madagoni surendar

Mar 28 2023, 21:28

22 దేశాలు.. 56 రోజులు.. 12 వేల కిలోమీటర్లు.. బస్సులో ప్రపంచ యాత్ర* *ప్రపంచ రికార్డు కోసం సిద్ధమైన భారత టూర్ ఆపరేటింగ్ కంపెనీ

22 దేశాలు.. 56 రోజులు.. 12 వేల కిలోమీటర్లు.. బస్సులో ప్రపంచ యాత్ర

ప్రపంచ రికార్డు కోసం సిద్ధమైన భారత టూర్ ఆపరేటింగ్ కంపెనీ

టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి బ్రిటన్ రాజధాని లండన్ కు బస్సు యాత్ర

ఆగస్టు 7న ప్రారంభం.. ఒక్కో టికెట్ సుమారు రూ.20 లక్షలు

ప్రపంచంలోనే సుదీర్ఘ ప్రయాణమిది.. ఒకటీ రెండు కాదు ఏకంగా 56 రోజులపాటు సాగే జర్నీ.. 12 వేల కిలోమీటర్లు.. మధ్యలో 22 దేశాలు చుట్టి వచ్చే యాత్ర. అయితే వెళ్లేది విమానంలోనో, నౌకలోనో అనుకుంటున్నారేమో.. కానే కాదు. కనీసం రైలులో కూడా కాదు. బస్సులో. అవును నిజంగా బస్సులోనే!

భారత్ కు చెందిన ప్రముఖ టూర్ ఆపరేటింగ్ కంపెనీ ‘అడ్వెంచర్స్ ఓవర్ లాండ్’ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు రెడీ అయింది. ప్రపంచంలోనే సుదీర్ఘ బస్సు ప్రయాణానికి సంబంధించిన షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. టర్కీ (తుర్కియా)లోని ఇస్తాంబుల్ నుంచి బ్రిటన్ రాజధాని లండన్ వరకు దాదాపు 12 వేల కిలోమీటర్ల దూరాన్ని 56 రోజుల్లో పూర్తి చేసేందుకు సకల వసతులతో కూడిన ప్రత్యేక లగ్జరీ బస్సును సిద్ధం చేసింది. ఆగస్టు 7న ఇస్తాంబుల్ నుంచి బయలుదేరనున్న బస్సు అక్టోబరు 1న లండన్ కు చేరుకుంటుందని టూర్ సంస్థ వెల్లడించింది. ఇందులో 30 సీట్లు ఉంటాయి. ఒక్కో టికెట్ రేటును 24,300 డాలర్లు ( సుమారుగా రూ.20 లక్షలు) గా నిర్ణయించారు. 22 దేశాల మీదుగా బస్సు జర్నీ సాగుతుంది. బాల్కన్స్, తూర్పు యూరప్, స్కాండినేవియా, పశ్చిమ యూరప్ ప్రాంతాల మీదుగా లండన్ కు చేరుకుంటుంది. ప్రధాన నగరాల్లో బస్సు ఆగినప్పుడల్లా హోటల్స్ లో డబుల్ షేరింగ్ రూమ్స్ కేటాయిస్తారు. బస్సులో రెండు నెలలు ఎలా పోవాలబ్బా అని ఆలోచించాల్సిన పని లేదు. ఫుల్ లగ్జరీ ఏర్పాట్లు చేశారట. సుదీర్ఘ ప్రయాణానికి అనువుగా ఉండేలా బస్సును డిజైన్ చేశారట. వరల్డ్ టూర్ చేయాలని అనుకునే వాళ్లకు ఇదో మంచి అవకాశం.

madagoni surendar

Mar 28 2023, 21:01

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ : *ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని మర్యాదపూర్వక కలిసిన ట్రాఫిక్ ఎస్.ఐ N. నరేష్ మరియు సిబ్బంది .

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :

ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని మర్యాదపూర్వక కలిసిన ట్రాఫిక్ ఎస్.ఐ N. నరేష్ మరియు సిబ్బంది ..

పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..*

నందిగామ పట్టణంలోని ఎమ్మెల్సీ వారి కార్యాలయంలో పట్టణ ట్రాఫిక్ S.I. గా నియమితులైన ఎన్.నరేష్ మరియు ట్రాఫిక్ కానిస్టేబుల్ లతో పాటు శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేశారు ..

