నిజంనిప్పులాంటిది

Nov 06 2023, 09:58

జగత్ విజేతగా టీమిండియా

స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ వరుసగా ఎనిమిదో విజయం ఖాతాలో వేసుకుంది.

కష్టతరమైన పిచ్‌పై బ్యాటర్ల మొక్కవోని దీక్షకు.. బౌలర్ల సహకారం తోడవడంతో టీమ్‌ఇండియా అజేయంగా నిలిచింది. ఆదివారం కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన పోరులో రోహిత్‌ సేన 243 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది.

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. తన 35వ పుట్టినరోజు నాడు బర్త్‌డే బాయ్‌ విరాట్‌ కోహ్లీ (121 బంతుల్లో 101 నాటౌట్‌; 10 ఫోర్లు) సూపర్‌ సెంచరీతో కదంతొక్కితే.. శ్రేయస్‌ అయ్యర్‌ (77; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అతడికి అండగా నిలిచాడు.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (24 బంతుల్లో 40; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వగా.. రవీంద్ర జడేజా (15 బంతుల్లో 29 నాటౌట్‌; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌) అద్భుత ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, జాన్సెన్‌, రబడ, కేశవ్‌ మహరాజ్‌, షంసీ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకు ఆలౌటైంది. నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు చేయగా.. ఒక్కరు కూడా 15 పరుగుల మార్క్‌ దాటలేకపోయారు.

వరల్డ్‌కప్‌లో సెంచరీల మోత మోగిస్తున్న డికాక్‌ (5), బవుమా (11), డసెన్‌ (13), మార్క్మ్‌ (9), క్లాసెన్‌ (1), మిల్లర్‌ (11), జాన్సెన్‌ (14) ఇలా ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొడితే.. మహమ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.

రికార్డు సెంచరీ బాదిన కోహ్లీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. టీమ్‌ఇండియా తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ వచ్చే ఆదివారం నెదర్లాండ్స్‌తో తలపడనుంది...

నిజంనిప్పులాంటిది

Nov 06 2023, 09:57

నేడు సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం బృందం పర్యటన

ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం బృందం సోమవారం పర్యటించనుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి రాష్ట్ర టీడీపీ వ్యవసాయ కమిటీ బృందం నిర్ణయించింది.

వివరాలు

సోమవారం ఉదయం 10:40 గంటలకు ఉరవకొండ నియోజకవర్గం, కూడేరు మండలం, ఇప్పేరు సమీపంలో వేరుశనగ, ఉలవ పంటలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు శ్రీసత్యసాయిజిల్లా పెనుకొండ నియోజకవర్గంలో పర్యటిస్తారు. 2:30 గంటలకు రొద్దం మండలం, చోళేమర్రి క్రాస్‌లో వేరుశనగ పొలం పరిశీలిస్తారు.

సాయంత్రం 3:30 గంటలకు మడకశిర మండలం, కోడిగానిపల్లి సమీపంలో పంటలను పరిశీలించి.. వసల వెళ్ళిన వ్యవసాయ కూలీల కుటుంబసభ్యులతో టీడీపీ బృందం సమావేశమై.. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

కాగా అనంత ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో కరువు పరిశీలించేందుకు ఆదివారం రాత్రి జిల్లాకు వచ్చిన టీడీపీ రాష్ట్ర బృందం నాయకులకు ఘన స్వాగతం లభించింది.

ఆ బృందంలో మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

స్థానిక మాసినేని హోటల్‌ వద్ద టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, గంజే నాగరాజు, నాయకులు సరిపూటి రమణ, నారాయణస్వామి యాదవ్‌, బ్రహ్మయ్య, షణ్ముఖ, రజాక్‌, సరిపూటి శ్రీకాంత స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

నిజంనిప్పులాంటిది

Nov 06 2023, 09:55

మంచిర్యాల జిల్లా మాజీ మంత్రి కాంగ్రెస్ కు రాజీనామా?

ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి బోడ జనార్దన్ ఆదివారం కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేశారు.రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కి ఫ్యాక్ ద్వారా పంపారు.

మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఈనెల 7న జరిగే బహిరంగ సభలో బిఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షములో గులాబీ కండువా కప్పుకోనున్నారు.

