/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz పిల్లల పై తల్లిదండ్రుల నిఘా ఉండాలి, ఇంద్రపాలనగరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్ &టీచర్స్ మీటింగ్ Vijay.S
పిల్లల పై తల్లిదండ్రుల నిఘా ఉండాలి, ఇంద్రపాలనగరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్ &టీచర్స్ మీటింగ్

ఇంద్రపాలనగరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం నాడు పేరెంట్స్ & టీచర్స్ మీటింగ్ స్కూల్ హెడ్మాస్టర్ నిర్మల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ గొల్లపల్లి నరసింహ మరియు రిటైర్డ్ హై స్కూల్ హెడ్మాస్టర్ బిక్షపతి పాల్గొన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థి సారయ్య హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పిల్లలు వాళ్ల జీవితంలో ఉన్నత స్థాయిలో ముందుకు వెళ్లాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమని తెలిపారు. గురువులు బాధ్యతయుతంగా పిల్లల్ని చదివంచాల్సిన అవసరం ఉందని, పిల్లల అభివృద్ధి సామాజికంగా విద్యాపరంగా ఉన్నతమైనటువంటి స్థానంలో తీర్చిదిద్ది మన గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను జిల్లాలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దాలని, దీనికి గ్రామ యువకులు విద్యావంతులు ఉద్యోగస్తులు అందరం కలిసి మనబడిని బాగు చేసుకునే బాధ్యత మనదే అని ముందుకు రావాలని ప్రభుత్వ బడి అంటే ప్రజల బడి అని మనబడిని మనమే బాగు చేసుకోవాలని తెలియజేశారు. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల శ్రద్ధ చూపించి బాధ్యతయుతంగా ఉండాలని తెలియజేశారు. ఈ క్రమంలో పిల్లల తల్లిదండ్రులు కూడా స్కూల్లో ప్రస్తుతం ఉన్నటువంటి చిన్న చిన్న లోటుపాట్ల ఏమైనా గమనించి ఉంటే, వారి దృష్టికి వచ్చిన తెలియజేయాలన్నారు. అన్నింటిని త్వరలోనే పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదే విధంగా గ్రామానికి చెందిన కొంత మంది యువకులు తమ వంతు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తామని తెలిపారు.

స్వామి రామానంద తీర్థ సంస్థలో ఉచిత విశిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు : పి ఎస్ ఎస్ ఆర్ లక్ష్మి డైరెక్టర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆద్వర్యంలో స్వామి రామానంద తీర్థ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సంస్థ డైరెక్టర్ పి ఎస్ ఎస్ ఆర్ లక్ష్మీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా "దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన" పథకం ను గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. బేసిక్ కంప్యూటర్స్ (డాటా ఎంట్రీ ఆపరేటర్) కోర్సును 3 నెలల పాటు ఉచిత శిక్షణ, వసతి మరియు భోజనం ఉచితంగా అందించి, శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు. ఇంటర్ పాసైన,18-35 సంవత్సరాల లోపు వయస్సు కల్గిన యువతీ యువకులు సెప్టెంబర్ 09-2024 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. ఎస్సీ/ ఎస్టీ/ మైనారిటీ అభ్యర్థులకు ప్రాదాన్యత ఉంటుందని ఆమె తెలిపారు. పూర్తి వివరాలకు పోన్ నెంబర్ (1) 9133908000 (2) 9133908111 (3) 9133908222 లను సంప్రదించాలని ఆమె కోరారు.
వలిగొండ లో ఆర్థిక సహాయం అందజేసిన మిత్రులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణానికి చెందిన వేముల లక్ష్మయ్య చిన్న కుమారుడు వేముల నరేష్ ( రైల్వే పోలీస్ కానిస్టేబుల్ ) కొద్ది రోజుల క్రితం మరణించడం జరిగింది. వేముల నరేష్ దశదినకర్మ రోజున చిన్ననాటి మిత్రులు 2004 -2005 ( బ్యాచ్ ) సంవత్సరం కు చెందిన మిత్రులు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం గా 1,08,000 (లక్ష ఎనిమిది వేల రూపాయలు) వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది .వేముల నరేష్ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కునపూరి. శ్రీశైలం , బసోజు .బాలా చారి, రచ్చ .ఆనంద్ , బొడిగె.రాజు, మిర్యాల. అశోక్ ,మాల్గ. కృష్ణ, పాండు, బొడిగె.లింగస్వామి, కిరణ్, ఉపేందర్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
చైతన్య యాత్రను విజయవంతం చేయండి: మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ మండల ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు

యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ ఒకటవ తారీఖున భువనగిరిలో రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం బైకు ర్యాలీ ఉంటుందని వలిగొండ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు మారగోని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ప్రతి ఉద్యమకారుడు చైతన్య యాత్రను విజయవంతం చేయాలని కోరారు.
స్వచ్ఛంద సంస్థల సేవలను సద్వినియోగం చేసుకోవాలి : సామాజిక కార్యకర్త కేతావత్ చిరంజీవి

స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, దాతలు అందించే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సామాజిక కార్యకర్త కేతావత్ చిరంజీవి అన్నారు. శుక్రవారం ఆయన భువనగిరి మండల పరిదిలోని ఆకుతోటబావితండా గ్రామంలో ఇటీవల మరణించిన కేతావత్ మంగ్త నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం "కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చరణ్" అందించిన అయిదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మృతిని భార్య కేతావత్ రాములమ్మ కు అందించారు. ఈ కార్యక్రమంలో కేతావత్ మురళి, కేతావత్ రాజు నాయక్, దరావత్ పాండు , ముడావత్ శ్రీనివాస్, కేతవత్ మహేందర్, కేతావత్ సుధాకర్, కేతావత్ నరేందర్ , కేతావత్ భాషా నాయక్, మురళి, సురేష్, భాస్కర్, శివ, కృష్ణ,రవి, సుధాకర్, నాగి శ్రీనివాస్, వ కేతావత్ పూల్ సింగ్, బీలు, కృష్ణ, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రిలో బిఆర్ఎస్ పూజలు... నీళ్లు చల్లి శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు...

యాదగిరిగుట్ట కొండపైకి బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి,ఎమ్మెల్యేలు కొండపైకి వచ్చి పాప పరిహార సంకల్పం చేయడంతో వారు చేసిన పూజలను ప్రక్షాళన చేయాలనే ఆలోచనలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్,బీర్ల ఐలయ్య గారు కొండపైన పూర్తిగా మాడవీధుల్లో పరిసర ప్రాంతాల్లో నీళ్లు చల్లి శుద్ధి చేశారు.అనంతరం కొండకింద మెట్లమార్గం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ ఎలక్షన్స్ లో మాట ఇచ్చిన ప్రకారం 2లక్షల ఋణమాఫి చేసాం,ఇప్పటికి 34లక్షల మంది రైతులకు రుణమాఫీ డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్లో జమచేయడం జరిగిందన్నారు.డ్రామారావు చేసే పనులు చెప్పే మాటలు అన్ని బూటకపు మాటలని,చేసే పనులు మొత్తం ధమాక్ లేకుండా చేస్తాడని అన్నారు.అలాగే మేము చెప్పిన ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు అయిన 10నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేసాం,2రోజుల్లోనే మహిళలకు ఉచితబస్సు సౌకర్యం,అర్హులకు ఉచిత విద్యుత్ ఏర్పాటు చేశామని తెలిపారు.కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 3ఎకరాల భూమి ఏది,దళితుడు సీఎం అయ్యాడా,నువ్వు పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టే లేదని హేళనగా నిరసన చేశావు అందుకే నిన్ను రాష్ట్ర ప్రజలు డ్రామారావు అని అంటున్నారని అన్నారు.ఆరోజు మీ మామ కేసీఆర్ దళితున్ని సీఎం చేస్తా లేదంటే తల నరుక్కుంటా అన్నాడు మరి దళితున్ని సీఎం చేశాడా మీ మామ అప్పుడే ఒక కత్తి ఇచ్చి తల నరుక్కోమంటే అయిపోయేది,ఆ తల భువనగిరి గుట్టకు వేలాడ దీస్తే ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్నకు అర్థం ఉండేది డ్రామారావు.మీరు 10సంవత్సరాలు పరిపాలించారు,ఎన్నిహామీలు నెరవేర్చారు,మీరు చేసిన ప్రతీ అభివృద్ధి కార్యక్రమాలలో 50శాతం మీ అకౌంట్లో మిగతా 50శాతం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.అన్ని నిధులు దోచుకున్నారని ఆరోపించారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య .

