/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.. *నేను నా మిర్యాలగూడ* కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ ! janardhanreddy vemula
మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.. *నేను నా మిర్యాలగూడ* కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ !
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా *రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మిర్యాలగూడ* వారి ఆధ్వర్యంలో 25 వేల మొక్కల పెంపకం కార్యక్రమంలో భాగంగా *శ్రీ వెంకట రమణ రైస్ మిల్స్* ఆధ్వర్యంలో *250 మొక్కలు నాటి* కార్యక్రమం ప్రారంభించడం జరిగింది... ఈ సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* మాట్లాడుతూ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ప్రతి రైస్ మిల్ ఆధ్వర్యంలో 250 మొక్కలను నాటుతామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. నేను నా మిర్యాలగూడ పర్యావరణ పరిరక్షణలో వారు కూడా భాగస్వామ్యులు అవుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. అలాగే మిర్యాలగూడ నియోజకవర్గం వ్యాప్తంగా వ్యాపార వాణిజ్య సంఘాల వారు, విద్యావంతులు మేధావులు ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అవుతూ మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రకృతి వనంగా తీర్చి దిద్దాలి అని అన్నారు.. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..
** మిర్యాలగూడ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్ చౌక్ నందు నిర్వహించిన *యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ* వేడుక**
** మిర్యాలగూడ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్ చౌక్ నందు నిర్వహించిన *యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ* వేడుక**
**మూడవ రోజు స్వచ్చ ధనం - పచ్చదనం కార్యక్రమంలో ..MLA -BLR**
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *స్వచ్చధనం- పచ్చదనం* 5 రోజుల కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు రోజు మిర్యాలగూడ మండలం *గూడూరు గ్రామంలో* నిర్వహించిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటడం జరిగింది. అనంతరం అధికారులతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం, పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి *గౌ,, శ్రీ రేవంత్ రెడ్డి గారు* .ఈ ఐదు రోజుల వినూత్నమైన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది .. కావున అధికారులు, గ్రామపంచాయతీ , సిబ్బంది, ప్రజలు అందరు సమన్వయం చేసుకొని బాధ్యతగా పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. అలాగే ప్రస్తుతం వస్తున్న విష జ్వరాలని పూర్తిగా కట్టడి చేయాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఈ కార్యక్రమంలో మొక్కలు నాటడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలను ప్రేరేపించాలి అని అన్నారు.. అనంతరం స్కూల్ పిల్లలతో కలసి మాట్లాడి మధ్యాహ్నం భోజన సదుపాయాలు గురించి తెలుసుకున్నారు .
ఈ కార్యక్రమంలో MPDO గారు, గ్రామ అధికారులు కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..
**నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి నీటిని విడుదల చేయండి. ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు MLA -BLR**
ఈరోజు మిర్యాలగూడ MLA క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులు *SE, DE, AE* మరియు ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి ప్రతీ ఎకరాకు నీటిని అందించాలి . నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రతీ కాలువ ప్రతీ కెలాను విడుదల చేయండి అలాగే ఏదైనా కాలువాలు చెట్లు మొలచి, చెత్త అధికంగా ఉండి నీటి సరఫరా ఆగిపోతే వెంటనే అలాంటి కాలువలను గుర్తించి శుభ్రపరచండి అని ఆదేశించారు .
రైతులు ఎవ్వరూ ఇబ్బంది పడకుండా వారికి సహకరించాలని అన్నారు.
**ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా..** వారికి నోటీసులు పంపిస్తున్న ఆదాయపు పన్ను శాఖ.. ఏం చేయాలి?
ఐటీఆర్ దాఖలు చేశారా.. రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు జులై 31తోనే ముగిసిపోయింది. దాదాపుగా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 7.20 కోట్లకుపైగా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలయ్యాయి. ఇప్పటివరకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంత మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ఇదే తొలిసారి. అయితే కోట్లాది మంది ఐటీఆర్ ఫైలింగ్ చేయగా.
