/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz శంషాబాద్ ఎయిర్ ఫోర్ట్ లో ఆపరేషన్ చిరుత Yadagiri Goud
శంషాబాద్ ఎయిర్ ఫోర్ట్ లో ఆపరేషన్ చిరుత

శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై చిరుత కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌పోర్టు పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

చిరుతను బంధించేందుకు మొత్తం 9 ట్రాప్ కెమెరాలతో పాటుగా ఒక బోన్‌ను సైతం ఏర్పాటు చేశారు. అయితే ఆ ట్రాప్ కెమెరాల్లో సైతం చిరుత కదలికలు స్పష్టంగా రికార్ట్ అయ్యాయి.

అదే చిరుత రన్‌వే పైకి వచ్చిందని జిల్లా అటవీ శాఖ అధికారి విజయానంద్ తెలిపారు. కొన్ని నెలల క్రితం షాద్‌నగర్ ప్రాంతంలోనూ చిరుత కనిపించింది.

ఇప్పుడే అదే చిరుత ఎయిర్‌పోర్టు పరిసరాలకు వచ్చి ఉంటుందని ఎయిర్‌ పోర్టు అధికారులు భావిస్తు న్నారు. చిరుతను బంధిం చేందుకు అందులో ఓ మేకను సైతం ఎరగా ఉంచినట్లుగా డీఎఫ్‌వో విజయానంద్ వెల్లడిం చారు...

పులివెందులలో వైయస్ భారతి ప్రచారం

పులివెందుల నియోజక వర్గంలో సీఎం జగన్ సతీమణి భారతి రెండో రోజు వేంపల్లిలో ప్రచారం చేస్తున్నారు.

మొదటిరోజు తొండూరు మండలం ఇడమడక గ్రామంలో వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమతతో కలిసి ప్రచారం చేశారు. రెండవ రోజు వేంపల్లి పట్టణంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు.

వైఎస్ భారతికి శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ సతీష్ రెడ్డి సతీమణి సుమతీరెడ్డి ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థు లను తప్పనిసరిగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

వేంపల్లి పట్టణంలో అడుగ డుగునా భారతిరెడ్డికి స్వాగతం పలికారు. జగన్ అభిమానులు, వైసీపీ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.

ఏపీ, తెలంగాణలో నామినేషన్ల ఉప సంహరణకు నేడు చివరి రోజు..

175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 6001 నామినేషన్ల దాఖలు.

4189 నామినేషన్ల ఆమోదం. 1637 నామినేషన్ల తిరస్కరణ‍..

తొమ్మిది నామినేషన్ల ఉప సంహరణ.

25 పార్లమెంట్ సెగ్మెంట్లకు 1103 నామినేషన్ల దాఖలు.

771 నామినేషన్ల ఆమోదం. 291 నామినేషన్ల తిరస్కరణ‍..

తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు 625 నామినేషన్లు దాఖలు..

268 నామినేషన్ల తిరస్కరణ..

ఎంత మంది పోటీ చేస్తారనే అంశంపై ఇవాళ రాత్రికి క్లారిటీ వచ్చే అవకాశం.

నల్లకోటు వెనక ఉన్న కష్టాలు తెలుసు నాకు : కంచర్ల కృష్ణారెడ్డి

ఎంపీగా గెలిస్తే నా తొలి ఎంపీ ల్యాండ్స్ నిధులు న్యాయవాదుల అభివృద్ధికే కేటాయిస్తా

మౌత్ ప్రచారంలో అడ్వకేట్ల చాలా కీలకమైన పాత్ర

నల్లకోటు వెనక ఉన్న కష్టాలు నాకు తెలుసని నల్లగొండ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారు అన్నారు

ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారితో కలిసి ఆయన పాల్గొన్నారు

ఈ సందర్భంగా కంచర్ల కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ... ఎంపీగా గెలిస్తే నా తొలి ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు న్యాయవాదుల అభివృద్ధికే కేటాయిస్తానని అన్నారు

ప్రజలను చైతన్యవంతం చేయడంలో అడ్వకేట్ల పాత్ర చాలా కీలకమైనదనీ, అటువంటివారు నాకు మద్దతుగా నిలవడం చాలా సంతోషదాయకమని అన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిగిరి వెంకటరెడ్డి, జనరల్ సెక్రెటరీ గిరి లింగయ్య గౌడ్, సీనియర్ న్యాయవాదులు మునగాల నారాయణ, నేతి రఘుపతి, లొడంగి గోవర్ధన్, కె.జవహర్ లాల్, జి.జవహర్ లాల్, జి.వెంకటేశ్వర్లు, మామిడి బాలయ్య, మామిడి ప్రమీల, తిమ్మ ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గుత్తా అమిత్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

భారత్ రాష్ట్ర సమితి పార్టీకి ఇప్పటికే పలువురు ఎంపీ లు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు గుడ్‌బై చెప్పగా.. తాజాగా ఈరోజు మరో యువనేత పార్టీని వీడారు.

శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.

రేవంత్ రెడ్డి ఆయన మెడ లో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నిక ల్లో అమిత్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డారు.

టికెట్ కోసం గట్టిగా ప్రయ త్నాలు చేసినా.. ఫలించ లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్లకే టికెట్ కేటాయించారు. అప్పటి నుంచి ఆయన పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

తన తాత గుత్తా వెంట్ రెడ్డి పేరుతో మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభించిన అమిత్.. గత కొంత కాలంగా నియోజ కవర్గంలో సేవా కార్యక్ర మాలు నిర్వహించి పట్టు సాధించారు.

ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీ అడుగుపె ట్టాలని భావించారు.

భోజ్ పురి సినీ నటి ఆత్మహత్య?

భోజ్‌పురి నటి అమృత పాండే,ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. బీహార్‌లోని జోగ్‌సర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆపార్ట్‌ మెంట్‌లో అమృత పాండే ఉరేసుకుంది.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతదేహా న్ని స్వాధీనం చేసుకున్నా రు. చనిపోయే ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. ఆమె రాసిన వాట్సాప్ స్టేటస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భోజ్‌పురి సినిమాలు, హిందీ సినిమాలు, వెబ్ సిరీస్, టివి షోలలో ఆమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకు న్నారు. సినీ నిర్మాత- దర్శకుడు చింతామనితో విడాకులు తీసుకున్న తరువాత మానసికంగా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపో యింది.

ఈ క్రమంలోనే ఆమె ఆత్మ హత్య చేసుకొని ఉంటుంద ని పోలీసులు భావిస్తున్నా రు. అమృత ఆత్మహత్య కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించా మని పోలీస్ ఉన్నతాధి కారులు ఆనంద్ కుమార్, శ్రీరాజ్ తెలిపారు..

రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాల విడు దలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటల కు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://results.bsetelangana.org/ చూసుకోవచ్చు.

ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహిం చిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యా ర్థులు హాజరయ్యారు.

వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియను ఏప్రిల్ 13 నాటికి పూర్తిచేశారు.

తెలంగాణ లో బీజేపీ అగ్ర నేతల ఫోకస్

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల మహాసంగ్రామాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు బీజేపీ అగ్రనే తలు తెలంగాణ బాట పడుతున్నారు.

పెద్ద ఎత్తున ప్రచారాలకు సిద్ధమవుతున్నారు. ఓవైపు అభ్యర్థుల కసరత్తు, మరోవై పు తమదైన శైలిలో ప్రచారా నికి రెడీ అయ్యారు. నేడు JP నడ్డా రేపు మోదీ, ఎల్లుండి అమిత్‌ షా ఇలా బీజేపీ అగ్రనేతల అంతా తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

ఇవాళ తెలంగాణ కు రాను న్న నడ్డా ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం పన్నెండున్నరకి మహబూబాబాద్‌ బహిరంగ సభలో పాల్గొంటారు

సాయంత్రం 5 గంటలకు నిజాంపేటలో రోడ్‌షో నిర్వహిస్తారు. రేపు ప్రధాని ఎల్లుండి అమిత్‌షా తెలంగాణ రానుండగా.. గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రచారం చేస్తోంది...

నేడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ‌ పిఠాపు రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. పిఠాపురంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు.

ఉదయం నుంచి మధ్యా హ్నం వరకూ రోడ్ షో జరగనుంది.అనంత‌రం చెందుర్తిలో రోడ్ షో ప్రారంభమవుతుంది.

తర్వాత రోడ్ షో వన్నెపూ డి, కొడవలి, వెల్దర్తి, దొంత మూరు, బి.కొత్తూరు, పి. తిమ్మాపురం, గోకివాడ, జాములపల్లి, నరసింగా పురం, ఎల్‌.ఎన్.పురం, కొలంక, విరవాడ, విరవ, మంగితుర్తి, మల్లం, జల్లూరు, ఎఫ్‌కే పాలెం, కంద్రాడమ,మీదుగా కుమారపురం వరకూ రోడ్ షో జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పవన్ రోడ్ షోకు జనం భారీగా తరలి వచ్చే అవకాశముంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి...

నేడు క‌ర్ణాట‌క‌కు సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ క‌ర్ణాట‌క‌కు వెళ్ళనున్నారు రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చా రానికి ఇవాళ రేవంత్‌రెడ్డి విరామం ఇచ్చారు.

లోక్ స‌భ ఎన్నిక‌ల ప్ర‌చా రంలో భాగంగా కర్ణాట‌క‌లో ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నా రు.14 లోక్‌సభ స్థానాల్లో ప్రచారం చేసేందుకు తెలం గాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు.

మధ్యాహ్నం గుర్మిట్కల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌ రెడ్డి పాల్గొంటారు. సాయంత్రం సేడంలో జరగనున్న ఎన్నికల ప్రచార సభకు కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీతో కలిసి రేవంత్‌రెడ్డి సభలో పాల్గొంటారు..