madagoni surendar

Mar 29 2023, 10:17

డేటా లీకేజీ వ్యవహారం.. రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ

డేటా లీకేజీ వ్యవహారం.. రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న డేటా లీకేజీపై కేంద్ర నిఘా సంస్థ(ఐబీ) దృష్టి సారించింది. రక్షణశాఖతో పాటు అనేక విభాగాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన 16.8 కోట్ల మందికి సంబంధించిన డేటా బహిరంగ మార్కెట్‌లో అమ్మకానికి పెట్టడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇందులో ఏమైనా ఉగ్రకోణం ఉండొచ్చన్న అనుమానంతో ఐబీ రంగంలోకి దిగింది.

ఇప్పటికే సైబరాబాద్‌ అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్న ఐబీ ప్రతినిధులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు త్వరలో ఇక్కడకు రానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఉగ్రకోణం ఉన్నట్లు తేలితే కేసు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌.ఐ.ఎ.)కి బదిలీ అయ్యే అవకాశం ఉంది.

ఈ కేసులో ఏడుగురు సభ్యుల ముఠాను ఇటీవల సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాధితుల్లో అనేక ప్రభుత్వ విభాగాలతో పాటు ఇతర రాష్ట్రాల వారూ ఉండటంతో కేంద్ర నిఘా సంస్థ దృష్టి సారించింది. ఇంత పెద్ద రాకెట్‌ను పట్టుకున్నందుకు వారిని ఈ సంస్థ అధికారులు అభినందిస్తున్నారు.

madagoni surendar

Mar 29 2023, 07:05

న్యూడిల్లీ :జర్నలిస్ట్ లకు మరింత స్వేచ్ఛ ఉండాలె : కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి

జర్నలిస్ట్ లకు మరింత స్వేచ్ఛ ఉండాలె : కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి

‘ఢిల్లీ టీయూడబ్ల్యూజే హెచ్ 143’ డైరీ రిలీజ్

న్యూఢిల్లీ, : జర్నలిస్టులకు మరింత స్వేచ్ఛ ఉండాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జర్నలిస్ట్ ల స్వేచ్ఛ అంటే, యాజమాన్యాల స్వేచ్ఛ కాదని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ గురజాడ హాల్​లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్–హెచ్ 143(టీయూడబ్ల్యూజే) డైరీ–2023 రిలీజ్ చేశారు. ఢిల్లీ మీడియా రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వాయిస్ ​వినిపిస్తున్నదని కిషన్ రెడ్డి కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియాపై ఉందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్ట్ ల పాత్ర మరువలేనిదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎంపీ బీద మస్తాన్ రావు, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నాగిళ్ల వెంకటేశ్, జనరల్ సెక్రటరీ వంగ తిరుపతి, కొండపల్లి శిరీశ్​ రెడ్డి, సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి, ఉంద్యాల అశోక్ రెడ్డి, కృష్ణారావు, విజయ్ కుమార్, రవీందర్ రెడ్డి, కొన్నోజు రాజు, మేక గోపి కృష్ణ, జబ్బర్ లాల్ నాయక్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Mar 28 2023, 21:37

10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేసిన "నకిరేకల్ ఏంపీపి బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు దంపతులు.

10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేసిన "నకిరేకల్ ఏంపీపి బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు దంపతులు.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

బిజిఆర్ ఫౌండేషన్ ఆద్వర్యంలో నకిరేకల్ మండలంలోనినోముల,ఓగోడ్,కడపర్తి గ్రామాల్లోని ప్రబుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు పరిక్షప్యాడ్ లు,పెన్నులు‌,స్కేల్లు అందజేసిన నకిరేకల్ ఏంపీపి దంపతులు.

