/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz దళితులు కబ్జాలో ఉన్న భూమికి పాస్ పుస్తకాలు ఇవ్వాలని దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి Vijay.S
దళితులు కబ్జాలో ఉన్న భూమికి పాస్ పుస్తకాలు ఇవ్వాలని దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి

దళితులు దీర్ఘ కాలంగా కబ్జాలో ఉన్న భూమికి పాసు పుస్తకాలు ఇవ్వాలని దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి*. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం మసిపట్ల గ్రామ రెవిన్యూ పరిధిలోని ఎ. 1.28 గుంటల భూమిలో ముప్పై సంవత్సరాలుగా కబ్జా లో ఉన్న దళితులకు కొత్త పాసు పుస్తకాలను ఇప్పించాలని కోరుతూ శుక్రవారం జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే కు దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో దళితులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య మాట్లాడుతూ మోత్కూరు మండలం ముసిపట్ల గ్రామానికి చెందిన కొందరు దళితులు గత 30 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన కొత్త రోషిరెడ్డి దగ్గర సర్వే నం 193,194,198 లలో సుమారు ఎ 32. 05 గుంటల భూమికి పూర్తి డబ్బులు చెల్లించి ఖరీదు చేసుకున్నారని, అందులోని సర్వే నం 194 లోఎ 1.28 గుంటల భూమి రికార్డుల్లో నమోదు కాలేదని ఆయన అన్నారు. గతంలో ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కరం చేయలేదన్నారు. ప్రస్తుతం మోత్కూరు గ్రామానికి చెందిన బిల్లపాటి యాదిరెడ్డి, బిల్లపాటి మాధవరెడ్డి మరియు కొప్పుల వెంకట్ రెడ్డి లు దౌర్జన్యంగా అట్టి భూమిని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, దళితులపై దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జిల్లా కలెక్టర్, ముసిపట్ల లోని సర్వే నం 194 జాగ మోకా పై విచారణ జరిపించి, న్యాయ పరంగా దళితులకు రావాల్సిన భూమికి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఇప్పించాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన వారిలో ముసిపట్ల గ్రామానికి చెందిన గందమల్ల మల్లయ్య, గురిజాల వెంకటయ్య, గందమల్ల కిష్టయ్య, నకిరేకంటి రాం నర్సయ్య, పొన్న బోయిన అంజయ్య, గందమల్ల యాదమ్మ, గందమల్ల ఎల్లమ్మ, ముప్పాల వెంకట్ రెడ్డి లు పాల్గొన్నారు.
చిత్తాపురం నుండి వేములకొండకు వెళ్లే మెటల్ రోడ్డు కు మరమ్మత్తులు చేపట్టాలి: పోరుబాట లో సిపిఎం డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని చిత్తాపురం నుండి వేములకొండ కు వెళ్లే మెటల్ రోడ్డుకు మరమ్మతులుచేపట్టాలి... సిర్పంగి స్వామి సిపిఎం మండల కార్యదర్శి చిత్తాపురం నుండి వేములకొండ వెళ్లే అద్వాన్నంగా మారిన మెటల్ రోడ్డు కు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు శుక్రవారం రోజున సిపిఎం చిత్తాపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు అద్వానమైన చిత్తాపురం వేములకొండ రోడ్డును పరిశీలించిన అనంతరం నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిర్పంగి స్వామి మాట్లాడుతూ చిత్తాపురం వేములకొండ గ్రామాల మధ్యన ఉన్న మెటల్ రోడ్డు పూర్తిగా గుంతలమయమై ఆ రోడ్డు ద్వారా వెళ్తున్న ప్రజలు రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతుందని వెంటనే నూతన మెటల్ రోడ్డును నిర్మించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా చిత్తాపురం నుండి ముద్దాపురం వరకు వెళ్లే మట్టి రోడ్డు గుంతలుగా ఏర్పడిందని దీనిపై బీటి రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు గ్రామంలో ఇల్లు లేని పేదలందరికీ ఐదు లక్షల రూపాయలను మంజూరు చేస్తూ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని పెన్షన్లు రేషన్ కార్డులు రాని వారందరికీ పెన్షన్లు రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఈర్లపల్లి ముత్యాలు, సిపిఎం శాఖ కార్యదర్శి ఏటేల్లి నరసింహ, సహాయ కార్యదర్శి వల్లమల్ల కృష్ణ, నాయకులు కందుల బిక్షం, భూపతి రాములు,కందుల మచ్చగిరి, నాయకులు నిశాంత్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు
భువనగిరి; అన్ని గ్రామాలకు నిధులు కేటాయించాలి: సిపిఎం


భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్టు) భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపిడిఓ కార్యాలయం ముందు శుక్రవారం  ధర్నా నిర్వహించి ,అనంతరం సూపరిండెంట్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ మాట్లాడుతూ....* *భువనగిరి మండలంలోని అన్ని గ్రామాలకు నిధులు లేక మౌలిక సదుపాయాలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, గ్రామాల్లో దోమల బెదడా,మరియు కుక్కలు, కోతులు ప్రజలపై దాడి చేస్తున్నాయి, అర్హులైన వారందరికీ 150 గజాల ఇంటి స్థలం , ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా నూతన రేషన్ కార్డులను, పెన్షన్ ను వెంటనే మంజూరు చేయాలని, హనుమాపురం నుండి అనంతరం వరకు బీటీ రోడ్ వేయాలని, కురుమ గూడెం నుండి మన్నె వారి పంపు వరకు బీటీ రోడ్డు వెయ్యాలని, బస్వాపురం నుండి హాన్మపురం వరకు రోడ్డు వేయాలని, నందనం, సిరివేరి కుంట మధ్యలో ఆగిపోయిన బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని, అనాజిపురం నుండి జంపల్లి మధ్యలో చిన్నేరు వాగు నూతన బిడ్జి నిర్మాణం చేయాలని, నమాజ్ పల్లి నుండి తుక్కరం బీటీ రోడ్డు మార్చాలని, చీమల కొండూరు నుండి ముస్తాలపల్లి వరకు బీటీ రోడ్డు వేయాలని, ముస్తాలపల్లి నుండి మూటకొండూర్ రోడ్డు వేయాలని, బస్వాపురం నుండి గంగసాని పల్లి వరకు రోడ్డు వేయాలని, పెంచికల్పహాడ్ వెళ్లే దారిలో అండర్ పాస్ రోడ్డు నిర్మాణం చేయాలని, ముత్తిరెడ్డిగూడెం గ్రామ ప్రజలకు ఉపయోగపడే బస్వాపూర్ రిజర్వాయర్ కల్వా పై బ్రిడ్జి నిర్మించాలని, ఉసిల్ల కాల్వపై బ్రిడ్జి నిర్మించాలని, బస్వపూర్ గ్రామంలో గతంలో కేటాయించిన ఇంటి స్థలంలో మౌలిక సదుపాయాలు కల్పించి, నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మొదటి విడుదల ఇవ్వాలని డిమాండ్ల చేశారు , డిమాండ్లను పరిష్కరించని ఎడలా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రాస్తారోకోలు ధర్నాలు చేస్తామని హెచ్చరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం అన్నం పట్ల కృష్ణ కొండమడుగు నాగమణి మండల కమిటీ సభ్యులు మోటే ఎల్లయ్య అబ్దుల్లాపురం వెంకటేష్ పాండాల మైసయ్య శాఖ కార్యదర్శిలు నరాల చంద్రయ్య ఏదునూరు వెంకటేష్ కూకుట్ల కృష్ణ,పార్టీ నాయకులు బండి శీను దయ్యాల మల్లేష్,బొల్లెపల్లి కిషన్ కొల్లూరు సిద్దిరాజు, కునుమ మధు, తదితరులు పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే విడుదల చేసి , థంబ్ విధానాన్ని రద్దు చేయాలి: AITUC డిమాండ్

భవన నిర్మాణ కార్మికులకు రావాల్సిన పెండింగ్ క్లెయిమ్స్ ను వెంటనే విడుదల చేసి మీ సేవలో ఉన్న థంబ్ విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతినే కొనసాగించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గోరేటి రాములు ఎండి ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భువన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు జిల్లా కార్మిక శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ తాహేర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్బంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గోరెటి రాములు, ఎండీ ఇమ్రాన్ మాట్లాడుతూ ప్రస్తుతం భవన నిర్మాణ కార్మికులు కొత్త కార్డు నమోదు చేసుకోవాలన్న, క్లెయిమ్స్ కోసం అప్లై చేయాలన్న మీ సేవలో థంబ్ విధానం పెట్టడంతో అటు సర్వర్ రాకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు అన్నారు. అందుకే థంబ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే 10 లక్షలు ఇవ్వాలని, సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని, 60 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 6000 పింఛన్ ఇవ్వాలని, కొత్త జిల్లాలు ఏర్పడినందున ఆయా జిల్లాల కార్యాలయాలలో ఏ సి ఎల్, డీసీఎల్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్, అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని, యాదాద్రి భువనగిరి జిల్లాకు ఏ సి ఎల్ పోస్ట్ కాలిగా ఉన్నందున కేవలం ఏఎల్ఓ ఉండటంతో భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. అలాగే ప్రసూతి కానుక 50 వేలకు పెంచాలని, పెళ్లి కానుకకు 1లక్ష రూపాయలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, నాయకులు సీతారాం, గౌస్, రాంచందర్, రవీందర్, రాజు, కృష్ణ, మోహన్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

