్నికలు సమీస్తున్న వేళ ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం కొత్త రూల్స్‌.. ఎన్నికల ప్రచారం, ర్యాలీల్లో చిన్నపిల్లలను ఉపయోగించరాదు.. సమావేశాలు, పోస్టర్లు, పాంప్లేట్‌ల పంపిణీలో కూడా పిల్లలను ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం-సీఈసీ

నిజందాగదుక్షణంఆగదు

Feb 05 2024, 16:07

నేటి సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకి ప్రత్యేక రైలు..

నేటి సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకి ప్రత్యేక రైలు.. రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ.. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి రైలును ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

నిజందాగదుక్షణంఆగదు

Feb 05 2024, 14:00

ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా...

ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా. ఈ నెల 16కు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. ఈడీ విచారణ తీరును తప్పుబడుతూ కవిత పిటిషన్‌. సీఆర్పీసీ నిబంధనలు పాటించడంలేదని..ఈడీ ఆఫీస్‌లో మహిళను విచారించడం సరికాదంటూ పిటిషన్‌. అభిషేక్‌బెనర్జీ కేసుతో జత చేస్తామన్న సుప్రీంకోర్టు.. అన్ని పిటిషన్లను కలిపి విచారించనున్న సుప్రీంకోర్టు. ఈ నెల 16న జరగనున్న తుది విచారణ.

నిజందాగదుక్షణంఆగదు

Feb 05 2024, 08:35

యాదాద్రి వాసవి నిత్య అన్నదాన సత్రం కు బారి విరాళం ప్రకటించిన సూర్యాపేట రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు ఇమ్మడి సోమ నరసయ్య

యాదాద్రి వాసవి నిత్య అన్నదాన సత్రం కు బారి విరాళం ప్రకటించిన ఇమ్మడి సోమ నరసయ్య

మరో సారి తన దాతృత్వం కు చాటుకున్న జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్స్ అద్యక్షులు ఇమ్మడి సోమ నరసయ్య

సత్రం లో జరుగు నిత్య అన్నదానము కు ఒక ఏడాది పాటు సరిపోను బియ్యం దాత గా ప్రకటన

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని తెలంగాణలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం సురేంద్రపురిలో నూతనంగా నెలకొల్పిన శ్రీ వాసవి నిత్యాన దాన సత్ర కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి నిత్యాన్న సత్రం అభివృద్ధిపై సమావేశం నిర్వహించగా పలువురు తమ అభిప్రాయాలను తెలియజేశారు. సత్రం అభివృద్ధి కమిటీ సభ్యులు సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమ నరసయ్య అన్నదాన సత్రంకు మరో సారి భారీ విరాళం ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఒక సంవత్సరం పాటు సత్రంలో జరుగు అన్నదాన కార్యక్రమానికి సరిపడు బియ్యం కు సంపూర్ణ దాతగా ఆర్థిక సహకారం ప్రకటించడంతో కమిటీ సభ్యులు హర్షద్వనాలు చేసి ఘనంగా సన్మానించారు. వీరు గతంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములకు జరుగు అన్నప్రసాద కార్యక్రమానికి 100 క్వింటాళ్ల బియ్యం ఇవ్వడంతో పాటు, అయోధ్యలోని శ్రీ రామయ్య దర్శనానికి వచ్చే భక్తులకు శ్రీ అమర్నాథ్ అన్న అన్నదాన సేవాసమితి కి 200 కింటాలు బియ్యం అందజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి నిత్యాన్నదాన సత్రం చైర్మన్ అయిత రాములు కార్యదర్శి ఇరుకుల్ల రామకృష్ణతో పాటు సభ్యులు కక్కిరేణి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు..

నిజందాగదుక్షణంఆగదు

Feb 05 2024, 08:31

అమరావతి: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

అమరావతి: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. తొలిరోజు గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం.. ఈ నెల 7న ఓటాన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి.. 10 ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైన టీడీపీ.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రోజూ నిరసన తెలుపుతూ అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం.

నిజందాగదుక్షణంఆగదు

Feb 05 2024, 08:28

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,679 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,717 మంది భక్తులు.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 04 2024, 18:48

నల్లగొండ బిజెపి పార్టీ అధ్యక్షునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టేల శివకుమార్

నల్లగొండ బిజెపి పార్టీ అధ్యక్షునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టేల శివకుమార్

నల్గొండ జిల్లా బీజేపీ జిల్లా కార్యాలయం నందు బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షులు అయినటువంటి నాగం వర్షిత్ రెడ్డి గారిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించి పూల మొక్క జ్ఞాపికగా అందజేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ప్రమోద్ చింతపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు

నిజందాగదుక్షణంఆగదు

Feb 04 2024, 16:33

అమరావతి: సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన..

అమరావతి: సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన..

చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. జనసేనకు 25 స్థానాలు ఇస్తామంటున్న టీడీపీ.. ఎక్కువ స్థానాలు కావాలని పట్టుబడుతున్న పవన్.. ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తున్న పవన్.. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో సీటు కావాలని పట్టుబడుతున్న పవన్.. దాదాపు కొలిక్కివచ్చిన సర్దుబాట్లు.. ఒకట్రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటుపై క్లారిటీకి రానున్న టీడీపీ-జనసేన

నిజందాగదుక్షణంఆగదు

Feb 04 2024, 16:26

ములుగు: మేడారానికి పోటెత్తిన భక్తులు...

ములుగు: మేడారానికి పోటెత్తిన భక్తులు

సెలవుదినం కావడంతో భారీగా తరలివస్తున్న భక్తులు

మేడారానికి వేలాదిగా వచ్చిన వాహనాలు

సుమారు 2 లక్షలమంది భక్తులు దర్శించుకున్నట్టు అంచనా

33 ప్రాంతాల్లో పార్కింగ్,500 సీసీ కెమెరాలు ఏర్పాటు