నిజంనిప్పులాంటిది

Sep 26 2023, 10:29

గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు: సి పి, డిఎస్ చౌహన్

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు.

కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న డిసిపిలు, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, అధికారులతో నాచారంలోని ఐఐసిటిలో సోమవారం సాయంత్రం సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

గణేష్ విగ్రహాల నిమజ్జనం విషయంలో నిర్వాహకులతో, ఇన్‌స్పెక్టర్లు సమన్వయం చేసుకోవాలని అన్నారు. గణేష్ నిమజ్జనం సమయంలో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతిభద్రతల విషయంలో అందరు అధికారులు సమిష్టిగా పనిచేయాలని కోరారు.

నిమజ్జనం ఎక్కువగా సాగే చెరువులు, కుంటల మార్గాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. రాచకొండ పోలీస్ అధికారులు, జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖ, నీటి పారుదల శాఖ, విద్యుత్, రవాణా శాఖ తదితర శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ గణేష్ నిమజ్జనం శాంతియుతంగా సజావుగా సాగేలా చూడాలన్నారు.

సీసీటీవీల ద్వారా నిమజ్జనం సాగే మార్గాల ట్రాఫిక్ ను , నిమజ్జనం జరిగే చోట పరిస్థితులను ప్రతిక్షణం గమనిస్తూ ఉండాలన్నారు, విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ఎలాంటి సమస్యలు, ఘర్షణలు లేకుండా చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక ప్రాంతాలు, మార్గాల్లో బందోబస్తును పెంచాలని సూచించారు.

అవసరమైన ప్రదేశాల్లో ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతవరణంలో నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నిజంనిప్పులాంటిది

Sep 26 2023, 10:17

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిధుల పై కెసిఆర్ ప్రత్యేక దృష్టి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రాకముందే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం రెండు వారాల్లోగా ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.5,000 కోట్లు విడుదల చేయనున్నట్లు సీఎంవో అధికారిక వర్గాలు తెలిపాయి.

ఈ క్రమంలో భారత ఎన్నికల సంఘం అక్టోబర్ 6న అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిధుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారు. ఎమ్మెల్యేలు, వారి నియోజకవర్గ అభివృద్ధి నిధి అయిపోయిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ. 10,000 కోట్లు కేటాయించడంతో ఎస్డీఎఫ్ కింద నిధులు కోరుతున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీ నిధుల పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం,తో సమానంగా, 2021-22 నుండి ఎమ్మెల్యేలకు సీడీఎఫ్ని రూ. 3 కోట్ల నుండి రూ. 5 కోట్లకు పెంచింది. 2019-20లో ఆర్థిక మందగమనం, 2020-21, 2021-22లో కోవిడ్ -19 మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినందున ఎమ్మెల్యేలకు సిడిఎఫ్ నిధులు అందలేదు.

ఈ తరుణలో ఎమ్మెల్యేలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోయారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఎమ్మెల్యేలకు పేపర్పై రూ.5 కోట్లు వచ్చినా కేవలం రూ.2 కోట్లు మాత్రమే మిగిలాయి.

ప్రభుత్వం నేరుగా సీడీఎఫ్ నిధుల నుంచి రూ.3 కోట్లు మినహాయించగా, ఎమ్మెల్యేలకు రూ.2 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నట్లు సమాచారం. దీంతో గతంలో ప్రారంభించిన పలు పనులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పెండింగ్లో ఉండడంతో ఎమ్మెల్యేలు నిధుల కొరతతో సతమతమవుతున్నారు.

అసెంబ్లి నియోజకవర్గాల్లోని చాలా గ్రామాలు, పట్టణాలు అధ్వాన్నమైన రోడ్లు, సరిపడని డ్రైనేజీ వ్యవస్థల వంటి మౌలిక సదుపాయాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి,

దీని కారణంగా పరిస్థితులను మెరుగుపరచాలని స్థానికుల నుండి బలమైన డిమాండ్ ఉంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, అలాగే ఓటర్ల తాజా డిమాండ్లను నెరవేర్చాలని ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారు..

Streetbuzz News

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Sep 26 2023, 10:11

ట్యాంక్ బండ్ పై గణేష్ మండప నిర్వహకుల ఆందోళన

ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన ట్యాంక్ బండ్ పై కచ్చితంగా నిమజ్జనం చేస్తామని గణేష్ మండప నిర్వహకులు చెబుతున్నారు.

దీంతో మండపం నిర్వాహకులు ట్యాంక్ బండ్ పై ఆందోళన కూడ నిర్వహిస్తున్నారు. ఓవైపు అధికారులు మహానగరంలో ప్రతిష్టించిన పీఓపీ విగ్రహాలెన్ని అన్న విషయంపై సర్కారుకు గానీ, జీహెచ్ఎంసీకి గానీ ఎలాంటి సమాచారం లేదు.

కానీ మహానగరంలో ఒక అడుగు నుంచి మొదలుకుని 20 నుంచి 30 అడుగుల ఎత్తు వరకు కూడా ప్రతిష్టించిన పీఓపీ విగ్రహాలు లక్షల్లోనే ఉంటాయన్నది ప్రాథమిక సమాచారం.