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ నందిగామ పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు, పట్టణ వాసులతో ఫ్రెండ్లీ పోలీసింగ్ తో మెలగాలన్నారు, ట్రాఫిక్ ఆంక్షాలపై - నో పార్కింగ్ జోన్లపై పట్టణ ప్రజలకు సిబ్బంది ద్వారా ప్రత్యేక సూచనలు ఇవ్వాలన్నారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు ..

madagoni surendar

Mar 28 2023, 19:30

సిటీలో ఆ రోజు వైన్స్, బార్లు బంద్

సిటీలో ఆ రోజు వైన్స్, బార్లు బంద్

శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో మార్చి 30 న మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. వైన్ షాపులు, కళ్ళు దుకాణాలు, బార్లు, రిజిస్టర్ క్లబ్ లు ,పబ్ లు ఇన్ క్లూడింగ్ ఫైవ్ స్టార్ హోటల్స్ లో బార్ రూమ్స్ మూసేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మార్చి30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 31 వ తేదీ ఉదయం 6 గంటల వరకు దుకాణాలు మూసి వేయనున్నారు.

శాంతి భద్రతల కారణంగా మద్యం షాపులను పండుగ సందర్భంగా మూసివేయాలని మద్యం షాపులకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

madagoni surendar

Mar 28 2023, 19:01

కర్ణాటక::ఇంకా.. ఆటా నాదే.. వేట నాదే అంటున్న బళ్ళారి బంగారు బాబు.. గాలి జనార్దనరెడ్డి.

ఇంకా.. ఆటా నాదే.. వేట నాదే అంటున్న బళ్ళారి బంగారు బాబు.. గాలి జనార్దనరెడ్డి.

బళ్ళారి మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్దనరెడ్డి కర్నాటక లో తానే సొంత పార్టీ పెట్టడం ఇప్పటికే 50 నియేజకవర్గలలో గాలి జనార్దనరెడ్డి దంపతులు సుడిగాలి గా రోడ్డు షో చేస్తున్నారు.

ఇప్పుడు గాలి జనార్దనరెడ్డి పార్టీ కి ఎన్నికల కమిషన్ ""పుట్ బాల్" గుర్తు కేటయించటం తో ఆయన పుట్ బాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నన్ను అన్ని పార్టీలు పుట్ బాల్ అడుకొన్నరు ఇంకా ఆట నాదే.

వేట నాదే.. ఇప్పుడు ఆటా నేను మొదలు పెట్టాతా.. గోల్ వేయడం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అని ఈ జట్టు కెప్టెన్ నేనే ఆటగాడు నేనే అని బళ్ళారి బంగారు బాబు తెలిపారు.

51 నియేజవర్గలలో తమ పార్టీ పోటీ చేస్తారు అని 30 స్థానాల లో గెలుపు ఖాయం అని గాలి జనార్దనరెడ్డి ధీమా వ్యక్తంచేశారు.

madagoni surendar

Mar 28 2023, 18:54

ఏపీ : గుంటూరు...గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో దారుణం . కాన్పుల వార్డు లో డబ్బులు వసూలు చేస్తున్న నర్సింగ్ సిబ్బంది...

గుంటూరు బ్రేకింగ్

గుంటూరు...గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో దారుణం ..

కాన్పుల వార్డు లో డబ్బులు వసూలు చేస్తున్న నర్సింగ్ సిబ్బంది...

మగ పిల్ల వాడికి 1500 ఆడపిల్ల పుడితే 1000 రూపాయలు వసూలు చేస్తున్న సిబ్బంది తమకు తెలిసిందని ఎమ్మెల్యే ముస్తఫా వెల్లడి

ఎమ్మెల్యే ముస్తఫా ,హాస్పిటల్ అధికారుల తనిఖీ ల లో వెలుగు చూసిన దారుణం...

కాన్పు ల వార్డు లో సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ సూపరిండెంట్ కు ఆదేశాలు...

తమ పై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే ముస్తఫా ఎదుట నర్సింగ్ సిబ్బంది ఆవేదన....

తాము డబ్బులు తీసుకుంటున్నట్లు నిరూపణ చేయాలని ఛాలెంజ్ చెస్తున్నామన్న ఆసుపత్రి సిబ్బంది

madagoni surendar

Mar 28 2023, 18:27

గద్వాల్ -కర్నూల్ సిటీ మధ్య విద్యుదీకరణ పూర్తి చేసి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే*

గద్వాల్ -కర్నూల్ సిటీ మధ్య విద్యుదీకరణ పూర్తి చేసి ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ నుండి ధర్మవరం అలాగే సౌత్ వెస్టర్న్ రైల్వే ( నైరుతి రైల్వే ) పరిధిలోని ధర్మవరం - బెంగళూరు వరకు పూర్తిగా విద్యుదీకరించిన రైలు మార్గ సౌకర్యాన్ని అందిస్తుంది, తద్వారా ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌తో రైళ్లను నడపడానికి వీలు కల్పిస్తుంది.

