/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz డిస్టిక్ ఇన్నోవేటర్ అవార్డు ను అందుకున్న నవీన్ కుమార్ Mane Praveen
డిస్టిక్ ఇన్నోవేటర్ అవార్డు ను అందుకున్న నవీన్ కుమార్
నల్గొండలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా  ఇంటింటా ఇన్నోవేటర్- ఇంటికి ఒక శాస్త్రవేత్త  ప్రాజెక్టు, "తక్కువ ధరలో ఎక్కువ సామర్థ్యం గల వ్యవసాయ డ్రోన్ పిచికారి విధానం" లో బొమ్మలరామారం మోడల్ స్కూల్ కెమిస్ట్రీ లెక్చరర్ కోట నవీన్ కుమార్ ఇవాళ నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేతుల మీదుగా "డిస్టిక్ ఇన్నోవేటర్ అవార్డు" ను అందుకున్నారు. ఈ సందర్భంగా రావులపెంట గ్రామానికి నవీన్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అనుసంధానం ద్వారా వ్యవసాయం చేయడంలో ముఖ్యంగా రసాయనిక ఎరువులు డ్రోన్ ద్వారా  పిచికారి చేయడం వల్ల అధిక దిగుబడి సాధించవచ్చని, పండిన పంట మానవులపై ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతం వినియోగిస్తున్న డ్రోన్ ల ధర ఎక్కువగా ఉంటుందని, అతి తక్కువ ధరలోనే ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నానని  తెలిపారు. రావులపెంట గ్రామస్తులు, మరియు మోడల్ స్కూల్ అధ్యాపకులు, మిత్రులు పలువురు ఈ అవార్డు రావడం పట్ల ఆయనను అభినందించారు
బహుజన సంఘాల ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవం
నల్లగొండ జిల్లా:
దేవరకొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇవాళ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బహుజన సంఘాల ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న డా. బుర్రి వెంకన్న పూలమాల వేశారు. తదంతరం వికలాంగుల హక్కుల సమితి రాష్ట్ర నాయకులు గుద్దేటి సైదులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

ఈ కార్యక్రమానికి  ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి కంబాలపల్లి వెంకటయ్య, నియోజకవర్గ కన్వీనర్ సహదేవుడు పాల్గొన్నారు.

వారు మాట్లాడుతూ.. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుందని ఎందరో స్వతంత్ర సమరయోధులు బ్రిటిష్ వారితో పోరాడి స్వతంత్రం సాధించుకున్నటువంటి మన భారతదేశంలో ఇంకా అట్టడుగు వర్గాలకు పూర్తి స్థాయిలో  రాజ్యాంగ  ఫలాలు దక్కుతలేవని వారు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెరిక విజయ్ కుమార్, చింతపల్లి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సంధ్య, ఏసు వికలాంగుల సంఘం రాష్ట్ర నాయకులు చారి, వస్కుల నాగరాజు, చాట్ల చందర్, యాదగిరి, మాతంగి జాన్, పెరిక వెంకన్న, బీసీ సంఘం నాయకులు భాస్కరాచారి, ఎర్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
NLG: ప్రభుత్వ బొట్టుగూడ హైస్కూల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బొట్టుగూడ హైస్కూల్లో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల శంకరయ్య అధ్యక్షతన నిర్వహించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జెండా వందనం అనంతరం పాఠశాల ఉపాధ్యాయులందరూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణను, జాతీయతాభావాన్ని పెంపొందించుకుంటూ వ్యక్తిగత ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

అనంతరం ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ బొట్టుగూడ హైస్కూలుకు గతంలో క్రీడల్లో ఘనమైన రికార్డు ఉందని దాన్ని కొనసాగించాలంటే విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా చదువుతోపాటు క్రీడల్లో రాణించడానికి పటిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఉపాధ్యాయులు సూచించిన మార్గంలో విద్యాభ్యాసం కొనసాగాలని సూచిస్తూ స్వాతంత్ర త్యాగాలను గుర్తుచేసే స్లొగన్స్ ను విద్యార్థుల చేత ఇప్పించారు.
మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఇవాళ పార్టీ మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ 78 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.

