/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz నల్లగొండ: ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధులకు, వికలాంగులకు ఓపి దగ్గర ప్రత్యేక లైన్ కేటాయించండి: సామాజిక కార్యకర్త సాదిక్ పాషా Miryala Kiran Kumar
నల్లగొండ: ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధులకు, వికలాంగులకు ఓపి దగ్గర ప్రత్యేక లైన్ కేటాయించండి: సామాజిక కార్యకర్త సాదిక్ పాషా
నల్గొండ లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలంటే ఎంతో వ్యయ ప్రయాస పడితే కానీ వైద్యం అందే పరిస్థితి లేదు

వివరాల్లోకి వెళితే ప్రస్తుతం సాధారణ జ్వరాలు మరియు మలేరియా, డెంగీ జ్వరాలతో ప్రజలు నిత్యం వందల సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు వారు ముందుగా ఓ.పి చీటి తీసుకుని డాక్టరు వద్దకు వెళ్ళాలి మరి ఓ.పి చీటి తీసుకోవడం అంత సులువైన పనేం కాదు వరుసలో గంటలు వెచ్చించాల్సిన పరిస్థితి ఓ.పి విభాగంలో ముగ్గురు సిబ్బంది వుంటారు ఒకరు పురుషులకు, మరొకరు మహిళలకు, ఇంకొకరు వృద్దులకు/వికలాంగులకు ఓ.పి ఇవ్వాలి కానీ ఇక్కడ అదేం వుండదు ఒక లైను పురుషులకు మరొక లైను మహిళలకు మాత్రమే ఇస్తారు. మరి వృద్దులు/వికలాంగులు సాధారణ పురుషుల మాదిరిగా గంటల కొద్ది లైనులో వేచి వుండలేరు అలాంటి వారికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి వారికి సత్వరమే వైద్య సేవలు అందజేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వున్నారు.

ఇదే విషయమై నల్గొండ కు చెందిన సామాజిక కార్యకర్త *ఎం.డి. సాదిక్ పాషా* నల్గొండ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ని కలిసి ఓ.పి విభాగం నందు వేగం పెంచడంతో బాటుగా వృద్దులకు, వికలాంగులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ఓ.పి చీటి ఇచ్చే సదుపాయం కల్పించి అలాగే వైద్యం కొరకు వచ్చే రోగులు వారికి ఎద్దురయ్యే ఇబ్బందులను ఎవరికి పిర్యాదు చేయాలో ఆ అధికారుల ఫోన్ నంబర్లను అందరికి కనపడేలా ఏర్పాటు చేయాలని మరియు రోగులు కూర్చునే కుర్చీలను ఓ.పి వద్ద బారికేడ్లుగా వాడుకోవడంతో రోగులు ఎక్కడ కూర్చువాలో అర్ధం పరిస్థితి ఉందని కావున రోగులు కూర్చునే కుర్చీలను వారికే కేటాయించాలని కోరారు దానికి సూపరింటెండెంట్  సానుకూలంగా స్పందించి తప్పని సరిగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది.

ఈ సందర్భంగా సాదిక్ పాషా మాట్లాడుతూ వైద్యం అందించడంలో వేగం పెంచాలని అలాగే రోగులకు తగ్గట్లుగా వైద్యులు ఉండేలా చూడాలని ఏర్పాట్లు చేయాలని కోరారు.
మరోసారి అక్బరుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు...

మరోసారి అక్బరుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు. మాపై కక్షగట్టి నోటీసులు ఇచ్చారు. మా విద్యా సంస్థలను కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. కూల్చినా కూడా కుతుబ్‌మినార్‌ కంటే ఎత్తైన భవనాలు నిర్మిస్తాం.

మేం 40 వేల మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నాం. నాపై కక్ష ఉంటే నన్ను కాల్చండి, నాపై దాడులు చేసుకోండి. నేను చేసే మంచి కార్యక్రమాలను అడ్డుకోవద్దు. మా విద్యాసంస్థలను మూయించి భయపెట్టాలనుకుంటున్నారు.

మిమ్మల్ని ఎదుర్కోవడానికి మా విద్యార్థులే చాలు. మాకు ఎవరు మద్దతు ఇచ్చినా.. ఇవ్వకుపోయినా ఎదుర్కోవడానికి సిద్ధం. కేసులతో జైల్లో పెట్టి వేధించినప్పుడే నేను భయపడలేదు. -అక్బరుద్దీన్‌ ఒవైసీ

త్వరలో మరో 35 వేల ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్‌రెడ్డి

త్వరలో మరో 35 వేల ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నట్లు చెప్పారు.

యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై.. మెయిన్స్‌ కోసం సన్నద్ధమవుతున్న తెలంగాణ అభ్యర్థులకు ‘రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం’ పేరిట రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు రేవంత్‌రెడ్డి చెక్కులు అందజేశారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 135 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్‌ సర్వెంట్లు రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. సివిల్స్‌ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలని ఆకాంక్షించారు.