సెంట్రల్ లైజ్ కిచెన్ విధానం రద్దు చేయాలి: AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్ డిమాండ్

సెంట్రాలైస్ కిచెన్ విధానం రద్దు చేసి హరే రామ హరే కృష్ణ అనే స్వచ్చంద సంస్థకు మధ్యాహ్న భోజన పథకం ఏజన్సీలు ఇవ్వరాదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున మధ్యన బోజన వంట కార్మికుల సమస్యలు పరిష్కారించాలని డిఇఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ వెంకటరమణ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ విద్యార్థి తరగతితొ సంబంధం లేకుండా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు రూ.25 రూపాయలకు పెంచాలని, 23 సంవత్సరాలుగా పని చేస్తున్న కార్మికులను వివిధ కారణాలతో తొలగించ కుండా ప్రత్యేక GO విడుదల చెయ్యాలని, వంట గ్యాస్, కోడిగుడ్లు మరియు నిత్యావసర వస్తువులు ప్రభుత్వమే సరఫరా చెయ్యాలని, రాష్ట్ర ప్రభుత్వo ఎన్నికల సందర్బంగా వంట కార్మికులకు నెలకు గౌరవ వేతనాo రూ.10 వెలు ఇస్తామన్నాహామీని వెంటనే అమలు చేయాలని, హరే రామ హరే క్రిష్ణ ఫౌండేషన్ కు మధ్యన బోజన పథకం అప్పచెప్పి ఆలోచన విరమించుకోవాలని రాష్ట వ్యాప్తంగా ఉన్న 54200 మంది వంట కార్మికులకు పని భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం, నాయకులు జిన్న రాజమ్మ, బుచ్చమ్మ, కృష్ణ, సుగుణ, అండాలు తదితరులు పాల్గొన్నారు.
దళిత మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం; మాల మహానాడు

తిరుమలగిరి పట్టణంలో చేపట్టిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని నిరసనలో పాల్గొన్న తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌పై దాడి చేసిన కాంగ్రెస్ నేతలను సహించేది లేదని, వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వలిగొండ మండల మాల మహానాడు నాయకులు కూచిమల్ల సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని చేపట్టిన రైతు నిరసన దీక్షపై దాడి చేసిన కాంగ్రెస్ నేతలు రాళ్లతో, కోడి గుడ్లతో దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారని గురువారం విలేకరుల సమావేశంలో ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరునికి ఉందని గుర్తు చేశారు. మాజీ దళిత ఎమ్మెల్యే కాబట్టే ఇలాంటి దాడులకు పాల్పడ్డారని, మాజీ దళిత ఎమ్మెల్యే అంటే చులకనబావం ఎందుకని ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. ఇదేనా ప్రజా పాలన? అని ఎద్దేవా చేశారు. ఇకనైనా దళితులపై దాడులు మానుకోవాలని హెచ్చరించారు.
రెక్కలు తెగిన బాల్యానికి బాధ్యులు ఎవరు...బంగారు భవితనందించేది ఎవరు...

