/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz వలిగొండలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి వినతి Vijay.S
వలిగొండలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో గురువారం భువనగిరి  శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి వలిగొండ మండలంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతూ మనం టీం తరఫున వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గంగాపురం సతీష్ ,బుగ్గ ఉదయ్ కుమార్, బత్తిని సైదులు , వరుణ్ ,నగేష్, బొమ్మగాని మహేష్ ,దంతూరి అరుణ్, బల్గూరి నరేష్ ,మన్నెం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
నైజాం నవాబును తరిమికొట్టింది కమ్యూనిస్టులు; గోదా శ్రీరాములు సిపిఐ జిల్లా కార్యదర్శి

వేములకొండ గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు బహిరంగ సభ మంగళవారం సాయంత్రం 7:00 గంటలకి సభాధ్యక్షులు కామ్రేడ్ పులి పలుకుల మల్లేశం గారి అధ్యక్షతన జరిగినది ఈ బహిరంగ సభకి *ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గోద శ్రీరాములు పాల్గొని ప్రసంగించారు* భారతదేశానికి సంవత్సరాల తరబడి పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యం వాదులని భారతదేశం నుంచి తరిమి కొట్టిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం ఆగస్టు 15-1947లో సిద్ధించింది అప్పటి భారత దేశంలో సుమారు 500 సంస్థానాలు ఉండేవి. అందులో హైదరాబాద్ సంస్థానం అతిపెద్ద ధనవంతమైన సంస్థానం ఇట్టి సంస్థానం నైజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, సైన్యాధ్యక్షులు ఖాషీం రజ్వీ, ఉపాధ్యక్షులు విసునూరు రామచంద్రారెడ్డి, భూస్వాములు ,పెతందారులు జాగిర్దారులు, మిలటరీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని. తెలంగాణ ప్రాంతంలో ప్రజలపై అనేక రకాలుగా పన్నులు వసూలు చేస్తూ మహిళలపై అఘాయిత్యాలు చేస్తూ అన్ని కులాల వారిలో వెట్టిచాకిరి చేయిస్తూ నిరంకుశంగా వ్యవహరించేవారు. భారతదేశం స్వాతంత్రం వచ్చి సంబరాలు జరుగుతున్నప్పటికీ తెలంగాణ ప్రజలకు తిప్పలు తప్పలేదు అట్టి నిరంకుశత్వాన్ని కల్లారా చూసిన రావి నారాయణరెడ్డి, మగ్డూం మోహినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి గారు ఆంధ్ర మహాసభలో ఖాసీ,ఆకృత్యాలపై పోరాటం చేయాలని నిర్ణయించారు సెప్టెంబర్ 11-1947న సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది గ్రామ గ్రామాన ప్రజల్ని చైతన్య పరిచి అందిన ఆయుధాలు గుతపలు రోకలిబండలు కారంపొట్లాలు ఒడిశాలలో తీసుకొని తిరగబడ్డారు మిలిటరీ సైన్యం జరిపిన కాల్పుల్లో, దాడుల్లో 4000 మంది మృతి చెందిన వెరవకుండా సాయుధ పోరాటాన్ని ఉదృతం చేశారు దాదాపు 3వేల గ్రామాల పైచిలుకు విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూమి ని పేదలకు పంచారు కాసిం రాజ్వి క్యాంపు లపై సాహిదులు తిరగబడే నేపథ్యంలో 1948 సెప్టెంబర్ 17న నైజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లొంగిపోయి హైదరాబాద్ సంస్థానాన్ని భారతీ యూనియన్ లో విలీనం చేయటం జరిగినది అని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా వేములకొండ గ్రామంలో గొప్ప బహిరంగ సభలో అన్నారు హైదరాబాదు నుండి వలిగొండ మండలం మీదగా పారుతున్న మూసి నదిని ప్రక్షాళన చేసి శుద్ధమైన నీరు అందించాలని అన్నారు వేములకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నాటి స్వతంత్ర సమరయోధులను సన్మానించారు గంగుల కృష్ణారెడ్డి, తాతయ్య, బందారపు అంజయ్య, కోమటిరెడ్డి అండాలు,జక్కిడి లక్ష్మమ్మ లను జిల్లా కార్యదర్శి సన్మానించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పులిపలుపుల ఆనందం, జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్, ఉప్పల ముత్యాలు,కల్లం కృష్ణ,వలిగొండ మండల కార్యదర్శి పోలపాక యాదయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎలగందుల అంజయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చలిగంజి వీరస్వామి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, ఆత్మకూరు మండల కార్యదర్శి మారుపాక వెంకటేష్, రామన్నపేట మండల కార్యదర్శి ఉట్కూరి నరసింహ, యాదగిరిగుట్ట మండల కార్యదర్శి కల్లపల్లి మహేందర్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుద్దాల సాయికుమార్, వలిగొండ మండల మరియు వేములకొండ గ్రామ శాఖ నాయకులు కొయ్యకురా రాంమల్లు, అంబటి అంజయ్య, చంద్రగిరి చంద్రయ్య,నరిగే యాదయ్య, నార్కట్పల్లి మచ్చ గిరి, సల్వాద్రి రవీందర్, చొప్పర్ వెంకటేష్, బొడిగ సుదర్శన్,ఆకుల శ్రీను, పొలమైన శంకరయ్య , వడ్డేగానిశంకరయ్య, బీస్ రమేష్, చేగురి పాపయ్య, భీమ గాని శ్రీను, సలిగంజి కృష్ణకుమార్, యాస జనార్దన్ రెడ్డి, రాపోలు పవన్, ఎర్ర కిరణ్, మారోజు నరసింహ చారి, ఎల్లంకి చంద్రశేఖర్, కనబడిన పృథ్వీరాజ్, వివిధ గ్రామాల నుండి భారీ ఎత్తున బహిరంగ సభకు హాజరైన ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజాపాలన దరఖాస్తులు పంపిణీ చేసిన కౌన్సిలర్ పంగ రెక్క స్వామి

