నిజంనిప్పులాంటిది

Sep 03 2023, 17:12

Simultaneous polls: 'జమిలి' అంటే రాష్ట్రాలపై దాడి చేయడమే: రాహుల్‌ గాంధీ

దిల్లీ: జమిలి ఎన్నికల (Simultaneous Polls) సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీపై కాంగ్రెస్‌ పార్టీ మరోసారి అనుమానాలు వ్యక్తం చేసింది..

అంతేకాకుండా జమిలీ ఎన్నికల ఆలోచన భారత ఐక్యత, రాష్ట్రాలపై దాడి చేయడమేనని మండిపడింది. ముఖ్యంగా కమిటీ ఏర్పాటు చేసిన సమయం, విధివిధానాలను నిర్దేశించిన తీరును చూస్తుంటే సిఫార్సులు కూడా ఇప్పటికే నిర్ణయించినట్లు ఆరోపించింది. కమిటీ కూర్పుపైనా అనుమానాలు ఉన్నాయని.. అందుకే అందులో ఉండేందుకు తమ నేత నిరాకరించారని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది..

'ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలు.. భారత్‌ ఐక్యత, అన్ని రాష్ట్రాలపై దాడి చేసే ఆలోచనే' అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. భారత్‌ అంటే రాష్ట్రాల సమైఖ్యత అన్నారు. 'జమిలి ఎన్నికలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం నామమాత్రపు ప్రక్రియే. దీన్ని ఏర్పాటు చేసిన సమయంపైనా అనుమానాలున్నాయి. దాని నియమ నిబంధనలను చూస్తే కమిటీ సిఫార్సులను ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరి ఆ కమిటీలో ఉండేందుకు నిరాకరించడం సరైనదే' అని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ పేర్కొన్నారు..

ఇక ఒకేసారి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఛైర్మన్‌గా 8 మంది ప్రముఖులతో ఓ కమిటీ ఏర్పాటయ్యింది. వెంటనే పని ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా సిఫార్సులు చేయాలని కమిటీకి సూచించింది. అయితే, ఇందుకు స్పష్టమైన గడువు మాత్రం నిర్దేశించలేదు. సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన విధివిధానాలను అదే రూపొందించుకోవచ్చని.. ఇది ప్రజల సూచనలనూ వింటుందని తాజా గెజిట్‌లో పేర్కొంది. వినతులు, లేఖలు స్వీకరించి, అవసరమైనవాటిని తుది సిఫార్సుల్లో పొందుపరచడానికి వీలు కల్పించింది..

నిజంనిప్పులాంటిది

Sep 03 2023, 14:58

చేతిలో కంకి కొడవలి, సుత్తి కొడవలి

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వాడివేడిగా నడుస్తున్నాయి. ముఖ్యంగా పొత్తుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హ్యాండ్ ఇవ్వడంతో కామ్రేడ్లు అప్పటి నుంచి అసంతృప్తిలో ఉన్నారు. దీంతో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్‌తో జత కట్టాలని అనుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్‌ను మరోసారి గద్దె ఎక్కకుండా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవాలనే అడుగులు వేసింది.

ఇందులో భాగంగానే ఇటీవల సీపీఐ, సీపీఎంల రాష్ట్ర నాయకులతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావు థాక్రే ఫోన్ చేసి మాట్లాడారు. వారితో థాక్రే రహస్య చర్చలు జరిపారనే టాక్ సైతం ఉంది. అయితే.. ఇప్పటివరకు పొత్తులపై మాత్రం అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ రాలేదు. ఎవరికివారుగా మౌనమే ప్రదర్శిస్తున్నారు.

సీపీఐకి రెండు, సీపీఎంకు రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. కమ్యూనిస్టులు ఇండియా కూటమిలో ఉన్నారు.

దీంతో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేకపోలేదు. కానీ.. పొత్తులపై టీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మాత్రం బహిరంగంగా ఎలాంటి చర్చలు జరపలేదు. పొత్తులపై కనీసం క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే కమ్యూనిస్టులు అడుగుతున్న అసెంబ్లీ సీట్లలో ఆల్రెడీ కాంగ్రెస్ నేతలు ఫిక్స్ అయి ఉన్నట్లు తెలుస్తోంది.