స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతున్న ప్రజా ప్రభుత్వం దేశం కోసం ప్రాణాలు అర్పించిన దేశ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ మర్రిగూడ మండల ప్రజలకి 78 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయం లో స్వీట్లు పంచుకొని పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ నాంపల్లి అధ్యక్షులు వెన్నమనేని రవీందర్ రావు, మాజీ జడ్పీటీసీ మేతరీ యాదయ్య,PACs డైరెక్టర్ బాయికడి కొండల్, అజ్జిలాపురం ఉప్పునుతులమల్లయ్య,ఎలిమినేటి సత్తి రెడ్డి,పగడాల లింగయ్య,మాజీ ఎంపీటీసీ వెంకటపేట బాలయ్య,ఏర్పుల శ్రీశైలం, కొడాల ఆల్వాల్ రెడ్డి, మాజీ సర్పంచ్,అశోక్ రెడ్డి,ఐతపాక జంగయ్య,గ్రామ శాఖ అధ్యక్షులు మహ్మద్ ఖధీర్, సలవోజు బిక్షమాచారి,నందికొండ లింగారెడ్డి, చాపల రవి, పెంబళ్ల గిరి,పగడాల యాదయ్య,బేత వెంకటేష్,బడేటి వెంకటేష్, జమ్ముల వెంకటేష్, వల్లపు భాస్కర్, రావుల రాములు, గ్యార వెంకటేష్,సిరపంగి శ్రీను,ఉడుతల లవకుమార్,గ్రామ శాఖ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

NLG: చర్లపల్లి లో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
నల్లగొండ మున్సిపల్ పరిధిలోని చర్లపల్లి గ్రామంలో ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దళిత నాయకుడు బొజ్జ ముత్తయ్య చే జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకుడు రాపోల్ విద్యాసాగర్, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి బద్దం నాగేష్, బిజెపి సీనియర్ నాయకుడు రాపోలు యాదగిరి, కటకం శ్రీధర్, ఏర్పుల గణేష్, రాపోల్ భాస్కర్, రాపోలు నరేష్, రాపోలు సాగర్,  మామిడి శ్రవణ్, జి నాగేష్ గౌడ్,  టంగుటూరు రాజు, బద్దం నాగరాజ్,  సిహెచ్ రామకృష్ణ, ఇసరం ఎల్లయ్య, బిపంగి అంజయ్య, బిక్షం చిన్న ఎల్లయ్య, భారీ రాములు, రాపోలు పరమేశం, కొడదల వెంకన్న, మల్లయ్య, టంగుటూరి భాస్కర్, మేడి లక్ష్మయ్య, బిజెపి కార్యకర్తలు, నాయకులు, మున్సిపాలిటీ కార్మికులు పాల్గొన్నారు.
అనంతరం స్వీట్స్ అరటిపండ్లు పంపిణీ చేశారు.
మునుగోడు ను ఆదర్శ నియోజకవర్గం గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వరుసగా అభివృద్ధి సమీక్షలు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వరుసగా అభివృద్ధి సమీక్షలు చేస్తున్నారు. నిన్న మర్రిగూడెం, ఈరోజు సంస్థాన్ నారాయణపురం మండలం నాయకులతో సమీక్ష నిర్వహించారు.

నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు, రోడ్లు, విద్యుత్తు, విద్య, వైద్యంపై ఎమ్మెల్యే సమీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
TG: హెడ్‌ కానిస్టేబుల్ చదువు యాదయ్య ను అభినందించి సన్మానించిన డీజీపీ
HYD: మాదాపూర్ సీసీఎస్ హెడ్‌ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అరుదైన గౌరవం దక్కింది.ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి శౌర్య పురస్కారానికి ఎంపిక అయ్యారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఒక నేరస్తున్ని పట్టుకునే ప్రయత్నంలో ఏడుసార్లు కత్తి పోట్లకు గురైనా వెరవకుండా, రక్తమోడుతున్నా.. ఆ దొంగను విడవకుండా హెడ్‌ కానిస్టేబుల్ యాదయ్య విధినిర్వహణలో ధైర్యసాహసాలు ప్రదర్శించి, ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి శౌర్య పురస్కారానికి ఎంపికైన ఏకైక పోలీస్ అధికారిగా నిలిచి తెలంగాణకు గర్వకారణమైనారు.

ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి డా.జితేందర్ ఐపీఎస్ ఇవాళ యదయ్య ను ప్రత్యేకంగా అభినందించి, సన్మానించారు.
కింగ్ డమ్ ఆప్ టాలెంట్ రికార్డ్స్ బుక్ ద్వారా గౌరవ డాక్టరేట్ అవార్డును అందుకున్న దళితరత్న డా. బుర్రి వెంకన్న
*అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన దళిత రత్న డా. బుర్రి వెంకన్న రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్రం*
*డా. బి.ఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, గౌతమ బుద్ధుడు, బొజ్జా తారకం లు నాకు స్ఫూర్తి: డాక్టర్ బుర్రి వెంకన్న*

నల్గొండ: జిల్లా, పెద్ద అడిసర్లపల్లి మండలం, దుగ్యాల గ్రామానికి చెందిన దళితరత్న, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డా. బుర్రి వెంకన్న.. విద్యార్థి దశ నుండి నేటి వరకు అనేక సామాజిక కార్యక్రమాలతో మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, లను స్ఫూర్తిగా తీసుకొని ఆ మహనీయుల ఆశయ సాధన కోసం, భారత రాజ్యాంగం లో ఉన్న హక్కులను ప్రతి పౌరుడికి అందే విధంగా సామాజిక పోరాటం దిశగా పనిచేస్తున్నందున, తన సేవలను గుర్తించి 'కింగ్డమ్ ఆఫ్ టాలెంట్ రికార్డ్ బుక్' ద్వారా వరల్డ్ రికార్డ్ గౌరవ డాక్టరేట్ అవార్డు ను అందుకోవడం జరిగింది. మీడియా తో డా. బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండి నేటి వరకు అనేక అవార్డ్స్ రివార్డ్స్ ని అందుకోవడం జరిగిందని బుధవారం తెలిపారు. ఇప్పటి వరకు అందుకున్న అవార్డు పురస్కారాలు
1)దళిత రత్న అవార్డు పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత అందుకోవడం జరిగింది.
2) జాతీయ అంబేద్కర్ అవార్డు పురస్కారాన్ని బహుజన సాహిత్య అకాడమీ నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో అందుకోవడం జరిగింది.
3) ఢిల్లీలో బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డు పురస్కారాన్ని అందుకోవడం జరిగింది.
4) జాతీయ ఎక్స్లెంట్ అవార్డు పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఢిల్లీ వారి చేతుల మీదుగా అవార్డు పురస్కారాన్ని అందుకోవడం జరిగింది.
5) సర్వేపల్లి రాధాకృష్ణ జాతీయ అవార్డును లైన్స్ క్లబ్ ద్వారా అందుకోవడం జరిగింది.
6) భారతదేశ గౌరవ పురస్కారం అవార్డును మయూరి ఆర్ట్స్ సంస్థ ద్వారా అందుకోవడం జరిగింది.
7) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సేవా పురస్కారం అవార్డును కళానిలయం ఆధ్వర్యంలో అందుకోవడం జరిగింది.
8) భారత విశిష్ట గౌరవ పురస్కారాన్ని జాతీయ అవార్డును నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ ద్వారా అందుకోవడం జరిగింది. 9)ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 10) ఇంటర్నేషనల్ కోహినూర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్.
11) ఇంటర్నేషనల్ డైమండ్ వరల్డ్ రికార్డ్ 12) ఇంటర్నేషనల్ గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్
13) ఇంటర్నేషనల్ జై ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్,
14) ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు,
15) ఇంటర్నేషనల్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్,
16) ఇంటర్నేషనల్ విశ్వం వరల్డ్ రికార్డ్, 17)ఇంటర్నేషనల్ స్టేట్స్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా,
18)ఇంటర్నేషనల్ ప్లాటినుం బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు
19) ఇండియన్ ఎక్స్లెన్స్ అవార్డు
20) హైదరాబాదులోని త్యాగరాయ గణ సభ లో జాతీయ ప్రతిభా పురస్కారాన్ని అందుకోవడం జరిగింది.
ఆగస్టు 2, 2024 న కింగ్డమ్ ఆఫ్ టాలెంటె రికార్డ్స్ బుక్ ద్వారా ప్రకటించిన వరల్డ్ రికార్డ్ బుక్ గౌరవ డాక్టర్ ను అందుకున్నట్లు తెలిపారు.