భువనగిరి: ఆరోగ్య భద్రత కార్డు ఉండి ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పథకాన్ని అందిస్తున్నారు రూపాయలు 500 కి గ్యాస్ సిలిండర్ తో పాటు రాయితీని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు అయితే చాలామంది నుంచి తమకురాయతి అందడం లేదనే ఫిర్యాదులు అందుకున్న నేపథ్యంలో పథకం ఉద్దేశాన్ని వివరిస్తూ లబ్ధిదారుల చిరునామా పేరుతో ప్రభుత్వం లేఖలు పంపుతుంది జిల్లాకు వచ్చిన లేఖలను కలెక్టరేట్లో ఈనెల 12 న కలెక్టర్ సమావేశం నిర్వహించే అధికారులకు అందజేయగా *భువనగిరి 8 వార్డు కౌన్సిలర్ పంగ రెక్క స్వామి లబ్ధిదారులకు పంపించేస్తున్నారు* * ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేఖలో ఉన్న అంశాల గురించి ప్రజలకు తెలియజేశారు మాట ప్రకారం 500 కే మహాలక్ష్మి ఎల్పిజి పథకాన్ని అమలు చేస్తున్నామని గత మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగా లబ్ధిదారులకు సిలిండర్లను అందిస్తున్నామని పేర్కొన్నారు ఈరోజు వరకు మీ అర్హత ప్రకారం 9 సిలిండర్లకు మూడు సిలిండర్లు వినియోగించుకున్నారు రాయితీ మొత్తం ఆన్లైన్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాం ఇంటికి చేరాక నాలుగు రోజుల్లో రాయితీ మొత్తం బ్యాంకు ఖాతాలో జమకాకుంటే 1967 లేదా 180042500 33 నెంబర్లకు సంప్రదించవచ్చని రాష్ట్ర నీటిపారుదల ఆహార పౌరసరపరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలియజేశారని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ఉడుత రమేష్ ఇట్టబోయిన సబితా గోపాల్ ఇట్టబోయి పావని రాములు అనిత విజయలక్ష్మి వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులే: CPI