అనంతరం వారు మాట్లాడుతూ. విద్యార్థులు ఎటువంటి సందిగ్ధాలకు గురికాకుండా,పరిక్షా సెంటర్ లకు గంట ముందుగానే చేరేవిధంగా ప్లాన్ చేసుకోవాలని, ప్రశాంతమైన ఆలోచనలతో పరిక్షలురాసి మంచి గ్రేడ్ లు సాధించాలని ఏంపీపి దంపతులు అన్నారు.(ఈకార్యక్రమంలో)

నోముల,ఓగోడ్ ఎంపీటీసీ సభ్యులు సామ మల్లమ్మ ,లోడే సాగర్,మంగలపల్లి ఉపసర్పంచ్ శ్రీను యాదవ్, పాలెం ఉపసర్పంచ్ మాల్లారగడ్డిగారు,అయాపాఠశాలల ఉపాద్యాయలు,మరియు అయాగ్రామల బిజీర్ సైన్యం యువత, తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Mar 28 2023, 21:33

ఏపీ ::అమరావతి ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ -

అమరావతి 

ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ - 

ఎన్టీఆర్ బొమ్మతో ప్రత్యేక నాణెం విడుదలపై ధన్యవాదాలు తెలుపుతూ లేఖ - 

 టీడీపీ పొలిట్‍బ్యూరో తరఫున ప్రధాని మోదీకి ధన్యవాదాలు - 

 

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం విడుదల చేయడం హర్షించదగిన విషయం - 

 ఎన్టీఆర్ ప్రత్యేక నాణెంపై కేంద్రం నిర్ణయాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో స్వాగతించింది - 

 

ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక - 

 ఎన్టీఆర్ ను గౌరవించడమంటే తెలుగువారిని గౌరవించడమే 

టీడీపీ అధినేత చంద్రబాబు

madagoni surendar

Mar 28 2023, 21:28

22 దేశాలు.. 56 రోజులు.. 12 వేల కిలోమీటర్లు.. బస్సులో ప్రపంచ యాత్ర* *ప్రపంచ రికార్డు కోసం సిద్ధమైన భారత టూర్ ఆపరేటింగ్ కంపెనీ

22 దేశాలు.. 56 రోజులు.. 12 వేల కిలోమీటర్లు.. బస్సులో ప్రపంచ యాత్ర

ప్రపంచ రికార్డు కోసం సిద్ధమైన భారత టూర్ ఆపరేటింగ్ కంపెనీ

టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి బ్రిటన్ రాజధాని లండన్ కు బస్సు యాత్ర

ఆగస్టు 7న ప్రారంభం.. ఒక్కో టికెట్ సుమారు రూ.20 లక్షలు

ప్రపంచంలోనే సుదీర్ఘ ప్రయాణమిది.. ఒకటీ రెండు కాదు ఏకంగా 56 రోజులపాటు సాగే జర్నీ.. 12 వేల కిలోమీటర్లు.. మధ్యలో 22 దేశాలు చుట్టి వచ్చే యాత్ర. అయితే వెళ్లేది విమానంలోనో, నౌకలోనో అనుకుంటున్నారేమో.. కానే కాదు. కనీసం రైలులో కూడా కాదు. బస్సులో. అవును నిజంగా బస్సులోనే!

