Karnataka: రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు తొలి జాబితా విడుదల చేయనున్న BJP
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక వేడెక్కుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో వ్యూహాలకు పదునుపెడుతున్నాయి అన్ని పార్టీలు.
ఏప్రిల్ 13న నోటిఫికేషన్, మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తమ అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించాయి. అధికార బీజేపీ ఈ రోజు తొలి జాబితా రిలీజ్ చేయనుంది.
కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉండగా.. బీజేపీ నేడు 120 నుంచి 150 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తుందని తెలిసింది. కర్ణాటకలోనే ఉన్న ప్రధాని మోదీ ఆదివారం ఆయన అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జాబితాని ఖరారు చేసినట్లు తెలిసింది.
ఐతే.. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ప్రహ్లాద్ జ్యోషి, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు.
ఇవాళ్టి జాబితా రిలీజ్తో.. కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయం
Apr 10 2023, 15:14