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంట గ్రామంలో మంగళవారం తెలంగాణ సాయుధ రహితంగా పోరాట వారోత్సవాల్లో భాగంగా భూమి కోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం.... మట్టి మనుషులు మరపిరంగులై,... సామాన్యులు సమర శంఖం ఊది... బాంచన్ నీ కాల్మోక్త అన్న చేతులు బందూకులు పట్టి తిరుగుబాటు చేసి, దొర ఏందీరో...! వాడి పీకుడేందిరో...!! అంటూ, దొరల గోసీలు ఊడగొట్టి,తరిమికొట్టి,వాళ్ళ గడీలను బద్దలు కొట్టి... తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసిన సాయుధ పోరాట,అమరవీరులకు జోహార్లు.. అర్పించిన ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజం నిరంకుషత్వ పాలనలో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా దొరలకు జాకీర్దారులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన కామ్రేడ్ రావి నారాయణరెడ్డి, మాగ్దుమ్ మొహినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, స్ఫూర్తితో సాయుధ పోరాటంలో పాల్గొన్న అనేకమంది కమ్యూనిస్టు నాయకులు చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య ఆరుట్ల కమలాదేవి వంటి వారి పోరాటాల ఫలితంగానే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం జరిగిందని అన్నారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు నాటి సాయుధ పోరాటాన్ని వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు కేవలం ముస్లిం,హిందూ మతానికి సంబంధించిన పోరాటాలుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు నాటి సాయుధ పోరాటంలో అనేకమంది ముస్లిం నాయకులు పాల్గొన్నరని కాశీం రాజ్వికి ఆశ్రయమిచ్చిన విసునూరు రామచంద్రారెడ్డి హిందు మతం అని గుర్తుచేశారు సాయుధ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులేనని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎడ్ల వెంకటయ్య బోడ చంద్రయ్య కడారి మారయ్య, శ్రీనివాస్ డి లింగయ్య బన్నీ శివ తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రపాల నగరం BRS గ్రామ శాఖ అధ్యక్షులు గర్దాసు విక్రమ్ జన్మదిన వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాలనగరం బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గర్దాసు విక్రమ్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. విక్రమ్ జన్మదినం సందర్భంగా నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో వారి నివాసంలో శుభకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. చెరువుగట్టు దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా మరియు నకిరేకల్ నియోజకవర్గంలోని పలువురు బిఆర్ఎస్ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
అన్నదానం గొప్ప పుణ్యదానం : మునుగోడు ఎమ్మెల్యే వ్యక్తిగత డ్రైవర్ గుత్తా నరేందర్ రెడ్డి

అన్నదానం గొప్ప పుణ్య కార్యక్రమం అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యక్తిగత డ్రైవర్ గుత్తా నరేందర్ రెడ్డి, గుత్తా నరేందర్ రెడ్డి అన్నారు. వినాయకుని వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం ఔరవాణి గ్రామంలో ఎస్ సి కాలనీ లో ఉత్సవ కమిటీ వారు ఆహ్వానం మేరకు వారు ఏర్పాటు చేసిన పూజ, అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతు వినాయకుని విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనియమం అన్నారు.ప్రతి ఒక్కరు భక్తి భావం అలవర్చుకొని సమజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలని సూచించాన నాకిరేకంటి యాదయ్య, ముప్పిడి ఈదయ్య, బొంతల ఎల్లయ్య, గాదె లింగాలు, ముప్పిడి లింగయ్య, బొజ్జ స్వామి, ముప్పిడి నరసింహ కమిటీ సభ్యులు బొంతల రమేష్, ముప్పిడి రవి, బొంతల రవి, ముప్పిడి లింగస్వామి, ముప్పిడి సతీష్, ఎక్కురి నరేష్, నీరుడు అఖిల్ రెడ్డి, గాదె క్రాంతి, గాదె శివ ముప్పిడి చరణ్, బొజ్జ గిరి,పురం సతీష్, ఎక్కూరి శివ, బొజ్జ గిరి, అవగాని గణేష్, దొడ్డి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎస్టి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి:LHPS రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన "చేవెళ్ల ఎస్టీ డిక్లరేషన్" ను వెంటనే అమలు చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం భువనగిరి లోని సుందరయ్య భవన్ లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశానికి జిల్లా బాధ్యులు కేతావత్ మురళి నాయక్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి భీమా నాయక్ మాట్లాడుతూ ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎస్టీ ల అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం చేసినా, చేవెళ్ల ఎస్టీ డిక్లరేషన్ అమలులో జాప్యం చేసినా, లంబాడీలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం లంబాడి హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కమిటీని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్యా శ్రీనివాస్ నాయక్ ప్రకటించారు. *యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కమిటీ* జిల్లా అధ్యక్షుడిగా నరసింహ నాయక్ భువనగిరి నియోజకవర్గ అధ్యక్షులుగా కేతావత్ మురళీ నాయక్ మండల అధ్యక్షులుగా పాండు నాయక్ ఉపాధ్యక్షులుగా భాష నాయక్ ప్రధాన కార్యదర్శిగా కేతావత్ హరి నాయక సహాయ కార్యదర్శిగా బిక్షపతి నాయక్ రైతు విభాగం జిల్లా అధ్యక్షులుగా నరేందర్ నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా లకావత్ సురేష్ నాయక్ జిల్లా ప్రధాన సలహాదారులుగా కేతావత్ రాజు నాయక్ ఎన్నికయ్యారు.
కుల మత ప్రాంతీయ భేదాల ప్రసక్తి లేని మహా ఉద్యమమే నాటి తెలంగాణ సాయుధ రైతంగ పోరాటం: సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్