‘చదువుకు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో యంగ్‌ ఇండియా వర్సిటీ ద్వారా 2వేల మందికి శిక్షణ ఇస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి శిక్షణ ఇస్తాం. అంతేకాకుండా యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ వర్సిటీ ఏర్పాటు చేస్తాం. 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లకు అత్యధికంగా పతకాలు వచ్చేలా కృషి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో 25 నుంచి 30 ఎకరాల్లో యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వం వర్సిటీలను నిర్వీర్యం చేసింది. 10, 15 రోజుల్లో అన్ని వర్సిటీలకు నూతన వైస్‌ ఛాన్సలర్లను నియమిస్తాం. వర్సిటీల్లోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం. కొందరు ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు.’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

AP: చిత్తూరు జిల్లాలో దారుణం.. వైద్యం వికటించి విద్యార్థిని మృతి..

AP: చిత్తూరు జిల్లాలో దారుణం.. వైద్యం వికటించి విద్యార్థిని మృతి..

చిత్తూరు జిల్లా పలమనేరులో ఇంటర్‌ విద్యార్థిని మృతి. వైద్యం వికటించడం వల్లే చనిపోయిందని బంధువుల ఆందోళన. ఆస్పత్రి ముందు ధర్నా, ఫర్నీచర్‌ ధ్వంసం.

జ్వరం రావడంతో విద్యార్థిని ప్రైవేట్‌ క్లినిక్‌కు తీసుకెళ్లిన తల్లిదండ్రులు. ఇంజెక్షన్‌ ఇచ్చి ఇంటికి పంపిన వైద్యులు. ఇంటికి వచ్చిన కాసేపటికే ఫిట్స్‌తో పడిపోయిన విద్యార్థిని. బ్రెయిన్‌ డెడ్‌తో చనిపోయిందని నిర్ధారించిన వైద్యులు.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం ఇన్‌ఫ్లో 1,32,281 క్యూసెక్కులు

ఔట్‌ఫ్లో 66,051 క్యూసెక్కులు

పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు

ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు

ప్రస్తుత నీటి నిల్వ 210.03 టీఎంసీలు

కొనసాగుతున్న జల విద్యుత్ ఉత్పత్తి.

TG: తెలంగాణ సీజనల్‌ వ్యాధులపై డేటా విడుదల...

తెలంగాణ సీజనల్‌ వ్యాధులపై డేటా విడుదల. జనవరి 1 నుంచి ఆగస్టు 25 వరకు 5,372 డెంగ్యూ కేసులు.

హై రిస్క్‌ డెంగ్యూ కేసులు హైదరాబాద్‌లో 1,852. సూర్యపేట 471, మేడ్చల్‌ 426, ఖమ్మం 375, నల్గొండలో 315 డెంగ్యూ కేసులు.

నిజమాబాద్‌ 286, రంగారెడ్డి 232, జగిత్యాల 185, సంగారెడ్డి 160, వరంగల్‌లో 110 డెంగ్యూ కేసులు. రాష్ట్రవ్యాప్తంగా చికెన్‌ గునియా కేసులు 152, మలేరియా 191 కేసులు.

హైదరాబాదులో దారుణం.. సెల్ ఫోన్ చార్జర్ కోసం మహిళను చంపిన యువకుడు..

హైదరాబాద్‌: దుండిగల్‌లో దారుణం

చార్జర్ కోసం మహిళను చంపిన యువకుడు

చార్జర్‌ ఇవ్వలేదని శాంత అనే మహిళను..

కొట్టి చంపిన కమల్‌ కుమార్‌

సీసీ కెమెరాలో రికార్డయిన హత్య దృశ్యాలు

భద్రాచలం: చర్ల:దశాబ్దాలు గడుస్తున్న తాలిపేరు ప్రాజెక్టు అదనపు 3 గేట్లు ఎందుకు ఓపెన్ చేయడం లేదు AITF మండల నాయకుడు గొంది ముయ్యన్న

దశాబ్దాలు గడుస్తున్న తాలిపేరు ప్రాజెక్టు అదనపు 3 గేట్లు ఎందుకు ఓపెన్ చేయడం లేదు AITF మండల నాయకుడు గొంది ముయ్యన్న

 చర్ల మండలం పెద్ద ముడిసిలేరులో ఉన్న ఎడమ పక్కన తాలిపేరు ప్రాజెక్టుకు అదనపు మూడు గేట్లకు 70 కోట్ల రూపాయలు సాంక్షన్ అయ్యాయి కానీ రెండు దశాబ్దాలు పూర్తవుతున్న ఇంకా దాన్ని పూర్తి చేయలేదని దీనిపైన పూర్తి అవగాహన సీనియర్ మీడియా మిత్రులకు నాయకులకు అధికారులకు ఉన్న స్పందించడం లేదని ఏఐటిఎఫ్ ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం మండల నాయకుడు గొంది ముయ్యన్న అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్లు జేబులు నింపుకోవడానికి అధికారుల జేబులు నింపడానికి ఈ ప్రాజెక్టుకి ప్రతి ఏటా నిధులు వస్తున్నాయి.