అయిదడుగుల కన్నా ఎక్కువ ఎత్తు కల్గిన విగ్రహాలు సుమారు మూడు నుంచి మూడున్నర లక్షల వరకుంటాయని ఓ అంచనా ఉంది. వీటిని ఎక్కడ నిమజ్జనం చేయించాలన్నది ప్రస్తుతం జీహెచ్ఎంసీ ముందున్న ఓ బిగ్ ఛాలెంజ్.

హుస్సేన్ సాగర్ మినహా నిమజ్జనం నిర్వహించే మిగిలిన 32 చెరువుల వద్ద నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేద్దామనుకుంటే, విగ్రహాలతో వచ్చే భారీ వాహానాలు కనీసం చెరువు వరకు చేరుకునేందుకు వీలుగా లేని పరిస్థితులున్నట్లు సమాచారం.

ప్రస్తుతం సిటీలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కొలనులను ఇంకా కాస్త లోతుగా చేసి, అయిదడుగుల కన్నా ఎక్కువ ఎత్తున్న విగ్రహాలను నిమజ్జనం చేస్తూ, ఎప్పటికపుడు వ్యర్థాలను బయటకు తీసి, మరో విగ్రహాన్ని నిమజ్జనం చేసేలా ఏర్పాటు చేస్తారా? లేక ఎప్పటి లాగానే కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారా? వేచి చూడాలి..మరి

SB NEWS

Streetbuzz News

Streetbuzz News

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Sep 26 2023, 09:05

TS TET Results: రేపు టెట్‌ ఫలితాలు..

హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష( టెట్‌) ఫలితాలు ఈ నెల 27న వెలువడనున్నాయి. ఈ నెల 15న పరీక్ష జరగగా పేపర్‌-1కు 2.26 లక్షలు, పేపర్‌-2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు..

ఈ నెల 27న ఫలితాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, తుది నిర్ణయం ఉన్నతాధికారులు తీసుకుంటారని ఎస్‌సీఈఆర్‌టీ వర్గాలు తెలిపాయి..

SB NEWS

Streetbuzz News

Streetbuzz News

Streetbuzz News

Streetbuzz News

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Sep 26 2023, 09:00

Chandrababu: నేడు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్‌..

దిల్లీ: అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తనపై నమోదు చేసిన కేసును

కొట్టేయాలని కోరుతూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు రానుంది..

తన పిటిషన్‌ను గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి కొట్టేయడాన్ని సవాలు చేస్తూ ఆయన శనివారం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేశారు..

SB NEWS

Streetbuzz News

Streetbuzz News

Streetbuzz News

STREETBUZZ NEWS

నిజంనిప్పులాంటిది

Sep 26 2023, 08:56

144 Sec: బెంగళూరులో 144 సెక్షన్‌ - నగర పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌..

బెంగళూరు బంద్‌కు అవకాశం లేదని, సోమవారం అర్ధరాత్రి నుంచే నగర వ్యాప్తంగా 144వ సెక్షన్‌(144 Sec) జారీ చేశామని నగర పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌(City Police Commissioner Dayanand) స్పష్టం చేశారు..

సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాలకు అనుగుణంగా ఎటువంటి బంద్‌లకు అవకాశం ఇవ్వరాదన్నారు. సోమవారం కమిషనరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ నిరసన కొనసాగించినా ప్రజల ఆస్తులకు నష్టం, ప్రజా జీవనానికి భంగం ఉండరాదన్నారు.

నిరసన వేళ హింసాత్మాక సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా బలగాలను పెంచామన్నారు. బలవంతంగా బంద్‌ చేయించేందుకు వీలు లేదన్నారు. నగరవ్యాప్తంగా 60 కేఎ్‌సఆర్‌పీ, 40 సీఏఆర్‌ ప్లటూన్‌లతోపాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు..

SB NEWS

Streetbuzz News

Streetbuzz News

Streetbuzz News

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Sep 26 2023, 08:53

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. శ్రీవారి దర్శనానికి నేడు మంగళవారం భక్తులకు నేరుగానే అనుమతి లభిస్తోంది.

శ్రీవారి సర్వదర్శనానికి కేవలం ఒక గంట సమయం మాత్రమే పడుతోంది. ఇక సోమవారం 72,137 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

కాగా.. నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి....

SB NEWS

Streetbuzz News

Streetbuzz News

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Sep 25 2023, 20:53

గణనాధుని ఆశీస్సులు ప్రజలకు ఉండాలి

•టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి

శాలిగౌరారం మండలంలోని ఉట్కూర్ గ్రామంలోని వినాయక మండపాల వద్ద టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించారు.