నా వెన్నంటూ ఉంటూ అహర్నిశలు సంపూర్ణ సహకారాన్ని అందించినందుకు గాను, అనేక విజయాలు సాధించగలిగానని అందుకోసం ఆయన ఈ అవార్డును మా కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నాను. నా వెన్నంటూ ఉంటూ నేను సామాజిక కార్యక్రమాలు తలపెట్టినప్పుడు అనేక సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో నా గురువర్యులు ముందుండి నడిపించినందుకు గాను శిరస్సు వంచి అభివందనాలు తెలియజేస్తూ, నేను తలపెట్టే ప్రతి సామాజిక కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమాజానికి అందించి గొప్ప గుర్తింపు తీసుకురావడానికి, అనేక విజయాలు సాధించడానికి సహకరించిన దేవరకొండ డివిజన్ పాత్రికేయులకు, ఎలక్ట్రాన్ మీడియా ప్రతినిధులకు పేరుపేరునా అభివందనాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ అవార్డు ద్వారా తన పై మరింత సమాజిక బాధ్యత పెరిందని డా.బుర్రి వెంకన్న అన్నారు.
పోలీసులు, నక్సలైట్లకు మధ్య భారీగా ఎదురుకాల్పులు
ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో హోరాహోరీ ఎన్‌కౌంటర్

పోలీసులు, నక్సలైట్లకు మధ్య భారీగా ఎదురుకాల్పులు

పోలీసుల మెరుపు దాడికి తాళలేక పరారైన నక్సలైట్లు

భారీగా ఆయుధాలతో పాటు 38 లక్షల నగదు స్వాధీనం

నగదు డంప్‌లో రూ.10 లక్షల వరకు పాత 2 వేల రూపాయల నోట్లు

పరారైన మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్
NLG: మండల మహిళా సమైక్య అటెండర్స్ కు వేతనాలు పెంచాలి: సిఐటియు జిల్లా అధ్యక్షులు
మండల మహిళా సమైక్యలో అటెండర్ లుగా పనిచేస్తున్న వారందరికీ కనీస వేతనం రూ.18 వేలు వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నల్లగొండలో డిఆర్డిఓ పిడి శేఖర్ రెడ్డి కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మండల మహిళ సమైక్యాలు ఏర్పడిన నాటి నుండి  తక్కువ వేతనాలతో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తున్నారని అన్నారు.

జిల్లాలో అటెండర్స్ కి రూ. 2 వేలు నుండి 6 వేలు వరకు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని, పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ఈ వేతనాలు సరిపోక వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు పులకరం నారాయణ, జిల్లా నాయకులు ఉల్లెందుల సైదులు, సైదమ్మ, నాగమ్మ, ఎల్లమ్మ, కమలమ్మ,సరిత, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
             
ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న వీరికి గుర్తింపు కార్డులు, పిఎఫ్ ,ఈఎస్ఐ, ప్రమాద బీమా యూనిఫాం క్యాజువల్ సెలవులు అమలు కావడం లేదని కనీసం ఉద్యోగ భద్రత కూడా లేని పరిస్థితి దాపురించిందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే వీళ్ళ వేతనాలు పెంచే విధంగా ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనియెడల అటెండర్స్ అందరూ పోరాటాలకు సిద్ధమవుతారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పులకరం నారాయణ, జిల్లా నాయకులు ఉల్లెందుల సైదులు, సైదమ్మ, నాగమ్మ, ఎల్లమ్మ, కమలమ్మ,సరిత, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు.