/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz సాగర్ రింగ్ రోడ్ లో బస్సులను పరిశీలించిన నల్లగొండ ఆర్ఎం Mane Praveen
సాగర్ రింగ్ రోడ్ లో బస్సులను పరిశీలించిన నల్లగొండ ఆర్ఎం

నల్లగొండ జిల్లా టీజీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజశేఖర్ హైదరాబాదులోని సాగర్ రింగ్ రోడ్డు ప్రయాణికుల ప్రాంగణం వద్ద బస్సులను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాఖీ పండగ వేల రద్దీతో ప్రయాణికులు ఇబ్బంది పడకూడదని, దేవరకొండ మరియు నాగార్జునసాగర్ లకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ డిపో మేనేజర్ రమేష్ బాబు, ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ బి వెంకట నరసయ్య, మరియు ఇతర ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

కేఎన్ బయోసెన్సెస్-చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్గానిక్ వ్యవసాయ రైతు సదస్సులు
రైతుబడి కార్యక్రమంలో అగ్రికల్చర్ సైంటిస్ట్ డాక్టర్ సుధారెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బొమ్మపాల గిరిబాబు

నల్గొండ ఎన్జీ కాలేజ్ మైదానంలో నిర్వహిస్తున్న రైతు బడి ఎగ్జిబిషన్ కార్యక్రమంలో భాగంగా, ఈరోజు నల్లగొండకు విచ్చేసిన కేఎన్ బయోసైన్సెస్ వ్యవస్థాపకులు ప్రముఖ అగ్రికల్చర్ సైంటిస్ట్ డాక్టర్ సుధా రెడ్డిని  చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు ప్రత్యేకంగా కలిసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆర్గానిక్ వ్యవసాయరంగం అభివృద్ధి కొరకు డాక్టర్ సుధా రెడ్డి చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్గానిక్ రైతులను ప్రోత్సహించడానికి కే.ఎన్. బయోసెన్సెస్ మరియు చత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో, ఆర్గానిక్ వ్యవసాయంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 

గత 15 సంవత్సరాల నుండి ఉమ్మడి జిల్లాలో క్రీడాకారుల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేస్తూ, సామాజిక బాధ్యతగా ఆర్గానిక్ వ్యవసాయరంగం అభివృద్ధి కొరకు వివిధ సంస్థలతో సదస్సులు నిర్వహించి ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని, యువతీ, యువకులు ఈ రంగంలో రాణించేటందుకు ప్రత్యేకమైన శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తామని తెలిపారు.
NLG: ఫోటో జర్నలిస్టులు ముచ్చర్ల బ్రదర్స్ కు రాష్ట్రస్థాయి అవార్డులు
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నల్గొండ ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్, హన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్  ముచ్చర్ల శ్రీనివాస్ లు తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో అవార్డులకు ఎంపికయ్యారు. వారిద్దరూ అన్నదమ్ములు కావడం విశేషం.

ఈ మేరకు హైదరాబాద్ గ్రీన్ పార్క్‌ హోటల్ లో ఈ నెల 19  ఉదయం 9 గంటలకు సమాచార శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డులను మరియు నగదు పారితోషికాన్ని అందుకోనున్నారు.

ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాలోని పలువురు జర్నలిస్టులు వారికి అభినందనలు తెలిపారు.
డా.బుర్రి వెంకన్న ను సన్మానించిన టిజి ఎంఆర్పిఎస్ నాయకులు
నల్లగొండ జిల్లా:
కొండ మల్లెపల్లి: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నియోజకవర్గ ఆఫీసులో ఇవాళ టిజి ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు అన్నేపాక సంజీవ, ప్రదాన కార్యదర్శి ఎర్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఇటీవల గౌరవ డాక్టరేట్ పొందిన దళిత రత్న బుర్రి వెంకన్న ను మర్యాదపూర్వకంగా కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రం పటాన్ని బహుకరణ చేసి శాలువ తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు దళిత రత్న మద్దిమడుగు బిక్షపతి గారు పాల్గొని మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుండి యువతను చైతన్య పరుస్తూ భారత రాజ్యాంగ హక్కులు పూర్తిస్థాయిలో తెలియపరుస్తూ అవగాహన సదస్సు నిర్వహిస్తూ, జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు పొంది ఇప్పుడు గౌరవ డాక్టరేట్ తీసుకోవడం చాలా సంతోషకరమని వారు హర్షం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా సమతా సైనిక దళ్ అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని భారత రాజ్యాంగ హక్కులు ప్రతి పౌరుడికి అందే విధంగా నిరంతరం పనిచేస్తుందని వారు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో  అన్నేపాక సంజీవ. జెడ చంటి, దర్శనం దేవా, ఎలిమినేటి చిన్న యాదయ్య, వస్కుల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ ఈ నెల 30
నల్గొండ: అక్టోబర్ లో జరిగే ఓపెన్ స్కూల్ 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు అయ్యేందుకు పరీక్ష ఫీజును ఈనెల 30 వ తేదీలో చెల్లించాలని డిఈఓ బిక్షపతి మరియు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ జగదీష్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు మీసేవ కేంద్రం ద్వారా పరీక్ష ఫీజును చెల్లించి రసీదు ను సంబంధిత స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ కు అందజేయాలన్నారు. పరీక్ష ఫీజును నిర్ణీత రుసుము తో ఈనెల 22 నుండి 30 వ తేదీ లోపు చెల్లించాలని పేర్కొన్నారు.
NLG: యూత్ ఫర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో బొట్టుగూడ హైస్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ
నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య అధ్యక్షతన, ఈరోజు యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో సైన్స్ విభాగంలో ప్రాథమిక స్థాయి పరీక్ష నిర్వహించారు.అనంతరం రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించి, రక్షాబంధన్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అదేవిదంగా పాఠశాలలోని నిరుపేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సైదులు, తిరుపతి ,పాఠశాల టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
గౌరవ డాక్టరేట్ అందుకున్న బుర్రి వెంకన్నను సన్మానించిన ఎమ్మెల్యే
నల్గొండ జిల్లా:
దేవరకొండ: ఆల్ ఇండియా సంస్థ సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డా. బుర్రి వెంకన్న ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మరియు చందంపేట  పీ ఏ సి ఎస్ చైర్మన్ జాలె నరసింహారెడ్డి లు శుక్రవారం డా. బుర్రి వెంకన్నను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాబాసాహెబ్ స్థాపించిన సంస్థ ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ సంఘం ద్వారా తెలంగాణ రాష్ట్ర, నల్గొండ జిల్లా లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను దళిత రత్న బుర్రి వెంకన్న రాష్ట్ర, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకొని నేడు ప్రతిష్టాత్మకంగా గౌరవ డాక్టరేట్ అందుకోవడం.. ఆయన మన నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గ వాసి కావడం సంతోషకరమని అన్నారు.     