ఐటీ శాఖ తప్పు ఐటీఆర్ ఫారం ఎంచుకోవడం లేదా.. అన్ని ఆదాయ వనరుల్ని వెల్లడించకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన టాక్స్ పేయర్లను కనిపెడుతుంది. ఇలాంటి వారికి ఇ- మెయిల్ ద్వారా వారి తప్పుల్ని తెలియజేస్తుంది ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోవడం.. టాక్స్ చెల్లించకపోవడం, ఆదాయం వెల్లడించకపోవడం వంటి సమస్యల పేరిట నోటీసులు జారీ చేస్తారు. అందుకే ఎలాంటి ఆదాయపు పన్ను నోటీసులు వస్తుంటాయి.. వస్తే ఏం చేయాలి.. పన్ను నోటీసులకు ఎలా స్పందించాలో తెలుసుకోవడం మంచిది. మీరు వేతన జీవులైతే.. కంపెనీ మీ తరఫున టాక్స్ తీసేసి చెల్లిస్తే.. ఐటీఆర్ కచ్చితంగా ఫైల్ చేయాలి. ఇంకా. కొత్త పన్ను విధానంలో వార్షికాదాయం రూ. 3 లక్షలు, పాత పన్ను విధానంలో రూ. 2.5 లక్షల వార్షిక ఆదాయం కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ నుంచి మినహాయింపు ఉంది. జీతం నుంచి కంపెనీ టీడీఎస్ తీసేసినట్లయితే.. ఐటీ చట్టాల ప్రకారం పేర్కొన్న ప్రాథమిక పన్ను మినహాయింపుల పరిమితి కంటే జీతం ఎక్కువగా ఉందని అర్థం. తప్పుగా ఐటీఆర్ ఫైల్ చేస్తే నోటీసులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరు.. సెక్షన్లు 139(9), 143 (1), (2), (3), 245, 144, 147 సహా ఆదాయపు పన్ను చట్టం- 1961 లోని పలు సెక్షన్ల కింద నోటీసులు వస్తాయి. జీతం నుంచి టీడీఎస్ తీసివేసినప్పటికీ.. ఐటీఆర్ ఫైల్ చేయాలి. నిర్ణీత సమయంలోగా ఫైల్ చేస్తే.. ఆదాయ లెక్కింపు, పెట్టుబడి ప్రూఫ్స్ సమర్పించొచ్చు. అదే గడువు ముగిసిన తర్వాత టాక్స్ ఎగవేత లేదని నిరూపించేందుకు ప్రూఫ్స్ కచ్చితంగా ఇవ్వాలి.
మీరు ఐటీఆర్ ఫైల్ చేయలేదని మెయిల్‌కు నోటీసులు వస్తే.. ఐటీ శాఖ ఇ- ఫైలింగ్ వెబ్‌సైట్‌ లాగిన్ చేయడం వల్ల ఆన్‌లైన్‌లో రిప్లై ఇవ్వొచ్చు. ఫైల్ చేయకపోవడానికి గల కారణాల్ని అక్కడ ఎంచుకోవాలి.
మీ పన్ను మొత్తం,, ఐటీఆర్ ఫారం 26AS సరిపోలకుంటే మీకు ఐటీ నోటీసు వస్తుంది. TDS, ITR కు వ్యతిరేకంగా ఫారం 26AS లో టాక్స్ క్రెడిట్స్ తనిఖీ చేయండి. ఇక్కడ ఏదైనా వ్యత్యాసాలు ఉంటే సరిచేసుకోవాలి. ఆదాయపు పన్ను వివరాల్ని అప్డేట్ చేయాలి. సవరించిన ఐటీఆర్ ఫైల్ చేయాలి. >> మీరు సంపాదించిన మొత్తం ఆదాయం వివరాలు వెల్లడించకపోతే కూడా నోటీసులు వస్తాయి. టాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ సమాచారాన్ని.. బ్యాంక్ వడ్డీ, పన్ను మినహాయింపులు ఇలా వేర్వేరు మార్గాల నుంచి కనుగొనే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు వివిధ వనరుల నుంచి మీ ఆదాయం చెక్ చేస్కొని.. దాన్ని ఫారం 26AS తో సరిపోల్చాలి. అప్పుడు ఏదైనా ఆదాయ వివరాలు మిస్ అయితే.. అప్పుడు ఐటీఆర్ అప్డేట్ చేసి మళ్లీ ఫైల్ చేయాలి.



ఇక నోటీసులు వచ్చాక.. దానిని ముందు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. ఐటీ శాఖ, ఐటీ చట్టం- 1961 లోని పలు సెక్షన్ల కింద టాక్స్ పేయర్లకు నోటీసులు అందిస్తుంది. నోటీసులో పేరు, పాన్ నంబర్, మదింపు సంవత్సరం తనిఖీ చేయాలి. నోటీసు మీకు సంబంధించినదేనో కాదో నిర్ధరించుకోవాలి. ఐటీ వెబ్‌సైట్లో నోటీసు చెక్ చేయండి. దానిలోని సూచనల్ని అనుసరించి చేయాల్సి ఉంటుంది.
**హైదరాబాద్‌కు మహర్దశ..**ఎంట్రీ ఇస్తోన్న మరో ఇంటర్నేషన్ కంపెనీ!
టెక్నాలజీ, సర్వీస్ సొల్యూషన్స్ లో పేరొందిన ఆర్సీసియం కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అమెరికాలో పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందం ఆర్సీసియం సీఈవో గౌరవ్ సూరి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆర్సీసియం మొదటిసారిగా హైదరాబాద్ లో తమ ఆఫీసును విస్తరించనుంది. అమెరికా తర్వాత విదేశాల్లో కంపెనీ పెట్టడం ఇదే మొదటి సారి. ప్రపంచ వ్యాప్తంగా తమ సేవల విస్తరణకు హైదరాబాద్ సెంటర్ కీలకంగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది. డీఈ షా గ్రూప్, బ్లాక్‌స్టోన్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ మద్దతుతో ఆర్సెసియం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది. బ్యాంకులు, హెడ్జ్ ఫండ్‌లు, సంస్థాగత ఆస్తుల నిర్వాహకులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు సంబంధించిన డేటాతో పాటు కార్యకలాపాలపై ఈ కంపెనీ విశ్లేషణలు అందిస్తుంది. ప్రత్యేకంగా డేటా మేనేజ్మెంట్, డేటా స్ట్రాటజీలో ఈ కంపెనీకి గుర్తింపు ఉంది. హైదరాబాద్ ఆఫీసు విస్తరణతో రాష్ట్రంలో మరింత మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గ్లోబల్ టెక్ కంపెనీలకు ప్రధాన గమ్య స్థానంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షించనుంది. ఐటీ రంగంలో బహుముఖ వృద్ధిని సాధించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో స్పష్టం చేశారు.
కంపెనీ విస్తరణకు ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందని ప్రకటించారు.
ఈ కంపెనీ విస్తరణ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సురెన్స్ రంగంలో హైదరాబాద్ పే కొత్త ఆవిష్కరణ కేంద్రంగా నిలబెడుతుందని అన్నారు. సాంకేతిక వృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సహకారం తప్పనిసరిగా ఉండాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. ఆర్సీసియం లాంటి కంపెనీలకు తగినంత మద్దతు పాటు మౌలిక సదుపాయాలను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రపంచ స్థాయి టెక్ కంపెనీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతుందని అన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు నైపుణ్యమున్న మానవ వనరులుండటంతో హైదరాబాద్ ను తమ అంతర్జాతీయ కార్యకలాపాలకు అనువైన ప్రదేశంగా ఎంచుకున్నట్లు కంపెనీ సీఈవో గౌరవ్ సూరీ తెలిపారు.
*ఈరోజు ప్రో . జయశంకర్ సార్ గారి ఆత్మ శాంతిస్తుంది అని భావిస్తున్నాము ...MLA -BLR*
ఈరోజు మన తెలంగాణ పితామహుడు , *ఆచార్య జయశంకర్ సార్ గారి* జయంతి సందర్భంగా మన మిర్యాలగూడ పట్టణంలో మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి-BLR గారు* మరియు *మిర్యాలగూడ కార్పెంటర్స్ యూనియన్* ఆధ్వర్యంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని విగ్రహం ప్రారంభించిన *MLA బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*

ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నిరంతరం పోరాడి ఆజన్మ బ్రహ్మచారి గా ఉండిపోయి తన జీవితం ఉద్యమానికి తెలంగాణ భవిషత్తు కోసం అంకితం చేసిన మహనీయుని విగ్రహం వారి జయంతి సందర్భంగా ఆవిష్కరణ చేయడం చాలా గర్వంగా ఉంది అని అన్నారు.. అలాగే గత BRS ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో తెలంగాణ కోసం పోరాడిన మన రాష్ట్ర జాతి పిత విగ్రహ ఏర్పాటు చేయకపోవడం చాలా బాధా కరం . కానీ మేము ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేసుకుంటే మమ్ములను ఏర్పాటు చేయనివ్వకుండా అడ్డుకున్నారు .కానీ కాలం సమాధానం చెప్తుంది అనడానికి ఇదే నిదర్శనం ఆ మహనీయుడు జయశంకర్ సార్ గారే ఈ రోజు మాతో ఇలా విగ్రహ ప్రతిష్టాపన చేయిస్తున్నారు అని మేము భావిస్తున్నాము అని అన్నారు. ఆరోజు వొద్దు అని అడ్డుకున్న నాయకులతోనే ఈరోజు విగ్రహానికి దండ వేయించాము.
ఈరోజు వారి ఆత్మ శాంతిస్తుంది అని అన్నారు. రాజకీయాలు అనేవి సామాజిక బాధ్యతగా ఉండాలి కాని రాజరికంగా చేస్తే కాలం ఇలాగే సమాధానం చెప్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పెంటర్స్ యూనియన్ వారు కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు...