వేములకొండ లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామంలో అంబేద్కర్ చౌక్ వద్ద వేములకొండ గ్రామ రైతులు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 రోజుల నుండి తమ సొంత నిధులతో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి  వేములకొండ పెద్ద కాలువను పూడికతీత మరియు గుర్రపు డెక్క ఆకు తొలగించి పెద్ద చెరువులోకి నీరు రావడానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు  తెలుపుతూ పాలాభిషేకం చేశామని రైతులు  అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సామ రామిరెడ్డి ,పులిపలుపుల రాములు ,ఎస్కే రసూల్, ఏర్పుల వెంకటేష్, కేశిరెడ్డి నీరజ, బుంగ మనెమ్మ ,ఆకుల లలిత, బత్తుల సువర్ణ ,ఎనుగుల నరసింహ, వింజమూరు శ్రీను ,వింజమూరి శివయ్య, చెక్క సత్తయ్య, బుంగ రాములు, రైతులు ,తదితరులు పాల్గొన్నారు.

రైతులను ఆదుకోవడంలో దేశానికి ఆదర్శం రేవంత్ రెడ్డి ప్రభుత్వం: కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు గాదె శోభారాణి

రైతులకు అండగా నిలబడే బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం,ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ రామన్నపేట మండల మహిళా అధ్యక్షురాలు గాదె శోభరాణి రాష్ట్ర రైతాంగం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఆమె మాట్లాడుతూ ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రూ.72 వేల 659 కోట్లు కేటాయించారు.తెలంగాణ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో దేశానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు.గతంలో కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో బి.ఆర్. ఎస్. ప్రభుత్వాలు పదేళ్ళు గా రైతులను ఏ విదంగా మోసం చేసాయో తెలిసిందేనన్నారు.రైతు వ్యతిరేక నల్ల చట్టాలు,గిట్టుబాటు ధర కల్పించకుండా డిల్లీ రైతు పోరాటం లో 700 మంది రైతాంగం ను చవడానికి కారణం అయినా బిజెపి కి మా ప్రభుత్వం పై విమర్శలు చేసే నైతికత లేదన్నారు.పదేళ్లు ప్రభుత్వం నడిపిన కేసీఆర్ ధరణి వంటి వాటితో రైతాంగం హక్కులను కాలరాసిన చరిత్ర బి.ఆర్.ఎస్ ప్రభుత్వంది అన్నారు.లక్ష రుణమాఫీ మాటలకే పరిమితము అయినా కెసిఆర్,కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కడం వారికే చెల్లిందన్నారు.ఈ బడ్జెట్ లో ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఇందిరమ్మ రాజ్యంలోనే రైతుకు భరోసా అని మరోసారి నిరూపితమైందన్నారు.అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ. 72,659 కోట్లు కేటాయించడం పాటు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీని చేస్తున్నామని అన్నారు.ఇప్పటికే రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసిన విషయం కనుల ముందు ఉందన్నారు.పంద్రాగస్టు లోపు రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాది చేతల ప్రభుత్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపించారని అన్నారు.అలాగే రైతులకు రైతు భరోసా,ఇంకా రైతు బీమ, పంట నష్ట పరిహారం కూడా ఉంటుంది. అందుకే వ్యవసాయానికి భారీగా నిధులు కేటాయించి చిత్తశుద్ధి ని నిలుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని ,మంత్రి వర్గంను, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారిని, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని, తెలంగాణ ప్రజలు,రైతాంగం ఆశీర్వదించాలన్నారు.
విద్యారంగం పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: AISF