పక్కన ఉన్న తాలు పేరు ప్రాజెక్టు ఎస్టిమేషన్ వెంగళరావు 24 గేట్లకు అంచనా 48 కోట్లు ఇప్పుడున్న అదనపు మూడు గేట్లకి 70 కోట్లు శాంక్షన్ అయ్యాయి దానికి దీనికి రూపాయలు డిఫరెంట్ కోట్లు పెట్టిన ప్రాజెక్టుకు 24 గేట్లు తక్కువ కోట్లకు పూర్తయింది  దీనిపైన అధికారులు పాలకులు 70 కోట్ల వరకు బిల్లు చేశారు అయినా ఎందుకు ఇది పూర్తి కావడం లేదు ఇట్టి విషయంపై అవగాహన ఉన్న మేధావులు రాజకీయ నాయకులు సీనియర్ పత్రికా రిపోర్టర్లు ఎందుకు స్పందించడం లేదు దీనిలో కుల సమీకరణ కూడా ఉందని ప్రజలలో తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ప్రాజెక్టుకి కొండా సురేఖ భర్త అయినా కొండ మురళి హస్తం ఉన్నదని వారు అన్నారు ఇప్పటికైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు* స్పందించి ఈ తాలిపేరు ప్రాజెక్ట్ అదనపు మూడు గేట్లను పూర్తి చేయించి ప్రారంభోత్సవం చేయాలని ఇప్పుడున్న వరద బీభత్సవానికి కాల్ పేరు బిర్జి తట్టుకోవడం లేదని వారు సర్వే చేసి తెలియజేశారు రెండు దశాబ్దాలు అయిన పూర్తి కానిది కనీసం మూడో దశాబ్దానికైనా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఆదివాసి మండలం అయినా చర్ల మండలం పైన పాలకులకు అధికారులకు ఎందుకు చిన్న చూపు అని ఆయన ప్రశ్నించారు.

కాలు పేరు అదనపు 3 గేట్లని పూర్తి చేయకపోతే ఆదివాసీ ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని పాలకులను అధికారులను వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు మండల నాయకుడు ఇర్ఫా రాజేష్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా నాయకుడు కామ్రేడ్ ముసలి సతీష్ పాల్గొన్నారు.

కోల్కతాలో మెడికోపై హత్యాచారం కేసులో లై డిటెక్టర్ టెస్టులో పొంతన లేని సమాధానాలు చెప్పిన సంజయ్రాయ్..

కోల్కతాలో మెడికోపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్..

లై డిటెక్టర్ టెస్టులో పొంతన లేని సమాధానాలు చెప్పిన సంజయ్రాయ్..

తాను చూసేసరికే లేడీ డాక్టర్ మరణించిందని చెప్పిన సంజయ్రాయ్..

సెమినార్ హాల్లోకి వెళ్లే సరికి మృతదేహం కనిపించిందన్న ప్రధాన నిందితుడు.. మృతదేహం కనిపంచడంతో భయంతో పారిపోయానన్న సంజయ్రాయ్.. అనేక ఆధారాలు చూపించి ప్రశ్నించిన సీబీఐ, సెంట్రల్ ఫోరెన్సిక్ టీమ్.. హత్యాచారం జరిగిన సమయంలో తాను వేరే చోట ఉన్నానన్న నిందితుడు..

న్యూఢిల్లీ: విద్యార్థుల కోసం పదివేల కోట్లతో విజ్ఞాన ధార పథకం..

10 వేల కోట్లతో విజ్ఞాన్‌ ధార

బయో ఈ3 పాలసీకి ఆమోదం

   

కేంద్ర మంత్రివర్గం నిర్ణయం

న్యూఢిల్లీ,: విజ్ఞాన్‌ ధార పథకానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఐటీశాఖ అమలు చేస్తున్న మూడు పథకాలను విలీనం చేసి ‘విజ్ఞాన్‌ ధార’ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చింది. 15వ ఆర్థిక సంఘం కాలమైన 2021-22 నుంచి 2025-26 మధ్య రూ.10,579 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు. ఈ పథకం కింద 11వ, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, యూజీ, పీజీ, పీహెచ్‌డీ, పోస్ట్‌ డాక్టరల్‌ రిసెర్చ్‌ విద్యార్థులకు ఫెలోషిప్‌లు అందించనుంది.*

అధునాతన పరిశోధనల కోసం అంతర్జాతీయ భాగస్వామ్యం, సంయుక్త పరిశోధనా ప్రాజెక్టులు, ఫెలోషిప్‌లు వంటివి ఈ పథకంలో ఉంటాయి. ఆర్థిక, పర్యావరణ, ఉపాధి కోసం జీవసాంకేతిక విజ్ఞానం(బయో ఈ3) విధానానికి సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్వచ్ఛ ఇంధన, పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీ, పరిశోధన, ఈ రంగంలోని నూతన సాంకేతికత ప్రోత్సాహానికి ఈ విధానం ఉపయోగపడుతుందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.