**ధోని శిష్యుడితో పాటు కేఎల్ రాహుల్‌పై వేటు.. జట్టులోకి ధనాధన్ కుర్రాళ్లు**
మూడో వన్డేకి భారత తుదిజట్టు ఇదే.శ్రీలంకతో వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ బుధవారం జరగనుంది. మొదటి వన్డే టై కాగా, రెండో మ్యాచ్‌లో శ్రీలంక గెలిచింది. చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ డ్రా చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తుండగా, ఆతిథ్య జట్టు కూడా గెలుపే లక్ష్యంగా గేమ్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది.
1997 తర్వాత శ్రీలంక, భారత్‌పై వన్డే సిరీస్ గెలవలేదు. ఇప్పుడు ఆ లోటు పూడ్చుకునే అవకాశం వారికి దక్కింది. అయితే మూడో మ్యాచ్‌లో ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరెవరు ఉండే అవకాశం ఉందో చూద్దాం. ఓపెనింగ్‌, టాప్ ఆర్డర్ టీమ్ ఇండియా కెప్టెన్, ఓపెనర్‌ రోహిత్ శర్మ రెండు మ్యాచ్‌ల్లోనూ దూకుడుగా ఆడాడు. పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీలు బాదాడు. కానీ ఈ ఆరంభాన్ని టీమ్ ఇండియా సరిగా ఉపయోగించుకోలేదు. మిగతా బ్యాటర్లు ఫెయిల్ అవ్వడంతో తక్కువ స్కోర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే, భారత మిడిల్ ఆర్డర్ మొత్తం తడబడింది. విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, శివమ్ దూబే అందరూ నిరాశపరిచారు. అయితే మూడో వన్డేలో కోహ్లి, అయ్యర్‌ ఇద్దరూ తుది జట్టులో ఉండవచ్చు. కానీ రాహుల్, దూబేను రీప్లేస్ చేసే అవకాశం ఉంది. మొదటి వన్డేలో రాహుల్ 31 పరుగులు చేసినా, టీమ్‌ను గెలిపించలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో డక్‌ ఔట్ అయ్యాడు. శివమ్ దూబే స్పిన్నర్లపై బాగా ఆడతాడనే అంచనాలు ఉన్నా, అతడు అంచనాలకు తగ్గట్లు రాణించలేదు. మొదటి వన్డేలో దూబే 25 పరుగులు చేశాడు, కానీ రెండో వన్డేలో డక్ ఔట్ అయ్యాడు. గంభీర్, రోహిత్ జట్టు కూర్పు మార్చాలనుకుంటే. రాహుల్, దూబేలకు బ్యాకప్ ఆప్షన్స్‌గా ఉన్న రిషబ్ పంత్, రియాన్ పరాగ్‌ను ఫైనల్ ఎలెవన్‌లోకి తీసుకోవచ్చు. పరాగ్‌కు ప్లస్ రియాన్ పరాగ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. టీ20 సిరీస్‌లో అతడి బౌలింగ్ స్కిల్స్‌ బయటపెట్టాడు. శ్రీలంక వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతున్నాయి. ఇక్కడి స్లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అందుకే రెండో వన్డేలో శ్రీలంక కేవలం ఒకే ఒక్క పేసర్‌ అసిత ఫెర్నాండోతో ఆడింది. భారత్ కూడా ఇదే గేమ్ ప్లాన్ ఫాలో కావచ్చు. టీమ్ ఇండియా ఇప్పటికే ముగ్గురు స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌తో ఆడుతోంది. వీరికి పరాగ్‌ తోడైతే, లంక బ్యాటింగ్‌ ఆర్డర్‌ను ఎదుర్కొనే అవకాశాలు పెరుగుతాయి. అందుకే దూబే ప్లేస్‌లో రియాన్ పరాగ్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. రాహుల్‌ను తీసేస్తారా? రెండు వన్డేల్లో టీమ్ ఇండియా బ్యాటర్లు దూకుడుగా ఆడలేదు. అందుకే అగ్రెసివ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు చివరి మ్యాచ్‌లో అవకాశం రావచ్చు. కానీ రాహుల్‌ను తప్పించడం తప్పుడు నిర్ణయమే అవుతుంది. ఎందుకంటే గత ఏడాది అతడు 66.25 యావరేజ్, 87.74 స్ట్రైక్ రేట్‌తో 1060 రన్స్ సాధించాడు. ఐదో స్థానంలో ఆడే ఈ కర్ణాటక బ్యాటర్ నిలబడితే, మ్యాచ్‌ను ఈజీగా గెలిపించగలడు. అంతేకాదు, రాహుల్ స్పిన్ బౌలింగ్‌లో చాలా బాగా ఆడతాడు.