విభజన హామీ ప్రకారం తెలంగాణకి కేటాయించాల్సిన విద్యాసంస్థలను కేటాయించకుండా అలసత్వం ప్రదర్శిస్తుందని ఈ ప్రభుత్వం ముమ్మాటికి విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమేనని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ. నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు బీజేపీ ప్రభుత్వం విద్య కాషాయీకరణ చేసే విధంగా కుట్ర చేస్తుందని, నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్య కార్పోరేటీకరణ, కాషాయీకరణ చేసే విధంగా అడుగులు వేయడం శోచనీయం. తెలంగాణ రాష్ట్ర విభజన హామీల్లో ఉన్న విద్యాసంస్థలను తెలంగాణకి కేటాయించకుండా మోడీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తుందన్నారు బడ్జెట్ ప్రవేశ లో యూనివర్సిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించక పోవడం ఎంత వరకు సమంజసం అని,తెలంగాణకు సంబంధించి విభజన హామీలో ఉన్న ట్రిపుల్ ఐటీ, జిల్లాకొక కేంద్రీయ విశ్వవిద్యాలయం, జిల్లాకొక నవోదయ పాఠశాల, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయకుండా బడ్జెట్ పెట్టడం తెలంగాణ విద్యారంగంపై బీజేపీ ప్రభుత్వం తన కుట్రను వెల్లడించింది. విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని, దేశంలో ఉన్న యూనివర్సిటీలను అభివృద్ధి చేయకుండా,దేశంలోకి విదేశీ యూనివర్సిటీలను ఆహ్వానిస్తూ, ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. విద్యారంగంలో సంస్కరణల పేరుతో శాస్త్రీయ విద్యావిధానాన్ని పాతరేసి పాఠ్యాంశాల్లో మతపరమైన అంశాలను చేరుస్తూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫెల్లోషిప్స్ , మౌలానా ఆజాద్ ఉపకార వేతనాలు, ఇవ్వకుండా ,కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు ఢిల్లీలో పార్లమెంటులో తెలంగాణ విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయాలని, గుజరాత్ గులాంలకు బానిసలుగా ఉండి, తెలంగాణకి ద్రోహులుగా బీజేపీ ఎంపీలు ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం విద్యలో 10 శాతం నిధులు కేటాయించాల్సిన కేవలం 2.46% నిధులు మాత్రమే కేటాయిస్తూ విద్యారంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఈ బడ్జెట్లో విద్యకు సంబంధించినటువంటి వాటిపై జీఎస్టీ ఎత్తివేయకుండా అదనపు భారం మోపడం దుర్మార్గం. ఇక రాష్ట్రంలో చూసుకుంటే అనేక గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేవని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్స్ లేక విద్యార్థులు నానావస్థలు పడుతున్నారని గత ఎన్నికల ప్రచారంలో విద్యా రంగానికి 15% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

దళితులు సేద్యం చేసుకుంటున్నా ప్రభుత్వ భూమికి పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలి: కొండమడుగు నరసింహ డిమాండ్

గత 60, 65 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నా హన్మాపురం గ్రామ దళితులందరికీ వెంటనే పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం గ్రామంలోని దళితులు సాగు చేసుకుంటున్న సర్వే నెంబరు 87 లోని 15 ఎకరాల 12 గుంటల భూమిని సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నర్సింహ్మ, రైతులతో కలిసి పరిశీలన చేసినా అనంతరం నిర్వహించిన సదస్సులో నర్సింహ్మ పాల్గొని మాట్లాడుతూ హన్మాపురం గ్రామంలోని సర్వేనెంబర్ 87 లోని 15 ఎకరాల 12 గంటల భూమిని 14 ఎస్సీ కుటుంబాలకు చెందిన 29 మంది సేద్యం చేసుకుంటున్నారని వారందరికీ ప్రభుత్వము వెంటనే నూతన పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని డిమాండ్ చేసినారు. ఆనాడు ఎన్నో కష్టనష్టాలకు ఓడ్చి పైసా పైసా కూడా పెట్టి భావి తొవ్వి , కరెంటు సాంక్షన్ ను తెచ్చుకొని మోటార్ తో నీటిని తోడి ఆ నీళ్లతో వ్యవసాయ పంటను పండించి తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. కానీ ఆ భూములకు పట్టాదారు పాసుబుక్కులు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ది పొందలేదని, బ్యాంకుల నుండి కూడా ఎలాంటి సహాయము తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని వారు ఆవేదన వెలిబుచ్చారు. సేద్యం చేసుకుంటున్నా భూమికి పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలని పలుమార్లు జిల్లా కలెక్టర్, ఆర్డిఓకు, స్థానిక తహసిల్దారుకు, ప్రజా ప్రతినిధులకు మెమోరండం ఇచ్చి మొరపెట్టుకున్నా ఇప్పటివరకు నూతన పాస్ బుక్స్ లు ఇవ్వలేదని అన్నారు. ఈ మధ్యకాలంలో ఆ భూమిని భూమి కాజేయడానికి, ఆక్రమించడానికి పక్కనున్న కొంతమంది భూసాములు ప్రయత్నం చేస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వము తక్షణం స్పందించి భూమిని సర్వే చేసి హద్దురాళ్ళు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను కోరారు. సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నర్సింహ మాట్లాడుతు రెక్కాడితే గాని డొక్కానిండని దళితులు భూమిని సాగు చేసుకుని బతుకుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగుదారులైన దళితులందరికీ పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని లేనిచో పోరాటాన్ని కొనసాగిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం నూతన పాసుబుక్కుల సాధన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా బిచ్చాల మహేందర్, ప్రధాన కార్యదర్శిగా మూడుగుల రాజు, గౌరవ అధ్యక్షులుగా మూడుగుల అంజయ్య, ఉపాధ్యక్షులుగా బండారి రామచందర్, సహాయ కార్యదర్శిగా చందుపట్ల మల్లయ్య, కార్యవర్గ సభ్యులుగా బిచ్చాల మైసయ్య, మూడ్గుల వెంకటయ్య, మూడ్గుల బాల్ నరసింహ, బండారి జీవన్ రావ్, బిచ్చాల పరుశరాములు, పొట్ట జగన్ ఎన్నుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముడుగుల బాలరాజు, బాల్ నరసింహ, మైసయ్య, కొండలు ప్రభాకర్, ఉప్పలయ్య, మహేష్, వెంకన్న, బిక్షపతి, రమేష్, నరసయ్య, మైసయ్య, కొండలు, రాజు, ఉప్పలయ్య, సుధాకర్, నరసింహ, పెంటయ్య, బిక్షపతి, లక్ష్మి, పరమేష్, కొండల్ ,సీతారాములు, మైసయ్య, జయమ్మ, లింగయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు

సామాజిక కార్యకర్త, హక్కుల నాయకుడు, సీనియర్ జర్నలిస్టు, మూడ నమ్మకాల నిర్మూలనకు, కరెన్సీ నోట్ల పై అంబేద్కర్ ఫోటో సాధన కోసం కృషి చేస్తున్న కొడారి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘణంగా నిర్వహించారు. మొదట భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కు పూలమాలలు వేసి నివాళులర్పించారు‌. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ధరణికోట నర్సింహ, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్, జిల్లా ఎస్సీ/ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్, టీ పి సి సి మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నింటి స్టాన్లీ లు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న కొడారి వెంకటేష్,భవిష్యత్తులో మరిన్ని సామాజిక ఉద్యమాలు నిర్వహించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందే విధంగా కృషి చేయాలని కోరుతూ ఆశీర్వదించారు. పుట్టినరోజు కార్యక్రమంలో వికలాంగుల హక్కుల మహిళా అధ్యక్షురాలు కొత్త లలిత, జిల్లా నాయకులు జాగిల్లపురం అయిలయ్య, సింగారం రమేష్, కాటపల్లి రజిత, ఇంజ పద్మ , మచ్చ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.


ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి:AISF

అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా AISF జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో సరైన సదుపాయాలు లేక విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. మహిళల విద్యార్థులకు బాత్ రూమ్ శుభ్రంగా లేకపోవడం మూలంగా ఇబ్బందులు పడుతున్నారు. .లైబ్రరీ సౌకర్యాలు లేకపోవడం మూలంగా విద్యార్థుల అధ్యయనంతో పాటు వారి భవిష్యత్ పైన కూడా ప్రభావం పడుతుందని అన్నారు. పాఠశాలలో పారిశుద్ధ కార్మికులు లేకపోవడం మూలంగా పాఠశాల ఆవరణమంతా శుభ్రంగా లేకపోవడం మరియు మంచినీటి సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో వైరల్ ఫీవర్ తో పాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.. చాలా పాఠశాలలో పురాతన భవనాలు కుంగి పోవడంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పాఠశాలలు మార్చడం జరుగుతుంది దీని మూలంగా అనేకమంది విద్యార్థులు చదువుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు కావున తక్షణమే సొంత భవనాలను నిర్మించాలి అదే విధంగా అనేక పాఠశాలలో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ కొరత ఉంది. కావున తక్షణమే అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలని కోరడం జరిగింది లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ గా ఈ సమస్యలన్నీ తీరేవరకు విద్యార్థులకు సరైన విద్య నాణ్యతతో కూడిన సదుపాయాలు కల్పించేంత వరకు పోరాటం కొనసాగుతుందని వారు అన్నారు. అనంతరం ఎస్సీ బాలికల వసతి గృహం, బీసీ కళాశాల బాలుర వసతి గృహం లను సందర్శించి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో విద్యార్థులకు ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా శానిటేషన్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న సంక్షేమ హాస్టల్లో మిస్ చార్జీలను విడుదల చేయాలని మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు కంబాల నరసింహ శివ తదితరులు పాల్గొన్నారు.