భారత్ కు చెందిన ప్రముఖ టూర్ ఆపరేటింగ్ కంపెనీ ‘అడ్వెంచర్స్ ఓవర్ లాండ్’ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు రెడీ అయింది. ప్రపంచంలోనే సుదీర్ఘ బస్సు ప్రయాణానికి సంబంధించిన షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. టర్కీ (తుర్కియా)లోని ఇస్తాంబుల్ నుంచి బ్రిటన్ రాజధాని లండన్ వరకు దాదాపు 12 వేల కిలోమీటర్ల దూరాన్ని 56 రోజుల్లో పూర్తి చేసేందుకు సకల వసతులతో కూడిన ప్రత్యేక లగ్జరీ బస్సును సిద్ధం చేసింది. ఆగస్టు 7న ఇస్తాంబుల్ నుంచి బయలుదేరనున్న బస్సు అక్టోబరు 1న లండన్ కు చేరుకుంటుందని టూర్ సంస్థ వెల్లడించింది. ఇందులో 30 సీట్లు ఉంటాయి. ఒక్కో టికెట్ రేటును 24,300 డాలర్లు ( సుమారుగా రూ.20 లక్షలు) గా నిర్ణయించారు. 22 దేశాల మీదుగా బస్సు జర్నీ సాగుతుంది. బాల్కన్స్, తూర్పు యూరప్, స్కాండినేవియా, పశ్చిమ యూరప్ ప్రాంతాల మీదుగా లండన్ కు చేరుకుంటుంది. ప్రధాన నగరాల్లో బస్సు ఆగినప్పుడల్లా హోటల్స్ లో డబుల్ షేరింగ్ రూమ్స్ కేటాయిస్తారు. బస్సులో రెండు నెలలు ఎలా పోవాలబ్బా అని ఆలోచించాల్సిన పని లేదు. ఫుల్ లగ్జరీ ఏర్పాట్లు చేశారట. సుదీర్ఘ ప్రయాణానికి అనువుగా ఉండేలా బస్సును డిజైన్ చేశారట. వరల్డ్ టూర్ చేయాలని అనుకునే వాళ్లకు ఇదో మంచి అవకాశం.

madagoni surendar

Mar 28 2023, 21:01

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ : *ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని మర్యాదపూర్వక కలిసిన ట్రాఫిక్ ఎస్.ఐ N. నరేష్ మరియు సిబ్బంది .

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :

ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని మర్యాదపూర్వక కలిసిన ట్రాఫిక్ ఎస్.ఐ N. నరేష్ మరియు సిబ్బంది ..

పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..*

నందిగామ పట్టణంలోని ఎమ్మెల్సీ వారి కార్యాలయంలో పట్టణ ట్రాఫిక్ S.I. గా నియమితులైన ఎన్.నరేష్ మరియు ట్రాఫిక్ కానిస్టేబుల్ లతో పాటు శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేశారు ..

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ నందిగామ పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు, పట్టణ వాసులతో ఫ్రెండ్లీ పోలీసింగ్ తో మెలగాలన్నారు, ట్రాఫిక్ ఆంక్షాలపై - నో పార్కింగ్ జోన్లపై పట్టణ ప్రజలకు సిబ్బంది ద్వారా ప్రత్యేక సూచనలు ఇవ్వాలన్నారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు ..

madagoni surendar

Mar 28 2023, 19:30

సిటీలో ఆ రోజు వైన్స్, బార్లు బంద్

సిటీలో ఆ రోజు వైన్స్, బార్లు బంద్

శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో మార్చి 30 న మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. వైన్ షాపులు, కళ్ళు దుకాణాలు, బార్లు, రిజిస్టర్ క్లబ్ లు ,పబ్ లు ఇన్ క్లూడింగ్ ఫైవ్ స్టార్ హోటల్స్ లో బార్ రూమ్స్ మూసేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మార్చి30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 31 వ తేదీ ఉదయం 6 గంటల వరకు దుకాణాలు మూసి వేయనున్నారు.

శాంతి భద్రతల కారణంగా మద్యం షాపులను పండుగ సందర్భంగా మూసివేయాలని మద్యం షాపులకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

madagoni surendar

Mar 28 2023, 19:01

కర్ణాటక::ఇంకా.. ఆటా నాదే.. వేట నాదే అంటున్న బళ్ళారి బంగారు బాబు.. గాలి జనార్దనరెడ్డి.

ఇంకా.. ఆటా నాదే.. వేట నాదే అంటున్న బళ్ళారి బంగారు బాబు.. గాలి జనార్దనరెడ్డి.

బళ్ళారి మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దనరెడ్డి కర్నాటక లో తానే సొంత పార్టీ పెట్టడం ఇప్పటికే 50 నియేజకవర్గలలో గాలి జనార్దనరెడ్డి దంపతులు సుడిగాలి గా రోడ్డు షో చేస్తున్నారు.