దక్షిణ మధ్య రైల్వే 2022-2023 ఆర్థిక సంవత్సరం చివరి అంకంలో విద్యుదీకరణ కు అధిక ప్రాధాన్యమిస్తు , పనులను వేగవంతం చేసింది, తద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని విభాగాలను విద్యుదీకరించబడిన మార్గాలకు జోడించింది. ఈ క్రమంలో , దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గద్వాల్ - కర్నూలు సిటీ మధ్య 54 రూట్ కిమీ దూరం వరకు విద్యుదీకరణ పనులను పూర్తి చేసింది. తద్వారా జోన్ పరిధిలో సికింద్రాబాద్ - ధర్మవరం మధ్య పూర్తిస్థాయిలో విద్యుదీకరించబడిన రైలు మార్గంలో ఇప్పుడు విద్యుత్ ట్రాక్షన్‌ ద్వారా రైళ్లను నడిపే వీలు కల్గింది .

గద్వాల్ - కర్నూలు సిటీ స్టేషన్ల మధ్య విద్యుదీకరణ , డోన్ - కర్నూలు సిటీ - మహబూబ్‌నగర్‌ ; సికింద్రాబాద్ - ముద్ఖేడ్ - మన్మాడ్ విద్యుదీకరణ ప్రాజెక్ట్ లో భాగంగా పూర్తి చేయబడింది . ఈ ప్రాజెక్ట్ 2018-19 సంవత్సరంలో రూ. 916.07 కోట్ల సవరించిన అంచనా వ్యయంతో పనులు చేపట్టడం జరిగింది .సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ మధ్య విభాగాన్ని వేరే ప్రాజెక్టులో భాగంగా మంజూరు చేయబడి ఇప్పటికే విద్యుదీకరించారు. ఈ ప్రాజెక్టు కింద మహబూబ్‌నగర్-గద్వాల్ & కర్నూలు సిటీ -డోన్ ల విభాగాల మధ్య పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధి లోని డోన్ - గుత్తి - ధర్మవరం మరియు నైరుతి రైల్వే పరిధిలోని ధర్మవరం - బెంగళూరు సిటీ విభాగాల మధ్య విద్యుదీకరణ కూడా పూర్తయింది. అందువల్ల, ప్యాసింజర్ మరియు సరకు రవాణా రైళ్లు రెండూ, ఇప్పుడు హైదరాబాద్ - ధర్మవరం మరియు అటుపైన బెంగుళూరు వరకు సజావుగా ప్రయాణించేందుకు వీలుంటుంది , తద్వారా , రైలు ప్రారంభ స్థానం నుండి చివరి స్టేషన్ వరకు రైళ్లను ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌తో నడిపేందుకు వీలుపడుతుంది .

ఈ ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌తో రైళ్ల రాకపోకల నిర్వహణ వల్ల కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది తద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది . ఇంజిన్ మార్పిడి ని నివారించడం ద్వారా రైళ్ల నిర్వహణలో రైలు ప్రయాణీకులకు ఎలాంటి అంతరాయం లేని రాకపోకలు సాగించేందుకు సహాయపడుతుంది. ప్రయాణికుల మరియు సరకు రవాణా చేసే రైళ్ల మార్గ మధ్య నిలుపుదలను తగ్గిస్తుంది మరియు రైళ్ల సగటు వేగాన్ని మెరుగుపరుస్తుంది. విభాగాల మధ్య సామర్థ్యం పెంపుదల కారణంగా ఈ విభాగంలో మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విద్యుదీరణ వల్ల రైల్వేలకు ఇంధన ఖర్చులు పెద్ద ఎత్తున ఆదా చేయబడతాయి మరియు కార్యాచరణ సామర్ధ్యాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడతాయి.

ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ..విద్యుద్దీకరణ పనులను పూర్తి చేయడంలో అద్భుతమైన పనితీరును కనబరిచిన అంకితభావంతో పనిచేసినందుకు ఎలక్ట్రికల్ వింగ్ అధికారులు మరియు సిబ్బందిని అభినందించారు. గద్వాల్-కర్నూల్ స్టేషన్ల మధ్య ఈ మార్గంలో విద్యుదీకరణ పూర్తవడంతో, సికింద్రాబాద్-బెంగళూరు మధ్య మొత్తం సెక్షన్‌లో ఎలక్ట్రిక్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు జనరల్ మేనేజర్ తెలిపారు. జోన్ పరిధిలో ఇప్పటికే ఉన్న బ్రాడ్ గేజ్ మార్గాలను 100% విద్యుదీకరణ దిశగా వడివడిగా అడుగులు వేస్తోందని కూడా ఆయన పేర్కొన్నారు.

madagoni surendar

Mar 28 2023, 18:13

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేసామని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ శ్రీ. ఎం. మందపాటి శేషగిరిరావు అన్నారు.విజయవాడ ఠాగూర్ గ్రంథాలయంలో రాష్ట్రంలోని గ్రంథాలయ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పుస్తకాల కొనుగోలు, డిజిటల్ గ్రంథాలయాల ఏర్పాటు బడ్జెట్ ప్రతిపాధనలపై సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఛైర్మన్ శేషగిరి రావు మాట్లాడుతూ ప్రతి పేద వానికి విద్యతో పాటు విజ్ఞానాన్ని అందించాలని లక్ష్యంతో విద్యా శాఖలో పలు సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దక్కుతుందన్నారు. అన్ని గ్రామల్లో డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ముఖ్య మంత్రి ఆలోచనలకు అనుగుణంగా రూ.450 కోట్లతో 10,960 డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కడపలో మొదటి డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసామన్నారు, పల్లె పల్లెకు విజ్ఞాన వీచికలు అందాలనే లక్ష్యంతో గ్రంథాలయాలను బలోపేతం చేస్తున్నమన్నారు.

రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలలో ఏప్రిల్ 5 నుండి విజనరీజగన్ పేరుతో సెమీనార్‌లు నిర్వహిస్తున్నామన్నారు. గత సంవత్సరం బడ్జెట్ లో రాష్ట్రంలో గ్రంథాలయాల్లో పుస్తకాల కొనుగోలు చేయుటకు రూ.15.75 కోట్లు కేటాయించామన్నారు, ఇప్పటి వరకు రూ.10 కోట్లతో పుస్తకాలను కొనుగోలు చేసి గ్రంథాలయాలకు అందించామన్నారు. గత పది సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రాంలోని గ్రంథాలయాలను నిర్వీర్యం చేసాయన్నారు.

సామాజిక, విజ్ఞాన విషయాలకు సంబంధించి కొత్తగా ప్రచురింపబడిన (2021,2022,2023 సం//ల) పుస్తకాల నమూనా ప్రతులను రచయితలు, ప్రచురణ కర్తలనుండి కోరుచున్నామన్నారు. ఈ నెల 27 నుండి ఏప్రిల్ 26 వరకు రచయితలు, ప్రచురణకర్తల నుండి పుస్తకాలు నమూన ప్రతుల రిజిస్ట్రేషన్ కొరకు పుస్తకాల శాఖా గ్రంథాలయ భవనం, మొదటి అంతస్తు, శివాలయం ప్రక్కన, మెట్ల బజార్, పౌర గ్రంథాలయ సంచాలకుల వారి కార్యాలయం, మంగళగిరి నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో (పని దినాలు) ఉ.11. గంటల నుండి సా. 4. గంటల వరకు నమూన ప్రతులు, పోస్ట్ ద్వార గాని, స్వయంగా గాని అందజేయవచ్చునన్నారు. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ చట్టంలోని నిబంధనల (సెక్షన్-9) 1867 ప్రకారం ముద్రించిన పుస్తకాలు మూడు ప్రతులను అందజేయవలసి ఉందన్నారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్ధూ, సంస్కృతం, కన్నడ తమిళం మరియు ఒరియా సంబంధించి ప్రచురించబడిన పుస్తుకాలు ఈ ఎంపికకు అవసరమైవున్నవని. ఛైర్మన్ శ్రీ. ఎం. మందపాటి శేషగిరిరావు అన్నారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ సభ్యులు జి. మహేష్, శ్రీమతి రెడ్డి పద్మావతి, వై. నరసింహరావు, అమిరుద్దీన్, పౌర గ్రంథాలయ సంస్ధ, ఉప సంచాలకులు సి. శ్రీనివాస రెడ్డి, 13 ఉమ్మడి జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు

రాష్ట్ర సమాచార కేంద్రం విజయవాడ వారిచే జారీ చేయబడినది.

madagoni surendar

Mar 28 2023, 18:01

ఐడియా అదిరిపోయింది.. హైదరాబాద్ ఫ్లైఓవర్ల కింద కూడా ఇలా చేస్తే.

