/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ఇంద్రపాల నగరం BRS గ్రామ శాఖ అధ్యక్షులు గర్దాసు విక్రమ్ జన్మదిన వేడుకలు Vijay.S
ఇంద్రపాల నగరం BRS గ్రామ శాఖ అధ్యక్షులు గర్దాసు విక్రమ్ జన్మదిన వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాలనగరం బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గర్దాసు విక్రమ్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. విక్రమ్ జన్మదినం సందర్భంగా నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో వారి నివాసంలో శుభకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. చెరువుగట్టు దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా మరియు నకిరేకల్ నియోజకవర్గంలోని పలువురు బిఆర్ఎస్ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
అన్నదానం గొప్ప పుణ్యదానం : మునుగోడు ఎమ్మెల్యే వ్యక్తిగత డ్రైవర్ గుత్తా నరేందర్ రెడ్డి

అన్నదానం గొప్ప పుణ్య కార్యక్రమం అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యక్తిగత డ్రైవర్ గుత్తా నరేందర్ రెడ్డి, గుత్తా నరేందర్ రెడ్డి అన్నారు. వినాయకుని వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం ఔరవాణి గ్రామంలో ఎస్ సి కాలనీ లో ఉత్సవ కమిటీ వారు ఆహ్వానం మేరకు వారు ఏర్పాటు చేసిన పూజ, అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతు వినాయకుని విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనియమం అన్నారు.ప్రతి ఒక్కరు భక్తి భావం అలవర్చుకొని సమజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలని సూచించాన నాకిరేకంటి యాదయ్య, ముప్పిడి ఈదయ్య, బొంతల ఎల్లయ్య, గాదె లింగాలు, ముప్పిడి లింగయ్య, బొజ్జ స్వామి, ముప్పిడి నరసింహ కమిటీ సభ్యులు బొంతల రమేష్, ముప్పిడి రవి, బొంతల రవి, ముప్పిడి లింగస్వామి, ముప్పిడి సతీష్, ఎక్కురి నరేష్, నీరుడు అఖిల్ రెడ్డి, గాదె క్రాంతి, గాదె శివ ముప్పిడి చరణ్, బొజ్జ గిరి,పురం సతీష్, ఎక్కూరి శివ, బొజ్జ గిరి, అవగాని గణేష్, దొడ్డి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎస్టి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి:LHPS రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన "చేవెళ్ల ఎస్టీ డిక్లరేషన్" ను వెంటనే అమలు చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం భువనగిరి లోని సుందరయ్య భవన్ లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశానికి జిల్లా బాధ్యులు కేతావత్ మురళి నాయక్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి భీమా నాయక్ మాట్లాడుతూ ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎస్టీ ల అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం చేసినా, చేవెళ్ల ఎస్టీ డిక్లరేషన్ అమలులో జాప్యం చేసినా, లంబాడీలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం లంబాడి హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కమిటీని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్యా శ్రీనివాస్ నాయక్ ప్రకటించారు. *యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కమిటీ* జిల్లా అధ్యక్షుడిగా నరసింహ నాయక్ భువనగిరి నియోజకవర్గ అధ్యక్షులుగా కేతావత్ మురళీ నాయక్ మండల అధ్యక్షులుగా పాండు నాయక్ ఉపాధ్యక్షులుగా భాష నాయక్ ప్రధాన కార్యదర్శిగా కేతావత్ హరి నాయక సహాయ కార్యదర్శిగా బిక్షపతి నాయక్ రైతు విభాగం జిల్లా అధ్యక్షులుగా నరేందర్ నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా లకావత్ సురేష్ నాయక్ జిల్లా ప్రధాన సలహాదారులుగా కేతావత్ రాజు నాయక్ ఎన్నికయ్యారు.
