నిజంనిప్పులాంటిది

Sep 02 2023, 10:58

Pawan Kalyan: ఆ నిస్పృహ వెంటాడేది.. అదే చివరి సినిమాకావాలనుకున్నా: పవన్‌ కల్యాణ్‌

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan).. ఈ పేరే కొందరికి ఓ మంత్రం.. ఓ బ్రాండ్‌.. ఓ శక్తి.. ఒకప్పుడు ఒక్క స్నేహితుడూ లేని ఆయనకు ఇప్పుడు కోట్లమంది అభిమానులు..

తొలి సినిమానే చివరి సినిమా కావాలనుకున్న ఆయన ఎందరో నటులకు స్ఫూర్తిగా నిలిచారు. శనివారం పవన్‌ పుట్టినరోజు (Happy Birthday Pawan Kalyan) సందర్భంగా ఆ విషయాలు తెలుసుకుందాం..

ఈ ఏడాది జులైలో పవన్‌ కల్యాణ్‌ 'ఇన్‌స్టాగ్రామ్‌' ఖాతా తెరిచారు. ఒక్క పోస్ట్‌ పెట్టకపోయినా ఆయన ఫాలోవర్స్‌ సంఖ్య కొన్ని గంటల్లోనే మిలియన్‌కుపైగా చేరడం ఓ రికార్డు.

2014లో గూగుల్‌లో అత్యధిక మంది సెర్చ్‌ చేసిన ఇండియన్‌ సెలబ్రిటీ పొలిటిషియన్‌ పవన్‌ కల్యాణ్‌.

'ఫోర్బ్స్‌ ఇండియా టాప్‌ 100 సెలబ్రిటీస్‌' (2013) జాబితాలో పవన్‌ కల్యాణ్‌ 26వ స్థానంలో నిలిచారు.

కరాటేలో 'బ్లాక్‌ బెల్ట్‌' పొందిన అతి కొద్దిమంది నటుల్లో పవన్‌ ఒకరు.

అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్శిటీలో 2017లో నిర్వహించిన 'ఇండియా కాన్ఫరెన్స్‌'లో పవన్‌ ఇచ్చిన ఉపన్యాసం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. ఈ అరుదైన అవకాశం పొందిన కొద్దిమంది నటుల్లో పవన్‌ ఒకరు.

పవన్‌ నటించిన 'తొలిప్రేమ' జాతీయ అవార్డుతోపాటు వివిధ విభాగాల్లో ఆరు నంది పురస్కారాలు దక్కించుకోవడం విశేషం.

'జాని', 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లకు కథ, 'గుడుంబా శంకర్‌' చిత్రానికి స్క్రీన్‌ప్లే రాసింది పవనే. 'జాని'కి దర్శకత్వం కూడా వహించారు.

'తమ్ముడు', 'బద్రి', 'ఖుషి', 'జానీ', 'గుడుంబా శంకర్‌', 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' తదితర చిత్రాల్లోని కొన్ని స్టంట్స్‌కు పవన్‌ కొరియోగ్రఫీ చేశారు.

'గుడుంబా శంకర్'లోని అన్ని పాటలు, 'ఖుషి'లోని పలు గీతాలు, 'పంజా' టైటిల్ సాంగ్‌కు పవన్‌ సాంగ్స్‌ విజువలైజర్‌గా వ్యవహరించారు. 'తాటి చెట్టెక్కలేవు..', 'బంగారు రమణమ్మలాంటి', 'కాటమరాయుడా'వంటి బిట్‌ సాంగ్స్‌ను ఆలపించి ఉర్రూతలూగించిన పవన్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌', 'ఛల్‌ మోహన్‌రంగ' తదితర చిత్రాలను నిర్మించారు.

పవన్‌కు దర్శకుడు త్రివిక్రమ్‌ మంచి స్నేహితుడనే సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి పనిచేసిన తొలి చిత్రం 'గోకులంలో సీత'. ఈ చిత్రానికి నటుడు పోసాని కృష్ణమురళి సంభాషణలు రాశారు. అప్పట్లో త్రివిక్రమ్‌ ఈయన అసిస్టెంట్‌గా పనిచేశారు. అలా.. ఆ

చిత్రం కోసం త్రివిక్రమ్‌ రాసిన 'ప్రేమే దైవం, ప్రేమే సర్వం, ప్రేమే సృష్టి మనుడగకు మూలం' అనే డైలాగ్‌ పవన్‌కు బాగా నచ్చిందట. అయితే, అప్పట్లో త్రివిక్రమ్‌ ఎవరో పవన్‌కు తెలియదు. ఆ తర్వాత ఈ కాంబోలో 'జల్సా', 'అత్తారింటికి దారేది', 'అజ్ఞాతవాసి' సినిమాలు తెరకెక్కాయి.