ఐడియా అదిరిపోయింది.. హైదరాబాద్ ఫ్లైఓవర్ల కింద కూడా ఇలా చేస్తే.


స్పోర్ట్స్ కాంప్లెక్స్ లకు స్థలం దొరికడం లేదని నాన్చే అధికారులకు ఓ యువకుడు బెస్ట్ ఐడియా చెప్పాడు. రోడ్డుపై ఉండే ఫ్లై ఓవర్ల కింది భాగాన ఖాళీగా ఉండే స్థలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఓ వీడియో ద్వారా తెలియజేశాడు. ఫ్లైఓవర్ కింద నిర్మించిన పబ్లిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను చూపించే ఓ వీడియో సోషల్ మీడియా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను ధనన్యాజ్_టెక్ అనే పేరుతో ఉన్న ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోలో ఫ్లై ఓవర్ కింద ఉన్న ఓ బాస్కెట్‌బాల్ కోర్ట్‌లో యువకులు క్రికెట్ ఆడుతున్నారు. ఆ ప్రాంతాన్ని చూపిస్తూ.. ఫ్లైఓవర్ కింద మిగిలిన సగం ప్రాంతంలో బ్యాడ్మింటన్ కోర్ట్‌ని చూపించాడు. దాంతో పాటు ఇది చాలా బ్రిలియంట్ ఐడియా అని, అన్ని నగరాల్లోనూ ఏర్పాటు చేస్తే బాగుంటుందంటూ క్యాప్షన్ లో తెలిపాడు. ఇలాంటిదే మీ సిటీలో ఉందా..? అంటూ ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ ఐడియాను వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాతో సహా పలువురు స్మార్ట్ ప్లానింగ్‌ అంటూ ప్రశంసిస్తున్నారు.

ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను సంపద ఫ్లై ఓవర్ కింద 2021లో నిర్మించినట్టు సమాచారం. వైరల్ అవుతున్న వీడియోలో, బంతులు, ఇతర వస్తువులు రోడ్డుపై పడకుండా నెట్‌తో ఆ ప్రాంతాన్ని కవర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు1.3 మిలియన్ వ్యూస్ రాగా… 12,000 పైగా లైక్‌లు వచ్చాయి. ఈ అమేజింగ్ ఐడియాను నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మెచ్చుకుంటున్నారు. గొప్ప మేక్ఓవర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ తరహా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు ఢిల్లీలోనూ ఏర్పాటు చేయాలని మరికొందరు కోరుతున్నారు. నవీ ముంబై నుండి వెలువడిన స్థానిక దినపత్రిక న్యూస్‌బ్యాండ్ ప్రకారం, ఈ పబ్లిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ 2745.27 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది డిసెంబర్ 2022లో క్రీడాకారులకు ఉచితంగా ఉపయోగించుకునేలా ఏర్పాటు చేశారు.

madagoni surendar

Mar 28 2023, 17:33

సిద్దిపేటలో తుపాకులు క్లీన్ చేస్తుండగా గన్ మిస్ ఫైర్

తుపాకులు క్లీన్ చేస్తుండగా గన్ మిస్ ఫైర్

సిద్దిపేటలో గన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో తుపాకులు క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ రాజశేఖర్ కుడి కన్నుకు గాయాలయ్యాయి. వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజశేఖర్ 2013 బ్యాచ్ కి చెందిన వాడు. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

madagoni surendar

Mar 28 2023, 17:05

సుప్రీంకోర్ట్ - ఢిల్లీ:అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం.

- సుప్రీంకోర్ట్ - ఢిల్లీ

- అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం

- అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టు లో పిటీషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం

- హైకోర్టు తీర్పును యధాతధంగా అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన అమరావతి రైతులు

- రెండు పిటీషన్లను విచారిస్తున్న న్యాయమూర్తి కె. ఎం. జోసెఫ్, బివి నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం

- అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం

- జగన్ మూడు రాజధానుల గురించి తమకు తెలియదన్న కేంద్రం

త్వరలోనే వైజాగ్ కు మకాం మార్చుతానని స్పష్టం చేసిన జగన్

అమరావతి కేసు విచారణపై కొనసాగుతున్న ఉత్కంఠ..

- 11 జులై 2023 కి వాయిదా వేసిన ధర్మాసనం