కుల మత ప్రాంతీయ భేదాల ప్రసక్తి లేని మహా ఉద్యమమే నాటి తెలంగాణ సాయుధ రైతంగ పోరాటం: సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్

కుల, మత, ప్రాంతీయ భేదాల ప్రసక్తి లేని మహా ఉద్యమమే నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట మని *సిపిఎం జిల్లా కార్యదర్శి యండి. జంహగీర్* తెలియజేశారు. మంగళవారం సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి గారి స్థూపానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమానికి సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ అధ్యక్షత వహించగా జహంగీర్ మాట్లాడుతూ ఆనాడు భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం బక్క జిక్కిన పేదతో బంధూకులు పట్టించి దొరలకు, జాగిర్దారులకు, రజాకార్లకు వ్యతిరేకంగా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు కులాలకు, మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున పోరాటం సాగిందని ఆ పోరాటంలో అనేకమంది నేలకుఓరిగగారని అన్నారు.ఆ పోరాట ఫలితంగానే ప్రజలు వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందారని, దున్నేవాడికి భూమి సాధించి పెట్టారని అన్నారు. ఆరోజు అన్నదమ్ములు లెక్క అందరూ ఏకమై పోరాటం చేస్తే నేడు బిజెపి, ఆర్ఎస్ఎస్ ఆనాటి చరిత్రను మతం పేరుతో, కులం పేరుతో మరుగున పడేయాలని చూస్తున్నదని దీనిని ప్రజలందరూ తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో బిజెపి విధానాలు ప్రజల మధ్యన ఐక్యత దెబ్బతీస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పోరేట్ శక్తులకు అమ్ముతున్నారని, రాజ్యాంగాన్ని కాల రాయాలని చూస్తున్నదని ఇలాంటి మతోన్మాద బిజెపిని ఈ దేశం నుండి తరమవలసిన పరిస్థితి ఏర్పడ్డదని అందుకు ప్రజలందరూ నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల స్ఫూర్తితో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని జహంగీర్ పిలుపునిచ్చారు. *సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ* మాట్లాడుతూ మట్టి మనుషులను తల ఎత్తి నిలబెట్టింది నాటి తెలంగాణ సాయిధ పోరాటమని అన్నారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు మన తెలంగాణ మాగానాల్లో విరబూసిన ఎర్రటి మందారాలని అన్నారు. నాడు దున్నేవాడికి భూమి కావాలని పెద్ద ఎత్తున పోరాటం నడిపి భూమిలేని పేదలందరికీ భూమి పంపిణీ చేశారని అన్నారు. కానీ నేడు పాలకులు అనేక రకాలైన చట్టాలలో మార్పులు తెచ్చి సెజ్ ల పేరుతో, పరిశ్రమల పేరుతో మల్లి వందలాది ఎకరాల భూములను ఒక్కొక్కరు పోగు చేసుకుంటున్నారని ఆ భూములను మల్లి పేదలకు పంచడానికి నాటి తెలంగాణ సాయుధ పోరాట వీరుల స్ఫూర్తితో మరోసారి భూ పోరాటాలకు సిద్ధం కావాలని నర్సింహ పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, దాసరి పాండు మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ, జిల్లా కమిటి సభ్యులు గడ్డం వెంకటేష్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడ్య రాజు, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, మండల కమిటి సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేష్, కొండపురం యాదగిరి,సురుపంగ ప్రకాష్, మండల నాయకులు దేషపాక రవి, యండి.జహంగీర్, మహేందర్, ఎస్.కె. షరీఫ్, పి.జహంగీర్, వెంకటస్వామి, సింగిరెడ్డి భూపాల్ రెడ్డి, మామిడి లచ్చిరెడ్డి, భీమబోయిన ముత్యంప్రకాష్,గంగాదరీ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

యాదాద్రి భువనగిరి ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసులు గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవము జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజా పాలనా వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్య్ర సమరయోధులు అందరికీ నా జోహార్లు ... సెప్టెంబర్‌ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు, హైదరాబాద్‌ సంస్థానం భారత్‌ యూనియన్‌లో చేరి నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు,  ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్ధినీ, విద్యార్ధులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,మందుల సామేలు , జిల్లా కలెక్టర్ హనుమంతు కె జండగే , డిసిపి రాజేష్ చంద్ర , అడిషనల్ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నాగోల్ లోని సహబావన టౌన్షిప్ బ్లాక్ సి03 గణేష్ నిమజ్జనుంలో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.