డా. బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల వారికి భారత రాజ్యాంగ ఫలాలు, హక్కులను ప్రతి పౌరుడికి అందే విధంగా సామాజిక పోరాటాలు నిర్వహించినందుకు, నాకు గౌరవ డాక్టరేట్ రావడం చాలా సంతోషకరమని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.తన గౌరవ డాక్టరేట్ ను తన వెన్నంటూ ఉండి సంపూర్ణ సహకారం అందించిన తన కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, డివిజన్ ఉపాధ్యక్షులు అందుగుల గిరి, పీఏ పల్లి మండల అధ్యక్షులు జిల్లా రాములు, కొండమల్లేపల్లి మండల ఉపాధ్యక్షులు చేపూరి రాజేష్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెరిక విజయ్ కుమార్, మామిడి చెట్టు యాదగిరి. టీజీ ఎంఆర్పిఎస్ మల్లేపల్లి మండల ప్రధాన కార్యదర్శి ఎర్ర ప్రసాద్, కడారి రాజు, ఖండేలా వెంకన్న లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
NLG: కప్ప కాముడు నిర్వహించిన లెంకలపల్లి గ్రామస్తులు

మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, ఇవాళ వరుణ దేవుని ప్రార్థిస్తూ కప్ప కాముడు ఆటలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు గ్రామంలోని బొడ్రాయికి నీళ్ళు పోసి సమృద్ధిగా వర్షాలు కురవాలని పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా సరిగ్గా వర్షాలు లేవని దీంతో పత్తి చేలు ఎండిపోతున్నాయని, వర్షాలు పడకపోతే ఆర్థికంగా నష్టపోతామని, వర్షాలు సమృద్ధిగా పడాలని బొడ్రాయికి పూజలు నిర్వహించామని తెలిపారు.

యరగండ్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నల్లగొండ జిల్లా, మారిగూడ మండలం (ఆగష్టు 15, స్ట్రీట్ బజ్ న్యూస్): 78 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా యరగండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

స్కూల్  హెడ్మాస్టర్ మాలతి మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమ పోరాట నాయకుల త్యాగాలను స్మరించుకుంటూ మర్రిగూడ మండల ప్రజలకి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్కూల్ కు యువ చైతన్య యూత్ కమిటీ సభ్యులు సౌండ్ బాక్స్ లు ఇవ్వడం జరిగింది. యూత్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. స్కూల్లో ఉన్న స్టూడెంట్ కు ఏమైనా అవసరం ఉంటే మేము ముందుకు రావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.తదనంతరం యూత్ కమిటీ సభ్యులకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీచర్లు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు పాల్గొన్నారు.
డిస్టిక్ ఇన్నోవేటర్ అవార్డు ను అందుకున్న నవీన్ కుమార్
నల్గొండలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా  ఇంటింటా ఇన్నోవేటర్- ఇంటికి ఒక శాస్త్రవేత్త  ప్రాజెక్టు, "తక్కువ ధరలో ఎక్కువ సామర్థ్యం గల వ్యవసాయ డ్రోన్ పిచికారి విధానం" లో బొమ్మలరామారం మోడల్ స్కూల్ కెమిస్ట్రీ లెక్చరర్ కోట నవీన్ కుమార్ ఇవాళ నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేతుల మీదుగా "డిస్టిక్ ఇన్నోవేటర్ అవార్డు" ను అందుకున్నారు. ఈ సందర్భంగా రావులపెంట గ్రామానికి నవీన్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అనుసంధానం ద్వారా వ్యవసాయం చేయడంలో ముఖ్యంగా రసాయనిక ఎరువులు డ్రోన్ ద్వారా  పిచికారి చేయడం వల్ల అధిక దిగుబడి సాధించవచ్చని, పండిన పంట మానవులపై ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతం వినియోగిస్తున్న డ్రోన్ ల ధర ఎక్కువగా ఉంటుందని, అతి తక్కువ ధరలోనే ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నానని  తెలిపారు. రావులపెంట గ్రామస్తులు, మరియు మోడల్ స్కూల్ అధ్యాపకులు, మిత్రులు పలువురు ఈ అవార్డు రావడం పట్ల ఆయనను అభినందించారు