ఇప్పుడు గాలి జనార్దనరెడ్డి పార్టీ కి ఎన్నికల కమిషన్ ""పుట్ బాల్" గుర్తు కేటయించటం తో ఆయన పుట్ బాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నన్ను అన్ని పార్టీలు పుట్ బాల్ అడుకొన్నరు ఇంకా ఆట నాదే.

వేట నాదే.. ఇప్పుడు ఆటా నేను మొదలు పెట్టాతా.. గోల్ వేయడం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అని ఈ జట్టు కెప్టెన్ నేనే ఆటగాడు నేనే అని బళ్ళారి బంగారు బాబు తెలిపారు.

51 నియేజవర్గలలో తమ పార్టీ పోటీ చేస్తారు అని 30 స్థానాల లో గెలుపు ఖాయం అని గాలి జనార్దనరెడ్డి ధీమా వ్యక్తంచేశారు.

madagoni surendar

Mar 28 2023, 18:54

ఏపీ : గుంటూరు...గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో దారుణం . కాన్పుల వార్డు లో డబ్బులు వసూలు చేస్తున్న నర్సింగ్ సిబ్బంది...

గుంటూరు బ్రేకింగ్

గుంటూరు...గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో దారుణం ..

కాన్పుల వార్డు లో డబ్బులు వసూలు చేస్తున్న నర్సింగ్ సిబ్బంది...

మగ పిల్ల వాడికి 1500 ఆడపిల్ల పుడితే 1000 రూపాయలు వసూలు చేస్తున్న సిబ్బంది తమకు తెలిసిందని ఎమ్మెల్యే ముస్తఫా వెల్లడి

ఎమ్మెల్యే ముస్తఫా ,హాస్పిటల్ అధికారుల తనిఖీ ల లో వెలుగు చూసిన దారుణం...

కాన్పు ల వార్డు లో సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ సూపరిండెంట్ కు ఆదేశాలు...

తమ పై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే ముస్తఫా ఎదుట నర్సింగ్ సిబ్బంది ఆవేదన....

తాము డబ్బులు తీసుకుంటున్నట్లు నిరూపణ చేయాలని ఛాలెంజ్ చెస్తున్నామన్న ఆసుపత్రి సిబ్బంది

madagoni surendar

Mar 28 2023, 18:27

గద్వాల్ -కర్నూల్ సిటీ మధ్య విద్యుదీకరణ పూర్తి చేసి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే*

గద్వాల్ -కర్నూల్ సిటీ మధ్య విద్యుదీకరణ పూర్తి చేసి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ నుండి ధర్మవరం అలాగే సౌత్ వెస్టర్న్ రైల్వే ( నైరుతి రైల్వే ) పరిధిలోని ధర్మవరం - బెంగళూరు వరకు పూర్తిగా విద్యుదీకరించిన రైలు మార్గ సౌకర్యాన్ని అందిస్తుంది, తద్వారా ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌తో రైళ్లను నడపడానికి వీలు కల్పిస్తుంది.

దక్షిణ మధ్య రైల్వే 2022-2023 ఆర్థిక సంవత్సరం చివరి అంకంలో విద్యుదీకరణ కు అధిక ప్రాధాన్యమిస్తు , పనులను వేగవంతం చేసింది, తద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని విభాగాలను విద్యుదీకరించబడిన మార్గాలకు జోడించింది. ఈ క్రమంలో , దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గద్వాల్ - కర్నూలు సిటీ మధ్య 54 రూట్ కిమీ దూరం వరకు విద్యుదీకరణ పనులను పూర్తి చేసింది. తద్వారా జోన్ పరిధిలో సికింద్రాబాద్ - ధర్మవరం మధ్య పూర్తిస్థాయిలో విద్యుదీకరించబడిన రైలు మార్గంలో ఇప్పుడు విద్యుత్ ట్రాక్షన్‌ ద్వారా రైళ్లను నడిపే వీలు కల్గింది .