ఈ విషయమై జనార్దన్ ను మీడియా ప్రతినిధిలు సంప్రదించగా వాస్తవమేనన్నారు. బిఆర్ఎస్ లో రాష్ట్ర అభివృద్ధి కోసమే చేరుతున్నానన్నారు. పదవులపై ఎలాంటి ఆశ లేదన్నారు.కాంగ్రెస్ పార్టీ నుంచి అయన రాజకీయ భవిష్యత్తు పై స్పష్టమైన హామీ రాకపోవడంతోనే పార్టీ కి రాజీనామా చేసినట్టు తెలిసింది.

ముందుగా చెన్నూర్ టికెట్ పై హామీ ఇవ్వడం జరిగిందని, ఆ తరువాత వివేక్ చేరిన తరువాత పెద్దపల్లి పార్లమెంట్ స్తానం పై కూడా పార్టీ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతోనే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు సమాచారం..

రెండు నెలల పాటు వివేక్ చేరికపై మంతనాలు జరిగాయి.చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కూడా జనార్దన్ కె చెన్నూర్ టికెట్ ఇస్తున్నట్టుగా కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలుచెప్పడం ఫలించిన మంతనాలు.

ఈ నెల 1న చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్,మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకార్ రావ్లు స్వయంగా మంచిర్యాల లోని మాజీ మంత్రి బోడ జనార్దన్ ఇంటికి వెళ్లి పార్టీలో చేరాలని ఆహ్వానించారు.

సుమారు నాలుగు గంటలకు పైగా చర్చలు జరిపారు.మరుసటి రోజు ఉదయం అల్పహారం సమయంలో బాల్క సుమన్ జనార్దన్ ఇంటికి వెళ్లి సుమారు రెండు గంటల పాటు మరోసారి మంతనాలు జరిపారు.

వీరితోపాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే,జనార్దన్ రాజకీయ శిష్యుడు దుర్గం చిన్నయ్య,పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతలు సైతం జనార్ధన్ తో పార్టీ లో చేరాలని ఆహ్వానించారు. నలుగురు నేతలు జరిపిన మంతనాల నేపథ్యంలో జనార్దన్ ఎట్టకేలకు గులాబీ తీర్థం పుచ్చుకోబోతున్నారు...

నిజంనిప్పులాంటిది

Nov 06 2023, 09:54

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సర్వసాధారణంగా ఉంది

తిరుమలలో నేడు సోమవారం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.

నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు 7 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.

అలాగే టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.

నిన్న ఆదివారం వీకెండ్ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

78,389 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది...

నిజంనిప్పులాంటిది

Nov 06 2023, 09:53

వాయుకాలుష్యంతో క్యాన్సర్ వచ్చే అవకాశం.. వైద్యనిపుణుల హెచ్చరిక..

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ప్రజలు తీవ్రమైన వాయు కాలుష్యంతో విలవిల్లాడుతున్నారు. గాలి నాణ్యత తీవ్రంగా పడిపోవడంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు..

వాయు కాలుష్యం హానికరమైనదని, మానవ శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తుందని వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. వాయు కాలుష్యం, వివిధ రకాల క్యాన్సర్ల మధ్య సంబంధాన్ని తెలియజేసే శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ ఎయిమ్స్ అదనపు ప్రొఫెసర్, డాక్టర్ పీయూష్ రంజన్ తెలిపారు.

వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యవస్థకు హాని కలిగించడమే కాకుండా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాల వ్యాధులకు కూడా దారితీస్తుందని పేర్కొన్నారు. శరీరంలోని వివిధ వ్యవస్థలను ప్రభావితం చేస్తుందని, ఈ విషయాన్ని తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమని అన్నారు.

వైద్య ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కడుపులోని పిండానికి కూడా వాయు కాలుష్యం హానికరమేనని, పిండంపై దుష్ప్రభావాలు చూపుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

అన్ని వయసులవారి మెదడు, గుండెను కాలుష్యం దెబ్బతీస్తుందని, ముందు జాగ్రత్తతో వ్యవహరించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోతోంది. వరుసగా నాలుగో రోజు ఆదివారం కూడా 'తీవ్రమైన' కేటగిరీలోనే 'వాయు నాణ్యత ఇండెక్స్' ఉంది..

నిజంనిప్పులాంటిది

Nov 06 2023, 09:49

ఊరూరా భోజనాలు.. నేతల బెంబేలు..!

•ప్రచారంలో రోజూ రూ.లక్షల్లో 'వడ్డింపు'

హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలకు, అభ్యర్థులకు రోజువారీ ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి..