పాపం, పుణ్యం,ప్రపంచ మార్గం కష్టం, సౌఖ్యం,శ్లేషార్థాలూ ఏమీ ఎరుగని పువ్వుల్లారా... అయిదారేడుల పాపల్లారా.... మెరుపు మెరిస్తే వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తే, అవి మీకే అని ఆనందించే కూనల్లారా.... మీదే మీదే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్యవిధాతలు... ఉడతల్లారా! బుడతల్లారా! ఇది నా గీతం వింటారా.... అంటూ కల్మషం లేని బాల్యానికి అక్షరాల ఆకారం ఇచ్చాడు మహాకవి శ్రీశ్రీ కానీ నేడు ఆ బాల్యానికి భరోసా ఇచ్చే వారు కరువౌతున్నారని ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. సరిగ్గా నేటికీ 965 రోజుల క్రితం కుటుంబ పెద్దదిక్కుగా ఉన్న తండ్రిని కోల్పోయి బతుకు తెరువు కోసం జిల్లా కేంద్రానికి వచ్చారు ఈ కుటుంబం. వీరి బాధను అర్థం చేసుకొని సామాజిక కార్యకర్త ఒకరు 1098 కు పోన్ చేసి వీరికి రక్షణ తో పాటు పిల్లలకు చదువు, తల్లికి ఉపాధి కల్పించాలని అధికారులను కోరారు. అధికారులు మాత్రం వీరిని తీసుకెళ్ళి వివరాలు రాసుకుని వదిలి వేసారు. తినడానికి తిండి లేక, ఉపాధి అవకాశాలు లేక భిక్షాటన చేయడం మొదలుపెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వీరు మద్యానికి, డిపో కల్లుకు బానిసలయ్యారు.అంతేకాదు అప్పుడప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం. పిల్లల సంక్షేమం కోసం, ముఖ్యంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకోసం ఎన్నో సంక్షేమ పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నా, ఆపథకాలు వీరికి అందకపోవడం లో ఆంతర్యం ఏమిటి? దేశంలోని 6-14 సంవత్సరాల వయస్సు పిల్లల కొరకు తెచ్చిన "నిర్భంద విద్యా హక్కు చట్టం- 2009" కి వీరు అర్హూలు కారా ? అని సామాజిక కార్యకర్తలు అడుగుతున్నారు. పసి పిల్లల సంరక్షణ కోసం అంగన్వాడీ కేంద్రాలు, బాలసదనం, మరియు చైల్డ్ కేర్ సెంటర్లు ఎన్ని ఉన్నా, వీరిని పట్టించుకునే వారు కరువయ్యారు. అనాధలైన, తప్పిపోయిన 6 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించి వారిని తల్లిదండ్రులకు అప్పగించాలని, లేదా బాలసదనం లో ఉంచి చదివించాలని సుప్రీం కోర్టు 2016 లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఏటా జనవరి ఒకటో తేదీ నుంచి 31 వ తేదీ వరకు "ఆపరేషన్ స్మైల్" పేరుతో జులై ఒకటో తేదీ నుంచి 31 వ తేదీ వరకు "ఆపరేషన్ ముస్కాన్" పేరుతో ప్రత్యేక దాడులు నిర్వహించి పిల్లలను గుర్తించి బాలల సంరక్షణ కమిటీ కి అప్పగిస్తున్నారు. కానీ జిల్లా కేంద్రం నగరం నడిబొడ్డున ఉన్న భువనగిరి బస్ స్టేషన్ లో భిక్షాటన చేస్తూ , దుర్బర జీవితం గడుపుతున్న,వీరిని మాత్రం గుర్తించకపోవడం విడ్డూరంగా ఉందని సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. బాల్యం ఎంతో విలువైనది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకొనే భాద్యతలు తల్లిదండ్రుల పైనా, మరియు ప్రభుత్వల పైనా ఉంది. ఇప్పటికైనా భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి, తగిన వసతి కల్పించి, పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాలని, తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఆమె కు మెరుగైన చికిత్స చేయించాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. *పిల్లలను రక్షించండి, లేకుంటే సంఘం విద్రోహ శక్తులుగా మారే ప్రమాదం ఉంది* *కొడారి వెంకటేష్*. సామాజిక కార్యకర్త. గత రెండు సంవత్సరాలుగా భువనగిరి బస్ స్టేషన్ లో భిక్షాటన చేస్తూ గడుపుతున్న కుటుంబం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ , దామెర ప్రాంతానికి చెందిన వారు. తల్లి హసీనా (30). పిల్లలు, రషీద్ (11) హైమ్మద్ (9) లు ఇప్పటికే మద్యానికి బానిసలయ్యారని, వీరిని ఇలాగే వదిలి పెడితే భవిష్యత్తులో సంఘ విద్రోహ శక్తులుగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీరికి మంచి జీవితాన్ని ఇవ్వడానికి కృషి చేయాలని కోరారు.

నాగారం లో కట్ట లక్ష్మమ్మకి నివాళులర్పించిన మాలమహానాడు నేతలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నాగారం గ్రామంలో కట్ట అశోక్ మాతృమూర్తి కట్ట లక్ష్మమ్మ అనారోగ్యం తో మృతి చెందారు. బుధవారం నాగారంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా మాల మహానాడు అధ్యక్షులు పెరుమాళ్ళ యాదగిరి, వలిగొండ మండలం మాల మహానాడు అధ్యక్షులు నీలం నరేందర్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వల్లమల్ల రఘుపతి, సంగిశెట్టి నరసయ్య, బుంగ రాములు, సంభోగు బాలస్వామి, వల్లమాల రత్నయ్య, సలబద్రి మహేందర్, గడ్డం ప్రకాష్, సంగిశెట్టి చంద్రయ్య ,సంగిశెట్టి విజయ్ కుమార్, సంభోగు విజయ్ కుమార్, బంధువులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.