హైదరాబాద్ నాగోల్ లోని సహబావన టౌన్షిప్ బ్లాక్ సి03 నాగోల్ బండ్లగూడలో సహవాన టౌన్షిప్ లో జరిగినటువంటి వినాయక నిమజ్జనములో లో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మరియు సహభావన టౌన్షిప్ సి 03 నుండి కల్లూరు ఉపేంద్ర చారి, రామకృష్ణ, రేవంత్ సోమిరెడ్డి వారి బృందం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ అందరం ఘనంగా జరుపుకునే గణనాధునికి వీడ్కోలుతున్నటువంటి సందర్భంలో ఆహ్వానాన్ని మంచి నేనిక్కడికి రావడం జరిగిందని తెలిపారు. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మాల మహానాడు వలిగొండ మండల అధ్యక్షులుగా కూచి మల్ల నాగేష్ ఏకగ్రీవ ఎన్నిక

వలిగొండ మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటుచేసిన మాలల ఐక్య సమావేశంలో వలిగొండ మండల వివిధ గ్రామాలకు చెందిన మాల మహానాడు నాయకులు, పెద్దలు, యువకుల ఆధ్వర్యంలో మండల మాల మహానాడు నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల మాల మహానాడు నూతన అధ్యక్షులుగా వెల్వర్తి గ్రామానికి చెందిన కూచిమల్ల నాగేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పుర్మ అంజయ్య, బుంగ శేఖర్, ప్రధాన కార్యదర్శిగా కాశమల్ల శేఖర్, కోశాధికారిగా చలిచీమల కృష్ణ, సహాయ కార్యదర్శులుగా కట్ట సురేష్, వలవల బిక్షపతి, సాంస్కృతిక కార్యదర్శిగా కూచిమల్ల కుమార్, క్రీడల కార్యదర్శిగా వీసం కృష్ణ, కట్ట యాదగిరి లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు కూచిమల్ల నాగేష్ మాట్లాడుతూ మాలల ఐక్యత కోసం మాలల అభివృద్ధి కోసం అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాపోలు పవన్ కుమార్, నీలం నరేందర్, కూచిమల్ల సుధాకర్, సలబద్రి మహేందర్, సంగిశెట్టి రమేష్, సంగిశెట్టి విజయ్ కుమార్, వలమల రత్నయ్య, సంగిశెట్టి సుందరయ్య, జక్క స్వామి, కూచిమల్ల రాము, జక్క శ్రావణ్, మాడుగుల నరసింహ, నీలం నరేష్, కట్ట దానయ్య, చలిచీమల నరసింహ, చలిచీమల లక్ష్మయ్య, కుల పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సుంకిశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఇంజమూరి జంగయ్య పవిత్ర కుటుంబ సభ్యులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామంలో వినాయక మండపం దగ్గర గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంజమూరి జంగయ్య పవిత్ర వారి కుటుంబ సభ్యులు పాల్గొని. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విగ్రహ దాతలు మొగిలిపాక చిన్న ఎల్ల స్వామి హేమలత వారి కుటుంబ సభ్యులు విగ్నేశ్వర మహారాజుకి ప్రత్యేక పూజలు నిర్వహించినారు. వచ్చిన భక్తులకు భగవంతుని ప్రసాదం అందజేసినారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి పైళ్ల సంధ్యారాణి ఉపేందర్ రెడ్డి. మాజీ సర్పంచ్ మొగిలిపాక నరసింహ. యూత్ సభ్యులు యువకులు గ్రామ పెద్దలు బాలకృష్ణ ఉప్పలయ్య జంగయ్య రామకృష్ణ స్వామి వెంకటరెడ్డి అశోక్ భక్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వలిగొండ మాల మహానాడు మండల అధ్యక్షులుగా కూచిమల్ల నాగేష్ ఏకగ్రీవ ఎన్నిక