గద్వాల్ - కర్నూలు సిటీ స్టేషన్ల మధ్య విద్యుదీకరణ , డోన్ - కర్నూలు సిటీ - మహబూబ్‌నగర్‌ ; సికింద్రాబాద్ - ముద్ఖేడ్ - మన్మాడ్ విద్యుదీకరణ ప్రాజెక్ట్ లో భాగంగా పూర్తి చేయబడింది . ఈ ప్రాజెక్ట్ 2018-19 సంవత్సరంలో రూ. 916.07 కోట్ల సవరించిన అంచనా వ్యయంతో పనులు చేపట్టడం జరిగింది .సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ మధ్య విభాగాన్ని వేరే ప్రాజెక్టులో భాగంగా మంజూరు చేయబడి ఇప్పటికే విద్యుదీకరించారు. ఈ ప్రాజెక్టు కింద మహబూబ్‌నగర్-గద్వాల్ & కర్నూలు సిటీ -డోన్ ల విభాగాల మధ్య పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధి లోని డోన్ - గుత్తి - ధర్మవరం మరియు నైరుతి రైల్వే పరిధిలోని ధర్మవరం - బెంగళూరు సిటీ విభాగాల మధ్య విద్యుదీకరణ కూడా పూర్తయింది. అందువల్ల, ప్యాసింజర్ మరియు సరకు రవాణా రైళ్లు రెండూ, ఇప్పుడు హైదరాబాద్ - ధర్మవరం మరియు అటుపైన బెంగుళూరు వరకు సజావుగా ప్రయాణించేందుకు వీలుంటుంది , తద్వారా , రైలు ప్రారంభ స్థానం నుండి చివరి స్టేషన్ వరకు రైళ్లను ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌తో నడిపేందుకు వీలుపడుతుంది .

ఈ ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌తో రైళ్ల రాకపోకల నిర్వహణ వల్ల కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది తద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది . ఇంజిన్ మార్పిడి ని నివారించడం ద్వారా రైళ్ల నిర్వహణలో రైలు ప్రయాణీకులకు ఎలాంటి అంతరాయం లేని రాకపోకలు సాగించేందుకు సహాయపడుతుంది. ప్రయాణికుల మరియు సరకు రవాణా చేసే రైళ్ల మార్గ మధ్య నిలుపుదలను తగ్గిస్తుంది మరియు రైళ్ల సగటు వేగాన్ని మెరుగుపరుస్తుంది. విభాగాల మధ్య సామర్థ్యం పెంపుదల కారణంగా ఈ విభాగంలో మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విద్యుదీరణ వల్ల రైల్వేలకు ఇంధన ఖర్చులు పెద్ద ఎత్తున ఆదా చేయబడతాయి మరియు కార్యాచరణ సామర్ధ్యాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడతాయి.

ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ..విద్యుద్దీకరణ పనులను పూర్తి చేయడంలో అద్భుతమైన పనితీరును కనబరిచిన అంకితభావంతో పనిచేసినందుకు ఎలక్ట్రికల్ వింగ్ అధికారులు మరియు సిబ్బందిని అభినందించారు. గద్వాల్-కర్నూల్ స్టేషన్ల మధ్య ఈ మార్గంలో విద్యుదీకరణ పూర్తవడంతో, సికింద్రాబాద్-బెంగళూరు మధ్య మొత్తం సెక్షన్‌లో ఎలక్ట్రిక్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు జనరల్ మేనేజర్ తెలిపారు. జోన్ పరిధిలో ఇప్పటికే ఉన్న బ్రాడ్ గేజ్ మార్గాలను 100% విద్యుదీకరణ దిశగా వడివడిగా అడుగులు వేస్తోందని కూడా ఆయన పేర్కొన్నారు.