కుల, మత, ప్రాంతీయ భేదాల ప్రసక్తి లేని మహా ఉద్యమమే నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట మని *సిపిఎం జిల్లా కార్యదర్శి యండి. జంహగీర్* తెలియజేశారు. మంగళవారం సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి గారి స్థూపానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమానికి సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ అధ్యక్షత వహించగా జహంగీర్ మాట్లాడుతూ ఆనాడు భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం బక్క జిక్కిన పేదతో బంధూకులు పట్టించి దొరలకు, జాగిర్దారులకు, రజాకార్లకు వ్యతిరేకంగా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు కులాలకు, మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున పోరాటం సాగిందని ఆ పోరాటంలో అనేకమంది నేలకుఓరిగగారని అన్నారు.ఆ పోరాట ఫలితంగానే ప్రజలు వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందారని, దున్నేవాడికి భూమి సాధించి పెట్టారని అన్నారు. ఆరోజు అన్నదమ్ములు లెక్క అందరూ ఏకమై పోరాటం చేస్తే నేడు బిజెపి, ఆర్ఎస్ఎస్ ఆనాటి చరిత్రను మతం పేరుతో, కులం పేరుతో మరుగున పడేయాలని చూస్తున్నదని దీనిని ప్రజలందరూ తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో బిజెపి విధానాలు ప్రజల మధ్యన ఐక్యత దెబ్బతీస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పోరేట్ శక్తులకు అమ్ముతున్నారని, రాజ్యాంగాన్ని కాల రాయాలని చూస్తున్నదని ఇలాంటి మతోన్మాద బిజెపిని ఈ దేశం నుండి తరమవలసిన పరిస్థితి ఏర్పడ్డదని అందుకు ప్రజలందరూ నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల స్ఫూర్తితో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని జహంగీర్ పిలుపునిచ్చారు. *సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ* మాట్లాడుతూ మట్టి మనుషులను తల ఎత్తి నిలబెట్టింది నాటి తెలంగాణ సాయిధ పోరాటమని అన్నారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు మన తెలంగాణ మాగానాల్లో విరబూసిన ఎర్రటి మందారాలని అన్నారు. నాడు దున్నేవాడికి భూమి కావాలని పెద్ద ఎత్తున పోరాటం నడిపి భూమిలేని పేదలందరికీ భూమి పంపిణీ చేశారని అన్నారు. కానీ నేడు పాలకులు అనేక రకాలైన చట్టాలలో మార్పులు తెచ్చి సెజ్ ల పేరుతో, పరిశ్రమల పేరుతో మల్లి వందలాది ఎకరాల భూములను ఒక్కొక్కరు పోగు చేసుకుంటున్నారని ఆ భూములను మల్లి పేదలకు పంచడానికి నాటి తెలంగాణ సాయుధ పోరాట వీరుల స్ఫూర్తితో మరోసారి భూ పోరాటాలకు సిద్ధం కావాలని నర్సింహ పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, దాసరి పాండు మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ, జిల్లా కమిటి సభ్యులు గడ్డం వెంకటేష్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడ్య రాజు, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, మండల కమిటి సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేష్, కొండపురం యాదగిరి,సురుపంగ ప్రకాష్, మండల నాయకులు దేషపాక రవి, యండి.జహంగీర్, మహేందర్, ఎస్.కె. షరీఫ్, పి.జహంగీర్, వెంకటస్వామి, సింగిరెడ్డి భూపాల్ రెడ్డి, మామిడి లచ్చిరెడ్డి, భీమబోయిన ముత్యంప్రకాష్,గంగాదరీ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

యాదాద్రి భువనగిరి ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసులు గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవము జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజా పాలనా వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్య్ర సమరయోధులు అందరికీ నా జోహార్లు ... సెప్టెంబర్‌ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు, హైదరాబాద్‌ సంస్థానం భారత్‌ యూనియన్‌లో చేరి నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు,  ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్ధినీ, విద్యార్ధులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,మందుల సామేలు , జిల్లా కలెక్టర్ హనుమంతు కె జండగే , డిసిపి రాజేష్ చంద్ర , అడిషనల్ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నాగోల్ లోని సహబావన టౌన్షిప్ బ్లాక్ సి03 గణేష్ నిమజ్జనుంలో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.

హైదరాబాద్ నాగోల్ లోని సహబావన టౌన్షిప్ బ్లాక్ సి03 నాగోల్ బండ్లగూడలో సహవాన టౌన్షిప్ లో జరిగినటువంటి వినాయక నిమజ్జనములో లో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మరియు సహభావన టౌన్షిప్ సి 03 నుండి కల్లూరు ఉపేంద్ర చారి, రామకృష్ణ, రేవంత్ సోమిరెడ్డి వారి బృందం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ అందరం ఘనంగా జరుపుకునే గణనాధునికి వీడ్కోలుతున్నటువంటి సందర్భంలో ఆహ్వానాన్ని మంచి నేనిక్కడికి రావడం జరిగిందని తెలిపారు. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.