పాలేరు, కొత్తగూడెం, భద్రాచలం, వైరా, మధిర, హుస్నాబాద్, బెల్లంపల్లి, మిర్యాలగూడ, నకిరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సీట్లను వామపక్షాలు అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ.. ఈ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులు ఉన్నారని, ఆ స్థానాలను కమ్యూనిస్టులకు ఇస్తే ఎలా అని నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం జరిగేలా ఉందని అనుకుంటున్నట్లు సమాచారం. అందుకే టీ కాంగ్రెస్‌ నేతలు పొత్తులపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా చేరికలపై దృష్టి పెట్టింది. తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిలపై అధిష్టానం దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల పోటీ చేశారు. షర్మిల ఒకవేళ కాంగ్రెస్‌లో విలీనం చేస్తే పాలేరు టికేట్ ఆశించే అవకాశం లేకపోలేదు.

మరోవైపు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాలేరు టికెట్ కోసం చూస్తున్నారు. కాంగ్రెస్‌లో కమ్యూనిస్టులు అడుతున్న ప్రతీ సెగ్మెంట్‌లో బలమైన నేతలు ఉన్నారు. కమ్యూనిస్టులా, చేరికలా అనే డైలామాలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మరోవైపు ఎవరి బలం ఎంత అని నేతలు బేరీజు వేస్తున్నారు. కాగా, కమ్యూనిస్టులు మాత్రం ఎవరితో పొత్తులు కుదరకపోతే బలమైన స్థానాల్లో ఉమ్మడిగా పోటీచేయాలని ఇదివరకే నిర్ణయించుకున్నారు...

నిజంనిప్పులాంటిది

Sep 03 2023, 13:22

హైదరాబాద్‌ ప్రజలు బయటకు రావొద్దు: తలసాని

హైదరాబాద్‌ ప్రజలు బయటకు రావొద్దని కోరారు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఆదివారం తెల్లవారు జాము నుండి ఏకధాటిగా వర్షం కురుస్తున్నందున ఎక్కడ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని ఆదేశించారు.

ప్రజలు అత్యవసర సేవల కోసం GHMC కంట్రోల్ రూమ్ కు పిర్యాదు చేయండని కోరారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

కాగా.. ఇవాల్టి నుంచి తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం, సోమవారం, మంగళవారం ఇలా మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది...

నిజంనిప్పులాంటిది

Sep 03 2023, 12:33

ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ..

న్యూఢిల్లీ : కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియాగాంధీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. తేలికపాటి జ్వరం లక్షణాలతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి..

ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉన్నట్లు వెల్లడించాయి. ఈ ఏడాదిలో ఆమె ఆస్పత్రిలో చేరడం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు ఆస్పత్రిలో చేరారు. వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం జనవరి 12న సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు.

ఐదు రోజుల పాటు చికిత్స తీసుకుని జనవరి 17న డిశ్చార్జ్ అయ్యారు. మార్చి 2న కూడా జ్వరంతో ఇదే ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం ముంబయిలో జరిగిన ప్రతిపక్షాల కూటమి ఇండియా సమావేశానికి సోనియా గాంధీ హాజరయ్యారు. కాంగ్రెస్ ఎంపితో కలిసి ఆమె సమావేశాల్లో పాల్గన్నారు..

నిజంనిప్పులాంటిది

Sep 03 2023, 09:33

వేముల అశ్విని వివాహ ప్రధాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సతీమణి పుష్ప

శాలిగౌరారం,

ఊట్కూరు గ్రామపంచాయతీ సిబ్బంది వేముల లింగస్వామి కూతురు వేముల అశ్విని వివాహ ప్రధానం ఊట్కూరు గ్రామంలో శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్ప శనివారం రాత్రి అశ్విని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాది వేముల అందీప్, పాస్టర్ హనోక్, జహంగీర్ ,బాష పాక చంద్రశేఖర్, యాదగిరి ,కుర్ర సురేష్ ,వేముల ఇద్దయ్య, వేముల గోపీనాథ్, ధన శేఖర్,మేడి రమేష్, వేముల పవన్,వేముల భాస్కర్, వేముల జనార్దన్, వేముల వెంకటేష్ ,గ్రామస్తులు బంధువులు మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Sep 03 2023, 08:32

హైదరాబాద్‌లో కుండపోత వర్షం..

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. హైదరాబాద్ సహా రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన దంచి కొడుతోంది..

రహదారులపై వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు..

ఎస్సార్ నగర్, అమీర్ పేట, బోరబండ, మదాపూర్, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, మియాపూర్, ఉప్పల్, అంబర్ పేట, నాగోల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. ఎక్కడా భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ కాలేదు. అటు.. రోడ్లపై నిలిచిన నీటిని క్లియర్ చేయడానికి జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

తెల్లవారుజాము నుంచీ కురుస్తున్న కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

నిజంనిప్పులాంటిది

Sep 03 2023, 08:30

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం!

•సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌: ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడనున్న ఆవర్తన ప్రభావంతో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది..

దీనివల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఒక ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది.

విదర్భ నుంచి అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి కొనసాగుతున్నట్లు ఐఎండీ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శనివారం పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి..

నిజంనిప్పులాంటిది

Sep 02 2023, 21:51

ఉత్తమ సేవలందించిన 54,మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందజేసే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఈ ఏడాది 54 మంది టీచర్లను ఎంపిక చేశారు.

2023- 24 విద్యాసంవత్సరానికి గాను 54మంది టీచర్లను ఎంపికచేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం జీవోను జారీచేశారు.

ప్రభుత్వ పాఠశాలు, గురుకులాలు, డైట్‌కాలేజీల్లో పనిచేస్తూనే, ఉత్తమ సేవలందించినందుకు గాను వీరిని అవార్డులు వరించాయి.

హెడ్‌ మాస్టర్‌ కేటగిరిలో 10 మంది, స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరిలో 20 మంది, ఎస్జీటీ, టీజీటీ, పీజీటీ,కేటగిరిలో 11 మంది, డైట్‌ లెక్చరర్‌ కేటగిరిలో ఒకరు, స్పెషల్‌ కేటగిరిలో 12 మంది టీచర్లు ఈ అవార్డులకు ఎంపికయ్యారు.

ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని గురుపూజోత్సవం సందర్భంగా ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో నిర్వహించే కార్యక్రమంలో సన్మానిస్తారు. అలాగే అవార్డు కింద రూ. 10వేల నగదుతో పాటు సర్టిఫికేట్‌, మెడల్‌ అందజేస్తారు...

నిజంనిప్పులాంటిది

Sep 02 2023, 19:25

jamili Elections: జమిలి ఎన్నికల కమిటీ.. 8 మంది సభ్యులు వీళ్లే..

దిల్లీ: జమిలి ఎన్నికల (Jamili Elections) కమిటీపై న్యాయశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను (Ramnath Kovind) నియమించింది..

కేంద్ర మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, గులాం నబీ ఆజాద్‌, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌,

సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ సంజయ్‌ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది. కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి మొగ్గుచూపడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల అంశం చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే..

నిజంనిప్పులాంటిది

Sep 02 2023, 18:44

నన్ను చంపేందుకు బీఆర్‌ నాయుడు ప్లాన్‌ చేస్తున్నాడు: పోసాని

హైదరాబాద్‌: ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా ముసుగులో బీఆర్‌నాయుడు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు..

చంపించడం అనేది బీఆర్‌ నాయుడికి చాలా చిన్న పని అని అన్నారు.

కాగా, పోసాని కృష్ణమురళి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీపై కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే అంతు చూస్తామని నన్ను బెదిరించారు.

బీఆర్‌ నాయుడికి దివంగత నేత వైఎస్సార్‌ భిక్ష పెట్టారు. మీడియా ముసుగులో బీఆర్‌ నాయుడు బెదిరింపులకు దిగుతున్నారు. ఆడవాళ్లపై టీవీ-5లో నీచాతినీచంగా మాట్లాడుతున్నారు. మీ ఇళ్లలో ఆడవాళ్లు లేరా? వారితో ఇలానే మాట్లాడుతారా?. ఇప్పటికైనా బీఆర్‌ నాయుడు మహిళలకు క్షమాపణ చెప్పాలి..