ప్రచార సంరంభంలో భాగంగా.. గ్రామాల నుంచి పట్టణాల దాకా రోజూ పెద్దసంఖ్యలో సామూహిక భోజనాలు వండుతున్నారు. రోజూ వీధుల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించే వారికి నాయకులే భోజనాలు సమకూరుస్తున్నారు. దాదాపు ప్రతి గ్రామం, పట్టణంలో నిత్యం వేల మందికి భోజనాలు వండి వడ్డిస్తున్నారు.

వీటి కోసం హోటళ్లు, క్యాటరింగ్‌ నిర్వాహకులు పెద్దఎత్తున సరకులు కొని నిల్వ చేస్తున్నారు. నెల క్రితం వరకూ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి భారీగా కూరగాయలు, ఉల్లిగడ్డలు ఇతర సరకులు రాష్ట్రానికి వచ్చేవి. మహారాష్ట్రకు ఉత్తరాన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో, తూర్పున ఛత్తీస్‌గఢ్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో తెలంగాణకు కూరగాయల సరఫరా తగ్గిపోయింది. ప్రస్తుతం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక నుంచే వస్తున్నాయి..

నెలక్రితం వరకూ సాధారణ రోజుల్లో హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి టోకు మార్కెట్‌కు రోజూ 21 వేల క్వింటాళ్లకు పైగా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు సగానికి సగం తగ్గిపోయినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు జాతీయ మార్కెట్లలో నిత్యావసరాలకు గత నెలరోజుల్లో గణనీయంగా డిమాండు ఏర్పడిందని టోకు వర్తకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా భోజనాలకే రోజూ రూ.లక్షల్లో వెచ్చించాల్సి వస్తోందని అభ్యర్థులు వాపోతున్నారు. దీనికి తోడు పెళ్లి ముహూర్తాలు, కార్తికమాసం, అయ్యప్పదీక్షలు మొదలవుతుండటంతో ఊరూరా అన్నదానాలతో సందడి వాతావరణం నెలకొంటోంది. ఇలా నిత్యావసరాలకు డిమాండ్‌ పెరగడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది..

నిజంనిప్పులాంటిది

Nov 05 2023, 20:38

ప్రజా సేవకులు చెరుకు శివ గౌడ్ కి గోల్డెన్ నంది పురస్కారం అందజేత

స్థానిక చౌటుప్పల్ మున్సిపాలిటీ రాంనగర్ కాలనీకి చెందిన చెరుకు శివ గౌడ్ కి గోల్డెన్ నంది అవార్డును తెలంగాణ బీసీ కమీషన్ చైర్మన్ వకులబరణం కృష్ణ మోహన్ రావు,

హీరో కిరణ్ మరియు ప్రముఖ కవులు, అతిధుల చేతుల మీదుగా ఆదివారం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వేదికగా అందజేశారు.

నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ, అసమర్థ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ పేదలకు, విద్యార్థులకు సమస్యలు వస్తే తన వంతు సహాయ సహకారాలు అందజేస్తూ

ప్రజా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున చెరుకు శివ గౌడ్ కి ఈ పురస్కారం అందజేస్తున్నట్లుగా నిర్వాహకులు తెలియజేసారు.

ఈ సందర్బంగా చెరుకు శివగౌడ్ మాట్లాడుతూ ఇకపై రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Nov 05 2023, 19:09

గడప గడపకు ప్రచారాన్ని చేపట్టిన - బిజెపి

•నల్గొండ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ గారి సతీమణి మాదగాని విజయలక్ష్మి

నల్లగొండ పట్టణం 16వ వార్డులో చంద్రగిరి విలాస్ కాలనీలో గడప గడపకు వెళ్లి కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని

నల్లగొండ నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి - శ్రీ మాదగాని శ్రీనివాస్ గౌడ్ గారి సతీమణి మాదగాని విజయలక్ష్మి అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో వీరళ్ళి ఆండాళు,నేవర్సు నీరజ,కాశమ్మ,భవాని, హైమవతి,తార,దేవి, కవిత, ఆవుల మధు, నరాల శంకర్,పెరిక మునికుమార్, గుండెబోయిన శేఖర్, కోటి, తరాల వంశీ, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