అందుకే మూడో వన్డేల్లో పంత్ లేదా రాహుల్ ఇద్దరిలో ఎవర్ని ఆడించాలనేది డిసైడ్ అవ్వడం గంభీర్, రోహిత్‌కు కష్టంగా మారనుంది.
**నల్గొండ బిడ్డ సత్తా..** ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక!
సర్కార్ కొలువు సాధించాలనేది ఎందరికో కల
డిగ్రీ పట్టాలు చేతికి వచ్చినప్పటి నుంచి కోచింగ్‌లు తీసుకుంటూ యువత ఉద్యోగ సాధనలో ముగినిపోతుంటారు. ఎంత కష్టపడినా.. కొలువు కొందరినే వరిస్తుంది. అయితే తాజాగా రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. నల్గొండకు చెందిన చింతల తులసి రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన పలు నియామక పరీక్షల్లో సత్తాచాటి నాలుగు ఉద్యోగాలు.. సర్కార్ కొలువు సాధించాలనేది ఎందరికో కల. డిగ్రీ పట్టాలు చేతికి వచ్చినప్పటి నుంచి కోచింగ్‌లు తీసుకుంటూ యువత ఉద్యోగ సాధనలో ముగినిపోతుంటారు. ఎంత కష్టపడినా.. కొలువు కొందరినే వరిస్తుంది. అయితే తాజాగా రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. నల్గొండకు చెందిన చింతల తులసి రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన పలు నియామక పరీక్షల్లో సత్తాచాటి నాలుగు ఉద్యోగాలు సాధించింది. ఇది వరకే ఆమె గ్రూప్‌-4, పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ కొలువులు సాధించిన తులసి.. ఏప్రిల్‌ 24న ఏఈ, ఆగస్టు 2న ఏఈఈ ఉద్యోగాలకు సైతం ఎంపికైంది. చింతల వెంకన్న, లక్ష్మి దంపతుల మూడో సంతానం తులసి. స్వగ్రామలో ప్రభుత్వ పాఠశాలలోనే విద్య అభ్యసించిన తులసి, జేఎన్‌టీయూహెచ్‌లో బీటెక్, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్‌ పూర్తిచేసింది. అనంతరం ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా రెండేళ్లుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉంది. ఈ క్రమంలో టీజీపీఎస్సీ గ్రూప్‌-4, పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ ఉద్యోగాలు సాధించింది. అయినా వాటితో సంతృప్తి చెందకుండా ఆ ఉద్యోగాలు వదులుకుని, ఉన్నత కొలువు కోసం అహర్నిశలు కష్టించింది. తాజాగా ఏఈఈ, ఏఈ ఉద్యోగాలు తులసిని వరించాయి. దీనిపై తులసి మాట్లాడుతూ.. ఏఈఈ పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపింది. అయితే వేటికీ బెదరక ట్యూషన్లు చెప్పుకుంటూ.. వచ్చిన డబ్బులతో పుస్తకాలు కొనుగోలు చేసి హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నానని చెప్పుకొచ్చింది. ఎన్ని కష్టాలెదురైనా చదువు వదలకూడదని అమ్మానాన్న చెప్పిన మాటలే తనలో స్ఫూర్తి నింపాయని, వారి ఆశలను వమ్ము చేయకుండా గ్రూప్‌-1 సాధించడమే తన లక్ష్యమని తులసి తెలిపింది.
*స్వచ్చధనం - పచ్చదనం కార్యక్రమం విజయవతం చేయండి..MLA -BLR*
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *స్వచ్చధనం- పచ్చదనం* 5 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు యాద్గరిపల్లి గ్రామంలో ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం, పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి *గౌ,, శ్రీ రేవంత్ రెడ్డి గారు* ఈ ఐదు రోజుల వినూత్నమైన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది . కావున అధికారులు, గ్రామపంచాయతీ , సిబ్బంది, ప్రజలు అందరు సమన్వయం చేసుకొని బాధ్యతగా పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.అలాగే ప్రస్తుతం వస్తున్న విష జ్వరాలని పూర్తిగా కట్టడి చేయాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఈ ఐదు రోజుల కార్యక్రమంలో మొక్కలు నాటడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలను ప్రేరేపించాలి అని అన్నారు.. ఈ కార్యక్రమంలో RDO గారు, MRO గారు, MPDO గారు, అధికారులు కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.