సినిమాల్లోకి రాకముందు పవన్‌ ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో కొన్ని రోజులు, ఓ గిడ్డంగిలో రెండు రోజులు పనిచేశారు. పారా గ్లైడింగ్ చేశారు. కర్ణాటక సంగీతంలో ప్రవేశం పొందారు. వయొలిన్‌ సాధన చేశారు. డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ కోర్సులో చేరారు. కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ గురించి కొంత తెలుసుకున్నారు. విదేశీ భాషలు నేర్చుకునే ప్రయత్నం చేశారు.

వెంటవెంటనే సినిమాలు చేసేయాలనే ఆలోచన పవన్‌కు ఉండదు. తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు, అభిమానులను మెప్పించేగలిగే పవర్‌ఫుల్‌ రోల్స్‌, సందేశాత్మకమైన కథలనే ఎంపిక చేసుకుంటుంటారు. అందుకే.. 27 ఏళ్ల ప్రస్థానంలో పవన్ నటించిన సినిమాల సంఖ్య 28. వాటిలో 12 రీమేక్‌లు. ప్రస్తుతం 'ఓజీ' (OG), 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' (Ustaad Bhagat Singh), 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) చిత్రాలతో బిజీగా ఉన్నారు.పలు సందర్భాల్లో పవన్‌ పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే (Happy Birthday Power Star)..

వారి వల్లే బతికా..!

''చిన్నప్పుడు ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యేవాణ్ని. అప్పట్లో నాకు స్నేహితులు లేరు. నేను ఇంటర్‌లో చేరే సమయానికి అన్నయ్య (చిరంజీవి) చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డారు. నేను ఇంటర్‌ పాస్‌కానని నాకు అర్థమైంది. చదువు విషయంలో అమ్మ, నాన్న నన్ను ఒక్క మాట అనకపోయినా నాలో ఏదో అపరాధభావం. 'స్నేహితులంతా జీవితంలో ముందుకెళ్లిపోతున్నారు. మనం మాత్రం ఉన్న చోటే ఉంటున్నాం' అన్న నిస్పృహ వెంటాడేది. ఆ ఒత్తిడిలో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించా. కుటుంబ సభ్యులు చూడడం వల్ల బతికి బయటపడ్డా. 'నువ్వు చదివినా చదవక పోయినా మేం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. జీవితంలో స్పష్టత ముఖ్యం. ముందు, నువ్వు ఏం కావాలనుకుంటున్నావో నిర్ణయించుకో' అని ఆ సమయంలో ఇద్దరు అన్నయ్యలు (చిరంజీవి, నాగబాబు), సురేఖ వదిన అండగా నిలిచారు''

నిజంనిప్పులాంటిది

Sep 02 2023, 10:57

High Tension in Amalapuram: అమలాపురంలో హై టెన్షన్

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు..

పలుచోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.. అమలాపురం మండలం ఈదరపల్లిలో వైసీపీకి చెందిన పోలిశెట్టి కిషోర్ అనే వ్యక్తిని హత్యకు గురయ్యాడు. కొంతమంది గుర్తుతెలియని దుండగులు ఈ హత్య చేశారు.

ఈ ఘటనపై అమలాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. మాజీ హోం మంత్రి, టిడిపి నేత నిమ్మకాయల చిన రాజప్ప ప్రధాన అనుచరుడు గంధం పళ్ళంరాజుకు చెందిన అమలాపురంలోని రియల్ ఎస్టేట్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. వైసిపి నేత హత్యకు ప్రతిక్రియ చర్యగా దుండగులు ఈ ఘటనకు పాల్పడినట్లు భావిస్తున్నారు..

అమలాపురం ఎర్ర వంతెన వద్ద సప్తగిరి రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో గంధం పళ్ళంరాజు.. రియల్ ఎస్టేట్ కార్యాలయం నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కొంతమంది వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు ఉంది. ఈ నేపథ్యంలోనే యువకుడిని హత్య చేశారని భావిస్తున్నారు. ఇరు వర్గాలు కొంత మంది రౌడీ షీటర్లను పెంచి పోషిస్తున్నారు. వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గత రాత్రి జరిగిన ఘర్షణ నేపథ్యంలోనే ఈ ఘటనలకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన నేపథ్యంలో శాంతిభద్రతలు అదుపుతప్పుతాయన్న ముందస్తు సమాచారం పై పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.. డీఐజీ జీవీజీ అశోక్ ఆదేశాల మేరకు.. జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ పర్యవేక్షణలో దాదాపు 200 మంది సిబ్బందితో బందోబస్త్ ఏర్పాటు చేశారు.. అమలాపురంలో ముందుజాగ్రత్త చర్యగా పట్టణంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.. ఉభయ గోదావరి జిల్లాల నుండి అదనపు పోలీసు బలగాలను రప్పిస్తున్నారు.. అయితే, మొత్తంగా తాజా హత్య మరోసారి అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా చేసింది..

నిజంనిప్పులాంటిది

Sep 02 2023, 10:55

దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కి వైయస్సార్ టిపి అది నేత్రి షర్మిల ఘన నివాళి

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి సందర్భంగా కుమార్తె, వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నివాళులర్పించారు.

శనివారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌కు చేరుకున్న షర్మిల.. తల్లి విజయమ్మతో కలిసి తండ్రి వైఎస్సార్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో షర్మిల పాల్గొన్నారు.

మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తండ్రి వైఎస్‌ఆర్ వర్దంతి కార్యక్రమాల్లో ఎవరికి వారుగా వేరు వేరుగా అన్నాచెల్లెళ్లు పాల్గొననుండటం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వైఎస్ జయంతి సందర్భంగా ఇదే సీన్ రిపీట్ అవగా.. ఈసారి అయినా కలుస్తారేమోనన్న ఆశతో వైఎస్ అభిమానులు ఎదురు చూశారు.

అయితే తండ్రి వర్ధంతి నేపథ్యంలో నిన్న సాయంత్రమే ఇడుపులపాయకు షర్మిళ చేరుకున్నారు. ఉదయమే తండ్రికి నివాళులర్పించిన షర్మిల ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరనున్నారు. షర్మిల వెళ్లిపోయిన తర్వాత ఇడుపులపాయకు వచ్చే విధంగా జగన్ రెడ్డి షెడ్యూల్ సిద్ధం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.....

నిజంనిప్పులాంటిది

Sep 02 2023, 10:54

సింగరేణి కార్మికులకు త్వరలో వేజ్ బోర్డు ఏరియర్స్ : డైరెక్టర్ బలరామ్

సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన 23 నెలల 11వ వేజ్‌బోర్డు బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేందుకు ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.1,726 కోట్ల బకాయిలు చెల్లించనున్నామని, దీంతో ఒక్కో కార్మికుడు సగటున రూ.4 లక్షల వరకు ఎరియర్స్‌ అందుకుంటాడని సింగరేణి డైరెక్టర్‌ ఎన్‌ బలరామ్‌ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు.

కార్మికులకు ఇంత పెద్ద మొత్తంలో బకాయిలను చెల్లించడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారని, ఈ బకాయిలను నెల రోజుల వ్యవధిలో రెండు విడతలుగా కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నామని వెల్లడించారు.

పర్సనల్‌, అకౌంట్స్‌, ఆడిటింగ్‌, ఈఆర్పీ, ఎస్‌ఏపీ, ఐటీ తదితర విభాగాల సమన్వయంతో శుక్రవారం నుంచే వేతన బకాయిల లెకింపు ప్రక్రియను ప్రారంభించినట్టు తెలిపారు.

తొలుత వేతన బకాయిలకు సంబంధించిన ఆడిటింగ్‌ను, ఆ తర్వాత మిగిలిన ప్రక్రియలను వేగంగా పూర్తిచేసి చెల్లింపులకు మార్గం సుగమం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్టు వివరించారు.

ముందే చెల్లించేందుకు కృషి

వేతన బకాయిలను నెలరోజుల్లోపే చెల్లించాలని ప్రాథమికంగా అనుకుంటున్నప్పటికీ అంతకన్నా ముందే చెల్లించేందుకు కృషి చేస్తున్నట్టు బలరామ్‌ తెలిపారు. 11వ వేజ్‌ బోర్డు సిఫారసులను అందరికన్నా ముందే సింగరేణిలో అమలు జరిపామని, దీంతో సంస్థపై ఏటా దాదాపు రూ.1,200 కోట్ల అదనపు భారం పడుతున్నదని పేర్కొన్నారు.

దీనికి రూ.1,726 కోట్ల ఎరియర్స్‌ను కూడా కలిపితే మొత్తం దాదాపు రూ.3 వేల కోట్లు అవుతుందని తెలిపారు. తొలుత ఉద్యోగంలో ఉన్న కార్మికులకు, ఆ తర్వాత పదవీ విరమణ చేసిన కార్మికులకు బకాయిలు చెల్లించనున్నట్టు చెప్పారు......

నిజంనిప్పులాంటిది

Sep 02 2023, 09:02

ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగించిన విద్యాశాఖ

ఇంటర్‌ మొదటి ఏడాదిలో ప్రవేశాల గడువు తేదీని --విద్యాశాఖ పొడిగించింది--2023-24 విద్యాసంవత్సరంలో మొదటి ఏడాది ఇంటర్‌ ప్రవేశాలకు సెప్టెంబరు 16 వరకు అవకాశం కల్పించింది.

ఈ మేరకు ఇంటర్‌ బోర్డు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా ఆదేశాల మేరకు సెప్టెంబరు 16 వరకు మొదటి ఏడాది ఇంటర్‌లో ప్రవేశాలకు విద్యార్థులను అనుమతించాలని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌, కాంపోజిట్‌ డిడ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించింది.

అయితే ఈ నెల 16 వరకు ప్రవేశాలను రూ.1000 ఆలస్య రుసుముతో పొందొచ్చని సూచించింది. విద్యార్థులు తమ ఉన్నత చదువులను కోల్పోవద్దన్న ఉద్దేశ్యంతోనే ఇంటర్‌ ప్రవేశాల గడువును ఈ నెల 16 వరకు పొడిగించినట్లు ప్రకటనలో పేర్కొంది.

గడువు పొడిగించిన నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అనుమతి పొందిన జూనియర్‌ కళాశాల్లోనే చేర్పించాలని సూచించింది. అఫిలియేటెడ్‌ జూనియర్‌ కాలేజీల వివరాలను ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొంది.

ఇప్పటి వరకు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 83177, ప్రయివేటులో 311160, ఇతర కాలేజీల్లో కలిపి మొత్తంగా 4,92, 873 మంది ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరినట్లు వివరించింది...

నిజంనిప్పులాంటిది

Sep 02 2023, 08:49

Aditya L1: సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు ఇస్రో సిద్ధం.. నేడు నింగిలోకి ఎగరనున్న ఆదిత్య..

చంద్రుడిపై అడుగు పెట్టిన తర్వాత, సూర్యుడిని అధ్యయనం చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం అది ఆదిత్య L1 మిషన్‌ను ప్రారంభించనుంది. భారత తొలి సోలార్ మిషన్‌ను ఇస్రో శనివారం ఉదయం 11:50 గంటలకు ప్రారంభించనుంది..

భారతదేశం ఆదిత్య L-1కు చైనా సోలార్ మిషన్ కంటే ఏ విధంగా భిన్నం అంటే..

భూమి నుంచి ఎత్తు

చైనాకు చెందిన కౌఫు-1 720 కి.మీ.

భారతదేశానికి చెందిన ఆదిత్య ఎల్-1 15 లక్షల కి.మీ.

బరువు

చైనాకు చెందిన కౌఫు-1 859 కిలోలు.

భారతదేశానికి చెందిన ఆదిత్య ఎల్-1 400 కేజీలు.

స్థానం

భూమి కక్ష్యలో చైనాకు చెందిన కువాఫు-1

భూమి కక్ష్య వెలుపల భారతదేశంపు ఆదిత్య L-1

ఇప్పటివరకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ మాత్రమే సూర్యుని అధ్యయనం కోసం విడివిడిగా, ఉమ్మడిగా అంతరిక్ష యాత్రలను పంపాయి. ఇందులో అతిపెద్ద మైలురాయి నాసా కు చెందిన పార్కర్ సోలార్ ప్రోబ్ మిషన్ అని నిరూపించబడింది. ఇది సూర్యుడికి దగ్గరగా ఉన్న ఏకైక అంతరిక్ష నౌక. ఆ తర్వాత నాసా పిరియడ్ బ్రేక్ త్రూ పీరియడ్‌ను పిలిచే సమయం వచ్చింది. తేదీ డిసెంబర్ 14, 2021. పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుని ఎగువ వాతావరణం గుండా వెళ్లిందని నాసా ప్రకటించింది. దీనిని కరోనా అని పిలుస్తారు..

NASA ఈ విజయాన్ని సాధించడానికి 60 సంవత్సరాలకు పైగా పట్టింది. అయితే భారతదేశం కేవలం 15 సంవత్సరాలలో తన సోలార్ మిషన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేసింది. భూమి సహా ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లే.. సూర్యుడు కూడా పాలపుంత మధ్యలో తిరుగుతాడు. అటువంటి పరిస్థితిలో.. సూర్యుని రహస్యాలను తెలుసుకోవడం ద్వారా విశ్వానికి కి చెందిన సత్యాన్ని కనుగొనవచ్చు. దేశ ప్రధాని నేతృత్వంలో ఇస్రో నిరంతరం పని చేస్తోందని.. ప్రధాని మోడీ దేశంలోని శాస్త్రవేత్తలకు ప్రయోగాలు చేసేందుకు స్వేచ్ఛనిచ్చిన కారణంగా ఇస్రో నిరంతరం తమ పని చేస్తూ సగర్వంగా విజయాలను నమోదు చేస్తుదనని అన్నారు..

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 22:22

తెలంగాణ జిల్లాల్లో రేపు ఎల్లుండి వర్షసూచన: వాతావరణం శాఖ వెల్లడి

తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తీపి కబురు అందించింది. శని, ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

శనివారం సాయంత్రం వరకు ఆదిలాబాద్‌, కొమరంభీం, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌,వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఆదివారం ఉదయం ఆదిలాబాద్‌, కొమరంబీం, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తాయని తెలిపింది.

అదేవిధంగా ఈనెల 4, 5న రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్‌, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్‌, నిజమాబాద్‌, జగిత్యాల, జనగామ, హన్మకొండ, వికారాబాద్‌, రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికను జారీ చేసింది...

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 22:18

తెలంగాణలో గెరిల్లా గ్లాస్ సంస్థ పెట్టుబడి: మంత్రి కేటీఆర్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో దిగ్గజ కంపెనీ ముందుకొచ్చింది. మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న గొరిల్లా గ్లాస్‌ తయారీ కంపెనీ తెలంగాణలో తయారీ ప్లాంట్‌ను సెటప్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ మంత్రి కేటీఆర్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు.

ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఆ సంస్థ రూ. 934 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. 800 మందికి ఉపాధిని కల్పించనున్నట్లు తెలిపారు. కాగా, అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్ ఉన్న సంగతి తెలిసిందే.

తెలంగాణలో పెట్టుబడుల కోసం అంతర్జాతీయ కంపెనీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం గొరిల్లా గ్లాస్‌ను తయారు చేయడానికి తెలంగాణ‌లో తయారీ ప్లాంట్‌ను నెల‌కొల్పాల‌ని నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు...

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 22:17

రేపటి నుంచి ఎంసెట్ బైపీసీ అభ్య‌ర్థుల‌కు కౌన్సెలింగ్ ప్రారంభం

ఎంసెట్ బైపీసీ అభ్య‌ర్థుల‌కు శ‌నివారం నుంచి కౌన్సెలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. బీ ఫార్మ‌సీ, ఫార్మా డీ త‌దిత‌ర కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్నారు.

వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, స్లాట్‌బుకింగ్‌ శనివారం నుంచి ప్రారంభం కానుంది.

ఈ నెల 4, 5 తేదీల్లో అభ్య‌ర్థుల ధ్రువ‌ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌నున్నారు. 4 నుంచి 9 వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్లు ఇచ్చుకోవాలి. పూర్తి వివరాల కోసం https://tseamcetb.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

బీ ఫార్మ‌సీకి సంబంధించి 114 కాలేజీల్లో 6910 క‌న్వీన‌ర్ కోటా సీట్లు, ఫార్మ్ -డీలో 61 కాలేజీల్లో 1191 క‌న్వీన‌ర్ కోటా సీట్లు, బ‌యోటెక్నాల‌జీలో 94, బ‌యోమెడిక‌ల్ ఇంజినీరింగ్‌లో 36, ఫార్మాస్యూటిక‌ల్ ఇంజినీరింగ్‌లో 81 సీట్లు ఉన్నాయి...

నిజంనిప్పులాంటిది

Sep 01 2023, 19:59

Nadendla: 'ఒకే దేశం- ఒకే ఎన్నిక'కు జనసేన మద్దతు: నాదెండ్ల మనోహర్‌

మంగళగిరి: ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానానికి తమ పార్టీ మద్దతిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడతూ..

ఈ అంశంపై భాజపా పెద్దలు పవన్‌ కల్యాణ్‌తో ఇప్పటికే చర్చించారన్నారు. దీనిపై మరింత లోతైన చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ విధానంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పిన మనోహర్‌.. ఎన్నికల సమయంలో తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

ఈనెల 2న పవన్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సేవా కార్యాక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం, భవన నిర్మాణ కార్మికులతో కలసి సహపంక్తి భోజనం, రెల్లి కాలనీ వాసుల మధ్య పుట్టిన రోజు వేడుకలు, ఎస్సీ బాలుర వసతి గృహాలలో పెన్నులు, నోట్ బుక్స్ పంపిణీ, ప్రభుత్వ సహాయం అందని విభిన్న ప్రతిభా వంతులను దత్తత తీసుకొని వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతున్నామన్నారు..