నిజంనిప్పులాంటిది

Nov 05 2023, 16:00

కెసిఆర్ నియంత పాలన, దోపిడీ నుంచి విముక్తి పొందాలి

•బిజెపి గెలిస్తే రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి

•బిజెపి నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్

తెలంగాణలో కెసిఆర్ నియంత పాలన నుంచి విముక్తి పొందాలని బిజెపి నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని హైదరాబాద్ రోడ్ లో ఉన్న వీటి కాలనీ హనుమాన్ దేవాలయంలో బిజెపి నాయకులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం 36వ వార్డు వివేకానంద నగర్ కాలనీ, వీటి కాలనీ, యాట కన్నా రెడ్డి కాలనీలలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల ఊబీలో కూరుకుపోయిందని, ప్రజలంతా ఆలోచించి కెసిఆర్ కుటుంబ పాలన నుంచి బయటపడాలని, తెలంగాణను వారి దోపిడి నుంచి కాపాడాలని అన్నారు. కేవలం బిజెపి ప్రభుత్వం తోనే తెలంగాణలో కెసిఆర్ అవినీతి అక్రమాలను ఆపగలుగుతామన్నారు.

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ప్రజలు అన్ని రంగాల్లో బాగుపడతారని అన్నారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి వెళ్తున్న సందర్భంలో ప్రజలంతా ఆదరిస్తున్నారని, గతంలో టిడిపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఈ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా నల్గొండ గడ్డపై బిజెపి గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర నాయకులు బండారు ప్రసాద్ మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలో మాదగాని శ్రీనివాస్ గౌడ్ కు ఎంతో అనుబంధం ఉందని ఆయన పరిచయాలు కూడా నల్గొండలో బిజెపి గెలవడానికి అవసరం అయితాయన్నారు. ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి శ్రీనివాస్ గౌడ్ ను గెలిపించాలని అందుకోసం పార్టీ కార్యకర్తలు బూత్ సాయి అధ్యక్షులు ప్రతి ఒక్కరూ కంకణ బద్దలే పని చేయాలని సూచించారు.

నాగం వర్షిత్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ 20 ఏళ్లుగా నల్గొండకు ఎమ్మెల్యేగా వ్యవహరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభివృద్ధి చేసింది శూన్యమని, నల్గొండకు అవసరం లేదని వెంకటరెడ్డిని ఓడించి బయటకు పంపిన సిగ్గు లేకుండా మళ్లీ నియోజకవర్గానికి వచ్చారన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గత ఐదేళ్లుగా నల్గొండ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని అలాంటి నాయకున్ని ప్రజలు ఇంటికి పంపనున్నారన్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేశానని చెప్పిన పార్టీ బిజెపి అని అలాంటి బిజెపిని బీసీలంతా ఆలోచించి ఆదరించాలన్నారు.

ఈకార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, కౌన్సిలర్లు బొజ్జ మల్లిక నాగరాజు, రావిరాల పూజిత, వెంకటేశ్వర్లు, దాసరి సాయి, నూకల వెంకట్ నారాయణ రెడ్డి,ఆవుల మధు,చర్లపల్లి గణేష్, వంగూరి రాఖి, ఏరుకొండ హరి, యాట మధు, దీక్షిత్, మిర్యాల అంజిబాబు, కుమార్, మల్లికార్జున్, నవీన్, మధుకర్ రెడ్డి, మేక శీను, ఎడ్ల వెంకన్న, పులిపల్లి రవీందర్ రెడ్డి, బాలాజీ, సురేష్, జీవన్, కిరణ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Nov 05 2023, 13:34

మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్‌ ఆత్మహత్య?

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్‌ ఏఎస్‌ఐ ఫజల్‌ అలీ బలవన్మరణానికి పాల్పడ్డారు. సర్వీస్‌ రివాల్వర్ తో నుదిటిపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది .

హైదరాబాద్‌ అమీర్‌పేటలోని శ్రీనగర్‌ కాలనీలో ఉన్న ఓ హోటల్‌లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఆయన సూసైడ్‌ చేసుకున్నట్టు తెలిసింది . ఘటనా స్థలాన్ని మంత్రి సబిత, వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ పరిశీలించారు.

అయితే ఆదివారం ఉదయం కుమార్తెతో మాట్లాడిన ఫజల్‌.. ఆమె ఎదుటే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోస్టుమార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.

కాగా, ఏఎస్‌ఐ ఫజల్‌ అలీ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణమని ప్రాథమికంగా తెలుస్తున్నదని డీసీపీ జోయల్‌ డేవిస్‌ అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్నారని చెప్పారు.

ఆదివారం ఉదయం 6 గంటలకు తన కూతురుతో కలిసి విధులకు హాజరయ్యారని, 7 గంటల సమయంలో సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

హోటల్‌ దగ్గర వ్యక్తిగత విషయాల గురించి కుమార్తెతో చర్చించినట్లు తెలిసింది.పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.,..