యాదాద్రి భువనగిరి జిల్లా  వలిగొండ మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటుచేసిన మాలల ఐక్య సమావేశంలో వలిగొండ మండల వివిధ గ్రామాలకు చెందిన మాల మహానాడు నాయకులు, పెద్దలు, యువకుల ఆధ్వర్యంలో మండల మాల మహానాడు నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల మాల మహానాడు నూతన అధ్యక్షులుగా వెల్వర్తి గ్రామానికి చెందిన కూచిమల్ల నాగేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పుర్మ అంజయ్య, బుంగ శేఖర్, ప్రధాన కార్యదర్శిగా కాశమల్ల శేఖర్, కోశాధికారిగా చలిచీమల కృష్ణ, సహాయ కార్యదర్శులుగా కట్ట సురేష్, వలవల బిక్షపతి, సాంస్కృతిక కార్యదర్శిగా కూచిమల్ల కుమార్, క్రీడల కార్యదర్శిగా వీసం కృష్ణ, కట్ట యాదగిరి లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు కూచిమల్ల నాగేష్ మాట్లాడుతూ మాలల ఐక్యత కోసం మాలల అభివృద్ధి కోసం అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాపోలు పవన్ కుమార్, నీలం నరేందర్, కూచిమల్ల సుధాకర్, సలబద్రి మహేందర్, సంగిశెట్టి రమేష్, సంగిశెట్టి విజయ్ కుమార్, వలమల రత్నయ్య, సంగిశెట్టి సుందరయ్య, జక్క స్వామి, కూచిమల్ల రాము, జక్క శ్రావణ్, మాడుగుల నరసింహ, నీలం నరేష్, కట్ట దానయ్య, చలిచీమల నరసింహ, చలిచీమల లక్ష్మయ్య, కుల పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అక్టోబర్ నెలలో జరిగే సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవ మరియు అవగాహన సదస్సు పోస్టర్లను శుక్రవారం  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శశాంక మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రతి పౌరునికి భారత్ వంటి అనేక ప్రజాస్వామ్య దేశాలలో సమాచార హక్కు ప్రాథమిక హక్కులలో భాగంగా అత్యంత విలువైన మానవ హక్కుగా గుర్తించారన్నారు. ప్రజలకు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు పథకాల గురించి అవగాహన పెంచుకోవడానికి కూడా సమాచార హక్కు ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని శక్తివంతమైన సాధనంగా ఉపయోగించాలని అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం సక్రమంగా అమలవుతుందన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, విద్యా అధికారులు, పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, మైనింగ్ అధికారులు,మెడికల్ సిబ్బంది, అంగన్వాడి ఉద్యోగులు మరియు అన్ని శాఖల అధికారుల సమక్షంలో విద్యార్థులకు, యువకులకు సమాజంలో సమాచార హక్కు చట్టం వల్ల కలిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏ ఏ కార్యక్రమాలు ప్రజలకు అవసరం పడతాయని అవగాహన సదస్సును ఏర్పాటు చేయుటకు జాతీయ మరియు రాష్ట్ర కమిటీ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సూర స్రవంతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం,రాష్ట్ర కార్యదర్శి గుండెల రాయుడు,ఆర్టీఐ రంగారెడ్డి జిల్లా సభ్యులు రామగళ్ళ శ్రీనివాస్,దొడ్డి రాజు యాదవ్,కాకి శేఖర్,ఉడుగుల మధు, తదితరులు పాల్గొన్నారు.