ఈ సందర్భంగా వినాయకుని నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ తమ భక్తి భావాన్ని చాటుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్, యూత్ కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు పాకాల సతీష్ ,మాదారం ఎంపిటిసి నోముల జనార్ధన్ యాదవ్, ఆకారం సర్పంచ్ సమరం రెడ్డి,

ఊట్కూర్ గ్రామ శాఖ అధ్యక్షులు కుర్ర లింగయ్య, వార్డ్ మెంబర్ గుండ్లు వినోద-సైదులు,ఎన్ ఎస్ యు ఐ మండల ఉపాధ్యక్షుడు కట్లకుంట్ల రమేష్,మో దాల రమేష్, సీనియర్ నాయకులు రంగు రాములు,కప్పల శ్రీకాంత్, భూపతి శ్రీనివాస్ , శీలం శంకర్, రంగు బిక్షం,వేముల సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS

Streetbuzz News

SB NEWS

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Sep 25 2023, 20:49

పెంచిన వేతనాలు ఏరియార్స్ తో సహా చెల్లించాలి

పెంచిన వేతనాలు ఏరియార్స్ తో సహా చెల్లించాలి

•28 నుండి నిరవధిక సమ్మె

మధ్యాహ్న భోజన కార్మికులకు జీవో నెంబర్ 8 ప్రకారం పెంచిన వేతనాలు ఏరియర్స్ తో సహా సెప్టెంబర్ సెప్టెంబర్ 27 లోపు చెల్లించని యెడల 28 నుండి నిరవధిక సమ్మె చేస్తామని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ తెలిపారు.

సోమవారం నల్గొండ మండలం లోని కంచనపల్లి, నల్లగొండ మాధవ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం లకు సమ్మె నోటీసులు అందజేశారు.

ఈ సందర్భంగా సత్యనారాయ మాట్లాడుతూ 2022 మార్చిలో గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు 2000 రూపాయల వేతనం పెంచుతున్నట్లు ప్రకటించి నేటికీ అమలు చేయలేదని అన్నారు.

తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో మూడు రోజుల టోకెన్ సమ్మె చేసిన సందర్భంగా 2023 జూలైలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కమిషనర్ కరుణ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ వేతనాలు పెంచుతున్నామని మరోసారి ప్రకటించారు.

జీవో నెంబర్ 8 విడుదల చేస్తూ పెంచిన 2000 రూపాయల వేతనం నేటి నుండి అమలు చేస్తామని ప్రభుత్వాలు ప్రకటనలకే పరిమితమైందని నేటికీ అవి ఇవ్వలేదని అన్నారు.

అతి తక్కువ పెంచిన రెండువేల తో కలిపి నెలకు 3000 రూపాయల వేతనంతో ఎలా పనిచేయాలని ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కొత్త మెనూ ప్రకారం రేట్లు పెంచి బడ్జెట్ విడుదల చేయాలని అవసరమైన చోట వంట సామాగ్రి, సబ్సిడీపై గ్యాస్, కాటన్ యూనిఫామ్స్ ఈఎస్ఐ, పిఎఫ్, ప్రమాద బీమా, ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వాలని ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల పెంపు ఇతర సమస్యలు పరిష్కరించని ఎడల సెప్టెంబర్ 28 నుండి నిరవధిక సమ్మె చేస్తామని తెలిపారు

ఈ కార్యక్రమంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నలగొండ పట్టణ మండల నాయకులు ఇటికాల అనిత నిమ్మల కవిత ఇటికాల మమత సైదమ్మ సునీత కృష్ణమ్మ భాగ్యలక్ష్మి రేణుక మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Sep 25 2023, 12:33

గ్రూప్ 1 ఫిలిమ్స్ రద్దు పై టిఎస్పిఎస్ పి పిటిషన్ దాఖల్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్క మిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేయడంపై సోమవారం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ పిటిషన్ వేయాలని కమిషన్ నిర్ణయించినట్లు సమాచారం.

ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు టిఎస్‌పిఎస్‌సి న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది.

ఇప్పటి కే ఒకసారి రద్దయిన గ్రూప్1 ప్రిలిమ్స్, కోర్టు తీర్పుతో రెం డోసారి రద్దయితే.. అభ్యర్థులు మానసికంగా తీవ్ర ఆం దోళనకు గురవుతారని కమిషన్ భావిస్తోంది.ఈ మేరకు డివిజన్ బెంచ్ ముందు పిటిషన్ వేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

ఒకవేళ రద్దు తీర్పును డివిజన్ బెంచ్ సమర్థిస్తే.. ఇప్పట్లో ప్రిలిమ్స్ నిర్వహణ సాధ్యం కాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం పూర్తిగా ఎన్నికల నిర్వహణ విధుల్లో నిగమ్నమైపోతుంది.

ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే దాదాపు 2024లోనే మళ్లీ గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష జరిగే అవకాశం కనిపిస్తోంది.

అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళం

గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దు కావడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే ఒకసారి రద్దు కావడంతో రెండోసారి పరీక్ష రాయాల్సి వచ్చిందని, ఇప్పు డు మళ్లీ పరీక్ష రాయాల్సి వస్తుందేమో అని ఆందోళన వ్య క్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతేడా ది ఏప్రిల్‌లో గ్రూప్1 నోటిఫికేషన్ వెలువడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011లో వెలువడిన గ్రూప్ 1 ప్రిలి మ్స్ ఉత్తీర్ణులైన వారికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించి 128 నియామకాలు పూర్తి చేసింది...